ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

Published Sun, May 5 2024 7:40 AM

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

తాడిపత్రి: ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణకు వచ్చిన ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్‌ మండలం చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న మద్ద రామాంజనేయులు (55) ఉరవకొండలో నివాసముంటున్నారు. ఆయనకు భార్య మాలతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరయ్యారు. షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు రోజూ వేకువజామున వాకింగ్‌కు వెళ్లే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున కడప మార్గంలో వాకింగ్‌కు వెళ్లిన ఆయన శివాలయం వద్ద రహదారి పక్కన మృతదేహమై కనిపించారు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రూరల్‌ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement