-
ఆనందప్రకాష్కు 41 నోటీసు
పాలకొల్లు అర్బన్: పట్టణంలోని యాళ్లవానిగరువులో నివాసముంటున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్కి శుక్రవారం పట్టణ పోలీసులు 41 నోటీసు అందజేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకపోయినా, పాత వీడియోలు, పాత ఫొటోలు పెట్టి విశాఖకు చెందిన ఓ మహిళ సీ–విజిల్ యాప్లో ఫిర్యాదు చేయడం విచారకరమన్నారు. దీనిపై తాను ఎన్నికల్లో పాల్గొనలేదని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. ఫిర్యాదుపై పోలీసులు కనీసం విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇదిలా ఉండగా 41 నోటీసు అందించే విషయంలో పాలకొల్లు పట్టణ సీఐ మంగాదేవి ఏకవచనంతో, అమర్యాదగా మాట్లాడారని ఆనందప్రకాష్ అన్నారు. నోటీసు స్వీకరించకపోతే ఇబ్బంది పడతారని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఫోన్లో బెదిరించారన్నారు. సీఐ మంగాదేవి నియంతృత్వ పోకడపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, 41 నోటీసు జారీ చేసిన పోలీసు అధికారులు, రిటర్నింగ్ అధికారులపై న్యా య పోరాటం చేస్తానని అన్నారు. -
ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
భీమవరం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్–1938 జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక పీఎస్ఎం గరల్స్ హైస్కూల్, భీమవరంలో గురువారం సాయంత్రం జరిగాయి. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయ బ్రహ్మం వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బి.ఓంప్రకాష్, పీవీఎస్ఎస్బీ రమణారావు, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా ఎస్కె. బాబాజీ సాహెబ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా బి.దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి.శ్రీవల్లి, పి.రాజేశ్వరరావు, బి.ఆదినారాయణ, అదనపు కార్యదర్శిగా కె.గంగరాజు, కార్యదర్శులుగా ఎ.ఎన్.వి సుభాషిణి, డి.అంజనీదేవి, ఎన్.ఆంజనేయులు, పి.గంగాకుమారి, జె.సత్యనారాయణ, జి.శ్రీనివాస్, ఆడిట్ కమిటీ కన్వీనర్గా పి.నాగరాజు, అకడమిక్ కమిటీ కన్వీనర్గా డి.తిరుమలేశ్వరి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంతో ఉదయబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కార్యవర్గం మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యా సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నామన్నారు. -
నేటి నుంచి ఉగాది నాటిక, నృత్యోత్సవాలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బీవీఆర్ కళాకేంద్రంలో శనివారం నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు, నృత్యోత్సవాలను నిర్వహించనున్నట్టు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాంసృతిక శాఖ, భారత ప్రభుత్వం (న్యూఢిల్లీ) ఆర్థిక సహకారంతో భారతీయ విద్యాభవన్స్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సౌజన్యంతో స్వర్గీయ గుండుమోగుల కృష్ణారావు, ఆదిలక్ష్మి స్మారక 31వ జాతీయస్థాయి ఉగాది నాటికల పోటీలు, నృత్యోత్సవాలు నిర్వహించనున్నామ న్నారు. 18, 19 తేదీల్లో ఉదయం 9 గంటలకు నృత్య పోటీలు నిర్వహిస్తారన్నారు. రాత్రి 7 గంటలకు నృత్య ప్రదర్శనలు, అవార్డుల ప్రదానం ఉంటాయన్నారు. 20న రాత్రి 7 గంటలకు రైతేరాజు, కౌసల్యా సుప్రజా రామా నాటికలు, 21న రాత, అమృతహస్తం నాటికలు, 22న స్వప్నం రాల్చిన అమృతం, నిశ్శబ్ధమా నీ ఖరీదెంత, కొత్తరకం కొడుకు నాటికల నిర్వహణ, గౌరవ విశిష్ట సేవా పురస్కారాలు అందజేస్తారు. 23న ఇంద్రప్రస్థం, థింక్ నాటికలతో పాటు గౌరవ విశిష్ట సేవా పురస్కారాల ప్రదానం, 24న మాకూ స్వాతంత్య్రం కావాలి, సీతా పరిత్యాగం నాటిక పోటీలతో పాటు జీవన సాఫల్య పురస్కార ప్రదానం, 25న రాత్రి ఘంటసాల నాటక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. -
మామిడి.. దిగుబడి తడబడి
చింతలపూడి: ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే మామిడి పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి ఎగుమతుల్లో జిల్లాలో నూజివీడు తర్వాత ద్వితీయ స్థానం ఆక్రమించిన చింతలపూడి ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెల కావస్తున్నా ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాయ దిగుబడి లేకపోవడం, కోతకు వచ్చిన కొద్దిపాటి కాయ నాణ్యత లోపించడం ఎగుమతులు మందగించడానికి కారణాలని వ్యాపారులు భావిస్తున్నారు. అలాగే కాయను ఆకర్షణీయమైన సైజుకు ఎదిగే వరకూ చెట్టుమీదే ఆపడానికి రైతులకు ధైర్యం చాలడం లేదు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, వర్షాలు వస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. 5 వేల టన్నులు మాత్రమే.. గతంలో ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 25 లారీల మామిడి కాయలు ఎగుమతి చేసేవారు. రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో ఎగుమతి చేయలేక పోయామని వ్యాపారులు వాపో తున్నారు. ఏటా 20 వేల టన్నుల మామిడి పంట ఈ ప్రాంతం నుంచి కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిసా ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చినా 5 వేల టన్నులు కూడా ఎగుమతి చేయలేదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం బంగినపల్లి రకం టన్ను మామిడి కాయలు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. జిల్లాలో తగ్గిన విస్తీర్ణం గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉండే మామిడి తోటలు ప్రస్తుతం బాగా తగ్గిపోయాయి. అధిక భాగం మామిడి తోటలను తొలగించి రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 44 వేల హెక్టార్లలో మామిడి స్థానంలో ఆయిల్పామ్ సాగవుతోంది. జిల్లాలో చింతలపూడి, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, కామవరపుకోట ప్రాంతాల్లో సుమారు 15 వేల హెక్టార్లలో మాత్రమే మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. మామిడి తోటల అభివృద్ధికి ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తోంది. రైతులకు మరింత ప్రోత్సాహం అందించి అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. తగ్గిన దిగుబడులు మందకొడిగా ఎగుమతులు జిల్లాలో 15 వేల హెక్టార్లలో సాగు దిగుబడి తగ్గింది దిగుబడి తగ్గిన కారణంగా ఎగుమతులు మందగించాయి. ప్రారంభంలో టన్ను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.30 వేలు పలుకుతోంది. ప్రభుత్వం మామిడి రైతులను, వ్యాపారులను ప్రోత్సహించేలా శీతల గిడ్డంగులను నిర్మించాలి. – చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్ వ్యాపారి, చింతలపూడి రవాణా ఖర్చుల భారం రైతుల నుంచి కొనుగోలు చేసిన మామిడి కాయలను రవాణా చేయడం భారంగా మారింది. మామిడి కాయల ప్యాకింగ్కు టన్నుకు రూ.1,500 వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది తోటలు సరిగా కాయకపోవడంతో 30 శాతం దిగుబడి మాత్రమే వచ్చింది. – పసుపులేటి నాగరాజు, మామిడి వ్యాపారి -
మినరల్ కాదు.. అంతా జనరలే!
శనివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2024నాణ్యత ఎంత? ఆర్ఓ ప్లాంటు నీటిలోని మలినాలను శుద్ధి చేస్తే, అల్ట్రా వైలెట్ సిస్టమ్ (యూవీ) బ్యాక్టీరియాను తొలగిస్తుంది. బాట్లింగ్, వాటర్ ప్యాకెట్ల రూపంలో రోజుల తరబడి నీటిని నిల్వ ఉంచాల్సి వస్తే వైరస్ చేరకుండా ఓజేనేషన్ సిస్టమ్ వాడతారు. ఐఎస్ఐ ఽధ్రువీకరణ కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్లలో ఓజేనేషన్ సిస్టమ్ తప్పనిసరి. అధిక శాతం ప్లాంట్లలో కేవలం ఆర్ఓ టెక్నాలజీ ద్వారా నీటిలోని మలినాలను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. ఓజేనేషన్ సిస్టమ్ మాట అటుంచితే కొన్నిచోట్ల బ్యాక్టీరియాను శుద్ధి చేసే యూవీ సిస్టమ్ ఉండటం లేదని తెలుస్తోంది. రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి దీని ని ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందు కు రావడం లేదు. క్రమం తప్పకుండా ఫిల్టర్లు శుభ్రం చేయడం, ఆర్ఓ ప్లాంటుకు ఆయువు పట్టులాంటి మెమరిన్ సామర్థాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడం వంటి చర్యలు చాలాచోట్ల కనిపించడం లేదు. నీటిలోని రంగు, ఐరెన్, హార్డ్నెస్, కాల్షియం, ఫ్లోరైడ్, మెగ్నీషియం, సల్ఫేట్ తదితర వాటి శాతం పరీక్షించేందుకు ప్రతినెలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా చాలా మంది వ్యాపారులు చేయడం లేదు. బోరు నీటిలోని టోటల్ డిజాల్వడ్ సాలిడ్స్ (టీడీఎస్) 2000 శాతం వరకు ఉంటుంది. ఆర్ఓ ప్లాంటు నుంచి బయటకు వచ్చేసరికి 20 నుంచి 30 మధ్య టీడీఎస్ శాతం ఉండాల్సి ఉండగా చాలా ప్లాంట్లలో పరిమితికి మించి ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రజారోగ్యం దృష్ట్యా సంబంధిత అధికారులు స్పందించి సురక్షితమైన నీటిని అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సాక్షి, భీమవరం: ఐఎస్ఐ సర్టిఫికెట్ కలిగిన రివర్స్ అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంటు పెట్టాలంటే వివిధ శాఖల నుంచి పదికి పైనే లైసెన్సులు పొందాలి. ల్యాబ్, ప్లాంట్ సామగ్రి, అనుమతులు తదితర వాటికి రూ.35 లక్షలకు పైనే ఖర్చవుతుంది. జిల్లాలో ఈ తరహా ఆర్ఓ ప్లాంట్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అయితే రెండు, మూడు లక్షల పెట్టుబడితో పెట్టిన ప్లాంట్లను ఐఎస్ఐ పేరిట వ్యాపారులు చలామణి చేసేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నాణ్యత లేని నీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. పెరుగుతున్న వాడకం : మినరల్ వాటర్ తాగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నీటి విక్రయాలు మూడు టిన్నులు, ఆరు బాటిళ్లలా సాగిపోతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని జిల్లావ్యాప్తంగా రివర్స్ అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్లాంట్ పెట్టాలంటే వివిధ శాఖల నుంచి గ్రౌండ్ వాటర్, ఫుడ్, జీఎస్టీ, లేబర్, ఐఎస్ఐ, నో అబ్జక్షన్, కమర్షియల్ తదితర పది వరకు లైసెన్సులు ఉండాలి. ఆయా లైసెన్సుల కోసం రూ.2 లక్షలకు పైనే ఖర్చవుతుంది. అయితే కేవలం స్థానిక సంస్థల నుంచి అనుమతి పొందడం ద్వారా తక్కువ పెట్టుబడితో అవసరమైన సామగ్రితో ప్లాంట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థలకు గతంలో ప్రభుత్వం పలు మినహాయింపులు ఇచ్చేది. స్వచ్ఛంద సంస్థల మాటున వ్యాపారులు ప్లాంట్లు ఏర్పాటుచేసి ఐఎస్ఐ సర్టిఫికెట్ ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. గ్రామాల్లో రెండు, మూడు ఆర్ఓ ప్లాంట్లు ఉండగా, పట్టణాల్లో పదుల సంఖ్యలో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 600లకు పైనే ఉన్నట్టు అంచనా. కాగా ఐఎస్ఐ సర్టిఫికెట్ కలిగినవి జిల్లాలో కేవలం నాలుగు మాత్రమే ఉండటం గమనార్హం. వీటిలో ఒకటి భీమవరం ఉండి రోడ్డులో ఉండగా, మిగిలినవి తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో ఉన్నాయి. వీరు మాత్రమే వాటర్ను బాట్లింగ్ చేయాల్సి ఉంది. కాగా కొందరు వ్యాపారులు తమ ప్లాంట్లకు ఐఎస్ఐ సర్టిఫికెట్ ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ కనీస ప్రమాణాలు పాటించకుండా బాట్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. హానికరంగా వాటర్ ప్యాకెట్లు : 120 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే మినరల్ వాటర్ ప్యాకింగ్ చేయాలన్న నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదు. తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నిర్ణీత మందం కన్నా పల్చటి కవర్లు వినియోగిస్తున్నారు. దీనివలన పర్యావరణానికి హాని కలగడంతో పాటు ఎండ తీవ్రతకు కవర్లోని నీరు వేడెక్కి కవర్లోని కెమికల్స్ నీటిలోకి చేరడం వలన ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. న్యూస్రీల్భారీగా వ్యాపారం.. శాంపిల్స్ కూడా సేకరించని వైనంగ్రామీణ ప్రాంతాల్లో 20 లీటర్లు రూ.5 నుంచి రూ.10ల వరకు, కూలింగ్ వాటర్ను రూ.30 చొప్పున విక్రయిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లకు చేరవేస్తే రవాణా చార్జీలు అదనం. ప్లాంట్లలో నీటిని వాటర్ ప్యాకెట్లుగా, బాటిళ్లుగా ప్యాకింగ్ చేసి పాన్షాపుల ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఎన్నికల సీజన్ రావడంతో ఈ వేసవిలో భారీస్థాయిలోనే వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది. జిల్లాలో రోజుకు దాదాపు రూ.80 లక్షలకు పైగా నీటి వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. భారీ ఎత్తున జిల్లాలో మినరల్ నీటి అమ్మకాలు జరుగుతున్నా నీటి నాణ్యతను పరిశీలించే దిశగా స్థానిక సంస్థలు కనీసం శాంపిల్స్ కూడా సేకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు కొరవడిన అజమాయిషీ అధిక శాతం ప్లాంట్లలో కానరాని యూవీ సిస్టమ్ యథేచ్ఛగా మినరల్ నీటి వ్యాపారం జిల్లాలో 600కు పైగా ప్లాంట్లు రోజుకు రూ.80 లక్షలకు పైగా అమ్మకాలు -
సీఎం జగన్ అధికారంలోకి రావడం ఖాయం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరలా అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ అన్నా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రజలకు రూ.2.70 లక్షల కోట్లను ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో అందించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా సీఎం జగన్ చేసి చూపించారన్నారు. మహిళలు, వృద్ధులు, యు వత జగన్ను నమ్మి ఓటు వేశారని, వైఎస్సార్ సీపీ రెండోసారి విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసి సీఎం జగన్ ప్రజల విశ్వాసాన్ని పొందారన్నారు. -
సాధారణ విధులపై దృష్టి పెట్టాలి
నరసాపురం: ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సాధారణ విధులపై ఉద్యోగులు దృష్టి పెట్టా లని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ కె.సత్యనారాయణ సూచించారు. శుక్రవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయ న తనిఖీ చేసి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అనంతరం మున్సిపల్, వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో వార్డుల్లో మంచినీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని, డ్రెయినేజీ శుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల అవసరాలు, సమస్యలు తీర్చేలా పనిచేయాలన్నారు. ఉద్యోగుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న డీఆర్ఎంఏను కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులు సత్కరించారు. ఆర్ఐ నానాజీ, డీఈ రమేష్బాబు, టీపీఓ శేషగిరి పాల్గొన్నారు. రక్తపోటుపై అప్రమత్తం భీమవరం అర్బన్: రక్తపోటు (హైబీపీ)పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు అన్నా రు. మండలంలోని గొల్లవానితిప్పలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా 30 ఏళ్లు పైబడిన వారికి హైబీపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మహేశ్వరరావు మాట్లాడుతూ ఒత్తిళ్లు, శారీరక వ్యాయామం, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో వల్ల హైబీపీ వస్తుందన్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉందన్నారు. ఉప్పు, కారం వంటి వాటి వినియోగం తగ్గించాలని, యోగ, ధ్యానం చేయాలన్నారు. అనంతరం బీపీ చెక్ చేయించుకోండి–ఆరోగ్యంగా జీవించండి అంటూ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ హసిత, ఎంపీహెచ్ఈఓ కె.అప్పారావు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. కొనసాగిన ఈఏపీసెట్ భీమవరం: భీమవరంలో ఏపీఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరి గాయి. స్థానిక డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో 300 మందికి 267 హాజరుకాగా, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో 350 మందికి 316 మంది హజరయ్యారు. విష్ణు కళాశాలలో 200 మందికి 183 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పరీక్షల పర్యవేక్షకులు ఎం. అంజన్కుమార్, ఎన్జీకే మూర్తి తెలిపారు. పాఠ్య పుస్తకాల పంపిణీ తాడేపల్లిగూడెం (టీఓసీ): పూర్వ పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సేల్స్ డిపో నుంచి అన్నిరకాల పుస్తకాల పంపిణీని శుక్రవారం ప్రారంభించా రు. నాలుగు మండలాలకు పుస్తకాలను ఆర్టీసీ డిపో నుంచి బస్సుల్లో పంపిణీ చేస్తున్నారు. బుక్స్ డిపో మేనేజర్ టి.భాస్కరరావు, ఆర్టీసీ సూపర్వైజర్ డి.విజయకుమార్, కార్గో మేనేజర్ జి.మాధవరావు పాల్గొన్నారు. -
పిల్లలను బడుల్లో చేర్పించాలి
అత్తిలి: బడిఈడు పిల్లలను పాఠశాలల్లో నమోదు చేయించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు అందేలా చూడాలని జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ అన్నారు. అత్తిలి శివారు రామన్నపేటలో శుక్రవారం చేపట్టిన దివ్యాంగుల పిల్లల నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు సమీపంలోని భవిత కేంద్రంలో పిల్లలను చేర్పించాలని ఆయన కోరారు. పిల్లలు లోపాన్ని అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ప్రత్యేక విద్యను అందిస్తున్నారన్నారు. ఫిజియోథెరపీ, స్పీచ్థెరపీ, ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షలు, ఉద్యోగాల్లో రాయితీలు వర్తిస్తాయన్నారు. సమగ్ర శిక్ష ద్వారా అలవెన్సులు కూడా అందిస్తున్నామన్నారు. జిల్లా సహిత విద్య కో–ఆర్డినేటర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం, టి.శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపాధ్యాయులు యేసురాజు, కేఎన్ రమ్య పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత
భీమవరం: ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్రూముల వద్దకు అనుమతి లేని ఏ ఒక్కరికీ ప్రవేశం లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం భీమవరం విష్ణు కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్రూములను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి భద్రతా అధికారులతో సమీక్షించి సూచనలు జారీ చేశారు. పరిశీలన అనంతరం స్ట్రాంగ్రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. భద్రతా అధికారులతో మాట్లాడుతూ ఏ ఒక్కరినీ స్ట్రాంగ్రూమ్ల ప్రదేశానికి అనుమతించవద్దని, ఐడీ కార్డులు కలిగిన వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేసిన మీదటే అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఎవరూ సెల్ఫోన్ తీసుకుని వెళ్లరాదన్నారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు సెగ్మెంట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను విష్ణు కాలేజీలో, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం సెగ్మెంట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, పోలీస్ అధికారులు ఉన్నారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యా లెట్, హోమ్ ఓటింగ్ బాక్సులను పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రతిష్ట భద్రత మధ్య భీమవరం విష్ణు కాలేజీ స్ట్రాంగ్రూమ్కు తరలించినట్టు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. స్థానిక భీమవరం కలెక్టరేట్ స్ట్రాంగ్రూమ్లోని పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ బాక్సులను శుక్రవారం మధ్యాహ్నం పటిష్ట బందోబస్తు మధ్య భీమవరం విష్ణు కాలేజీలోని స్ట్రాంగ్రూమ్నకు తరలించారు. స్ట్రాంగ్రూమ్లో బ్యా లెట్ బాక్సులను ఉంచి సీల్ చేశారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ను 13,347 మంది, హోమ్ ఓటింగ్ను 1,089 మంది మొత్తంగా 14,433 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, ఎన్నికల డీటీ ఎం.సన్యాసిరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మేడిది జాన్సన్, ఆర్వీ ప్రసాద్ (వైఎస్సార్సీపీ), మరపట్ల శ్యాంబాబు (టీడీపీ), తమలంపూడి వంశీ శ్రీనివాస్రావు, నల్లిమిల్లి అబ్రహం (కాంగ్రెస్), స్వతంత్ర అభ్యర్థులు కాకర రాజ్కుమార్, అద్దంకి దొరబాబు, తోలేటి రామ దుర్గాప్రసాద్, మేడపా వెంకట వరహాలరెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారితో సమీక్ష రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా భీమవరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సుమిత్కుమార్, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల హాజరయ్యారు. కలెక్టర్ సుమిత్కుమార్ -
జనం చెంతకే గిరిజన ఉత్పత్తులు
బుట్టాయగూడెం: అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజల చెంతకు చేర్చెందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేకంగా కృషి చేస్తుంది. అడవుల్లో గిరిజనులు సేకరించిన ముడి సరుకులను జీసీసీ అధికారులు కొనుగోలు చేసి వాటి ద్వారా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంది. ఈ ఉత్పత్తులను జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన షాపుల్లో, మొబైల్ వ్యాన్, వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. రసాయనాలు లేని ఉత్పత్తులు కావడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం ఆసక్తి చూపుతున్నారు. గిరిజన ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతో పాటు గిరిజన తేనె, త్రిఫల పౌడర్, ఆయిల్, గిరిజన సబ్బులకు మంచి గిరాకీ ఉంది. గిరిజన సహకార సంస్థ రంపచోడవరం డివిజన్ పరిధిలో 5 జీసీసీ సొసైటీ గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ఉత్పత్తుల విక్రయాలు ఇలా అటవీ ప్రాంతం నుంచి గిరిపుత్రులు సేకరించిన చింతపండు, పుట్టతేనె, చెట్ల తేనె, నరమామిడి చెక్క, కరక్కాయలు, నల్ల జీడిగింజలు, ముసిడి గింజలు, అడవి ఉసిరి కాయలు, శీకాయలు, కుంకుడు కాయలు వివిధ రకాల పండ్లు ఇలా 30 రకాల వరకూ చిన్న తరహా ఉత్పత్తులు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేకరిస్తుంది. రాష్ట్రంలో 26 గిరిజన సహకార సంస్థలు (జీసీసీ), 9 డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా సేకరించిన ఉత్పత్తులను 70 కేంద్రాల్లో నిల్వ ఉంచుతారు. రంపచోడవరం డివిజన్ పరిధిలో రూ.85 కోట్ల అమ్మకాలు గిరిజన సహకార సంస్థ రంపచోడవరం డివిజన్ పరిధిలోని కోటరామచంద్రపురం ( కేఆర్పురం), అడ్డతీగల, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 129 జీసీసీ డిపోలు ఉన్నాయి. వీటిలో 2023 –24 ఆర్థిక సంవత్సరానికి రూ.94 కోట్లు అమ్మకాలు టార్గెట్ కాగా 2024 మార్చి వరకూ సుమారు రూ.86 కోట్ల అమ్మకాలు జరిగినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. మిగిలిన టార్గెట్ మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని చెబుతున్నారు. మొబైల్ సేవల ద్వారా విక్రయాలకు శ్రీకారం ప్రకృతి సిద్ధ అటవీ ఉత్పత్తులకు మంచి గిరాకీ 2023 –24 ఆర్థిక సంవత్సరానికి రూ.94 కోట్ల అమ్మకాలు టార్గెట్ ఇంతవరకు రూ.86 కోట్ల అమ్మకాలు ప్రజల చెంతకు జీసీసీ ఉత్పత్తులు జీసీసీ ద్వారా విక్రయిస్తున్న ఉత్పత్తులను ప్రజల చెంతకు చేరేలా కృషి చేస్తున్నాం. రంపచోడవరం పరిధిలోని 129 డిపోల్లో విక్రయాలు చేస్తున్నారు. గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాది సుమారు రూ.86 కోట్ల వరకూ గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయి. – జి.పార్వతీశ్వరరావు, కేఆర్పురం జీసీసీ ఇన్చార్జి, జీసీసీ డీఎం, రంపచోడవరం -
ట్రిపుల్ ఐటీ ఆవరణలో ఎన్సీసీ క్యాడెట్లకు శిక్షణ
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఆవరణలో ఆంధ్రా 4(ఏ) ఎన్సీసీ విజయవాడ బాలికల బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరం శుక్రవారం రెండో రోజుకు చేరింది. జిల్లా నుంచి ఆరు కళాశాలలు, 14 పాఠశాలలకు చెందిన 723 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని శిక్షణ పొందుతున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజూ రెండు పూటలా డ్రిల్ నిర్వహించడంతో పాటు నాయకత్వ లక్షణాల పెంపుదల, రైఫిల్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, ఆప్టికల్ ట్రైనింగ్, వెపన్ ట్రైనింగ్, ఫైరింగ్, స్వీయ రక్షణ, యోగ, ఎన్డీఆర్ఎఫ్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 25 వరకు శిబిరం కొనసాగుతుంది. క్యాంప్ కమాండెంట్ కల్నల్ బలేందర్సింగ్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు పటిష్ట శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాంప్ ఆఫీసర్ మేజర్ స్వాతీపాండే, సుబేదార్ మేజర్ రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక ఆగిరిపల్లి: మండలంలోని ఈదులగూడెంకు చెందిన 6వ తరగతి విద్యార్థి భరత్ రాయ్ అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల బాపట్లలో నిర్వహించిన కరాటే జాతీయస్థాయి పోటీల్లో భరత్ రాయ్ ప్రతిభ చూపి.. నేపాల్లో జరిగే కరాటే పోటీలకు ఎంపికయ్యాడని తండ్రి దేవరపల్లి వేణు తెలిపారు. విద్యార్థిని పీఎసీఎస్ అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య, చిట్నేని శివరామకృష్ణ, కోచ్ జాస్తి విద్యాధర్ అభినందించారు. ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఇద్దరు రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరును చోరీచేశారు. రైతులు నల్లగోపు శ్రీనివాస్, కొయ్య గంగాధరరావులు శుక్రవారం ఉదయం తమ పొలాలకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరును చోరీ చేసినట్లు గుర్తించారు. చోరీ విషయాన్ని విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. ఇటీవల మండలంలో రైతుల పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరు చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, దొంగతనాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కొంతేరులో నాటిక పోటీలు ప్రారంభం
యలమంచిలి: సమాజంలోని రుగ్మతలను వేలెత్తి చూపడంలో నేటికీ నాటికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కొంతేరు యూత్ క్లబ్ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ చెప్పారు. కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 42వ జాతీయ స్థాయి నాటిక పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు మురళీకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రారంభ సభలో చేగొండి సత్యనారాయణమూర్తి, కొంతేటి సర్వేశలింగం, గుండా రామకృష్ణ, ఉన్నమట్ల కబర్ది, గోడి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు నాటిక ప్రాంగణానికి కొంతేరు మాజీ సర్పంచ్ ముదునూరి నరసింహరాజు పేరు పెట్టారు. తొలి ప్రదర్శనగా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ వారిచే కౌసల్యా..సుప్రజా..రామా..! నాటిక ప్రదర్శించారు. రామాయణంలో రాముడు అరణ్యానికి వెళ్తుంటే భర్త దశరథుడి మీద గౌరవంతో కుమారుడి అరణ్య ప్రయాణాన్ని కౌసల్య ఎలా అడ్డుకోలేక పోయిందో కలియుగంలో కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న పిల్లలను అడ్డుకోలేకపోతున్నారనే ఇతివృత్తంతో నాటిక సాగింది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. రెండవ నాటికగా చిలకలూరిపేట సుకృతి క్రియేషన్స్ వారిచే మిణుగురు వెలుగులు నాటిక ప్రదర్శించారు. కె.ఆదిత్య రచించిన ఈ నాటకానికి కెవి మంగారావు దర్శకత్వం వహించారు. ప్రేమ ఫలించలేదని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని సమాధుల పాలయితే బతికి ఉండగానే ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఎలాంటిదో ఈ నాటిక కళ్లకు కట్టింది. -
ఉమ్మడి జిల్లాలో మోస్తరు వర్షం
నేడూ వర్షం పడే అవకాశం ఏలూరు(మెట్రో) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు గత రెండు నెలలుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న తరుణంలో ఉపశమనం లభించించి. ఎండాకాలంలో రెయిన్కోట్లు, గొడుగులు దర్శనమిచ్చాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో శనివారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. వర్షం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఆ మేరకు రైతులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 1.5 మి.మి వర్షం నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం నుంచి వర్షంపోలవరం రూరల్: అల్పపీడనం ప్రభావంతో పోలవరం ప్రాంతంలో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పడిన వర్షంతో ప్రజలు సేదతీరారు. రెండు రోజుల క్రితం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు జల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. పాలకొల్లులో జోరువాన పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో కురిసిన వర్షానికి జనం ఎక్కడికక్కడ స్తంభించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కురిసిన వర్షంతో పట్టణంలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండు ప్రాంతం వర్షం నీటితో నిండిపోయింది. అకాల వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. గంటన్నర సేపు వర్షం కురిసింది. ఆటో స్టాండ్, హౌసింగ్బోర్డు కాలనీ, బ్రాడీపేట, శ్రీరాంపేట, బంగారు వారి చెరువుగట్టు వంటి అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోలవరంలో ఈదురుగాలులతో వర్షం -
