రాహుల్‌ సభ విజయవంతమైంది | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సభ విజయవంతమైంది

Published Mon, May 6 2024 6:45 AM

రాహుల్‌ సభ విజయవంతమైంది

● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు

నిర్మల్‌: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో ఆదివారం నిర్వహించిన జనజాతర సభ విజయవంతమైనట్లు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు తెలిపారు. సభ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకునేందుకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చిన సభను విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాహుల్‌గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క పాల్గొన్న సభకు మండుటెండను లెక్కచేయకుండా లక్షకుపైగా జనాలు వచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు. సభను విజయవంతం చేసినట్లే పార్టీ అభ్యర్థి సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement