కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి

Published Mon, May 6 2024 7:15 AM

కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి

● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

శ్రీరాంపూర్‌: సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్‌లో యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఆదాయ పన్ను మాఫీకి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఇంకా ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనే హామీ మేరకు పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్మికులు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, యూనియన్‌ డెప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా, రేగుంట చంద్రశేఖర్‌, మోత్కూరు కొమురయ్య, జోగుల మల్లయ్య, చంద్రమోహన్‌, అప్రోజ్‌ ఖాన్‌, మారుపల్లి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement