రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం అర్బన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన సంక్షేమ సారధి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉందామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం మండలంలోని పెదగరువు, వెంప, శ్రీరామపురం గ్రామాల్లో మేమంతా సిధ్ధం ఇంటింటికి ప్రచారం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత 58 నెలల్లో రైతుభరోసా, డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, చేయూత, జగనన్న చేదోడు, పింఛన్లు వంటి నవరత్నాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరిందన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రతి పథకాన్ని వలంటీర్ల ద్వారా ఇంటికే నేరుగా అందించారన్నారు. ఇంటింటికీ సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. పట్టణంలో రూ.130 కోట్లతో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే తనను, నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరాజు, మండల అధ్యక్షుడు తిరుమాని ఏడుకొండలు, జేసీఎస్ కన్వీనర్ కోమటి రాంబాబు, సీనియర్ నాయకులు అల్లూరి కృష్ణంరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు, కలిదిండి అప్పలరాజు, శ్రీరామపురం ఫణిరాజు, కలిదిండి సోమ సుందరరాజు, సానబోయిన సత్యనారాయణ, త్రిమూర్తులు, కొట్టి కుటుంబరావు, ఆరేటి పెద్దబ్బు తదితరులు పాల్గొన్నారు.