బీసీలకు పెద్దపీట | Sakshi
Sakshi News home page

బీసీలకు పెద్దపీట

Published Mon, May 6 2024 12:40 AM

బీసీలకు పెద్దపీట

పాలకోడేరు: సీఎం జగన్‌ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని, అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించారని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని వేండ్ర అగ్రహారం, రామచంద్రపురం గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ సోదరుడు పెన్మెత్స గోపాలకృష్ణంరాజు, ఎంపీపీ భూపతిరాజు చంటిరాజుతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు. అన్నివర్గాలకు సమన్యాయం చేశారని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు బీసీలకు చేసింది ఏమీ లేదని జగన్‌ ప్రభుత్వంలోనే బీసీలు అభివృద్ధి సాధించారన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగన్‌కు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. విస్సాకోడేరు సర్పంచ్‌లు బొల్లా శ్రీనివాస్‌, చింతపల్లి వెంకటనారాయణ, గొరగనమూడి మాజీ సర్పంచ్‌ చెల్లబోయిన పాపారావు, బొక్కా రాంబాబు, భూపతిరాజు వంశీకృష్ణంరాజు, పాలా శ్రీనివాస్‌, నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement