-
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
సప్తగిరి.. భక్తఝురి
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తుల క్యూ శిలాతోరణం వరకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 76,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భా రీగా వర్షం కురవడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మాడవీధులు జలమయమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. -
మొదటి ఘాట్లో ప్రమాదాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం పలు ప్రమాదాలు జరిగాయి. వివరాలు.. తమిళనాడుకు చెందిన భక్తులు మినీవ్యాన్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కిందకు దిగుతుండగా మాల్వాడిగుండం సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని కొందరు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాద సమయంలో అటుగా వస్తున్న టీటీడీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. అలాగే ఘాట్ 19వ మలుపు వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే టీటీడీ వాటర్ ట్యాంకు కూడా డివైడర్ను ఢీకొంది. -
బోయకొండ గంగమ్మా..పాహిమాం
చౌడేపల్లె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగమ్మ తల్లీ శరణు అంటూ పూజల్లో పాల్గొన్నారు. వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్న ప్రసాదాల పంపిణీ ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈఓ పర్యవేక్షణలో సుమారు 2 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం బోయకొండ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న చోట జరుగుతున్న మరమ్మతు పనులను ఈఓ, చైర్మన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. -
24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలలో 1561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని డీఈఓ వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చిత్తూరు అర్బన్: నగరంలోని ఎస్వీ సెట్ కాలేజీలోని స్ట్రాంగ్రూమ్ను శుక్రవారం ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును క్షుణంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కౌటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అరిఫుల్లా, డీఎస్సీలు పావన్కుమార్, మహబూబ్బాషా పాల్గొన్నారు. మైనారిటీ గురుకులాల్లో డైరెక్ట్ అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ :జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి చిన్నారెడ్డి వెల్లడించారు. శుక్రవారం విలేకరులతో ఆయ న మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలల్లో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్శిక్, బౌద్ధులు, జైను కులస్తుల విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయకుండానే అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలోని మురకంబట్టు మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 63, 6వ తరగతిలో 55, 7వ తరగతిలో 48, 8వ తరగతిలో 47 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి సౌకర్యం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, కాస్మొటిక్ చార్జీలు, వైద్య సౌకర్యం కల్పి స్తున్నట్లు వివరించారు. వివరాలకు 8712625058, 9441155061 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు శరవేగంగా ఎన్హెచ్ పనులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎన్హెచ్ఎఐ పీడీ కార్తీక్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బెంగళూరు–చైన్నె ఎక్స్ప్రెస్ పనుల్లో భాగంగా బెతమంగళం నుంచి బైరెడ్డిపల్లె వరకు మొత్తం 25 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 15 కిలోమీటర్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె– బంగారుపాళ్యం 31 కిలోమీటర్లకు గాను 5 కి.మీ, బంగారుపాళ్యం–గుడిపాల మార్గంలో 29 కి.మీగాను 21.5 కి.మీ నిర్మించినట్లు తెలిపారు. చిత్తూరు–తచ్చూరు రోడ్డులో వరదారాజులపల్లె–కుమారారాజాపేట వరకు 43.8 కి.మీ నిర్మించాల్సి ఉండగా 25 కి.మీ పూర్తి చేశామన్నారు. కుమారారాజాపేట–వీరకావేరిరాజాపురం 17.58 కి.మీ గాను 1.6 కి.మీ, వీరకావేరిరాజాపురం–పొండవకం వర కు 34.66 కిలోమీటర్లకు గానూ 25 కి.మీ నిర్మించినట్లు ఆయన వివరించారు. 27 నుంచి వసంతోత్సవాలు తిరుపతి(అలిపిరి): శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారీ స మేతంగా వసంతోత్సవంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, సీతాలక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం అంతరార్థమని తెలిపారు. ఒక రోజు సేవలో పాల్గొనేందుకు దంపతులు రూ.516 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
● తాతయ్యగుంట గంగమ్మకు తోటి వేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని తన్మయత్వం చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – తిరుపతి కల్చరల్ -
ఇలాంటి క్షోభ ఎవరికీ రాకూడదు
చిన్నారుల తల్లి దండ్రులను ఓదార్చుతున్న మంత్రి రోజా పుత్తూరు: బాబు, విజయ దంపతులకు కలిగిన క్షోభ మరెవరికీ రాకూడదని మంత్రి ఆర్కే రోజా భావోధ్వేగం చెందారు. శుక్రవారం వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామానికి వెళ్లి ముగ్గురు ఆడ బిడ్డలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. వారి బాధను చూడలేక ఆమె కూడా కంటతడి పెట్టారు. శివుడికి పూజలు చేసి, దీపారాధన చేస్తూ చెరువులో పడి మృత్యువాత పడ్డ చిన్నారులు రూపిక, చరిత, యుషిక మృత దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోవాలని, తాను అండగా ఉంటానని బాధిత కుటుంభానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు. బాసటగా నిలవాలని గ్రామస్తులను కోరారు. అనంతరం అశ్రునయనాల మధ్య చిన్నారుల మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చిన్న పొరబాటు జరిగినా కఠిన చర్యలు
● కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు ● చిత్తూరు ఆర్ఓ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లల్లో చిన్నపొరబాటు జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయని చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు ఎస్పీ మణికంఠతో కలిసి ఆయన ఎస్వీ సెట్లోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించారు. అనంతరం ఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ కౌంటింగ్కు ఏర్పాట్లు పకడ్బందీగా చేప ట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఐడీ కార్డు, ప్రొసిడింగ్ ఉత్తర్వులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుందని తెలిపారు. 24 గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్కు ఏజెంట్లు వచ్చినప్పుడు రిజిస్టర్లో సంతకాలు చేయించుకోవాలని తెలిపారు. కంట్రోల్ రూమ్లో మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిం చేలా చేపట్టి, వారందరికీ ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించకూడదని తెలిపారు. డీఆర్ఓ పుల్లయ్య, ఏఎస్పీ అరిపుల్లా, కమ్యునికేషన్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ నరసింహులు, ఏఆర్ఓలు శ్రీనివాసులురెడ్డి, విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్వీ సెట్లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్ వేయించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి లోపాలు ఉన్నట్లైతే సరిచేయాలన్నారు. సిబ్బంది వివరాలతో పాటు కంప్యూటర్లు, నెట్ తదితర సాంకేతిక అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
విమానంలో విహారయాత్రకు విద్యాకుసుమాలు
సత్యవేడు: మాధనసాళెం జెడ్పీఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే విమానంలో విహాయ యాత్రకు పంపుతానని సురుటుపల్లె ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగా విద్యార్థులు పురుషోత్తం(552), వి. విష్ణు( 515),మహా(509), తనూజ(505)తోపాటు ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్ను శుక్రవారం చైన్నె నుంచి హైదరాబాద్కు విమానంలో పంపించారు. టికెట్లతోపాటు విద్యార్థుల రెండు రోజుల విహార యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతే భరిస్తున్నారు. ఈ మేరకు ఉమాపతిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. -
పక్కాగా ‘విద్యాహక్కు’
● పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్య ● జిల్లాలో 827 మంది విద్యార్థులు ఎంపిక ● ఈ నెల 20లోపు అడ్మిషన్లు ● తొలి జాబితా విడుదల చేసిన విద్యాశాఖ తిరుపతి ఎడ్యుకేషన్ : ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1) (సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25శాతం మంది విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 2024–25వ విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 34మండలాలకు గాను 31మండలాల నుంచి 1,407మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనలకు లోబడి ఉన్న 1,024మంది దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అందులో 827మందిని ఎంపిక చేస్తూ విద్యాశాఖ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. జిల్లాలో ఎంపిక ఇలా.. విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్ఈ వెబ్ పోర్టల్లో జిల్లాలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమలుచేస్తున్న జిల్లాలోని 402 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25శాతం సీట్లను కేటాయించాలి. అందులో భాగంగానే విడుదల చేసిన తొలి విడత జాబితాలో 827మంది విద్యార్థులు సీట్లు పొందనున్నారు. 20లోపు అడ్మిషన్లు పొందాలి విద్యాశాఖ విడుదల చేసిన జాబితా మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన 827మంది విద్యార్థుల్లో ఇప్పటికే 600మందికి పైగా అడ్మిషన్లు పొందారు. మిగిలిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న పాఠశాలలకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణపత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.సద్వినియోగం చేసుకోండి ఉచిత విద్యాహక్కు చట్టం మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలివిడత జాబితాలో 827మంది లబ్ధి పొందగా, వారిలో 600కుపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన వారు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. – శేఖర్, డీఈఓ, తిరుపతి -
మరణంలోనూ వీడని బంధం
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ఒకరినొకరు విడిపోకూడదని ఉపాధి కూడా ఒకే చోట వెతుక్కున్నారు. ఎక్కడికి వెళ్లినా ఒకటిగానే వెళ్లేవారు. స్నేహితుడి వివాహానికి హజరయ్యేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి దుర్మరణం చెందడం కుటుంబ సభ్యులు, సహా మిత్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. నగరి రూరల్ మండలం తడుకుపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నగరి: నగరి రూరల్ మండలం తడుకుపేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా నైనార్ కోయిల్ గ్రామానికి చెందిన ఇళంగన్ (27), కన్నన్ (28) మృతిచెందగా, నగరి మున్సిపాలిటీ సత్రవాడకు చెందిన సంజయ్ (29) తీవ్రంగా గాయపడ్డాడు. మృతుని బంధువుల కథనం మేరకు.. చిన్ననాటి నుంచి ఇళంగన్, కన్నన్ మిత్రులు. వీరు ఉపాధి కూడా ఒకే చోట వెతుక్కున్నారు. చైన్నెలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వీరు తిరుపతిలో జరిగే సహ ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు పని ముగించుకొని మరో మిత్రుడు నగరికి చెందిన సంజయ్తో కలిసి ముగ్గురు ఒకే బైక్పై బయలుదేరారు. రాత్రి కావడంతో నగరి రూరల్ మండలం తడుకు పేట వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇళంగన్, కన్నన్ ఘటన స్థలంలోనే మృతి చెందగా, సంజయ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉన్నత వైద్య చికిత్స నిమిత్తం చైన్నెకి తరలించారు. విషయం తెలిసిన మృతుల బంధువులు, మిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. నైనార్ కోయిల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నీటి వీడ్కోలు ఫ్లెక్సీలో మిత్రులిద్దరినీ ఒక్కటిగానే ఉంచడంతో చూసినవారి గుండెలు తరుక్కుపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి మరొకరికి తీవ్రగాయాలు పెళ్లికి హాజరయ్యేందుకు వస్తుండగా తడుకు పేట వద్ద ఘటన -
పలమనేరు జాతరకు వేళాయే..
● కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ తల్లి ● గంగ జాతరకు 300 ఏళ్ల చరిత్ర ● 20న శిరస్సు మెరవణి, 22న విశ్వరూప దర్శనం ● మొదలైన పండుగ సందడిపలమనేరు: జిల్లాలోనే పలమనేరులో జరిగే తిరు పతి గంగమ్మ జాతరకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం గతంలో తమిళనాడు రాష్ట్రంలోని నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ జాతర జరుగుతోంది. ఈజాతరకు స్థానికులే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న స్థానికులు సైతం వస్తుంటారు. జిల్లాలోని జాతర్లకు విభిన్నంగా ఇక్కడి జాతరలో అమ్మవారి శిరస్సు మెరవణి కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. అమ్మవారి శిరస్సును తాకేందుకు జనం ఆసక్తిని చూపుతుంటారు. జాతరకు ముందు పట్టణంలో గంగచాటు పెట్టినప్పటి నుంచి పట్టణంలో పండుగ సందడి మొదలవుతుంది. అప్పటినుంచి స్థానిక మారెమ్మ, గంగమ్మ ఆలయాల వద్ద మహిళలు పొంగళ్లను పెట్టడం ఆనవాయితీ. అప్పటినుంచి జాతర వరకు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తుంటారు. పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రా మాలనుంచి ప్రజలు పొంగళ్లు పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వస్తుంటారు. ఇక పట్టణంలోని కులసంఘాలు వారు రోజుకొక్కరు చొప్పున ప్రత్యేక పూజలు, అన్నదానాలను చేయడం ఆనవాయితీ. శిరస్సు మెరవణిలో లక్షల్లో టెంకాయలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగే జాతర్లకు భిన్నంగా ఇక్కడ బంగారు పూత పూసిన అమ్మవారిని శిరస్సును పట్టణంలో ఊరేగిస్తారు. ఈ తంతు పట్టణంలోని పాతపేట వేణుగోపాలస్వామి ఆలయం నుంచి అనాథిగా వస్తోంది. ఈ సందర్బంగా భక్తులు అమ్మవారికి లక్షల్లో టెంకాయలను కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం వద్ద విస్త్రృత ఏర్పాట్లు.. పలమనేరు పట్టణంలో ఈనెల 20 నుంచి 22 దాకా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే తిరుపతి గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవాదాయశాఖాధికారులు ఆలయం వద్ద విస్తృత ఏర్పాట్లను చేపట్టారు. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా అలంకరణలు చేశా రు. చలువపందిళ్లు, భారీ క్యూలు ఏర్పాటు చేశారు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు భక్తులు విచిత్ర వేషధారణలతో ఇప్పటికే ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో దుకాణాలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. మరోవైపు పొరుగునే ఉన్న మారెమ్మ ఆలయంలో పొంగళ్ల నివేదన కార్యక్రమం నిత్యం ఘనంగా సాగుతోంది. అమ్మవారికి అభిషేకం, అన్నదానం... స్థానిక గంగమ్మ ఆలయం వద్ద శుక్రవారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయ దుస్తులను ధరించి వారంతా పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. యోగివేమారెడ్డి ట్రస్టు అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం స్థానిక వడ్డెర సంఘం, మాజీ సైనికోద్యోగులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానాలు చేపట్టారు. పట్టణంలో ఎటు చూసినా సందడి నెలకొంది. భారీ బందోబస్తు జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. చిన్నపిల్లల కోసం భారీ రంగుల రాట్నాలు, జాయింట్ వీలర్లును ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు ఆలయం వద్ద అవసరమైన సౌకర్యాలను చేపట్టారు. పలు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి జలది చేసే చోట అవసరమైన పనులను చేపట్టారు. పట్టణంలో ఎటు చూసినాజాతర సందడి కనిపిస్తోంది. -
పెంచలకోనకు ప్రత్యేక బస్సులు
రాపూరు: మండలంలోనిపెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి, వాకాడు, కావలి, వెంకటగిరి, గూ డూరు, వైఎస్సార్ జిల్లా కడప, మైదుకూరు, రాజంపేట, బద్వేల్ నుంచి ప్రత్యేక బస్సులను శనివారం నుంచి నడపనున్నట్లు వివరించారు. 22న నృసింహ జయంతి, 23న శ్రీవారి కల్యాణం నేపథ్యంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందని, ఆ మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అన్ని బస్సుల్లో మామూలు చార్జీలనే వసూలు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు చెందిన ద్విచక్రవానదారుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చైన్నె నుంచి బెంగళూరు వెళుతున్న లారీ మొగిలి ఘాట్లో జాతీయ రహదారి మధ్యలో నిలిచిపోయింది. అదే సమయంలో చిత్తూరు నుంచి పలమనేరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పలమనేరు పట్టణం పాతపేట అంబేడ్కర్ నగర్కు చెందిన మురుగేష్ కుమారుడు సురే ష్(21) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. ఏఎస్ఐ మళ్లెమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు గాయాలు చౌడేపల్లె: దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె సమీపంలో శుక్రవారం నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు చెంగారెడ్డి పెంపుడుకుక్కను పెంచు కుంటున్నాడు. శుక్రవారం ఇంటికి సమీపంలో ఉన్న ఒక రైతు మామిడితోటలోకి కుక్క వెళ్లింది. కొద్దిసేపటికి పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. చెంగారెడ్డి అక్కడికి వెళ్లి చూడగా నాటు బాంబు పేలి కుక్క తీవ్రంగా గాయపడి ఉంది. దవడ భాగం చీలిపోయి ఉంది. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పాతిపెట్టిన నాటుబాంబును కొరకడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెంగారెడ్డి తెలిపారు. ఆముదాలకోనలో ఒంటరి ఏనుగు! చంద్రగిరి : మండలంలోని ఆముదాల కోన వద్ద అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం అటవీప్రాంతంలో ఆయన పర్యటించి ఏనుగు కాలి గుర్తులను పసిగట్టారు. గతంలో తవణంపల్లె, పాకాల వద్ద ఇద్దరిని హతమార్చింది ఈ ఏనుగే అని గుర్తించామని డీఆర్ఓ వెల్లడించారు. ఈ మేరకు ఆముదాల కోన ఎస్టీ కాలనీ, కల్రోడ్డుపల్లె, మిట్టూరు, కాశిపెంట్ల, కొత్త ఇండ్లు గ్రామాల్లోని ప్రజలకు తీసుకోవాల్సిన అవగాహన కల్పించారు. ఒంటరి ఏనుగు ఎక్కడ కనిపించినా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఏనుగును దారి మళ్లించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం పిచ్చాటూరు : స్థానిక పీహెచ్సీ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. శివగిరి ఏఏడబ్యూకు చెందిన మాతయ్య(22) ద్విచక్రవాహనంపై పిచ్చాటూరుకు వస్తుండగా శ్రీరామాపురం వెళుతున్న బస్సు ఢీకొంది. దీంతో మాతయ్య అక్కడికక్కడే మరణించాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదిగో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటున్నా
● భార్య, అక్కకు వీడియో కాల్ ● రైలు కింద పడి అటెండర్ ఆత్మహత్య కుప్పం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న నరేంద్ర మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు, మదనపల్లె సమీపంలోని బసినికొండకు చెందిన నరేంద్ర మూర్తి (40) శాంతిపురం మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. గురువారం కుప్పం రైల్వే స్టేషన్కు వచ్చి భార్య కల్పన, అక్క సుజాతకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకోవాల్సిన రూట్ను వీడి యో కాల్లో చూపించినట్లు తెలిసింది. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పంచనామా చేసి, బంధువులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. -
విద్యుత్ తీగలపై పడిన రైల్వే లిఫ్ట్గేట్
పుత్తూరు: పట్టణంలోని ఆర్డీఎం రైల్వే గేటు నెంబర్ 56 వద్ద గురువారం పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చిత్తూరు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లిఫ్ట్ గేట్ను ఈడ్చుకొంటూ వెళ్లింది. దీంతో లిఫ్ట్గేట్ హైవవర్ విద్యుత్ లైన్పై పడి మంటలు చెలరేగాయి. స్థానికులు కేకలు వేయడంతో గేట్మెన్ పుత్తూరు రైల్వే స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు 3 గంటల పాటు శ్రమించి లిఫ్ట్ గేటును సరిచేసి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆ లిఫ్ట్ గేటు తరచూ మరమ్మతులకు గురికావడం, ప్రమాదాలు చోటు చేసుకోవడం రివాజుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. -
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
చిత్తూరు కార్పొరేషన్: అటవీ రక్షణ సంరక్షణ పనులు చేస్తున్నామని ఈస్ట్ ఎఫ్ఆర్వో థామస్ తెలిపారు. ఆయన గురువారం పలు అంశాలపై మాట్లాడారు. చిత్తూరు నగరవనంలో 13 సోలార్ సిస్టమ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అదే విధంగా ట్రాక్ కెమెరాలు 4 ఏర్పాటు చేశామన్నారు. తద్వారా మనుషులు, జంతువుల కదలికలను రికార్డు చేసి ఫొటోలను ఎప్పటికప్పుడు అనుసంధానం చేసిన మొబైల్కు పంపుతుందన్నారు. ఈ రెండు రకాల కెమెరాలను మొబైల్ ద్వారా మానిటరింగ్ చేయవచ్చన్నారు. స్మగ్లింగ్ నివారణ, వన్యప్రాణుల రక్షణ కోసం ఇది ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా రూ.8.07 లక్షలతో నగరవనం చుట్టూ భద్రత కోసం 3 కిలోమీటర్లు ట్రెంచ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనివల్ల అటవీలోని జంతువులు బయటకు వెళ్లలేవన్నారు. బయట నుంచి జంతువులు లోనికి రాలేవన్నారు. కుక్కల బెడద ఎక్కువ కావడంతో దుప్పులు జనారణ్యంలోకి వస్తున్నట్లు వివరించారు. అందుకే డాగ్బోన్లు పెట్టి అందులో చిక్కిన కుక్కలను తమిళనాడు సరిహద్దులో వదిలిపెడుతున్నమన్నారు. రేంజ్ పరిధిలో రూ.9 లక్షలతో సాసర్పిట్లు మరమ్మతు చేశామన్నారు. మొత్తం 38 సాసర్పిట్లలో జంతువుల దాహార్తి కోసం నీరు నింపుతున్నట్లు స్పష్టం చేశారు. ఒంటరి ఏనుగును పూతలపట్టు నుంచి తిరుపతి జిల్లా అడవిలోకి పంపామన్నారు. నగర వనంలో సోలార్ సిస్టమ్ సీసీ కెమెరాలు ఎఫ్ఆర్వో థామస్ వెల్లడి -
మృతుల కుటుంబాల్లో తీరని విషాదం
బంగారుపాళెం: కూలి పనులకు వెళితేగానీ బతుకు సాగని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. మండలంలోని మొగిలి ఘాట్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరమంద గ్రామానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతుకు వరిగడ్డి తీసుకువచ్చేందుకు అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్, రాజా, నాగభూషణం, రాజయ్య, జయచంద్ర, బాబు కూలీలుగా ట్రాక్టర్లో చౌడేపల్లె మండలం రాయలపేటకు వెళ్లారు. వరిగడ్డి లోడుతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మొగిలి వద్ద ట్రాక్టర్ను కట్టెల లోడ్డుతో కర్ణాటక నుంచి చిత్తూరు పోతున్న లారీ ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రాజా బంగారుపాళెంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం రాజాకు వివాహమైంది. పిల్లలు లేరు. వేణుగోపాల్ పలమనేరు ఏరియా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆడపిల్లలకు పెళ్లయిపోయింది. పోలీసులు గురువారం రోడ్డు ప్రమాద మృతులకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాద సంఘటన కీరమంద గ్రామంలో విషాదాన్ని నింపింది. కూలి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే ఇంటి యజమానులు విగత జీవులుగా, క్షతగాత్రులుగా మారిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
థామస్ది రౌడీ రాజకీయం
చిత్తూరు రూరల్(కాణిపాకం): గంగాధరనెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ రౌడీ రాజకీయం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఇంత నీచమైన రాజకీయం ఎప్పుడూ చూడలేదన్నారు. టీడీపీ అభ్యర్థి థామస్ అల్లాగుంట పేరునే చెడిపేస్తున్నారన్నారు. మే 13వ తేదీన జరిగిన పోలింగ్కు థామస్ 300 మంది రౌడీలను బౌన్సర్లుగా దింపారని చెప్పారు. వారితో బూత్ల వద్ద దౌర్జన్యాలు, దాడులకు దిగారని గుర్తుచేశారు. ఎస్సీ కుటుంబాలపై దాడులు చేయించారని ఆరోపించారు. పుల్లూరు దళితవాడలోని నాలుగు ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. దీనిపై ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఫిర్యాదు చేస్తే ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులంతా టీడీపీ నేతలకే కొమ్ము కాశారని, ఎన్నికల కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. మునస్వామి అనే వ్యక్తి థామస్గా పేరు మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు దండుకోవడానికి ఏటీఎం కార్డుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి యత్నించారని చెప్పారు. ఇలాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. ఇక చంద్రబాబు అయితే ఎస్సీలను శత్రువులాగా చూస్తారన్నారు. దళితులను ఓట్లు అడిగేందుకు కూడా బాబు అసహ్యించుకుంటారని తెలిపారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. జగనన్న సంక్షేమాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ప్రజలంతా మళ్లీ జగనన్న నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగే ప్రజల నిర్ణయం తెలుస్తుందని, కచ్చితంగా మళ్లీ జగనన్న సీఎం అవుతారని స్పష్టం చేశారు. అనంతరం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని మీడియాకు పూర్తిస్థాయిలో వివరించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పురం జెడ్పీటీసీ రమణప్రసాద్రెడ్డి, ఎంపీపీ జనార్దన్, మండల అధ్యక్షుడు మణి తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు బౌన్సర్లంటూ రౌడీలను తీసుకొచ్చారు తమిళనాడు నుంచి 300 మందిని రప్పించారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
భద్రత కట్టుదిట్టం
చిత్తూరు కలెక్టరేట్ : కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు ఆదేశించారు. ఆయన గురువారం ఎస్వీసెట్ కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 4 వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదని ఆదేశించారు. స్ట్రాంగ్ రూంల వద్ద 24 గంటల పాటు సిబ్బంది, పోలీసులు విధులు నిర్వర్తించాలని తెలిపారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుల్స్, సీసీ కెమెరాలు, అభ్యర్థులు, ఏజెంట్లకు అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు, ఏజెంట్లు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీక్షించే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పుల్లయ్య, పూతలపట్టు ఆర్ఓ చిన్నయ్య, కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్లు నరసింహులు, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 9 ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ విజయ్కుమార్ తెలిపారు. పులిచెర్లలో 4, గుడుపల్లెలో 5 ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతోందన్నారు. జిల్లాలోని 480 ప్రాంతాల్లో బోర్, పైప్లైన్ మరమ్మతులు చేసి, నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో జేసీబీ డ్రైవర్ మృతి
పాలసముద్రం : గుర్తుతెలియని వాహనం ఢీకొని జేసీబీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, మండలంలోని నరసింహాపురం పంచాయతీ బలిజూరుకు చెందిన జానకిరామన్(52) జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఈయన తమిళనాడు సరిహద్దులోని పలేరి గ్రామంలో భూమి చదును చేసిన తరువాత ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. -
అడుగడుగునా టీడీపీ గూండాగిరి
● ఓటమి భయంతోనే టీడీపీ దాడులు ● వైఎస్సార్సీపీ నాయకులను రక్తమొచ్చేలా కొట్టారు ● వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ చిత్తూరు రూరల్(కాణిపాకం): అబద్ధాలు చెబుతూ, ఆత్మరక్షణ పేరుతో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ అడుగడుగునా గూండాగిరికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ మండిపడ్డారు. చిత్తూరు ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మురళీమోహన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాదిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ బలంగా ఉందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ పచ్చమూకలతో అల్లర్లు సృష్టించారన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను తీవ్రంగా కొట్టి గాయపరిచారని చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని వదిలి ఆత్మ రక్షణ అంటూ అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను దాచేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి ఓట్లు పడలేదనే అక్కసుతో రాళ్ల దాడులు చేస్తూ ఓటర్లను భయపెట్టారని పేర్కొన్నారు. యాదమరిలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని, అటువంటి వ్యక్తిపై బురదజల్లాలని చూస్తారన్నారు. బంగారుపాళెం మండలం నలగాంపల్లెలో కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదన్నారు. ప్రజలు సరిగ్గా ఓట్లు వేసిన పాపానపోలేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఓటర్లు తిరగబడి స్వచ్ఛందంగా ఓటు వేశారని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేని తమ్ముళ్లు కాపు కాసి దాడికి పాల్పడారని ఆవేదన వ్యక్తం చేవారు. ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి, ఆత్మరక్షణ కోసం కొట్టామని చెప్పడం దుర్మార్గమన్నారు. అలాగే పేట అగ్రహారం పోలింగ్ బూత్లో రవినాయుడును రక్తమొచ్చేలా కొట్టారన్నారు. కమ్మగుట్టపల్లిలో గురస్వామినాయుడును తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈ దాడులు చేయించారని పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబును ఈసారీ ఇంటికి పంపిస్తున్నారని..మురళీ మోహన్ కూడా తిరుపతికి వెళ్లి సొంత పనులు చూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వైస్ జెడ్పీ చైర్మన్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ యాదమరిలో తాము అరాచకాలు చేస్తున్నట్లు, టీడీపీ అభ్యర్థి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి నాయకుల వరకు అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో మోర్ధానపల్లి సర్పంచ్ మహిళ అని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దీనిపై తాము పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మాదిరెడ్డిపల్లిలో టీడీపీకి ఓట్లు పడకపోవడంతో దౌర్జన్యం చేశారని చెప్పారు. మళ్లీ అక్కడ రాళ్ల దాడి చేసి పోలీసులను కూడా గాయపరిచారని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ సురేష్బాబు, వైస్ ఎంపీపీ రవి, జిల్లా కార్యదర్శి మనోహర్రెడ్డి, సర్పంచులు, నాయకులు పరందమాన్, శేఖర్, తులసిరెడ్డి, సురేష్రెడ్డి పాల్గొన్నారు. -
మూడంచెల భద్రత
జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. అమలులో 144 సెక్షన్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు 144 సెక్షన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇది అమలులో ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఐపీసీ సెక్షన్ 141 ప్రకారం చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ర్యాలీలు చేయకూడదని తెలిపారు. తుపాకులు, కత్తులు, రాళ్లు, కర్రలు ఇతర ఆయుధాలు తీసుకెళ్లడం నిషిద్ధమని చెప్పారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి ఒకే చోట ఉండకూడదని ఆయన వెల్లడించారు. కాణిపాకంలో ఆర్టీఐ కమిషనర్ సునీల్ కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని గురువారం ఆర్టీఐ కమిషనర్ సునీల్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి, దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, అధికారులు కోదండపాణి, సత్యంరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. – 8లో -
మూడంచెల భద్రత
సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు ఇంకా 18 రోజులు సమయం ఉంది. అప్పటివరకు ఈవీఎం, బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు బందోబస్తు పకడ్బందీగా చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి ఈవీఎం యంత్రాలను జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి తరలించి వాటిని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. కౌంటింగ్కు ఇంకా సమయం ఉండడంతో ప్రజా తీర్పును అంచనా వేయడంలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలో ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణగా ఉండేలా ఏర్పాటు చేశారు. వీరితో పాటు కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చారు. భద్రతా వ్యవస్థ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లను సందర్శించే అవకాశం సదరు రిట్నరింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది. స్ట్రాంగ్ రూం పరిసరాల్లో 144 సెక్షన్ ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్న్ అమల్లో ఉంది. ఓటింగ్ యంత్రాలు భద్రపరిచేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉన్న గదిని ఎంచుకుని డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సాధారణంగా స్ట్రాంగ్ రూంలకు ప్రవేశ ద్వారం ఒక్కటే ఉంటుంది. ఇతర మార్గాల ద్వారా చేరుకోవడానికి వీలు పడదు. పోలింగ్లో ఉపయోగించిన బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు విలువైన పత్రాలను భద్రంగా ఉంచేలా స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం ద్వారా నిఘా ఈవీఎంల భద్రతకు అమర్చిన సీసీ కెమెరాలు అందించే దృశ్యాలను కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షిస్తారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం వాటిని పరిశీలించడానికి అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాల నిర్వహణకు నిరంతర విద్యుత్ అవసరం. కరెంట్ కోతలు లేకుండా స్థానిక విద్యుత్ బోర్డు సహకరిస్తోంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రాలతో పాటు జనరేటర్ సౌకర్యం కూడా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు ఉన్నత స్థాయి అధికారులను ఇన్న్చార్జ్లుగా నియమించారు. అక్కడికి అనధికార వ్యక్తుల వాహనాలకు అనుమతిని నిషేధించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లను ఓటర్ పెరిమీటర్ వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆర్ఓలు ఇన్నర్ పెరిమీటర్ వరకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్కు అనుసంధానం జూన్న్ 4న ఓట్ల లెక్కింపు జరిగేవరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిరంతర పోలీసు పహారా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూంలో అమర్చిన సీసీ టీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి వాటి దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీసీ టీవీ కవరేజ్తో సహా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గెజిటెడ్, పోలీసు అధికారులు 24 గంటలు విధుల్లో ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల సెక్యూరిటీ, కారిడార్ మొదలైన వాటి సీల్డ్ డోర్లను కవర్ చేసే విధంగా సీసీ టీవీ కవరేజీ, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారాల వద్ద విజిట్ చేసిన అధికారులు సంతకాలు చేసేందుకు లాక్ బుక్ (రిజిస్టర్లు) ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు పోలింగ్ తీరుపై బూత్లు, మండలాల వారీగా విశ్లేషణ కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు ఈవీఎంలలోనే తీర్పు జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత మూడు నెలలుగా ఎన్నికల్లో గెలుపు కోసం హోరా హోరీగా అభ్యర్థులు పోరాడారు. ఇప్పుడు ఫలితాల కోసం జూన్ 4 వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు గెలుపు తమదేనని ధీమాతో ఉండగా, మరికొందరిలో ఆందోళన ఉంది. పోలైన ఓట్లల్లో తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. నియోజకవర్గాలు, గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకుంటున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించిన వారితో సమావేశమై పరిస్థితులు ఆరా తీస్తున్నారు. ఓటర్ల మూడ్ ఎలా ఉంది. ఎటు వైపు మొగ్గు చూపారు. తదితర అంశాలను రాబట్టేపనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. -
క్షయ నివారణే లక్ష్యం
చిత్తూరు రూరల్(కాణిపాకం): ప్రభుత్వం క్షయ నివారణే లక్ష్యంగా పనిచేస్తోందని డీఎంహెచ్ఓ ప్రభావతిదేవి అన్నారు. చిత్తూరు నగరం సత్యనారాయణపురంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం అడల్ట్ బీసీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా గుర్తించిన వ్యక్తులకు టీకాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ వేస్తారన్నారు. మధుమేహం, ధూమపానం చేసేవారికి, టీబీ మందులు వాడిన వ్యక్తులకు, టీబీ వ్యాధిగ్రస్తుల కుటుంబీకులకు, 60 ఏళ్లు పైబడినవారికి బీసీజీ వ్యాక్సిన్ను ఉచితంగా వేస్తారన్నారు. ప్రతి గురువారం కేటాయించిన ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ను వేస్తారన్నారు. దీన్ని ప్రజలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, వైద్యాధికారులు సాయి షర్మిల, శిరీష, గుణశేఖర్, జార్జ్ తదితరులు పాల్గొన్నారు. 563 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జిల్లా వ్యాప్తంగా 563 కేంద్రాల్లో వంద శాతం పూర్తయిం దని జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ తెలిపారు. 60 ఏళ్లు పైబడిన 6,460 మందికి, ధూమపానం చేస్తున్న 2,000 మందికి, మధుమేహ వ్యాధిగ్రస్తులు 4,529 మందికి, టీబీ వ్యాధిగ్రస్తుల కుటుంబంలోని 2136 మంది వ్యాక్సినేషన్ వేసినట్లు ఆయన పేర్కొన్నారు. క్షయవ్యాధి నివారణకు బి.సి.జి టీకాలు తవణంపల్లె: క్షయవ్యాధి నివారణకు బి.సి.జి టీకాలు తప్పని సరిగా వేయించాలని క్షయ వ్యాధి నివారణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్కుమార్నాయక్ తెలిపారు. గురువారం మండలంలో బి.సి.జి టీకాలు వేసే కార్యక్రమానికి మొట్టమొదటి సారిగా శ్రీకారం చుట్టారు. మండలంలోని కె.పట్నం, తవణంపల్లె, దిగువమాఘం సచివాలయాల్లో జరుగుతున్న బీసీజీ టీకాల కార్యక్రమాన్ని ఆయనతోపాటు సిహెచ్ కిరణ్కుమార్ రెడ్డి, జిల్లా క్షయవ్యాధి నివారణ డాక్టర్ వెంకటప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం దిగుమాఘం సచివాలయంలో డాక్టర్ సునీల్కుమార్నాయక్ మాట్లాడుతూ ప్రతి గురువారం తప్పకుండా బీసీజీ టీకాలు వేసే కార్యక్రమం నిర్వహించాలన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకాలు వేయించాలని సూచించారు. టీకాలు వేసిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలని వివరించారు. మండల వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మోహన్వేలు, డాక్టర్ వినయ్కుమార్ మండలంలో జరుగుతున్న బీసీజీ టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు రాజశేఖర్, నిర్మల, రెడ్డెమ్మ, ఆరోగ్య కార్యకర్తలు సుబ్రమణ్యం రెడ్డి, శ్రీనివాసులు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యార్థుల చిత్రలేఖనం చాలా బాగుంది
చిత్తూరు కలెక్టరేట్ : వేసవి శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు గీసిన చిత్రలేఖనం బొమ్మలు చాలా బాగున్నాయని డీఈఓ దేవరాజు అభినందించారు. జిల్లా కేంద్రంలోని తపో వనం సంస్కృతోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బాపు బాలభవన్ చిత్రలేఖనం వేసవి శిక్షణా శిబిరాన్ని గురువారం డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు శిబిరంలో శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేసవి శిక్షణా శిబిరం శిక్షకులు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement