-
కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోంది
గోవిందరావుపేట: అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తుందని ఎమ్మెల్సీ ఎన్నికల ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ములుగు జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతీఒక్కరు పని చేయాలని, ఆయన గెలుపు చారిత్రక అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లకావత్ నరసింహనాయక్, పోరిక గోవింద్ నాయక్, బొల్లం శివ, ఫక్రుద్దీన్, దేవ నాయక్, హనుమంత రావు, వాగా నాయక్, మోహన్ రాథోడ్, సూరినేని రవీందర్, మల్లేష గౌడ్, అజయ్, గురునాథ్, గాంధీ, ఇంద్ర రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏటూరునాగారం: ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందిదని జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గడదాస్ సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు. అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
భక్తులకు మెరుగైన వైద్య సేవలందించాలి
మంగపేట: హేమాచల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరంలో మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలోని లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం విధుల్లో భాగంగా జాతరలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరాన్ని సందర్శించి ఇప్పటివరకు ఎంత మంది భక్తులకు వైద్య సేవలు అందించారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగపేట మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు. వృద్ధులకు దుస్తుల పంపిణీ జిల్లా వైద్యాధికారి అప్పయ్య పెళ్లిరోజు సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూరిబాయి వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులను పలకరించి వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పయ్యను వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కొమరగిరి సాంమ్రాజ్యం, కేశరావు దంపతులు శాలువాతో సత్కరించారు.హేమాచల క్షేత్రంలో డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య -
‘బెల్టు’ జోరు..
నిత్యం వేలల్లో తరలింపు.. బెల్ట్ నిర్వాహకులు రోజువారీగా రూ.వేలల్లో సరుకు తీసుకువెళుతున్నారు. ఎన్నికల సమయంలో పల్లెల్లో మద్యం దుకాణాల మూసివేతతో మందుకు బానిసగా మారిన వందలాది మంది ఉదయం పూట చుక్క వేయడం మానేశారు. దీంతో ఆ కుటుంబాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. గొడవలు, పంచాయతీలకు చెక్ పడింది. ప్రస్తుతం మద్యం ఏరులై పారుతుండడంతో మళ్లీ మునుపటి రోజులు పునరావృతం కానున్నాయి. కేవలం ఎన్నికల సమయం అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల సమయంలోనే బెల్ట్ దుకాణాలను మూసి వేస్తూ.. మిగతా సమయంలో గాలికి వదిలేస్తున్నా రు. దీంతో అధికారికంగా వాటికి అనుమతి ఇస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నా యి. రోజువారి కూలీ పనిచేస్తూ, వచ్చే సంపాదన మద్యానికే తగలేస్తుండడంతో.. అనేక కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మ ద్యం అక్రమ అమ్మకాలపై ప్రత్యేకంగా ఎకై ్సజ్శాఖ ఉన్నప్పటికీ, పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. బెల్టు దుకాణాలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై కాటారం ఎకై ్సజ్ సీఐ నరేందర్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. కాళేశ్వరం: లోక్సభ ఎన్నికలు ముగియడంతో గ్రామాల్లో బెల్టుషాపులు మళ్లీ ఓపెన్ అయ్యాయి. మద్యం దుకాణాల్లాగా గల్లీల్లో అమ్మకాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎకై ్సజ్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా బెల్ట్ దుకాణాలను మూసివేశారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచుతూ.. రెడ్హ్యాండెడ్గా పట్టుపడితే బెల్ట్ తీశారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి. చాలా ఇళ్లలో ప్రశాంత వాతావరణం నెలకొనగా ప్రస్తుతం మళ్లీ మునపటి పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల్లో 60 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో బెల్టు షాపులు తెలిసినవి 600 వరకు.. తెలియనివి 300 వరకు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు ఎకై ్సజ్ శాఖ బెల్టు దుకాణాలను మూసివేసింది. అక్కడక్కడ మద్యం అమ్మకాలు జరిగిన సమయంలో... సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు దాడులు చేసి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీనిపై పౌరులకు అవగాహన కల్పిస్తూ... సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మూసి ఉన్న బెల్టు దుకాణాలు.. కౌంటింగ్ ముగిసి పోవడంతో బార్లను తలపించే విధంగా తెరుచుకోగా, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు మూసివేశారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. పెరిగిన కొనుగోళ్లు.. గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు తెరుచుకోవడంతో జిల్లాలో చాలా చోట్ల బెల్టు దుకాణాలు బార్లు, రెస్టారెంట్లను తలపించే విధంగా ఉన్నాయి. కొన్నిచోట్ల బ్లాక్ డాగ్, బ్లెండర్ ప్రైడ్ ఇలా ఖరీదైన ఫుల్, ఆఫ్, క్వార్టర్ బాటిల్స్, కింగ్ఫిషర్ బీర్లు సైతం దొరికే పరిస్థితి ఉంది. క్వార్టర్, ఆఫ్, ఫుల్లు రూ.20 నుంచి రూ.100 వరకు అదనపు ధరలతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24 గంటలు బెల్ట్ దుకాణానికి వెళ్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. మహారాష్ట్రకు మన మద్యం.. కాటారం సబ్డివిజన్ పరిధిలోని మహదేవపూర్, కాళేశ్వరం మద్యం దుకాణాల్లో మద్యాన్ని గోదావరి దాటించి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ ఆదివాసీ జిల్లా కనుక మద్యం అమ్మకాలు లేవు. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు బెల్టు దుకాణాలకు విక్రయించే మద్యం రూ. 20–30 అదనంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. బెల్టు దుకాణాల వారిని ఆపేవారుండరు. తనిఖీలు చేసేవారుండరని చర్చ ఉంది. సంబంధిత అఽధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీరిని మద్యం దుకాణదారులు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. మహదేవపూర్, కాళేశ్వరం మద్యం దుకాణాల పరిధిలో సుమారుగా 200 వరకు బెల్టు దుకాణాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముగియడంతో మద్యం అమ్మకాలు పెద్దఎత్తున పెరిగిన కొనుగోళ్లు పట్టింపులేని ఎకై ్సజ్ శాఖ -
జాతీయ లోక్ అదాలత్కు సహకరించాలి
ములుగు: వచ్చే నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ కోరారు. ఈ మేరకు శుక్రవారం తన చాంబర్లో ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాండింగ్ కౌన్సిల్, చిట్ ఫండ్ కంపెనీలు, బ్యాంకు మేనేజర్స్తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చన్నారు. 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లుములుగు: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్లో మొత్తం 50 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. ఇందులో 22వ తేదీన 15 మంది, 23న 9 మంది, 24న 26 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. శుక్రవారంతో పోస్టల్ బ్యాలెట్ వినియోగ సమయం ముగిసిందని అధికారులు తెలిపారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపికములుగు: హైదరాబాద్లో శుక్రవారం నుంచి మొదలైన ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు అన్వేష్, ఏటూరునాగారంకు చెందిన సయ్యద్ రియాజ్ ఎంపికై నట్లు కోచ్ రమేష్, ములుగు సమ్మర్ క్యాంప్ ఇన్చార్జ్, కోచ్ సందీప్నేత్ర తెలిపారు. గత నెల 20వ తేదీ నుంచి హెచ్సీఏ ఽఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ వరకు నెల రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించారు. 21వ తేదీ నుంచి ఓపెన్ కేటగిరిలో డీడబ్ల్యూసీ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ములుగు రెండవ స్థానంలో నిలిచింది. ప్రతిభ చూపిన ఇద్దరు క్రీడాకారులను సెలెక్ట్ చేశారని, ప్రస్తుతం ఇరువురు ఉప్పల్ స్టేడియంలో అకామిడేషన్ ఇచ్చినట్లు కోచ్ తెలిపారు. తునికాకు బోనస్ చెల్లించాలని ధర్నావాజేడు: పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దులాపురం అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కుర్సం ప్రవీణ్ మాట్లాడుతూ అష్ట కష్టాలు పడి తునికాకు సేకరణ చేస్తే అందుకు సంబంధించిన బోనస్ డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి వాజేడు, వెంకటాపురం(కె) మండలాల లబ్ధి దారులకు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. బోనస్ డబ్బులు విడుదలై సంవత్సరమైన ఇంతవరకు ఇవ్వక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 2016 నుంచి 2020 వరకు పెండింగ్లో ఉన్న బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చారు. బోనస్ డబ్బులను వెంటనే ఇవ్వక పోతే అటవీ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దామోదర్, కృష్ణ బాబు, తదితరులున్నారు. గ్రూప్ పరీక్షలకు హెల్ప్డెస్క్ ఏర్పాటు భూపాలపల్లి అర్బన్: జూన్ 9వ తేదీన నిర్వహించే గ్రూప్–1 పరీక్షకు జిల్లాకేంద్రంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 90306 32608 ఫోన్నంబర్ ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎవైనా సందేహాలు, ఇబ్బందులు ఉన్నట్లయితే హెల్ప్డెస్క్ నంబర్కు ఫోన్చేయాలన్నారు. -
ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి
వెంకటాపురం(కె): రాష్ట్ర గెజిట్ ప్రకారమే ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని, ప్రతీ దరఖాస్తుదారుడికి ఎస్టీ కేటగిరి, ఇంటి పేరు వంశ వృక్షం పై పూర్తి విచారణ జరపాలన్నారు. అధికారులు విచారణ చేసి బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోదబోయిన సురేష్, పద్దం సుధాకర్, ఎట్టి చంద్రశేఖర్, అనిల్, అరుణ్ ఉన్నారు. -
ఘనంగా హేమాచలుడి రథోత్సవం
ఊరేగింపులో రఽథాన్ని లాగుతున్న గ్రామస్తులుమంగపేట: మండలంలోని మల్లూరులో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు రథోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. మల్లూరుగుట్టపై గల శ్రీ హేమాచల క్షేత్రంలో ఈ నెల 19 నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో (జాతర) భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్య బృందం ఆలయ అర్చకులు ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్య పూజ, సేవా కాలం, బాలబోగం సంక్షిప్త రామాయణ హవనం, పూర్ణాహుతి, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలకు ముందుగా ఆలయ ప్రాంగణంలోని దైత(వనదేవత) అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమంజనం, శ్రీ లక్ష్మీసహస్రనామ స్తోత్ర పారాయణ, హవనం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నూతన పట్టు వస్త్రాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకి (సేవపై)లో మంగళవాయిధ్యాల నడుమ గుట్టపై నుంచి మల్లూరు గ్రామానికి చేర్చారు. రాత్రి 8 గంటల నుంచి గ్రామంలో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పురవీధుల్లో మేళతాలాల నడుమ టపాసులు పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జంటగా గ్రామానికి వచ్చిన దేవతామూర్తులకు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి మంగళహారతులతో ఎదురేగి దర్శించుకున్నారు. బిందెలతో నీల్లారబోసి టెంకాలు కొట్టి పాడిపంట సంవృద్ధిగా పండాలని తమ పిల్లాపాపలు చల్లంగా ఉండేలా చూడాలని కోరుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం నుంచి వచ్చిన కళాకారుల బృందం వివిధ రూపాల వేషధారణతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. దీంతో గ్రామంలో పండగ సందడిని తలపించింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, యాగ్నిక పూజారులు, గ్రామస్తులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దైత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం గ్రామంలో పండుగ వాతావరణం అలరించిన కళాకారుల నృత్యాలు -
నేటి నుంచి 144 సెక్షన్
ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశం కావడం నిషేధమన్నారు. బహిరంగ సమావేశాలను అనుమతి ఉండదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధమని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు బల్క్ ఎస్ఎంఎస్లు ఇవ్వకూడదని సూచించారు. -
సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం
ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్జీ((రెవెన్యూ) అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ పోలింగ్కు ఒకరోజు ముందే కేంద్రాలకు చేరుకొని వసతులను సరి చూసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ను ఖాళీ చేసి తిరిగి క్లోజ్ చేయాలన్నారు. మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కలెక్టరేట్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రాంపతి, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎలక్షన్ డీటీ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
నేడు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్
ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బండారుపల్లిలోని టీజీ మోడల్ స్కూల్లో నేడు నిర్వహించనున్న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, నెంబరింగ్, టేబుల్స్ను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు సెంటర్లలో 675 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్న 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ వెంట హాల్టికెట్, హెచ్బీ పెన్సిల్, పెన్ను, రబ్బరు, చెక్మార్లను తెచ్చుకోవాలన్నారు. అసిస్టెంట్ కో ఆర్డినేటర్గా రజినీ లత, స్పెషల్ అబ్జర్వర్గా విజయమోహన్, అబ్జర్వర్లుగా విజయ్కుమార్, శివకుమార్లు వ్యవహరిస్తారని తెలిపారు. ముగ్గురు సభ్యుల స్పెషల్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తుంటారని వివరించారు. -
ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్
ఏటూరునాగారం: మంగపేట, ఏటూరునాగారం మండలాల మధ్యగల కురుణాయిగూడెం వద్ద గురువారం ఓ 108 అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో అబులెన్స్, అత్యవసర సర్వీసులకు సైతం ఇసుక లారీల డ్రైవర్లు దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్రమంలో గురువారం కరుణాయిగూడెం వద్ద రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అంబులెన్స్కు కూడా దారి ఇవ్వకపోవడం బాధాకరం. పోలీసులు ఇసుక లారీలను నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాఽధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు ములుగు: నేటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 8సెంటర్లు ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 782 మంది, ద్వితీయ సంవత్సరంలో 255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఏటూరునాగారం: స్పోర్ట్స్ కాలేజీలో ప్రవేశాల కోసం గురువారం ఇంటర్ విద్యార్థులకు మండల కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి రీజియన్ పరిధి అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కాగా 640 సీట్లకు గాను 240 విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరై సీట్లు పొందినట్లు ఆర్సీఓ రాజ్యలక్ష్మి తెలిపారు. మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మొద్దు ములుగు/ములుగు రూరల్: రైతులు పండించిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మిమోసపోవద్దని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎండి చాంద్పాషా ఆధ్వర్యంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ధాన్యానికి ప్రతీ క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ మిల్లర్లు రైతుల నుంచి నేరుగా వడ్లు కొనుగోలు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్, జయపాల్రెడ్డి, కంబాల రవి, రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజుయాదవ్, మావురపు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఎండు గంజాయి పట్టివేత భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి పట్టణంలోని కేటీకే 5వ గని మూలమాలుపు వద్ద గురువారం పోలీసులు ఎండు గంజాయిని పట్టుకున్నారు. సీఐ నరేష్కుమార్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరంకు చెందిన నిగ్గుల రాజు ద్విచక్ర వాహనంపై 1.100 కేజీల ఎండు గంజాయిని భూపాలపల్లికి తీసుకువస్తున్నాడు. ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో రాజు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీంతో అతడిని విచారించగా నడికూడ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు దగ్గర కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వదంతులను నమ్మొద్దు
ఎస్ఎస్ తాడ్వాయి: వరంగల్లోని భద్రకాళీ దేవస్థానంలో గల మేడారం భవనం ఖాళీ చేయించి లాక్కునే ప్రయత్నం చేయడం అన్ని వదంతులే తప్పా వాస్తవం లేదని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మేడారం పూజారులకు వివరించారు. మేడారం అమ్మవార్లకు సంబంధించిన భవనంతో పాటు వేయి గజాల స్థలాన్ని భద్రకాళీ దేవస్థానం ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందని దానిని విరమించుకోవాలని సమ్మక్క– సారలమ్మల పూజారులు ఈ నెల 29, 30న అమ్మవార్ల దర్శనం నిలిపివేసి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించిన విషయంపై కమిషనర్ స్పందించారు. ఈ మేరకు ఆయన పూజారులను గురువారం హైదరాబాద్కు పిలిపించి తన కార్యాలయంలో ఈ విషయంపై చర్చించారు. భద్రకాళీ దేవస్థానంలోని మేడారం భవనం, ఖాళీ స్థలం ఆధీనంలోకి తీసుకునేందుకు మేడారానికి సంబంధించిన కార్యాలయం ఖాళీ చేయాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, అంతే కాకుండా వేద పాఠశాలను అదే భవనంలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని పూజారులు కమిషనర్కు విన్నవించారు. కమిషనర్ మాట్లాడుతూ అ భవనం నిర్మించిన స్థల పత్రాలను పరిశీలిస్తానని అప్పటి వరకు మేడారం కార్యాలయాన్ని ఖాళీ చేయించే వదంతులను నమ్మవద్దని తెలిపారు. కొంతకాలం పాటు వేద పాఠశాల కొనసాగింపునకు సహకరించాలని కోరగా పూజారులు అంగీకరించలేదని తెలిపారు. ఈ నెల 29, 30న దర్శనం నిలిపివేత నిర్ణయంపై మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా పూజారులు కమిషనర్కు అమ్మవారి వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఈ సమావేశంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు కాక సారయ్య తదితరులు పాల్గొన్నారు.దేవాదాయ కమిషనర్ హనుమంతరావు -
5వ బెటాలియన్లో క్యాంటీన్ ప్రారంభం
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని చల్వాయిలో గల తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను గురువారం తెలంగాణ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా హైదరాబాద్ నుంచి వర్చువల్గా పాల్గొనగా డీఐజీ ఎంఎస్ సిద్ధికి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధికి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అందులో భాగంగా బెటాలియన్ ప్రారంభించిన వెల్ఫేర్ క్యాంటీన్లో సిబ్బందికి దాదాపు 30శాతం తక్కువ ధరలు ఉంటాయని తెలిపారు. సిబ్బంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ డీఎస్పీ రెడ్డి, అడిషనల్ కమాండెంట్ పెద్దబాబు, అసిస్టెంట్ కమాండెంట్స్ అనిల్కుమార్, వేణుగోపాల్ రెడ్డి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం గురువారం కనుల పండువగా జరిగింది. ఉదయం 9.30 గంటలకు ప్రధాన గర్భాలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి (మూలవరులు) అమ్మవార్లకు యాగ్నికులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. యాగశాల నుంచి స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి పల్లకి(సేవ)పై మంగళవాయిద్యాల నడుమ 10గంటలకు కల్యాణ మండపానికి చేర్చారు. ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వహణ అధికారి శనిగల మహేష్ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృందం ఆలయ అర్చకులు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తుల కల్యాణం జిలకర బెల్లం, మంగళ సూత్రధారణ, ముత్యాల తలంబ్రాలతో వివాహ మహోత్సవాన్ని ఆలయ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ మహేష్, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం తరఫున కేఈ స్తలశాయి, యాగ్నికులు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు రాఘవాచార్యులు, శేఖర్శర్మ, ఆచార్యులు, యాగ్నికులు, సిబ్బంది పాల్గొన్నారు. నేత్ర పర్వంగా హేమాచలుడి కల్యాణం వేలాదిగా తరలివచ్చిన భక్తులు కిటకిటలాడిన హేమాచలక్షేత్రంహేమాచలుడిని దర్శించుకున్న మంత్రి సీతక్క లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరై స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు యాగశాలలో మంత్రి కుటుంబసభ్యుల గోత్రనామాలతో అర్చన చేసి వేదాశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు స్పెషల్ బస్ సర్వీస్ ప్రారంభం
మంగపేట: మల్లూరు హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం హనుమకొండ 2 డిపో బస్ సర్వీస్ సౌకర్యాన్ని మంగళవారం నుంచి ప్రారంభించింది. ఉదయం 6గంటలకు హనుమకొండ నుంచి బస్సు బయలుదేరి మల్లూరుగుట్టపైకి వస్తుందని మంగపేట బస్టాండ్ కంట్రోలర్ శంకర్ తెలిపారు. అనంతరం గుట్ట నుంచి ఏటూరునాగారం వరకు 8 ట్రిప్పులు సర్వీస్ ఉంటుందన్నారు. సాయంత్ర 6 గంటల నుంచి మల్లూరుగుట్ట నుంచి హనుమకొండకు బయలుదేరి వెళ్తుందన్నారు. హనుమకొండ నుంచి మల్లూరుకు బస్చార్జీ రూ. 200, మల్లూరు నుంచి ఏటూరునాగారానికి రూ.40చార్జీ ఉంటుందని తెలిపారు. -
వైభవంగా ధ్వజారోహణం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడోరోజు మంగళవారం యాగ్నికులు మురళీకృష్ణమాచార్యుల బృందం ధ్వజారోహణం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి యాగశాలలో యాగ్నికుల బృందం అగ్నిప్రతిష్టాపన, సుదర్శన హోమం వేద మంత్రోచ్ఛరణ నడుమ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పంచముఖ ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. 11గంటలకు యాగశాలలోని ధ్వజపటాన్ని మంగళవాయిద్యాలతో వేదపండితులు తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణ పూజా కార్యక్రమాలను జరిపించారు. గరుడప్రసాదం పంపిణీ బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అనంతరం దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయంలో స్వయంభు స్వామివారి నాభి చందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. దీనిలో భాగంగానే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు గరుడ ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో గరుడ ప్రసాదం కోసం నూతనంగా వివాహమైన వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దంపతులు ధ్వజారోహణ కార్యక్రమంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈనెల 27న మరోసారి భక్తులకు గరుడప్రసాదాన్ని అందజేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు మధనమోహన్, రామనర్సింహా, మణిదీప్, వెంకటాచార్యులు, భరద్వాజ్, అభిరామ్, విరంచి, పూజారులు కై ంకర్యం రాఘవాచార్యులు, శేఖర్శర్మ, పవన్కుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన బ్రహ్మోత్సావాల్లో(జాతరలో) భక్తుల ఏర్పాట్లపై కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం పరిశీలించారు. మండల స్పెషలాఫీసర్ తుల రవి, తహసీల్దార్ వీరస్వామి, ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్ సంబంధిత అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణ అధికారి శనిగల మహేష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు కల్పించిన చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, మరుగదొడ్లు, మూత్రశాలలు వంటి సౌకర్యాలను అడిగి తెలుసుకుని ఆయా సౌకర్యాలను పర్యవేక్షించారు. వారి వెంట ఎంపీఓ మమత, ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అదే విధంగా రేపటి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలి రానుండటంతో ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆలయాన్ని ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ బాబాసాహెబ్ సీఐ రాజు, స్థానిక ఎస్సై రవికుమార్తో కలిసి మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను కలియతిరిగి ఆలయ కార్యనిర్వహణ అధికారితో పలు అంశాలపై చర్చించారు. ఇద్దరు సీఐలు, నలుగరు ఎస్సైలు, 60 నుంచి 70 మంది వరకు సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆర్టీసీ బస్సు గుట్టపైకి వచ్చి పోయే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే భక్తుల వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మల్లూరులో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -
తిరుగువారం పండుగ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని గౌడ కులస్తులంతా అమ్మవారికి బోనం సమర్పించి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పలు రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెల్లి నర్సింహులు, మోహన్ గడ్డం మహేష్, కూనూరు అశోక్, మహేష్, సప్పిడి రాము, రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్గాంధీకి ఘన నివాళి
ములుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి మండల అధ్యక్షుడు ఎండీ చాంద్పాషా ముఖ్యఅతిథిగా హాజరై రాజీవ్గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాన్ని తీసుకొచ్చిన ఘనుడు రాజీవ్గాంధీ అన్నారు. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన గొప్పనాయకుడు అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతి చెందిన దినాన్ని తీవ్రవాద వ్యతిరేఖ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి, నాయకులు బాదం ప్రవీణ్కుమార్, శ్యాం, తిరుపతి, కంబాల రవి, రేవంత్యాదవ్, బోడ రఘు, ఓరుగంటి అనిల్, పౌడాల ఓంప్రకాశ్, బోయిని రాజు, ఎల్లావుల అశోక్, బోడ సతీశ్, బండి మధు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
కన్నాయిగూడెం: పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం మండల పరిధిలోని జింగారం, ఏటూరు, కంతనపల్లి గ్రామాల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతులను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలలోని గదులు, మరుగుదొడ్లు, రూమ్లు, తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీలతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పున:ప్రారంభం నాటికి నూతన ఒరవడితో ఏర్పాటు చేయాలన్నారు. పనులపై అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. పనులపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. వీరి వెంట ఎంపీడీఓ అనిత, ఎంఈఓ రాజేష్, ఎంపీఓ రామకృష్ణ, మంగపేట ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, పంచాయతీ ఏఈ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీజ -
వైద్య పరీక్షలు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఎదిర ఆరోగ్య మహిళ కేంద్రంలో మహిళలకు వైద్య పరీక్షలను వైద్యాధికారి భవ్యశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 74 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. 12 మంది వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు ములుగు ఏరియా వైద్యశాలకు పంపించినట్లు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తునికాకు కూలీలపై తేనెటీగల దాడి ఎస్ఎస్తాడ్వాయి: అడవిలోకి తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు మంగళవారం దాడి చేశాయి. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన కూలీలు ఆకు సేకరణకు ట్రాక్టర్ల్లో సుమారుగా 40 మంది కూలీలు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆకు సేకరించి ట్రాక్టర్ దగ్గరకు వచ్చిన కూలీలపై తేనెటీగలు దాడి చేయగా కూలీలు అడవిలో పరిగెత్తారు. మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఈ తేనెటీగల దాడిలో సుమారుగా 15మంది కూలీలు గాయపడ్డారు. అటవీశాఖ అధికారులు, తునికాకు కాంట్రాక్టర్ గాయపడిన కూలీలకు వైద్య ఖర్చులు చెల్లించాలని కోరుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు మహాముత్తారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ మధుసూదన్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది పనితీరుపై వైద్యాధికారి సందీప్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీదేవి, ఉమాదేవి, ప్రమోద్, సీహెచ్ఓ విద్యాసాగర్, వైద్యసిబ్బంది ఉన్నారు. దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి రూరల్: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కీం కింద 3వ, 5వ, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చిత్రమిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లితండ్రుల సంవత్సర ఆదాయం గ్రామాల వారికి రూ.1.50 లక్షలలోపు, పట్టణాల వారికి రూ.2లక్షల లోపు ఉండాలన్నారు. విద్యార్థులను డ్రా పద్ధతిన ఎంపిక చేస్తారని చెప్పారు. దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో నేటినుంచి జూన్ 6వ తేదీ వరకు చేసుకోవాలన్నారు. ఇసుక లారీల పట్టివేతకాటారం: అనుమతులు లేకుండా మహదేవపూర్ మండలం అన్నారం క్వారీ నుంచి ఇసుక తరలిస్తున్న రెండు లారీలను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంగారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఇసుక లారీ డ్రైవర్ పోలీసులను గమనించి అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. మరో లారీ అనుమతులు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నారు. లారీ డ్రైవర్ గంధమల్ల మధుతో పాటు లారీ ఓనర్ గోవర్దన్పై కేసు నమోదు చేశారు. మరో లారీ డ్రైవర్, యజమాని వివరాలు తెలియలేదని ఎస్సై పేర్కొన్నారు. మూడు లారీలకు జరిమానా.. మహదేవపూర్ మండలం అన్నారం ఇసుక క్వారీ నుంచి ఓవర్లోడ్తో ఇసుక తరలిస్తున్న మూడు లారీలను మంగళవారం అర్ధరాత్రి పట్టుకొని జరిమానా విధించినట్లు ఆర్టీఓ సంధాన్ తెలిపారు. ఇసుక లారీలు ఓవర్లోడ్తో వెళ్తున్నాయనే సమాచారం మేరకు దాడులు చేసి మూడు ఓవర్లోడ్ లారీలను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఇసుక లారీల అడ్డగింత
మంగపేట: మండలంలోని మల్లూరు గోదావరి ఇసుక క్వారీ నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న లారీలను గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. మల్లూరులోని శ్రీ సమ్మక్క–సారక్క ట్రైబల్ ఇసుక, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటీవ్ సొసైటీ సంఘం లిమిటెడ్కు చెందిన ఇసుక క్వారీ ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇసుక క్వారీ నుంచి వెళ్తున్న ఇసుక లారీలను గ్రామంలోని ఎస్సీ, బీసీకి చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక క్వారీ ద్వారా ఉపాధి, ఆదాయం పొందుతున్న గిరిజనులతో పాటు తమకు అదే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో లారీలను వెళ్లనీయమని హెచ్చరించారు. 100మంది నిరసన లారీలకు అడ్డుపడి సుమారు 100 మంది మహిళలు, పురుషులు నిరసన తెలిపారు. గ్రామంలో ఎక్కువగా ఎస్సీ, బీసీలు ఉన్నా వందలాది మంది నిరుపేదలు ఉన్నారు. ఈ క్రమంలో పనులు లేక ఉపాధి లభించకపోవడంతో క్వారీ ద్వారా తమకు కూడా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో సుమారు 30 నుంచి 40 లారీలు నిలిచి పోవడంతో ఇసుక క్వారీ నిర్వాహకులు, సొసైటీ సభ్యులకు మధ్య సుమారు రెండు గంటల పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ.. దీంతో ఇసుక క్వారీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తోలెం శ్రీనివాస్, యాలం కాంతారావు స్థానిక పెద్దలు పీసా చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న గిరిజన సొసైటీకి ప్రభుత్వం నిబంధనల మేరకు క్వారీ మంజూరు అయిందని తెలిపారు. క్వారీ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కేవలం గిరిజన సొసైటీలోని సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. ఇసుక లోడుతో వెళ్లే లారీలలో ఇసుకను సరిచేసి టార్ఫాలిన్ కప్పేపని ద్వారా ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తామని సర్ధి చెప్పారు. అవరమైతే సంబంధిత అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని వివరించారు. గ్రామాభివృద్ధికి గోదావరి నుంచి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించినందుకుగాను సంవత్సరానికి రూ. 5 లక్షలు ఇస్తామని ఇసుక క్వారీ సొసైటీ నిర్వాహకులు గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో గొడవ సద్దు మణిగింది. ఉపాధి కల్పించాలని మల్లూరు గ్రామస్తుల డిమాండ్ రూ.5లక్షలు ఇస్తామని నిర్వాహకుల హామీతో సద్దుమణిగిన గొడవ -
గరుడాధివాసం
ఆలయం ఎదుట గరుడాధివాసం నిర్వహిస్తున్న యాగ్నికులుమంగపేట: మండల పరిధిలోని మల్లూరులోని శ్రీహేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు(జాతర) రెండో రోజు సోమవారం యాగ్నికులు యాగశాలలో గరుడాధివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి శనిగల మహేష్ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలను భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల శిశ్య బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడాధివాసం కార్యక్రమంలో భాగంగా గరుడపఠ లేకనం(గరుడ పఠాన్ని సుదరంగా లికించారు) సాయంత్రం 6గంటలకు పటానికి గరుడాధివాసం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి తారుమంజనం కార్యక్రకమాన్ని నిర్వహించి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. మంగళవారం ఉదయం ఆలయంలో సంతానార్థం దంపతులకు గరుడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సంతానం లేని దంపతులు గరుడ ప్రసాదాన్ని స్వీకరించాలని యాగ్నికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు మధనమోహన్, రామనర్సింహా, మణిదీప్, వెంకటాచార్యులు, భరద్వాజ్, అభిరామ్, విరంచి, ఆలయ ప్రధాన పూజారులు కై ంకర్యం రాఘవాచార్యులు, శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, హుండీ కీపర్ శేషు, సిబ్బంది పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. హేమాచలక్షేత్రంలో రెండోరోజు కొనసాగిన బ్రహ్మోత్సవాలు నేడు గరుడ ప్రసాదం పంపిణీ -
న్యాయ విజ్ఞాన సదస్సు
ములుగు: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు ఉచిత న్యాయసహాయం, కార్మిక చట్టం, హక్కులు, ఫోక్సో చట్టాలపై అవగాహాన కల్పించారు. అనంతరం జాతీయ లోక్ అదాలత్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్కుమార్ ఉన్నారు. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణి వినతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీజ(స్థానిక సంస్థలు) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీ ఓ సత్యపాల్తో కలిసి ఆమె వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన తొమ్మిది, ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆరు, అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఐదు వచ్చాయి. ఇలా మొత్తంగా 20 దరఖాస్తులు రాగా వాటిని అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ ఫార్వర్డ్ చేశారు. గతంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ప్రభు త్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మండల, గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్కుమార్, డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర, డిడబ్ల్యూఓ స్వర్ణలత లెనిన, ఎల్డీఎం రాజ్కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులపై సమీక్ష జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో డీఆర్డీఏ శ్రీనివాస్కుమార్తో కలిసి అదనపు కలెక్టర్ శ్రీజ ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలన్నారు. కూలీల సంఖ్య పెంచేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతిరోజూ విధిగా పనులను తనిఖీ చేయాలన్నారు. అనంతరం ఈ నెల 24నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గిరిజన దర్బార్లో.. ఏటూరునాగారం: గిరిజన దర్బార్లో వినతులు అందజేసిన గిరిజనుల సమస్యలను పరిష్కరించే విధంగా సెక్టార్ అధికారులు దృష్టి పెట్టాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ గిరిజనుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు 15 దరఖాస్తులను పీఓకు అందజేశారు. తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన గడ్డం రాధిక జీఎన్ఎం కోర్సు పూర్తి చేశానని తనకు ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. ఆదివాసీ కాంట్రాక్టర్లు సిద్ధబోయిన సురేందర్, రవి ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజనీరింగ్శాఖ ద్వారా చేస్తున్న అభివృద్ధి పనులు ఆదివాసీ రిజిస్టర్ కాంటాక్టర్లకు పనులు కేటాయించాలని పీఓను కోరారు. చుంచుపల్లి గ్రామానికి చెందిన గొంది కౌసల్య ఏఎన్ఎం పూర్తి చేశానని తనకు ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గోగుల నాగమణి మహాదేవ్పూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మైనర్, మేజర్ మరమ్మతుల పనులు పూర్తి అయ్యాయని, వాటికి చెందిన బిల్లులు ఇప్పించాలని వేడుకున్నారు. మల్లూరు గ్రామానికి పెద్ది సతీష్ 2020–21లో మంజూరైన ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇప్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఎస్ఓ రాజ్కుమార్, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ శ్రీజ -
ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులు
మంగపేట: మండల కేంద్రంతో పాటు కమలాపురంలోని పలు హోటళ్లు, దాబాలపై ఫుడ్ సెక్యూరిటీ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. మండలంలోని కమలాపురం, మంగపేటలోని సాయి గణేశ్, లక్ష్మీ రేణుక, పరమేశ్వర దాబాలపై పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వి.రోహిత్రెడ్డి తెలిపారు. ఆయా హోటళ్లు, దాబాలలో తనిఖీలు నిర్వహించగా పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు గుర్తించి 2006 నిబంధనల కింద నోటీసులు జారీ చేశామని తెలిపారు. హోటళ్లలో నిల్వ ఉంచిన వాటిని ల్యాబ్లో పరిక్షించేందుకు శాంపిళ్లను తీసుకున్నామని తెలిపారు. నోటీసులు తీసుకున్న ఆయా హోటళ్లు, దాబా యజమానులు మూడు రోజుల్లో వారి వివరణ నివేదికలు అందజేయాలన్నారు. అనుమతులు సైతం పొందాలన్నారు. లేని పక్షంలో దాబాలు, హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మరిన్ని తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. -
కేంద్ర అధికారుల బృందం పర్యటన
కాటారం: కాటారం మండలం గంగారం గ్రామాన్ని సోమవారం కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం గ్రామానికి చేరుకోగా ఎంపీడీఓ బాబు, ఎంపీఓ ఉపేంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్తో పాటు పలు శాఖల గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది వారికి స్వాగతం పలికారు. ఈ నెల 24 వరకు బృందం సభ్యులు గ్రామంలో ఉండి గ్రామపంచాయతీ స్థాయిలో పరిపాలన విధానం, శాఖల వారీగా విధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, గ్రామ అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల జీవన విధానం తదితర అంశాలపై సభ్యులు క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు. మొదటి రోజు సభ్యులు గ్రామ జనాభా, విస్తీర్ణం, గ్రామస్థాయి పరిపాలన, గ్రామస్థాయి అధికారులు, విధులపై ఆరాతీశారు. గ్రామంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సభ్యులకు బస ఏర్పాటు చేశారు. బృందంలో హిమాన్షు టైలర్, నిషాన్సింగ్, నీరజ్కుమార్ ఉన్నారు. కాళేశ్వరంలో.. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కేంద్రప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) శిక్షణ అధికారుల బృందం సభ్యులు అంకీత్గుప్త, సాహిల్, రిత్విక్, అన్సల్జైన్, అధిత్సోనీ సోమవారం పర్యటించారు. కాళేశ్వరం ఎస్సీకాలనీ, గోదావరి వద్ద ప్రజలతో మాట్లాడారు. కోటంచకు అధికారుల బృందం రేగొండ: కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సోమవారం కొడవటంచ సందర్శనకు వచ్చారు. అధికారుల బృందం ఈ నెల 24 తేదీ వరకు గ్రామంలో పర్యటించి గ్రామంలోని పరిస్థితులను, ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేయనున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement