టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్‌ | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్‌

Published Mon, May 6 2024 8:20 AM

టీడీప

మాచర్ల రూరల్‌: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ వారికి గ్రామంలో స్వాగతం పలికి భోజనం పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసి అడ్డుకోబోయిన పోలీసు తల పగలకొట్టిన సంఘటన ఆదివారం మండలంలోని అడుగురాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే వైఎస్సార్‌సీపీ పార్టీ అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పిలిపించాలంటూ రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పీఆర్కే సతీమణి పిన్నెల్లి రమాదేవి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి కార్యకర్తలు, నాయకులకు భోజనం ఏర్పాటు చేశారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రామిశెట్టి సుబ్బారావు, మరికొందరు ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపైకి వెళ్ళి దాడికి దిగి గొడవ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విజయపురి సౌత్‌ పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువురికి సద్దుబాటు చేసే ప్రయత్నంలో టీడీపీ నాయకులు పోలీసులపై తిరగబడి దాడి చేశారు. ఈ సమయంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మోడవత్‌ సాంబశివ నాయక్‌ తలకు తీవ్రగాయమైంది. ఆయనతో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎన్నికల్లో ఓట్ల కోసం టీడీపీ నాయకులు వర్గాలు, గొడవలు సృష్టిస్తున్న టీడీపీ నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతల దాడిలో  గాయపడ్డ కానిస్టేబుల్‌
1/1

టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్‌

Advertisement
 
Advertisement