పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ దేవతను దర్శించుకోడానికి మొగలి బాలపీర్(30) తన మోటార్ సైకిల్పై మైసమ్మ దేవత వద్దకు వెళ్తుండగా.. దేవల్తిరుమలాపూర్ గ్రామ సమీపంలోని ఊరగుట్ట వద్ద మోటార్ సైకిల్ను గుర్తు తెలియని బొలెరొ వాహనం ఢీకొట్టింది. మొగలి బాలపీరు రోడ్డుపై పడి అక్కడికక్కడ మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మొగలి బాలపీరు దేవల్తిరుమలాపూర్ గ్రామం నుంచి నాయినోనిపల్లి మైసమ్మ దేవత వద్దకు వెళ్తుండగా.. పెద్దకొత్తపల్లి నుంచి వనపర్తికి వెళ్తున్న గుర్తు తెలియని బొలెరొ వాహనం బాలపీర్ మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో మృతిచెందాడు. మైసమ్మ దేవత వద్దకు వెళ్తున్న భక్తులు రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని చూసి దేవల్తిరుమలాపూర్ గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా.. ఆ గ్రామస్తులు వచ్చి చనిపో యిన వ్యక్తిని మొగలు బాలపీర్గా గుర్తించారు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి, మృతుడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ తెలియజేశారు.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
మహబూబ్నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ అక్బర్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని తిమ్మసానిపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తి(40) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతదేహం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
వాహనంపై నుంచి పడి యువకుడు మృతి
ఉప్పునుంతల: వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడు చెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని వెల్టూరులో ఆదివారం ఉదయం ఎద్దులను వాహనంలో ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు తాడు తెగిపోయి పై నుంచి కింద పడిన వాహన యజమాని, డ్రైవర్ ఈరట్వానిపల్లికి చెందిన సబావట్ గణేష్ (27) తలకు, మేడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వెల్టూరుకు చెందిన గంట రాములు ఎద్దులను వేరే చోటుకు తీసుకెళ్లడానికి వాహనం అద్దెకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ తెలిపారు.