ఎంపీ అభ్యర్థి పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
గురజాల: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డి కావాలా...గ్రామాల్లో అల్లర్లు సృష్టించి గొడవలు పెట్టే చంద్రబాబునాయుడు కావాలా అని ఎంపీ అభ్యర్థి పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పులిపాడు, గంగవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు పాఠశాలలు బాగుపరచి విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని, వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ ఇచ్చే విధంగా చూడాలన్న ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. మొదటి సారిగా ముఖ్యమంత్రి అయిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చిన ఆలోచనలతో చంద్రబాబుకు నిద్రపట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు పేరుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. సామాజిక న్యాయం వైఎస్సార్ సీపీలో వుందన్నారు. పాలనా సౌలభ్యంలో భాగంగా గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. రాజశేఖర్రెడ్డి కడుపున పులి లాంటి జగన్మోహన్రెడ్డి పుట్టాడని నా కడుపున పప్పు ముద్ద లాంటి లోకేష్ పుట్టాడాని చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి, సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), మండల కన్వీనర్ సిద్దాడపు గాంధీ, కొమ్మినేని బుజ్జి, కొమ్మినేని రవిశంకర్, మన్నెం గురవయ్య, పరిమి శ్రీను, ఎం శ్రీనివాసరావు, ఓర్సు కొండలు, మాటూరి మరియదాసు, కో ఆప్షన్ మెంబర్ షేక్ పీర్ అహ్మద్, బి బ్రహ్మం, కావూరి అంజిబాబు, తదితరులున్నారు.