‘గల్ఫ్‌ కార్మికుల మద్దతు మోదీకే’ | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్‌ కార్మికుల మద్దతు మోదీకే’

Published Mon, May 6 2024 6:45 AM

‘గల్ఫ్‌ కార్మికుల మద్దతు మోదీకే’

ఖానాపూర్‌: ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక స్థా నం కల్పించడంలో ముందు వరుసలో ఉన్న నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని గల్ఫ్‌ కార్మికులు తెలిపా రు. ఆదివారం దుబాయ్‌లోని అబుదాబిలోగల బీఏ పీఎస్‌ హిందూమందిరంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఇరు దేశాల దౌత్యపరమైన సంబంధాలను పెంచడం, దుబాయ్‌లో మంచి ఆలయాలు నిర్మించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇండియాలోని తమ కుటుంబీకులు, బంధువులందరికీ ఫోన్‌ చేసి బీజేపీకి ఓటు వేయాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లా వాసులు మహేందర్‌రెడ్డి, శరత్‌గౌడ్‌, తెనుకుల అశోక్‌, పవన్‌సాయి, శ్రీను, ప్రశాంత్‌, సాయి, దేవ న్న, తిరుపతి, రమేశ్‌, నవీన్‌ తదితరులున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement