అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం న్యాయపోరాటం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం న్యాయపోరాటం

Published Mon, May 6 2024 10:30 AM

అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం న్యాయపోరాటం

రాజంపేట రూరల్‌ : అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తి న్యాయం జరిగేవరకు పోరాటాలు కొనసాగిస్తామని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసులు తెలియజేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం సుబ్బరాజు అధ్యక్షతన అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ పేరిట వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, బాధితులకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి న్యాయం చేయా లని కోరారు. అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లం కొండ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏఐటీయూసీ రాజంపేట నియోజకవర్గ కార్యదర్శి ఎంఎస్‌ రాయుడు, ఎఐటీయూసి పట్టణ కార్యదర్శి ఈ సికిందర్‌, కరణం మల్లికార్జున, పెంచలయ్య, మల్లిక, నదియా, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement