నిర్మల్: వారంతా.. 18ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత పైచదువుల కోసం ఎవరి దారిలో వారు వెళ్లారు. వివిధ ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు. మళ్లీ.. ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నారు. బడిలో చదివిన జ్ఞాపకాలు నెమరువేసుకు న్నారు. అప్పటి గురువులను సన్మానించారు. వారికి పాదాభివందనం చేశారు. జిల్లాకేంద్రంలోని బాగులవాడ శ్రీసరస్వతీ శిశుమందిర్లో 2006–07 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వవిద్యార్థులు ఆత్మీ య సమ్మేళనం పేరిట జిల్లాకేంద్రంలోని సిరి బంకె ట్ హాల్ ఆదివారం కలుసుకున్నారు. కలిసి భోజనా లు చేసి, మళ్లీ కలుద్దామంటూ వెళ్లిపోయారు.
కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూ ల్లో 2007–08 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్నవారంతా ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుపుకొన్నారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోగల ఓ ఫంక్షన్హాల్లో వీరంతా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చదివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రోజంతా సరదాగా గడిపారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.