మందమర్రిరూరల్: లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే ఆయన తండ్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మంచిర్యాల జిల్లా పేరును వెంకటస్వామి జిల్లాగా మార్పిస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్తో కలిసి దొరలబంగ్లాస్ ఏరియా నుంచి భారీ ర్యాలీ తీశారు. అనంతరం స్థా నిక సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల స మావేశంలో మాట్లాడారు. వివేక్ తండ్రి వెంకటస్వామి ఎన్నో పదవులు అనుభవించి జిల్లాకు ఒక్క పరి శ్రమ కూడా తీసుకురాలేదన్నారు. వివేక్ కూడా ఇత ర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇప్పుడు వంశీకృష్ణను గెలిపిస్తే జిల్లాకు పరిశ్రమలు తీసుకువస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. వారి మాటలు నమ్మవద్దని కోరా రు. గోమాస శ్రీనివాస్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజల కు సేవ చేస్తారని అభ్యర్థించారు. అనంతరం గోమా స శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి ఉద్యోగులకు ఇన్కంటాక్స్ రద్దు, సొంతింటి కల నెరవేరుస్తానన్నారు. కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, నాయకులు శ్రీనివాస్, యాదగిరి, దీక్షితులు, సంజీవరావు, నరేష్, దుర్గరాజ్ తదితరులు ఉన్నారు.
దేశ భద్రత కోసం బీజేపీని గెలిపించాలి
రామకృష్ణాపూర్: దేశభద్రతతోపాటు అభివృద్ధి కోసం మరోసారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరముందని బీజేపీ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్, దుర్గం అశోక్ , రజనీష్జైన్, వేముల అశోక్, అందుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.