నేను బ్యాంకులో పాసుబుక్కులు పెట్టి క్రాప్లోను తెచ్చుకున్నా! రెన్యువల్ చేసేందుకు వెళ్తే నా ఐదెకరాల్లో 2.5 ఎకరాలు నా పేరుతో లేదన్నారు. తీరా చూస్తే భర్త చనిపోతే ఓ మహిళ తన పేరుతో భూమి మార్చుకునేటప్పుడు నా భూమి ఆమె పేరున మారిపోయింది. నేను సచివాలయానికి వెళ్లా. అర్ధగంటలో వాళ్లు చూసి ప్రింట్ తీసిచ్చి ఓర్వకల్కు పంపినారు. అక్కడ 5 నిమిషాల్లో నా పని అయిపోయింది. ఇట్లాంటి సమస్య గత ప్రభుత్వంలో వచ్చింటే ఎన్ని నెలలు తిరగాల్సి వచ్చో. – వెంకటేశ్వర్లు, హుసేనాపురం
ఇంత మంచి సేసినోన్ని
యాడా సూడల్యా
నాకు 10 ఎకరాలుంది. రైతుభరోసా, చేయూత, మా కొడుకు పిల్లోళ్లకు అమ్మ ఒడి వచ్చాంది. ఇంగో విషయం. నాకు కాలు దెబ్బతింటే ఇంతకు ముందు కర్నూలు గౌరీగోపాల్ ఆస్పత్రికి వెళ్లా. రూ.1.50లక్షలు అయింది. బాక్కాలేదు. తర్వాత నేను కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లి పదిరోజులుంటి. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ సేసినారు. రూ.2,850 నా డబ్బులతో బయట మందులు తెస్తే అది కూడా ఇచ్చినారు. ఇంటికి వస్తే నేను ఇంటి వద్దే ఉన్నానని ఆరోగ్య ఆసరా ద్వారా రూ.30వేలు ఇచ్చినారు. ఇంత మంచి చేసినోన్ని, పెభుత్వాన్ని నా జీవితంలో సూడల్యా.