తిరుమలాపురంలో చేపల చెరువు వివాదం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం పంచాయతీలోని తామర చెరువు వద్ద గిరిజనులు, చేపల పాటదారులు మధ్య వివాదం తలెత్తింది. తామరచెరువులో ఏటా పంచాయతీ ద్వారా చేపలు పట్టేందుకు వేలం నిర్వహిస్తుంటారు. స్థానికులు ఈ చెరువును వేలంలో రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. కొద్ది రోజులు క్రితం కొంతమంది గిరిజనులు చేపలను పట్టుకుంటామని స్థానికులకు చెప్పి వెళ్లిపోయారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి సుబ్బలక్ష్మీ జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పెద్ద సంఖ్యలో గిరిజనులు వలలతో చెరువు వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పాటదారులు, స్థానికులు చెరువు వద్దకు చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. సీఐ రాజేష్, ఎస్సై జ్యోతిబాస్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. -
ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణంలో ఉద్రిక్తత
నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం సౌత్ గ్రామం నుంచి రుస్తుంబాద వరకూ చేపట్టిన ఓఎన్జీసీ పైప్లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం మండలంలోని సీతారామపురం సౌత్ గ్రామంలోని ఓఎన్జీసీ రిగ్గు నుంచి రుస్తుంబాదలోని ఓఎన్జీసీ స్థావరం (యస్–4) వరకూ భూగర్భ నిల్వలను తరలించేందుకు పైపులైన్ నిర్మాణ పనులు రైతులు అడ్డుకోవడంతో గత కొన్నేళ్లుగా నిలిచి పోయాయి. ఈ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు పలుమార్లు ప్రయత్నించినా రుస్తుంబాదకు చెందిన పలువురు రైతులు అభ్యంతరం చెప్పడంతో నిలిచిపోయాయి. తాజాగా శుక్రవారం అధికారులు పోలీసు, ఎస్పీఎఫ్, స్పెషల్పార్టీ బలగాల రక్షణతో నిర్మాణ పనులు చేపట్టే ప్రయత్నం చేసింది. అడ్డు వచ్చిన రైతులను పోలీసులు బస్సుల్లో భీమవరంలోని కలెక్టరేట్కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పొలాల్లో గ్యాస్ పైపులైన్లు వేయడం వల్ల నష్టపోతామంటూ రైతులు వాపోయారు. రైతులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు. తాత్కాలికంగా పనులు విరమించుకోవాలని ఓఎన్జీసీ అధికారులకు సూచించినట్లు నరసాపురం తహసీల్దార్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పైప్లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని సీపీయం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు డిమాండ్ చేశారు. శశి ఇంజినీరింగ్ కళాశాలకు అదనపు సీట్లు తాడేపల్లిగూడెం : పట్టణంలోని శశి ఇంజనీరింగ్ కళాశాలకు అదనపు సీట్లు మంజూరు చేస్తూ ఏఐసీటీఇ నుంచి అనుమతి వచ్చినట్టు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. 2024–25 సంవత్సరానికి కంప్యూటర్ సైన్సు విభాగంలో 180 సీట్లకు అదనంగా 60 సీట్లు, కంప్యూటర్ సైన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్ విభాగంలో ప్రస్తుతమున్న 120 సీట్లకు అదనంగా 60 సీట్లు మంజూరయ్యాయన్నారు. నేడు ప్రవీణ్ ప్రకాశ్ పర్యటన ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకులో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠ్యపుస్తకాల వివరాలను స్టాక్పాయింట్లో పరిశీలిస్తారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలు, జగనన్న విద్యాకానుకలో మిగిలిన వస్తువుల వివరాలు తెలుసుకుంటారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మన బడి – నాడు నేడు పనుల ప్రగతి, ఐఎఫ్పీ ప్యానల్స్ పనితీరు, జగనన్న విద్యాకానుకకు కొత్త స్టాక్ వివరాలు, శానిటరీ న్యాప్కిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ బిళ్ళల పంపిణీ తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. -
శ్రీవారిబ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఈనెల 25తో ముగియనున్నాయి. అందులో భాగంగా ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ రాజగోపురాల సముదాయం, అనివెట్టి మండపం తదితర ప్రాంతాలు మిరమిట్లు గొలుపుతున్నాయి. ఆలయ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వామివారి భారీ విద్యుత్ కటౌట్ చూపరులను ఆకట్టుకుంటోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను నిర్మించారు. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో నిర్వహించే శ్రీవారి తిరువీధి సేవలకు స్వామివారి వాహనాలను ముస్తాబు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికను సుందరీకరించారు. శనివారం స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ ఉత్సవాలు ముగిసే వరకు స్వామివారు ఆలయ ముఖ మండపంలో రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. నేడు వరుడిగా చినవెంకన్న ముస్తాబు బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి – భజన కార్యక్రమాలు ఉదయం 8 నుంచి – అన్నమాచార్య కీర్తనలు ఉదయం 8.30 నుంచి – శ్రీవారిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకారం ఉదయం 9 నుంచి – హరికథ ఉదయం 11 నుంచి – భక్తిరంజని సాయంత్రం 4 నుంచి – నాదస్వరకచేరి సాయంత్రం 5 నుంచి – కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు రాత్రి 7 నుంచి – గజ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ రాత్రి 8 నుంచి – నాటకం శ్రీవారి ప్రత్యేక అలంకారం : శ్రీ భూసమేత మహావిష్ణువు -
కిక్కిస పొదలకు నిప్పు
కై కలూరు: అక్రమ చేపల సాగు కోసం కొల్లేరు ప్రాంతంలో కిక్కిసను కొందరు తగలబెడుతున్నారు. సాధారణ సమయంలో నీటిలో కిక్కిస పొదలను తొలగించడం కష్టం. వేసవిలో చిన్న నిప్పురవ్వ మొత్తం కిక్కిసను తుడుచిపెడుతోంది. ఇదే అవకాశంగా చేసుకుని కొంతమంది ప్రతీ వేసవిలో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కిక్కిసను తగలబెడుతున్నారు. పెదఎడ్లగాడి వంతెన సమీపంలోని ఏలూరు జిల్లా కలకర్రు ప్రాంతంలో గురువారం పెద్ద ఎత్తున కిక్కిసను తగలబెట్టారు. దీంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ కుమార్ను వివరణ కోరగా కిక్కిసను తగలబెడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కొల్లేరు కిక్కిస పొదల్లో అరుదైన పక్షి జాతులు నివాసం ఉంటాయని.. పర్యావరణానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెనుగొండ: వడలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. పెనుగొండ ఎస్సై షేక్ సుభాని తెలిపిన వివరాల ప్రకారం వీరవాసరం మండలం కొణితివాడకు చెందిన యరకరాజు దుర్గాభవాని(39), చిన్న కుమార్తె మాధురీలత, పెద్ద కుమార్తె కుమారుడు హరీష్తో కలిసి మోటారు సైకిల్పై కోనసీమ జిల్లా పేరవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వడలిలోని రైసుమిల్లు సమీపంలోకి వచ్చే సరికి సిద్ధాంతం నుంచి పెనుగొండ వెళ్తున్న లారీ ఢీకొనడంతో దుర్గాభవాని సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మాధురీలత తీవ్రంగా గాయపడడంతో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. హరీష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. గత రెండు రోజులుగా వరి చేల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతుండడంతో రోడ్డుపై పడిన మట్టికి తోడు గురువారం వర్షం పడడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయని, అందువల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
డయేరియాతో చిన్నారి మృతి
కుక్కునూరు: డయేరియాతో భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుములతోగు గ్రామానికి చెందిన దేవరాజు (5) మృతి చెందాడు. దామరచర్ల పంచాయతీ కురుములతోగు గ్రామానికి చెందిన గిరిజనులు కలుషిత నీటిని తాగడంతో అనారోగ్యానికి గురయ్యారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో దేవరాజ్ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. ముగ్గురు మహిళలు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. డయోరియాతో బుధవారం బొజ్జమ్మ అనే మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే.. బాధిత కుటుంబాలను గురువారం కేఆర్ పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ పరామర్శించారు. కురుములతోగులో గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వెంటనే గ్రామంలో హ్యాండ్బోర్ వేయించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు నిత్యవసర సరుకులను అందించనున్నట్టు చెప్పారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించేలా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. గ్రామస్తులు తాగేందుకు మినరల్ వాటర్ను ఏర్పాటు చేశారు. పీఓతో పాటు డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్.శర్మిష్ట, డీఎల్పీఓ రజావుల్లా, వైస్ ఎంపీపీ తాండ్ర రాజేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కుచ్చర్లపాటి నరసింహారాజు, రావు వినోద్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. వైద్యశిబిరం ఏర్పాటు బాధిత గ్రామాల్లో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గురువారం మండలంలోని కురుములతోగు, గుత్తికోయ గ్రామాల్లో వైద్యశిబిరం నిర్వహించారు. ఇప్పటికే కురుమలతోగు గ్రామానికి చెందిన 10 మంది అస్వస్థతకు గురికాగా, వీరిలో ఇద్దరు మరణించారు. గురువారం గుత్తికోయలో మరో ముగ్గురు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా, వారిని వైద్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మండలంలోని డయరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాధి తీవ్రత తగ్గేంతవరకు వైద్యశిబిరాలు కొనసాగిస్తామని డీఎల్పీవో రజావుల్ల తెలిపారు. నీటి కాలుష్యం కారణం కాదు డయేరియాకు కారణం గిరిజనులు తాగిన నీరు కాదని ఎంపీడీవో నరసింహారావు చెప్పారు. నీటి నమూనాలు పరీక్షలకు పంపించగా.. అందులో ఎలాంటి కాలుష్యం లేనట్టు తేలిందన్నారు. కురుములతోగు, గుత్తికోయ గ్రామాల్లో వైద్య శిబిరాలు బాధిత కుటుంబాల్ని పరామర్శించిన ఐటీడీఓ పీవో -
గత వైభవం కనుమరుగు
నరసాపురం: మొగల్తూరు పేరు చెపితే.. రాజుల పాలనా వైభవం, తీర ప్రాంత చేపల రుచులు మాత్రమే కాదు.. వేసవిలో మామిడిపళ్లు నోరూరిస్తాయి. ఇసుక నేల సారం వల్ల అద్భుత రుచి ఉండే మొగల్తూరు మామిడికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది. దేశ విదేశాల్లోని తమ బంధువులు, స్నేహితులకు ఏటా వేసవి సీజన్లో మొగల్తూరు మామిడిపళ్లను పంపుతారు. నూజివీడు మామిడికి సమానంగా మొగల్తూరు మామిడికి పేరుంది. ఇప్పుడు మొగల్తూరు మామిడి ప్రాభవం కోల్పోతుంది. పెరుగుతున్న పట్టణీకరణతో తోటలు కొట్టేస్తున్నారు. దీంతో విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇక తోటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. దీంతో కాపు తగ్గుతోంది. మొగల్తూరు మామిడా.. మజాకా! మొగల్తూరు, పేరుపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1500 ఎకరాల్లో మామిడితోటలున్నాయి. చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి ఇక్కడ ఫేమస్. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. ఆవకాయ పచ్చళ్లకు సంబంధించి సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లకు డిమాండ్ ఉంది. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచే కాకుండా, పక్క జిల్లాల నుంచి అటు మామిడిపళ్లు, ఇటు పచ్చడి రకాలు కొంటారు. వేసవి సీజన్ వచ్చిందంటే మొగల్తూరు మామిడి మార్కెట్ కిటకిటలాడుతుంది. తెగుళ్ల బారిన తోటలు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు ఇటీవల సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో ఇళ్ల స్థలాలకు లేఅవుట్ల కోసం తోటలు నరికేస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గిపోతుంది. ఒకప్పుడు 5 వేల ఎకరాల్లో మొగల్తూరు చుట్టుపక్కల మామిడి తోటలుండేవి. ఇప్పుడు విస్తీర్ణం 2 వేల ఎకరాలకు పడిపోయింది. ప్రస్తుతం తోటల కంటే ఇక్కడ ప్రతి ఇంటి పెరట్లో కొన్ని చెట్లు ఉంటున్నాయి. ప్రతి ఇంటి పెరట్లో, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో మామిడి చెట్లు పెంచుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా గాలి దుమారంతో పిందెలు, కాయలు కూడా రాలిపోవడం వంటి కారణాలతో కూడా కాపు తగ్గుతుంది. మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ విక్రయిస్తుంటారు. చెట్ల కాపును బట్టి వ్యాపారులు కొని కాయలు తయారయ్యాక విక్రయిస్తారు. సీజన్లో ప్రతి రోజూ ఉదయం మొగల్తూరులో మార్కెట్ జరుగుతుంది. మొగల్తూరు నుంచి సీతారామపురం వరకూ 216 జాతీయ రహదారి దారిపొడవునా మామిడిపళ్లు విక్రయిస్తారు. లేట్గా వచ్చినా టేస్ట్లో బెస్ట్ మొగల్తూరు మామిడి పళ్లు ఆలస్యంగా కాపుకు వస్తాయి. జిల్లాలో చాలాచోట్ల మొగల్తూరు మామిడి పేరుతో, వేరే ప్రాంతాల నుంచి తెచ్చిన పళ్లను విక్రయిస్తారు. మే రెండోవారం నుంచి జూన్, జూలై నెలల్లో కూడా మొగల్తూరు మామిడిపళ్లు దొరుకుతాయి. మొగల్తూరు మామిడిపళ్లు పరక రూ.200 వరకూ అమ్ముతారు. బంగినపల్లి రకం కాయ డిమాండ్ బట్టి రూ 30 నుంచి రూ.70 వరకూ పలుకుతుంది. మొగల్తూరులో మామిడి తోటలు తగ్గుతున్న మొగల్తూరు మామిడి విస్తీర్ణం గతంలో 5 వేల ఎకరాల్లో తోటలు ప్రస్తుతం 2 వేల ఎకరాల లోపే తగ్గిపోతున్న తోటలు తోటలు తగ్గిపోతున్నాయి. కాపు తగ్గిపోతుంది. తోటలు నరికేసి లేఅవుట్లు వేస్తున్నారు. మా చిన్నప్పుడు కాపు ఇప్పుడు లేదు. దీంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల సీజన్ అయిపోతుంటే మాకు ప్రారంభమవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి బయట దేశాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు మామిడి కాయలు పంపిస్తారు. – బి.భోగేశ్వరారవు, పేరుపాలెం, రైతుకాపు అంతంత మాత్రమే ఈ ఏడాది కాపు అంతంత మాత్రమే.. గత మూడేళ్ల నుంచి కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడ్డాం. తోటలతో సరైన ఆదాయం రాలేదు. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుందని అనుకున్నాం. కాపు తక్కువగా ఉన్నా రేటు బాగుంది. ఇప్పటికే మామిడికాయల కోసం వ్యాపారులు వచ్చి కలుస్తున్నారు. మొగల్తూరు మామిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. – మన్నె ముత్యాలరావు,, మొగల్తూరు, రైతు -
సేంద్రియ, జీవన ఎరువులే మేలు
నూజివీడు: భూమిలో పోషకాల లోపం ఉంటే భర్తీకి రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించేటప్పుడు కొన్ని పోషకాలు అధికంగా ఇవ్వడం, మరికొన్ని తక్కువగా ఇవ్వడం వల్ల పోషక లభ్యతలో సమతుల్యత లేక పంటల ఉత్పాదకత తగ్గిపోతుంది. పోషకాలను రసాయన ఎరువుల రూపంలో అవసరానికి మించి వాడటంతో భూభౌతిక లక్షణాలు మారిపోయి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితులలో భూములు ఎక్కువ కాలం సాగుకు పనికివచ్చేలా ఉండాలంటే రైతులు రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ, జీవన ఎరువులను వాడాలని నూజివీడు వ్యవసాయాధికారిణి ఆలూరు చాముండేశ్వరి పేర్కొన్నారు. సేంద్రియ, జీవన ఎరువుల వల్ల ఉపయోగాల గురించి ఆమె సూచనలు అందించారు. రసాయన ఎరువులతో నష్టాలు నేలలోని పోషకాల సమతుల్యత దెబ్బతినడమే కాకుండా నేల ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడటం వల్ల నేలలో కాలుష్యం పెరిగి సహజత్వం దెబ్బతింటుంది. చౌడు సమస్య ఏర్పడటంతో పాటు సూక్ష్మపోషక లోపాలు ఏర్పడతాయి. దీంతో చీడపీడలు పంటలను ఎక్కువగా ఆశిస్తాయి. చివరకు మొక్కలు బలహీనంగా పెరిగి దిగుబడి తగ్గిపోతుంది. సేంద్రియ ఎరువులలో పచ్చిరొట్ట ఎరువులు పచ్చిరొట్ట విత్తనాలు పొలంలో చల్లుకుని పంట పూత దశలలో భూమిలోనే కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల 30 నుంచి 35 శాతం వరకు నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. ఖరీఫ్ పంటకు ముందు వర్షాకాలంలో పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాలి. జీలుగు, జనుము, అలచంద, పిల్లిపెసర, పెసర తదితర పచ్చిరొట్ట ఎరువులు బాగా ఉపయోగపడతాయి. కంపోస్టు ఎరువు వ్యవసాయ వ్యర్థాలు, ఆకులు తదితర వాటిని కొంతకాలం పాటు కుళ్లించిన తరువాత ఎరువుగా వాడతారు. అలాగే వానపాముల నుంచి వచ్చిన విసర్జనను ఎరువుగా వాడతారు. వీటి వాడకం వల్ల కూడా భూసారం పెరుగుతుంది. వానపాముల నుంచి వచ్చిన విసర్జనను వర్మీకంపోస్టు అంటారు. దీనిని ఎకరాకు ఒకటి నుంచి ఒకటిన్నర టన్ను వరకు ఉపయోగించవచ్చు. వరిపంటకు నాటిన తరువాత, మిగతా పంటలలో దుక్కిలో వేసి కలియదున్నాలి. అలాగే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, మేకల ఎరువు, గొర్రెల ఎరువులు వాడుకోవాలి. సేంద్రియ ఎరువుల వల్ల లాభాలు నేలలో నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. భూసారం పెరగడంతోపాటు వివిధ పోషకాలు మార్పిడి చెందే శక్తి నెలలో పెరుగుతుంది. మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. నేలలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది సుస్థిర దిగుబడులు సాధించవచ్చు. దిగుబడులు పెరుగుతాయి. నేలలో కాలుష్యం తగ్గుతుంది. ప్రకృతిలోగల సూక్ష్మజీవులు మొక్కలతోను కలిసి జీవించేటప్పుడు పంటలకు కావాల్సిన పోషకాలను వాతావరణం నుంచి గ్రహించి మొక్కలకు అందిస్తాయి. అందుకే వీటిని జీవన ఎరువులుగా గుర్తించారు. రైజోబియం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అజటోబాక్టర్ తదితర జీవన ఎరువులు ఉన్నాయి. ఇవి నత్రజనిని స్థిరీకరిస్తాయి. జీవన ఎరువుల వల్ల లాభాలు ఇవి మొక్కలకు ఎరువులను, పోషకాలను, వివిధ హార్మోనులను, విటమిన్లు, ఎంజైములు చేరుస్తాయి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను, చీడలను అరికడతాయి. 25 శాతం వరకు నత్రజని, భాస్వరం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. మిత్రపురుగులకు ఎలాంటి హాని జరగదు. దీంతో నేలలో కాలుష్యం తగ్గడంతో పాటు భూసారం పెరుగుతుంది. 20 శాతం వరకు దిగుబడులు పెరుగుతాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
భీమడోలు: సూరప్పగూడెం ఫ్లైఓవర్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. విజయనగరం జిల్లా పలాసకు చెందిన బద్రి లోకేష్ భీమడోలు రైల్వేస్టేషన్లో ట్రాక్మెన్గా పనిచేస్తున్నాడు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా బైక్పై వెళ్తున్నాడు. మంగళగిరికి చెందిన పఠాన్ నాగూర్బీ, తన కుమారుడు తారక్, కుమార్తె నానుతో కలిసి బైక్పై ద్వారకాతిరుమలలో స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి బయల్దేరారు. తారక్ బైక్ నడుపుతుండగా మధ్యలో నాను, చివర నాగూర్బీ కూర్చుంది. తారక్ ముందు వెళ్తున్న లోకేష్ బైక్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో బద్రి లోకేష్(28) తలకు తీవ్రగాయాలై అక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో నాగూర్బీ(41) తలకు తీవ్ర గాయమైంది. నాగూర్ బీను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో గాయపడ్డ తారక్, నానులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచానామా నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో తనిఖీలు భీమడోలు : గుండుగొలనులోని రేషన్ దుకాణంపై గురువారం విజిలెన్స్, సివిల్ సప్లయిస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో అదనంగా ఉన్న 122 కేజీల బియ్యం, 7 ప్యాకెట్ల పంచదార, గోధుమ పిండి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. డీలర్ ఎన్.లక్ష్మీ శివకుమారిపై కేసు నమోదు చేసారు. తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లలో ఉండాల్సిన సరుకు కన్నా అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో వి.వెంకటేశ్వరరావు పంచనామా నిర్వహించారు. 18న త్రోబాల్ సబ్ జూనియర్ నేషనల్స్ సెలెక్షన్స్ తాడేపల్లిగూడెం (టీఓసీ): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (ఐజీఎంసీ)లో ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి త్రోబాల్ సబ్ జూనియర్ నేషనల్స్ సెలక్షన్లు జరుగుతాయని త్రోబాల్ పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ఏఆర్కే వర్మ, సెక్రటరీ ఎన్.ఎం.శ్రీనాఽఽథ్ తెలిపారు. సెలక్షన్స్లో ప్రతిభ చూపిన విద్యార్థులు పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. 01.01.2010 తరువాత పుట్టిన వారై ఉండాలని, ఆధార్ కార్డు జిరాక్స్, ఎనిమిది పాస్పోర్టు సైజ్ ఫోటోలు అందించాలని, మరిన్ని వివరాలకు 97012 03030, 72879 65417 నెంబర్లలో సంప్రదించాలన్నారు. హత్య చేసిన వ్యక్తి అరెస్టు టి.నరసాపురం: టి.నరసాపురంలో వ్యక్తిని హత్య చేసిన పెసరగంటి మంగయ్యను గురువారం జీలుగుమిల్లి సీఐ పి.క్రాంతి కుమార్ అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. టి.నరసాపురం తూర్పుగూడానికి చెందిన రాయల వీరాస్వామి భార్యతో అదే గ్రామానికి చెందిన మంగయ్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం వీరాస్వామికి తెలియడంతో.. వీరాస్వామిని అడ్డు తొలగించుకోవాలని మంగయ్య ప్లాన్ వేశారు. ఈ నెల 10న తూర్పుగూడెం శివారు పామాయిల్ తోట దగ్గరకు వీరాస్వామిని మంగయ్య తీసుకువెళ్లి మద్యం తాగించాడు. తరువాత అతనితో గొడవపడి వీరాస్వామిని కత్తితో పొడిచాడు. గాయపడిన వీరాస్వామి చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందాడు. టి.నరసాపురం పోలీసులు హత్య కేసు నమోదు చేయగా, కేసును సీఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. మంగయ్యను గురువారం అరెస్టు చేసి చింతలపూడి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
శ్రీ షిర్డీసాయి విద్యార్థులకు జాతీయ ర్యాంకులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో తమ విద్యార్థులు సత్తా చాటారని రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ టి.శ్రీవిద్య గురువారం తెలిపారు. తమ డాఫ్నీ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మిజోరం రాష్ట్రానికి చెందిన ఐన్ల ఏవో ఆలిండియా 2వ ర్యాంకు సాధించిందన్నారు. జి.ప్రసన్నసాయి ఆలిండియా 328వ ర్యాంకు, ఎన్.భావన 504వ ర్యాంకు సాధించి ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అర్హత సాధించారన్నారు. దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలలో కేవలం 4,051 సీట్లు మాత్రమే ఉంటాయని, అందులో ముగ్గురు తమ విద్యార్థులే కావడం ఆనందదాయకమన్నారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఐఐటీ, నీట్ వంటి రెగ్యులర్ కోర్సులతో పాటు సివిల్స్, క్లాట్, ఐపీమ్యాట్, క్యూట్ వంటి కోర్సులను తమ విద్యార్థులు ఎంపిక చేసుకోవడం హర్షణీయమన్నారు. -
స్వీప్తో సత్ఫలితం
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాలు (స్వీప్) సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు దోహదపడ్డాయి. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83.67 ఓటింగ్ శాతం నమోదు కాగా ప్రస్తుత ఎన్నికల్లో తుది గణాంకాలు సంకలనం పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్తో కలిసి దాదాపు 84.82 శాతానికి ఓటింగ్ పెరిగింది. 90 రోజులు నిర్విరామంగా.. కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ గత ఎన్నికల పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే లక్ష్యంగా జిల్లాలో 90 రోజులు నిర్విరామంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్స్ టర్న్అవుట్ ఇప్లిమెంటేషన్ ప్రణాళికను ఆమోదించి స్వీప్ నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ను నియమించి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించారు. ఓటర్లలో చైతన్య అవగాహన కార్యక్రమాలు, ఓటు హక్కు ప్రాధాన్యత, గిరిజన, గ్రామీణ ప్రాంత ఓటర్లలో, బూత్ స్థాయిలో అసోషియేషన్ గ్రూపుల ఏర్పాటు, కశాశాల విద్యార్థులతో క్యాంపస్ అంబాసిడర్లు వంటి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. మహిళా సంఘాలతో చర్చావేదికలు, మొదటిసారిగా ఓటు హక్కు నమోదుచేసుకున్న ఓటర్లతో ముఖాముఖీ కార్యక్రమాలు, ఓటు వేయాలని ప్రత్యేక ఆహ్వాన పత్రిక ద్వారా పిలుపు జిల్లాలో పోలింగ్ శాతం పెరగడానికి దోహద పడ్డాయి. అలాగే ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, సీ–విజిల్, సాక్ష్యం యాప్, 1950 టోల్ఫ్రీ నంబర్, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వృద్ధాశ్రమాల్లో ‘హోం ఓటింగ్’పై అవగాహన కల్పించడం, పోలీస్ కవాతులు వంటివి నిర్వహించారు. స్వీప్ కార్యక్రమాల్లో కళాశాల విద్యార్థులు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో స్వాగతం పోలింగ్ రోజు స్వీప్ నోడల్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ బృందం తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులలో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లను ఘనంగా స్వాగతించడం, ఓటు వేసిన ప్రతి ఓటరుకు ‘గో గ్రీన్’ అనే నినాదంతో పచ్చని మొక్కలు ఇచ్చి వీడ్కోలు పలకడం జిల్లా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది. పోటెత్తిన ఓటరు చైతన్యం అధికారుల కార్యక్రమాలతోపెరిగిన పోలింగ్ ఎన్నికల కమిషన్ నుంచి అభినందనలు -
భూసార పరీక్షలకు సన్నద్ధం
గురువారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2024●ఆకివీడు: దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, మద్దతు ధర లభించడంతో రైతులు ఖరీఫ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారు. గత ఖరీఫ్, రబీ సాగు దిగుబడులు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇదే ఉత్సాహంతో వచ్చే ఖరీఫ్ సాగుకు జిల్లాలో రైతులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచారు. ఈ నెలాఖరు నాటికి రబీ మాసూళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే జిల్లాలో మాసూళ్లు పూర్తయిన ప్రాంతాల్లో రైతులు పచ్చిరొట్ట సాగు చేపట్టారు. దీని ద్వారా భూసారం పెరిగే అవకాశం ఉంది. భూసార పరీక్ష.. పంటకు రక్ష భూసార పరీక్షలతో అధిక దిగుబడులు సాధించేలా యంత్రాంగం దృష్టి పెట్టింది. జిల్లాలో 5 వేల మట్టి నమూనాలు సేకరించి వాటిని పరీక్షించే దిశలో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించే సర్వే నంబర్లను గుర్తించారు. నెలాఖరులోపు శాంపిల్స్ సేకరించి, పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జూన్ రెండో వారం నాటికి భూసార పరీక్షా ఫలితాల్ని ఆయా రైతులకు తెలియజేస్తారు. భూమిలో చౌడు, ఆమల గుణాల స్థాయిని నిర్ధారించి, సంబంధిత భూముల్లో సాగు చేయబోయే పంటలకు ఏఏ ఎరువులను వినియోగించాలో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు తెలియజేస్తారు. తద్వారా భూసారాన్ని పెంచి, పంటలకు మంచి పోషకాల్ని అందజేసేందుకు కృషి చేస్తారు. మట్టి పరీక్షలతోనే పంటలకు సరైన బలాన్ని అందించి, అధిక దిగుబడుల దిశగా సాగును తీసుకువెళుతున్నారు. చౌడు, ఉప్పునీటిని తట్టుకునే సాగు పశ్చిమ డెల్టాలో రొయ్యల సాగుకు ఉపయోగించే ఉప్పునీరు (సెలనిటీ) శాతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూసారం క్షీణిస్తుంది. ఉప్పుటేరు, ఇతర ప్రాంతాల్లో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చౌడును, సెలినిటీని తట్టుకుని సాగు చేసుకునేలా వరి వంగడాలు అందుబాటులో ఉన్నాయి. మచిలీపట్టణం వరి పరిశోధనా కేంద్రానికి చెందిన ఎంసీఎం 100 వంగడం చౌడు, సెలినిటీని తట్టుకుని దిగుబడులు ఇస్తుంది. మార్టేరు వరి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా రూపొందించిన వంగడాలు ఎంటీయూ 1273, ఎంటీయూ 1293 మినీకిట్ల దశలో ఉన్నాయి. ఎంటీయూ 1318పై ఆసక్తి : ఖరీఫ్ సాగుకు ఎంటీయూ 1318 రకం వంగడాన్ని రైతులు ఎక్కువగా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రకం వంగడాల్ని విత్తనాల కోసం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఇటీవల స్వర్ణ వంగడాన్ని మళ్లీ అధికంగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. స్వర్ణ రకం బియ్యాన్ని స్థానికంగా వినియోగించేందుకు ప్రజలు ఇష్టపడటంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు ప్రైవేట్ విత్తనం సంపద స్వర్ణ వంగడాన్ని కూడా సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విత్తన శాంపిల్స్ పరీక్షలను వ్యవసాయశాఖ అధికారులు చేపట్టనున్నారు. న్యూస్రీల్ జిల్లాలో 5 వేల భూసార పరీక్షల లక్ష్యం ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల ఎకరాల్లో సాగు అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఎంటీయూ 1318 వంగడానికి మొగ్గు ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగు ఖరీఫ్ సాగును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు భూసార పరీక్షలతో పాటు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాల పరీక్షలకు శాంపిల్స్ సేకరణను త్వరలో చేపడతాం. ఖరీఫ్కు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. రబీ మాసూళ్లు పూర్తయిన వెంటనే ప్రణాళికాబద్ధంగా ఖరీఫ్ సాగుకు వెళతాం. – జెడ్.వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ జేడీ, పశ్చిమగోదావరి జిల్లా
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
- Lok Sabha Election 2024: లద్దాఖ్లో త్రిముఖ పోటీ
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement