బెల్లంపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆది వారం బెల్లంపల్లి, చె న్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంటా చౌరస్తా వద్ద పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ద్రాక్ష పండ్లను తూకం వేసి అమ్ముతూ ప్రచారం నిర్వహించారు. తోపుడు బండ్ల వద్దకు వెళ్లి పండ్లను విక్రయిస్తూ ప్రచారం చేశారు.
నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, 6వ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సెమిస్టర్ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్కు 56,899, ఆరో సెమిస్టర్కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఉమ్మడి వరంగల్లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఓక్కో సెంటర్కు ఒక అజ్జర్వర్, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్స్క్వాడ్ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. హాల్టికెట్లు కళాశాలల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.