-
మైనార్టీ పాఠశాల,
కళాశాలలో ప్రవేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ గురుకుల విద్యాలయా ల సంస్థ ఆధ్వర్యంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశా లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ శిరీషా శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. 2024 –25 విద్యాసంవత్సరానికి సంబంధించి ము స్లిం, మైనార్టీ విద్యార్థు లకు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూ పుల్లో ప్రవేశం కల్పి స్తామని పేర్కొన్నారు. -
రేపటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
గుంటూరుఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికై ఉద్దేశించిన పాలిసెట్–2024 కౌన్సెలింగ్ ఈనెల 27 నుంచి జరగనుంది. పాలిసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు జూన్ మూడో తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్లో ఆయా ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పాలిసెట్ కౌన్సెలింగ్లో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ఆన్లైన్లో రుసుం చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన విద్యార్థులు ఈనెల 31 నుంచి జూన్ 5వ తేదీ వరకు ర్యాంకుల వారీగా ఆయా తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ● విద్యార్థులు తమ వెంట ఫీజు రసీదు, హాల్టిక్కెట్, ర్యాంకు కార్డు, టెన్త్ పాస్ సర్టిఫికెట్, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న టి. శేఖర్ సూచించారు. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్లో హాజరు కావాల్సి ఉంది. ● ఈనెల 27న ఒకటో ర్యాంకు నుంచి 12వేలు, 28న 12,001 నుంచి 27వేలు, 29న 27,001 నుంచి 43వేలు, 30న 43,001 నుంచి 59వేలు, 31న 59,001 నుంచి 75వేలు, జూన్ 1న 75,001 నుంచి 92వేలు, జూన్ 2న 92,001 నుంచి 1,08,000, జూన్ 3న 1,08,001 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరు కావాలి. ● సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 31నుంచి జూన్ ఐదో తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంది. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలకు https:// appolycet.nic.in సైట్కు లాగిన్ అవ్వాలి. విద్యార్థులూ... సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి జూన్ 3వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 31 నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు -
స్ట్రాంగ్రూమ్కు చేరిన పోస్టల్, హోమ్ ఓటింగ్ బాక్స్లు
నరసరావుపేటరూరల్: జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లత్కర్ శనివారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు భద్రపరిచిన కాకానిలోని జేఎన్టీయూఎన్ కళాశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ బాక్స్లను శనివారం స్ట్రాంగ్రూమ్లకు తరలించారు. బాక్స్లను స్ట్రాంగ్రూమ్లో భద్రపరిచే ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లత్కర్ పర్యవేక్షించారు. పటిష్ట బందోబస్తు మధ్య పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను నియోజకవర్గాల నుంచి స్ట్రాంగ్రూమ్కు తరలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ.శ్యామ్ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం తదితరులు పాల్గొన్నారు. నేడు ఇంటర్ ఆన్లైన్ వాల్యూయేషన్పై శిక్షణ తరగతులు నరసరావుపేటఈస్ట్: ఇంటర్మీడియేట్ బోర్డు నూతనంగా ప్రవేశపెట్టనున్న ఆన్లైన్ వాల్యూయేషన్ (మూల్యాంకనం)పై జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఆదివారం ఒకరోజు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి శనివారం తెలిపారు. జిల్లా పరిధిలోని జూనియర్ అధ్యాపకులకు రావిపాడురోడ్డులోని ఆక్స్ఫర్డ్ విట్ జూనియర్ కళాశాలలో ఉదయం 10.30గంటల నుంచి శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లాలోని ప్రతి కళాశాల నుంచి జ్ఞానభూమి పోర్టల్లో నమోదైన ప్రతి అధ్యాపకుడు శిక్షణ తరగతులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. హాజరు కాని కళాశాలల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా తాడేపల్లి రూరల్: మంగళగిరి రూరల్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్పై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంటుందని మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ అన్నారు. శనివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూరల్ పరిధిలోని ప్రతి రౌడీషీటర్పై ప్రత్యేక నిఘా ఉంచామని, జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాల నేపధ్యంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి రౌడీషీటర్కు కౌన్సెలింగ్ నిర్వహించి, బైండోవర్ చేశామని, కౌంటింగ్ రోజు చట్టవ్యతిరేక చర్యలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం గుంటూరు ఎడ్యుకేషన్: ఏసీ కళాశాల ఎదుట ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా శనివారం గ్రంథాలయాధికారి ఎన్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సమాజంలో సైన్స్ పాత్రపై అవగాహన కల్పించారు. అదేవిధంగా నిత్య జీవితంలో గణితశాస్త్ర ప్రాధాన్యతను విద్యార్థులకు తోటి విద్యార్థులచే చెప్పించారు. కార్యక్రమంలో పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు. చిరుజల్లులతో కూడిన వర్షం తెనాలిఅర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడిన ప్రభావం జిల్లావ్యాప్తంగా కనిపించింది. శనివారం తెల్లవారుజాము నుంచి ఈదురుగాలులు వీస్తూ వచ్చాయి. ఉదయం 8గంటల తరువాత ఓ మోస్తరు వర్షం కురిసింది. అక్కడి నుంచి మధ్య మధ్యలో ఆగుతూ చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి ముసురు వాతావరణం కనిపించింది. ఇప్పటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు కొంత సేదతీరారు. -
అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు
కొరిటెపాడు(గుంటూరు): రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని, అనుమతిలేని విత్తనాలు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. డీలర్లు అందరూ లైసెన్స్ నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక కృషిభవన్లో గుంటూరు నగరంలోని విత్తన ఉత్పత్తిదారులు, డీలర్లతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. షాపుల ముందు నిల్వ, ధరలను సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు ధ్రువీకరణ చేయించుకొని వాడాలన్నారు. ప్రతి విత్తనం యొక్క సర్టిఫికెట్ ఆఫ్ సోర్స్, ఇతర వివరాలు ఉండాలన్నారు. రైతులు ఏ రకం విత్తనాలు అడిగితే ఆ రకం విత్తనాలు మాత్రమే అందించాలని, ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలకు లోబడి వ్యాపారం చేయాలి గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు -
పెదగార్లపాడులో కార్డెన్ సెర్చ్
దాచేపల్లి: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటా మని సీఐ ఎ.సురేంద్రబాబు హెచ్చరించారు. మండలంలోని పెదగార్లపాడులో కార్డన్ సెర్చ్ని శనివారం చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఎరువు దిబ్బ లు, వరిగడ్డి వాములలో కూడా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ... గ్రామాల్లో అందరు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని, రాజకీయ వివాదాల జోలికి వెళ్లవద్దని చెప్పారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచిన.. ఓడిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, శాంతిభద్రతల సమస్యలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు దాసరి శివనాగరాజు, జి. సంధ్యారాణి తదితరులున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు నాదెండ్ల: గుంటూరు–కర్నూలు రాష్ట్రీయ రహదారి సాతులూరు సమీపంలో కోళ్లఫారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పేరేచర్లకు చెందిన శ్రీనివాసరావు, బోయపాలెంకు చెందిన దేవదానం ఇరువురూ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముందు వెళ్తున్న ట్యాంకర్ను ఢీకొన్నారు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురూ నాలు గు రోజుల క్రితమే కోళ్లఫారంలో పనిలో చేరా రు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇరువురినీ 108 సాయంతో నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించినట్లు సమాచారం. ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతినాదెండ్ల: ద్విచక్ర వాహనం ఢీకొని రహదారి దాటుతున్న ఓ మహిళ మృతిచెందిన ఘటన సాతులూరులో శుక్రవారం రాత్రి సాతులూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టిపాటి శివమ్మ (35) పన్నెండేళ్ల క్రితం తన పక్కింటి మహిళకు రూ.10 వేలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవటంతో పెద్దలను ఆశ్రయించింది. గ్రామ పెద్దలైన గద్దె కోటేశ్వరరావు, రావుల శ్రీనివాసరావు, పాటిబండ్ల శేఖర్ వద్దకు వెళ్లి విషయం తెలిపి సహాయం కోరింది. అప్పు తీసుకున్న వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో తిరిగి తన ఇంటికి బయలు దేరింది. ఈ క్రమంలో గుంటూరు నుంచి ఇసప్పాలెంకు వెళ్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలైన శివమ్మను స్థానికులు 108 సాయంతో చిలకలూరిపేట ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరులో మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త జెట్టిపాటి అంకారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బలరామ్రెడ్డి తెలిపారు. -
కారెంపూడి అల్లర్ల కేసుల్లో 25 మంది అరెస్టు
కారెంపూడి: సార్వత్రిక ఎన్నికల అనంతరం కారెంపూడిలో గత 14వ తేదీ చెలరేగిన అల్లర్లు ఆస్తుల విధ్వంసాల కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశామని ఎస్ఐ కె అమీర్ శనివారం తెలిపారు. మూకుమ్మడిగా కారెంపూడిలో పలు షాపులు, ఇళ్లపై దాడులకు పాల్పడడం, పార్క్ చేసిన వాహనాలను నిప్పంటించి దహనం చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడిన రెండు ఘటనలకు సంబంధించి రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్టులు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రెండు కేసుల్లో 25 మంది నిందితులను ఆరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం జరిగిందని ఎస్ఐ అమీర్ వెల్లడించారు. అలాగే మండలంలోని ఒప్పిచర్ల గ్రామ ప్రాథమిక పాఠశా లలోని ఒక పోలింగ్ బూత్లో 13వ తేదీ పోలింగ్ నాడు ఈవీఎం పగులగొట్టిన కేసులో గ్రామానికి చెందిన ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని ఎస్ఐ అమీర్ పేర్కొన్నారు. -
విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థుల ఎదుగుదలకు శాఖా గ్రంథాలయాలలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయోగపడతాయని ఉమ్మడి గుంటూరుజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ తెలిపారు. పల్నాడురోడ్డులోని శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న విజ్ఞాన శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించా రు. శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులతో మాట్లాడి వారి మాటల ద్వారానే శిబిరం ఉపయో గాలను చెప్పించారు. ఈసందర్భంగా సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 97 శాఖా గ్రంథాలయాలలో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్నతనం నుంచే సెల్ఫోన్, టివీలకు అలవాటు పడుతున్న చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు శిబిరాలు దోహదపడతాయన్నా రు. జ్ఞాన సంపదను పెంపొందించుకోవటంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. పుస్తక పఠనం విద్యార్థుల అభ్యున్నతికి బాటలు వేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి యడ్లపాటి రాధ, సిబ్బంది పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి శావల్యాపురం:స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన తరగతులను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని శావల్యాపురం గ్రంథాలయ అధికారి గంగవరపు అర్జున్ శనివా రం తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 0–5 నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన చిన్నారులకు శిక్షణ తరగతులను జరుగుతున్నాయని, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల పుస్తక పఠనం, కథలు చెప్పటం, రాయటం, స్పోకెన్ ఇంగ్లిఘ, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, ఉపన్యాసం అంశాల్లో శిక్షణ ఇస్తా మన్నారు. వచ్చే నెల 7వ వరకు వేసవి శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. అనంతరం చిన్నారులకు క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాససింగ్, చెన్నుబాబు, మద్దికుంట ఆంజనేయులు, చెవల శ్రీరాములు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో వేసవిశిక్షణ తరగతులు వినుకొండ(నూజెండ్ల): పట్టణంలోని వినుకొండ శాఖ గ్రంథాలయలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం విద్యార్థులకు రంగు కాగితాలతో చిత్రాలు తయారు చేయడం నేర్పించడం జరిగిందని గ్రంథాలయ శాఖాధికారి భూక్యా బద్రీనాయక్ తెలిపారు. కథలు చదవడం, కథలు చెప్పడం మాకిష్టం అనే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి నాదెండ్ల: విద్యార్థులు చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని నాదెండ్ల శాఖా గ్రంథాలయాధికారి రావూరి శ్రీనివాసరావు చెప్పారు. మండల కేంద్రమైన నాదెండ్ల శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలను పురస్కరించుకుని శనివారం నూతన పుస్తకాల పరిచయం నిర్వహించారు. చిన్నారులకు పలురకాల కథల పుస్తకాలు, సైన్స్, గణితం, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను అందించి అందులోని విషయాలపై అవగాహన కల్పించారు.ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ -
సంక్షిప్తం
●●●● ‘రోహిణి’కి వరుణుడు స్వాగతం! రొంపిచర్ల: ప్రస్తుత తరుణంలో నెలకొన్న వాతావరణాన్ని పరిశీలిస్తే రోహిణి కార్తెలో ఎండలు శాంతించాయని అనిపిస్తుంది. ప్రతి ఏటా ఉగాది మొదలు గ్రీష్మతాపం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. రోహిణి కార్తె ప్రవేశించిందంటే ఆ కార్తెలో కాసే ఎండలకు రోళ్లు కూడా పగులుతాయన్న నానుడి ప్రజల్లో ఉంది. ఈ సంవత్సరం రోహిణి కార్తె శనివారం ఆరంభమైంది. అయినప్పటికీ తెల్లవారుజాము నుండే చల్లటి వాతావరణం, పుల్ల చినుకులు పడుతున్నాయి. దీనికితోడు వాతావరణం చల్లగా ఉన్నా ఉక్కపోత నెలకొనడంతో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఈ వాతావరణం ఇలాగే కొనసాగి వర్షాలు కురిస్తే రోహిణికార్తెలో కాసే ఎండల నుంచి ప్రజలు ఈ ఏడాదికి ఉపశమనం పొందినట్లే. కాగా వర్షాలు సంవృద్ధిగా పడితే పూర్వకాలంలోలాగానే పంట పొలాలను తొలకరి దుక్కులు దున్నుకునే అవాకాశం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు. తొలకరిలో దుక్కులు దున్ని సిద్ధం చేసుకొంటే తరువాత కార్తెలో విత్తనాలు విత్తుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ● ఖరీఫ్ సీజన్కు సరిపడా పత్తి విత్తనాలు చిలకలూరిపేట: ఖరీఫ్ సీజన్కు సరిపడ పత్తివిత్తనా లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి టి శ్రీలత చెప్పారు. పట్టణంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేట మండల పరిధిలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో 4,116 ఎకరాల్లో పత్తిపాటి సాగు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో పత్తిపంట గత ఏడాది కన్నా 10 శాతం పెరుగుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. మండలంలో పత్తిపంట సాగుకు సరిపడా విత్తనాల కంటే కూడా ఎక్కువ మోతాదులో విత్తనాలు రైతుభరోసా కేంద్రాలు, విత్తన దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ముందస్తు ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రూపొందించటం జరిగిందన్నారు. ఈ నేప థ్యంలో ఎవరూ అధిక ధరలకు విత్తనాలు విక్రయించరాదన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత లాట్ నంబర్తో కూడిన రసీదును తప్పనిసరిగా దుకాణదారుడి వద్ద తీసుకొని వాటిని సీజన్ ముగిసే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు. విత్తనాలను ఎవరైనా దుకాణదారుడు ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువగా విక్రయిస్తే స్థానిక వ్యవసాయాధికారి సెల్ నంబర్ 8331056944, లేదా సహాయ వ్యవసాయ సంచాలకులు సెల్ నంబర్ 8331056941కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విత్తన దుకాణాలో నిరంతర తనిఖీలు నిర్వహించటం జరుగుతుందన్నారు. ● దివ్యాంగ హాస్టల్లో ప్రవేశాలకు ఆహ్వానం నరసరావుపేట ఈస్ట్: దివ్యాంగ బాల బాలికల వసతి గృహాలలో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు విభిన్న ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు సి.హెచ్.సువార్త శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలోని నరసరావుపేట పట్టణం, నకరికల్లు మండలం చల్లగుండ్లలోని వసతి గృహాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. వీరికి వసతితో పాటు భోజనం, దుస్తు లు, పుస్తకాలు, బెడ్డింగ్ మెటీరియల్ వంటివి ప్రభు త్వం నిర్ధేశించిన మేరకు ఉచితంగా అందిస్తామని వివరించారు. వివరాలకు ఎస్.సతీష్కుమార్ గ్రేడ్– 1 వార్డెన్ 984934 7904 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ● వారానికి రెండుసార్లు శుభ్రం నరసరావుపేట: వర్షాకాలం రానున్న తరుణంలో పట్టణంలోని ప్రతి వార్డులో వారానికి రెండుసార్లు మురుగు కాలువలు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పురపాలకసంఘం పరిధిలోని 30వ వార్డు ఏనుగులు బజార్లో కాలువల్లో పూడిక తీసే కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడక్కడా పేరుకుపోయిన చెత్తకుప్పలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శానిటేషన్ ఇనస్పెక్టర్ రామకోటయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ స్వర్ణరాజు పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కార్యదర్శి రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు, రొంపిచర్ల గ్రామాల్లో గల శాఖా గ్రంథాలయాలను జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వి. సుబ్బరత్తమ్మ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. శిక్షణ నిర్వహణపై వారు అమలు పరుస్తున్న కార్యక్రమాలను ఇన్చార్జి గ్రంథాలయ అధికారి కె. వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. వేసవి శిక్షణా శిబిరంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె గ్రంథాలయ అధికారిని ఆదేశించారు. గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. సప్లిమెంటరీకి 16 మంది గైర్హాజరు నాదెండ్ల: గణపవరం చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాలలో శనివారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి సంవత్స రం ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. 395 మందికి గాను 16 మంది గైర్హాజరు కాగా 379 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్గా సత్తెనపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ శ్రీలక్ష్మీ, అసోసియేటెడ్ చీఫ్ సూపరింటెండెంట్గా కళాశాల వైస్ ప్రిన్సిపల్ సీహెచ్ చైతన్య వ్యవహరించారు. డీఈసీ బృందం తనిఖీ చేశారు. గుండెపోటుతో వీఆర్వో మృతి వినుకొండ(నూజెండ్ల): మండలంలోని ఉప్పరపాలెం గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కె. యేసురత్నం శుక్రవారం రాత్రి తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందాడు. యేసురత్నంకు భార్య, కుమార్తె, ఇరువురు కుమారులు కలరు. తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, తోటి వీఆర్వోలు సంతాపం వ్యక్తం చేసి ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కౌంటింగ్ ఏజెంట్లే కీలకం
సత్తెనపల్లి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల నిబంధనలు–1961 ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమిస్తారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కౌంటింగ్కు మూడు రోజుల ముందు సాయంత్రం 5గంటల్లోపు కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన ఫారం–18ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఆర్వోలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి పంపుతారు. కౌంటింగ్కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డ్ ఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫారం–19 ద్వారా కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ను రద్దు చేసే అధికారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్కు ఉంటుంది. ఏజెంట్లకు అవగాహన అవసరం సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారం–17సీ పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారంలోనే నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.ట్యాంపరింగ్ జరిగితే..కంట్రోల్ యూనిట్ టేబుల్పైకి రాగానే అభ్యర్థి సీలింగ్ సెక్షన్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, పరిశీలకులు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్పై స్ట్రిప్ సీల్, గ్రీన్ పేపర్ సీల్ సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నంబర్లు ఫారం–17సీలో నమోదు చేసినవే ఉండాలి. కంట్రోల్ యూనిట్ పేపర్ సీళ్లు, అడ్రస్ ట్యాగ్ల ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే పరిశీలకులు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని కంట్రోల్ యూనిట్లను మాత్రమే లెక్కించాలి.మార్గదర్శకాలు ఇవీ..అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన వారిని ఏజెంట్లుగా నియమించుకుంటే వారు కౌంటింగ్ సక్రమంగా వీక్షించేందుకు వీలుంటుంది. సాయుధ రక్షణ కలిగిన వ్యక్తులను కౌంటింగ్ హాల్లోకి అనుమతించరాదని ఈసీఐ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మునిసిపల్, జెడ్పీ చైర్మన్లు, పబ్లిక్రంగ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ఏజెంట్లుగా కూర్చునేందుకు అనర్హులు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందేవారు, ప్రభుత్వ–ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారామెడికల్ స్టాఫ్, రేషన్ డీలర్లు, అంగన్వాడీ ఉద్యోగులు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఏజెంట్లుగా వ్యవహరిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్ 134 (ఏ) ప్రకారం శిక్షార్హులవుతారు. వీరికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. సర్పంచ్లు, పంచాయతీ వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత పౌరసత్వం కలిగిన ఎన్నారైలు కూడా కూర్చోవచ్చు. ప్రభుత్వ గన్మెన్ సౌకర్యం ఉన్నవారు ఎన్నికల ఏజెంట్గా, కౌంటింగ్ ఏజెంట్గా ఉండకూడదు. అలాంటి వ్యక్తి సెక్యూరిటీతో గాని, సెక్యూరిటీ లేకుండా గానీ కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించకూడదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తనకున్న సాయుధ రక్షణను స్వచ్ఛందంగా వదులుకుంటే కౌంటింగ్ హాల్లో కూర్చునేందుకు అనుమతిస్తారు. ఒక కౌంటింగ్ హాల్లో 14 టేబుళ్లు, ఒక ఆర్వో టేబుల్ కలిపి మొత్తం 15 టేబుళ్లు ఉంటాయి. ఆ మేరకు అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీ పీబీఎస్) లెక్కింపునకు అదనపు టేబుళ్లు అవసరం అని భావిస్తే అందుకోసం వేరే కౌంటింగ్ హాల్లో అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అభ్యర్థులు అక్కడ అదనంగా మరో కౌంటింగ్ ఏజెంట్ను నియమించుకోవచ్చు. -
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్ ట్యాంక్ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తున్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు తదితరులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు. -
ఊరిలోనే ఉపాధి
మా గ్రామంలో చేతి నిండా పని దొరుకుతుంది. వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పనులు అందుబాటులో ఉండడంతో ప్రతి రోజూ పనులకు వెళుతున్నా. రూ.270 నుంచి రూ.290 వరకు కూలి పడుతుంది. నేను 40 రోజులు ఉపాధి పనులకు వెళ్లా. –కోండ్రు లాజర్, ఉపాధి కూలీ, ధూళిపాళ్ల పనులకు ఎక్కడికో వెళ్లే పని లేకుండా మా ఊర్లోనే ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నారు. నేను, నా భర్త ఇద్దరం ఉపాధి పనులకు వెళుతున్నాం. వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో మా లాంటి వారికి ఎంతో ఉపయోగం. 80 పని దినాలు వినియోగించుకున్నాం –తుపాకుల మాధవి, ఉపాధి కూలీ, ఫణిదం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏప్రిల్ ఒకటి నుంచి ఉపాధి కూలీల దినసరి వేతనాన్ని రూ. 272 నుంచి రూ.300కు ప్రభుత్వం పెంచింది. దీంతో కూలీలకు ఉపాధి గిట్టుబాటు అవుతుంది. వేసవిలో ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. గ్రామాల్లో స్థానిక అవసరాల మేరకు ఉపాధి పనులు గుర్తిస్తున్నాం. ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. –జి జోసఫ్కుమార్, డ్వామా పీడీ, పల్నాడు ●సత్తెనపల్లి: వలస వెళ్లకుండా ఉన్న ఊర్లోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది. కొలతల ప్రకారం పని చేయించి గిట్టుబాటు వేతనం ఇస్తోంది. జిల్లాలో 3.20 లక్షల జాబ్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 5.50 లక్షల మంది కూలీలు ఉన్నారు. 2.52 లక్షల కుటుంబాల్లోని 4.32 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగా ఈ ఏడాది జిల్లాలో 45 లక్షల పనిదినాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకోసం రూ.225 కోట్ల లేబర్ (కూలీల వేతనం, మెటీరియల్ కలిపి) బడ్జెట్ కేటాయించారు. ఈ నిధులు పంట కాలవలు, పంట కుంటలు, చెరువుల్లో పూడిక తీత, నీటి సంరక్షణ, ఉద్యాన శాఖ పరిధిలో మామిడి, నిమ్మ, సపోటా, జామ తదితర పండ్ల తోటల పెంపకం పనులకు ఖర్చు చేయనున్నారు. కొనసాగుతున్న ఉపాధి పనులు జిల్లాలోని 28 మండలాల్లో 530 గ్రామాలు ఉండగా 525 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది నుంచి కూలీలకు రోజుకు రూ.300 గరిష్ట వేతనం కాగా రోజుకు రూ.248.19 సగటు వేతనం అందుతుంది. ఒక్కో చోట చేసిన పనిని బట్టి కొలతల ఆధారంగా రూ.290 వరకు అందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5,545 పనులు ప్రారంభించగా 110 పనులు పూర్తయ్యాయి. 20,280 కుటుంబాలు 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా సత్తెనపల్లి మండలంలో 1,946 కుటుంబాలు 100 రోజులు పని పూర్తి చేసుకున్నాయి. ఈ ఏడాది 25 వేలకు పైగా కుటుంబాలకు 100 రోజులు పని కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఊపందుకున్న పనులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెల నుంచి ఉపాధి పనులు ఊపందుకున్నాయి. వేసవిలో పంట కుంటలు, చెరువుల్లో పూడికతీత వంటి పనులు అధికంగా చేపట్టారు. ఏప్రిల్ నుంచి పనులు చేసే ఉపాధి కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఖరీఫ్ పనులు పూర్తిస్థాయిలో మొదలయ్యే వరకూ ఉపాధి హామీ పనులు జోరుగా సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కూలీలకు అదనపు సౌకర్యాలు ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 5.30 గంటలకు పనులు ప్రారంభించి ఉదయం 10:30 గంటలకు ముగించుకుంటున్నారు. అయినప్పటికీ ఎండ బారిన పడకుండా ఉపాధి కూలీలకు టెంట్లు వేయిస్తున్నారు. తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం 45 లక్షల పనిదినాలు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం జిల్లాలో 3.20 లక్షల కుటుంబాలకు జాబ్కార్డులు ఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు గరిష్ట వేతనం రూ.300 జిల్లాలోని 4 క్లస్టర్ల వారీగా ఇప్పటి వరకు కల్పించిన పనులు క్లస్టర్ పనిదినాలు చేసిన శాతం పనిదినాలు గురజాల 13,62,548 10,11,088 74.21 నరసరావుపేట7,44,439 6,35,425 85.36 సత్తెనపల్లి 14,06,738 12,82,147 91.14 వినుకొండ 9,86,276 8,86,770 89.91 మొత్తం 45,00,000 38,15,430 84.79 -
విధ్వంసానికి పక్కా ప్లాన్
మాచర్ల: మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసానికి టీడీపీ పక్కా ప్రణాళికను రూపొందించింది. దీంతో భాగంగానే ఫ్యాక్షనిస్టు జూలకంటి బ్రహ్మానందరెడ్డిని నియోజకవర్గానికి తీసుకొచ్చారు. అతను నియోజకవర్గంలో అడుగుపెట్టినది మొదలు గొడవలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటి వరకు టీడీపీ విజయం సాధించలేదు. నిరాశలో ఉన్న టీడీపీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్ధితి. ప్రజాభిమానాన్ని పొంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఎన్నికలలో ఎలా అడ్డగించాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పిన్నెల్లి హవాను అడ్డగించాలంటే బ్రహ్మారెడ్డి తప్ప ఎవరి వల్ల కాదని భావించి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగా ఏడాదిన్నర కిందట బ్రహ్మారెడ్డిని పిలిచి నిన్ను ఇన్ఛార్జిగా నియమిస్తా, నీకు అన్ని రకాలుగా పార్టీ అండదండలతోపాటు ఆర్థిక సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అక్కడే కథ మొదలైంది. అప్పటి నుంచి మొదటగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కారంపూడి మండలం నుంచి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఆ రోజే పిన్నెల్లికి సంబంధించిన ఒక వ్యాపార సంస్థ ముందు ఈలలు వేసి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అక్కడ నుంచి జూలకంటి ప్రతి గ్రామంలో పర్యటిస్తూ మీకెందుకు నేనున్నా గొడవలు పెట్టుకోండి మనకు పైనుంచి డబ్బులు వస్తాయంటూ రెచ్చగొట్టారు. ప్రతి గ్రామంలో చిచ్చు రేపారు. ఏ చిన్న గొడవ జరిగినా అది అధిష్టానానికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో చంద్రయ్య హత్యను హైలెట్గా చిత్రీకరించారు. జంగమహేశ్వరపాడులో గొడవ సృష్టించి పారిపోయిన వ్యక్తికి మద్దతు పలికాడు. అక్కడ నుంచి వెల్దుర్తి, బోదిలవీడు, శిరిగిరిపాడు, లోయపల్లితోపాటు అనేక గ్రామాల్లో విధ్వంసాలకు తెరతీశాడు. కారంపూడి మండలం ఒప్పిచర్ల, ఓబులేశునిపల్లె, చింతపల్లి, పేటసన్నిగండ్లలో, రెంటచింతల మండలంలోని తుమృకోట, పాలవాయి గేటుతోపాటు అనేక కమ్మ సామాజిక వర్గానికి చెందిన గ్రామాలకు వెళ్లి ఈసారి మనదే గెలుపంటూ ఈసారి వారిని ఉసిగొలిపి గొడవలు చేయించారు. ప్రతి గొడవకు పీఆర్కే కారణమంటూ ప్రచారం చేయించారు. ప్రతి రోజూ ఎల్లో మీడియాలో పీఆర్కే మీద బురదచల్లుతూ ప్రెస్మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. అనేక గ్రామాలలో రచ్చను పెంచిన ఆయన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మద్దతు వచ్చాక మరింత రెచ్చిపోయారు. ఎన్నికల ముందు రోజు నుంచి ఒక పథకం ప్రకారం గొడవలు సృష్టించారు. అందులో భాగంగానే పాలవాయి గేటులో బీభత్సం, తుమృకోటలో ఈవీఎంల ధ్వంసం, జెట్టిపాలెంలో ఘర్షణ, గుండ్లపాడులో ఒక వైపు వ్యవహరించేలా ఒక వర్గాన్ని ప్రోత్సహించారు. సొంతూరైన వెల్దుర్తిలో రిగ్గింగ్ చేసుకొని కండ్లకుంట, కొత్తపుల్లారెడ్డిగూడెంలో సంబంధం లేని ఇద్దరిని కూర్చోబెట్టి రగడకు ప్రయత్నించారు. ఇదంతా తమకు అనుకూలమైన పోలీసులతో కలిసి ముందుగానే సిద్ధం చేసుకొన్నారు. మాచర్ల మండలం కొత్తపల్లి, అలుగురాజుపల్లి, కంభంపాడు, రాయవరం గ్రామాలలో అలజడులు సృష్టించారు. అన్నీ చోట్ల టీడీపీ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. దీంతో వ్యాపారులతోపాటు అన్నీ వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పటి ఎస్పీపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఎస్పీని నియమించడంతో పరిస్ధితిని అదుపులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యూహాత్మకంగా బ్రహ్మారెడ్డిని రంగంలోకి దించిన టీడీపీ అతనికి ఆర్థికంగా అండదండలు జూలకంటి రాకతోనే అల్లర్లు ప్రారంభం భయపడుతున్న నియోజకవర్గ ప్రజలు -
అమరేశ్వరుడిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్
అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి రవికుమార్ గురువారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ఈఓ వేమూరి గోపినాథశర్మ, అర్చకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి సి.టి.రవికుమార్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దేవాలయంలోకి ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్ దంపతులకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్, పది సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేటఈస్ట్: ఇంటర్మీడియట్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలలో 14,935 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్, వృత్తి విద్యా విద్యార్థులు 10,157మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,778మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్(08647223355) ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 పరీక్ష కేంద్రాల్లో 6,199మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఆయా కేంద్రాల్లో సీఈలు, డీవోలతోపాటు 300మంది ఇన్విజిలేటర్లు, మూడు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు విధుల్లో పాల్గొంటున్నట్టు డీఈఓ తెలిపారు. దివ్యాంగ చిన్నారులపై ప్రత్యేక దృష్టి గురజాల: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులను గుర్తించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా 40 రోజుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 0 నుంచి 18 ఏళ్ల వయస్సు లోపల ఉన్న పిల్లలను గుర్తించి వారి అవసరాలు తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగడపతుందని ఐఈఆర్పీలు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. వారికి అనుగుణంగా చదువులో మంచి ప్రతిభ కనబరిచేలా చూడటం జరుగుతుందన్నారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్రాలు, సచివాలయాల్లో గల సిబ్బందిని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలుపుతున్నారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు మాచర్ల విజయలక్ష్మి, ఝాన్సీరాణిలు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 504.80 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 806.70 అడుగుల వద్ద ఉంది. -
మాచర్లలో టెన్షన్..టెన్షన్
మాచర్ల : టీడీపీ చలో మాచర్లకు పిలుపునివ్వటంతో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాలతో మాచర్లలో గురువారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగంతోపాటు ర్యాపిడ్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచి నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో మాచర్లకు అనుమతి లేదని బయటి వ్యక్తులు ఎవ్వరూ రాకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఎస్పీ మలికా గార్గ్ నేతృత్వంలో పటిష్ట చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలతోపాటు బయటి ప్రాంతాల నుంచి వ్యక్తులు మాచర్ల రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి ఉదయం నుంచే విస్తృతంగా తనిఖీ చేపట్టారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించారు. గుంపులు గుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకున్నారు. వ్యాపార, వాణిజ్య దుకాణాలను 10గంటల నుంచి సాయంత్రం వరకు మూసివేయాలని పోలీసులు వ్యాపారులను ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా పోలీసు అధికారులు మాచర్లలో మకాం వేసి ఎక్కడా ఒక చిన్న సంఘటన జరగకుండా పర్యవేక్షించారు. ముందు జాగ్రత్తగా వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. టీడీపీ చలో మాచర్ల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో మోహరించిన బలగాలు విస్తృతంగా తనిఖీలు పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు ఎస్పీ మలికా గార్గ్ పర్యవేక్షణ -
