ఉచిత ఆన్‌లైన్‌ దరఖాస్తు | Sakshi
Sakshi News home page

ఉచిత ఆన్‌లైన్‌ దరఖాస్తు

Published Mon, May 6 2024 7:50 AM

-

కాటారం: రైల్వే పోలీస్‌(ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులకు కాటారం సబ్‌ డివిజన్‌ పోలీస్‌ శాఖ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయనున్నట్లు కాటారం డిఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌కు సంబంధించి నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్‌ శాఖ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆర్‌పీఎఫ్‌లో 4,208 కానిస్టేబుల్‌ పోస్టులు, 452 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌ జారీ అయినట్లు తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నిండి పదో తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి గలవారు విద్యార్హత, కులం సర్టిఫికెట్‌, తెలుపు బ్యాక్‌ గ్రౌండ్‌లో ఉన్న పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆధార్‌కార్డు, ఈ మెయిల్‌ అడ్రస్‌, మొ బైల్‌ నంబర్‌తో డీఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుంటే పోలీస్‌శాఖ ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్‌ చివరి గడువు ఉందని చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement