అక్రమాలు వెలికితీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం | Sakshi
Sakshi News home page

అక్రమాలు వెలికితీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం

Published Sun, May 5 2024 5:50 AM

అక్రమాలు వెలికితీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం

రూ.3 లక్షలు జరిమానా విధింపు

కర్నూలు(న్యూటౌన్‌): ఉపగ్రహ ఛాయాచిత్రం రోడ్‌ మెటల్‌ తవ్వకాల్లో అక్రమాలను వెలికితీసింది. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని సర్వే నంబర్‌ 413/ఎలో రోడ్‌ మెటల్‌ తవ్వకాలను శనివారం జిల్లా మైనింగ్‌ అధికారులు ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా పరిశీలించారు. అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారించి లక్ష్మీసాయినాథ స్టోన్‌ క్రషర్‌ ప్రొప్రైటర్‌ కె.వరలక్ష్మికి రూ.3 లక్షల జరిమానా విధించినట్లు జిల్లా మైనింగ్‌ డిప్యుటీ డైరెక్టర్‌ టి.రాజశేఖర్‌ తెలిపారు. నోటీసులు కూడా జారీ చేశామని పేర్కొన్నారు. తమ తప్పును అంగీకరించి రూ.3 లక్షలు అపరాధ రుసుం చెల్లించారని జిల్లా మైనింగ్‌ డిప్యుటీ డైరెక్టర్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement