● ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
ఒంగోలు రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని కరవది, పాతపాడు, మండువారిపాలెం గ్రామాల్లో బాలినేని రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కరవది గ్రామంలో ఎంపీటీసీ మన్నె శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ వాక కృష్ణారెడ్డి, నాయకులు, ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు భూమిపట్టా ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లు, డొంక రోడ్డును మెటల్ రోడ్డుగా మార్పులు చేశామని చెప్పారు. కాలనీలో డ్రైనేజీలు, సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టారన్నారు. నాడు–నేడు కింద జెడ్పీ హైస్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని, పీహెచ్సీకి నూతన భవనాన్ని నిర్మించామని చెప్పారు.
ఒంగోలు నగరంలో 25 వేల గృహ పట్టాలు ఇచ్చామన్నారు. పోతురాజు కాలువ శుద్దీకరణ పనులు, డంపింగ్ యార్డ్, హైటెన్షన్ వైర్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పూర్తయిందన్నారు. గ్రామ చెరువు పూడిక తీసి, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని బాలినేని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ డీ కోటేశ్వరరావు, ఎంపీపీ మల్లిఖార్జున రెడ్డి, వైస్సార్ సీపీ ప్రెసిడెంట్ చుంచు రామకృష్ణ. సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, క్రాంతి, పాలపర్తి రమేష్, దార్ల బాబు, మిదశాల కృష్ణ, అంకారావు, ప్రసన్న రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, మాజీ సర్పంచ్లు రాఘవ, వెంకటేశ్వర్లు, చుండూరి రవి, మేడికొండ కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, పెరకంసుబ్బారావు పాల్గొన్నారు.