ఓట్ల లెక్కింపునకు పక్కా ప్రణాళిక
రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదించిన జిల్లా ఎన్నికల అధికారి నరసరావుపేట: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేశ్ బి.లత్కర్ నివేదించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఓట్ల లెక్కింపుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీక్షణ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను ఆయనకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం గాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానకార్యదర్శి సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, నిబంధనల మేరకు టేబుల్స్ ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, టేబుల్స్ ఏర్పాటుపై ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉండాలన్నారు. ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ప్రతి అంశాన్ని వీడియోగ్రఫీతో చిత్రీకరించాలని ఆయన సూచించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకం, బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఏ.శ్యామ్ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు నరసరావుపేటరూరల్: ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీఎస్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లత్కర్, జిల్లాఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కేటాయించిన జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లత్కర్, జిల్లాఎస్పీ మలికా గార్గ్లు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కౌంటింగ్కు వచ్చే సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు నిర్దేశించిన ప్రాంతంలో తమ వాహనాలను నిలిపి కేంద్రానికి రావాలని స్పష్టంచేశారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో, ముఖ్య కూడళ్లలో పోలీస్ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమ్మికూడరాదని, బహిరంగసభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ల్లో వాహనాల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని, ఏ ఇతర బాటిల్స్లో పోయరాదని తెలిపారు. పెట్రోల్ బంక్ యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నాయకులు, బాధ్యతగా వ్యవహరించి పోలీసులతో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యామ్ప్రసాద్, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) రాఘవేంద్రరావు, డీఎస్పీ సుధాకరరావు, ఎస్బీ సీఐ సురేష్బాబు, రూరల్ సీఐ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
పాతగుంటూరులో భారీ అగ్ని ప్రమాదం
పట్నంబజారు: గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సుద్దపల్లిడొంక శివారు ప్రాంతమైన ప్రగతినగర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అండర్గ్రౌండ్ డ్రెయినేజీకి సంబంధించి ప్లాస్టిక్ పైపులు నిల్వ ఉంచిన ఓ కంపెనీలో గురువారం మధ్యాహ్నం సమయంలో మంటలు చెలరేగాయి. సుమారు రూ. 2 కోట్ల విలువ చేసే ప్లాస్టిక్ పైపులు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రమాదకారణం తెలియరాలేదు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారుగా 40 లాట్లు వరకు పైపులు తగలబడినట్లు అధికారులు తెలిపారు. షాపుంజీ పల్లోంజీ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టు పనులకు చెందిన పైపులు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. -
పులిచింతల నిర్వాసిత కేంద్రంలో తనిఖీలు
రాజుపాలెం: రాజుపాలెంలోని పులిచింతల నిర్వాసిత కేంద్రంలో పోలీసు అధికారులు గురువారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిర్వాసిత కేంద్రంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. గేదెల కొస్టాలలో, గడ్డివాముల్లోను, దొడ్లలోను సోదలు నిర్వహించారు. ఎలాంటి మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి దొరకలేదు. ఎస్ఐ షమీర్బాషా కాలనీ వాసులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓట్ల లెక్కింపు రోజు శాంతియూతంగా ఉండాలని, ఊరేగింపులు, టపాసులు పేలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఆయన వెంట ఏఎస్ఐ కిరణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
● దీపాలదిన్నెపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై మూకుమ్ముడి దాడి ● కారుకు పోలీసు సైరన్తో గ్రామంలో హల్చల్ ● మాదిగ నా కొడుకులు అంటూ దూషణలపర్వం సత్తెనపల్లి: పోలింగ్ ముగిసి పది రోజులవుతున్నా టీడీపీ గూండాలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటు వేశారన్న అక్కసుతో గ్రామానికి చెందిన చిలుకా ఏసుబాబుపై గ్రామానికి చెందిన టీడీపీ రౌడీలు మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. దేవరపల్లి లక్ష్మీనారాయణ, దేవరపల్లి శేఖర్, ప్రదీప్, వంశీలతో మరో ఏడుగురు గుంటూరుకు చెందిన వ్యక్తులు కారులో పోలీస్ సైరన్ వేసుకొని సాయంత్రానికి గ్రామానికి వచ్చి ఒంటరిగా ఉన్న ఏసుబాబుపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో ఏసుబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసుబాబు కుటుంబ సభ్యులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు చెప్పినా స్పందించలేదు. దీంతో ఏసుబాబును సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరువాత మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఏసుబాబు బంధువులు మాట్లాడుతూ ‘మాదిగ నా కొడకల్లారా మీ అంతు తేలుస్తామంటూ’ కులం పేరుతో దూషించి విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు వచ్చాక మీ అందరి అంతు తేలుస్తామంటూ మహిళలని కూడా చూడకుండా చెప్పటానికి వీలు లేని భాషలో దూషించారన్నారు. 4న ఫలితాలు వచ్చాక ఏసుబాబును తాళ్ళు కట్టి బావిలో దించుతామంటూ హెచ్చరికలు చేసి వెళ్లారని పేర్కొన్నారు. -
భార్యను కొట్టి చంపిన భర్త
గుంటూరు రూరల్: విలాసాలకు, మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యను కొట్టి హత్య చేసిన ఘటన నగరంలోని స్వర్ణభారతి నగర్లోని ఐద్వానగర్లో జరిగింది. నిందితుడిని నల్లపాడు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐద్వానగర్కు చెందిన జాతావత్ అశోక్నాయక్కు, స్థానికంగా ఉండే ఆశాభాయి(25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో అశోక్నాయక్ పలుమార్లు ఆశాభాయిపై దాడిచేసి డబ్బులు కావాలని హింసించేవాడు. తాగుడు, వ్యసనాలకు బానిసై భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఆశాభాయిను డబ్బులు కావాలని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంతో అశోక్ ఆశాభాయిని తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. స్థానికులు, బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించి కోర్టుకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. -
వైభవంగా శ్రీరంగనాథస్వామి కల్యాణ మహోత్సవం
విజయపురిసౌత్: మాచర్ల మండలం అనుపులో ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభభవంగా జరిగింది. ఈ కల్యాణానికి ముందుగా శ్రీదేవి, భూదేవి, శ్రీరంగనాథస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు జరిపారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఉత్సవమూర్తులను ఆలయ అర్చకులు కురుమేటి దత్తాత్రేయశర్మ, కురుమేటి దత్తకుమార్శర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్యశర్మ, రాజశేఖర్శర్మ తదితరులు వేదమంత్రాలతో ఉత్సవమూర్తులను కల్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి ఎదురుగా శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆయా గ్రామాల నుంచి భక్తులు ప్రభలను అలంకరించి మేళతాళాలతో అనుపు రంగనాథస్వామి దేవాలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో ఉదయం స్వామి వారి అలంకరణ, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, నవగ్రహారాధన, ఎదురుకోలా, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాగార్జునకొండ కన్జర్వేటివ్ అసిస్టెంట్ యు వెంకటయ్య, రిటైర్ట్ ఇన్కంటాక్స్ కమిషనర్ స్వామి నాయక్ పాల్గొన్నారు. -
నవరసభరితంగా సంగీత నాట్య పోటీలు
చిలకలూరిపేట: పురివిప్పిన నెమలిని తలపించే నృత్యాలు..మనసును పులకింపచేసే కీర్తనలు..సుమధుర గీతాలు...ఉర్రూతలూగించే జానపద నృత్యాల నడుమ కళానిలయం 39వ జాతీయస్థాయి నవరస శాస్త్రియ, జానపద, సంగీత నాట్య కళారూపాల పోటీలు గురువారం మూడో రోజు కొనసాగాయి. పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కొనసాగుతున్న ఈ పోటీలలో చివరిరోజు వివిధ అంశాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొని కళారూపాలను ప్రదర్శించారు. మూడో రోజు పోటీలను కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ నటరాజపూజ చేసి ప్రారంభించారు. సూర్య, చంద్ర విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలలో జానపద నృత్యాలతోపాటు శాసీ్త్రయ బృందనాట్యాలు, శాసీ్త్రయ జంటనాట్యాలు, శాసీ్త్రయం కాని జంటనాట్యాలు, శాసీ్త్రయ కాని బృందనాట్యాలు, శాసీ్త్రయ నృత్య నాటికలు ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తుమ్మెదలున్నాయేమిరా, చిరుతముత్తి, పారేగోదావరి, నా పేరు మల్లిగాడు, పోమతి పొన్నమ్మ, ఓరి మగడా వంటి జానపద నృత్యాలతో పాటు, శ్రీకృష్ణ తరంగిణి, సారూప్యం, దేవిస్తుతి, కాళింగనర్తనం, శ్రీకృష్ణలీలలు, గోవర్ధనం వంటి బృందనాట్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జానపద నృత్యాలు రసజ్ఞులైన ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ప్రదర్శనలను వీక్షించారు. ఉర్రూతలూగించిన జానపద నృత్యాలు మూడో రోజు కొనసాగిన కళానిలయం జాతీయస్థాయి సంగీత నాట్యపోటీలు -
నిర్మానుష్యంగా కారెంపూడి
కారెంపూడి: కారెంపూడిలో గురువారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పది రోజులుగా అమలులో ఉన్న 144 సెక్షన్ కొనసాగుతుంది. కారెంపూడి పూర్తిగా పోలీస్ పహారాలో ఉంది. ఉదయం కొద్ది సమయం ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా షాపులన్నీ మూతపడ్డాయి. కారెంపూడితో పాటు మండలంలోని అన్ని గ్రామాలపై పోలీస్ నిఘా యథావిధిగా కొనసాగింది. వైఎస్సార్సీపీ, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఎవరూ కూడా బహిరంగంగా తిరగడం లేదు, చాలా మంది గ్రామాలు విడిచి వేరే గ్రామాలలో తలదాచుకున్నారు. ముఖ్యంగా గురువారం మండలంలో టెన్షన్ వాతావరణం కొనసాగింది. అవాంఛనీయ ఘటనలు జరగలేదు. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా పని చేశాయి. -
వేర్వేరు దాడి కేసుల్లో 33 మంది అరెస్ట్
దాచేపల్లి : మండలంలోని తంగెడ గ్రామంలో జరిగిన దాడి ఘటనలో 33 మంది నిందితులను అరెస్ట్ చేశామని సీఐ ఎ.సురేంద్రబాబు గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అదే విధంగా మరో ఘటనలో 22 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. -
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. పోలింగ్ బూత్లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్ బూత్లలో వైఎస్సార్సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్కు, నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్ప్రసాద్ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్కుమార్, కాసు మహేష్రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్ రోజున వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్ బూత్కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్ బూత్కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్ స్వామినాయక్ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్ బూత్ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
Advertisement