ప్రధాని సభకు భారీ భద్రత | Sakshi
Sakshi News home page

ప్రధాని సభకు భారీ భద్రత

Published Mon, May 6 2024 9:35 AM

ప్రధాని సభకు భారీ భద్రత

భద్రత ఏర్పాట్లలో పోలీసులు

కశింకోట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మండలంలోని ఉగ్గినపాలెం వద్ద అమలోద్భవి హోటల్‌ పక్కన ఉన్న న్యూ వెంచర్‌లో సోమవారం సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో సభ వేదిక వద్దకు ప్రధానమంత్రి చేరుకుంటారు. సుమారు 2500 మంది కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. డీఐజీ విశాల గున్ని, విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌ రవికుమార్‌ అయ్యనార్‌, ఎస్పీ మురళీకృష్ణ, తదితరులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. సభా ప్రాంగణం సమీపంలో మూడు హెలిపాడ్‌లను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement