● వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
కాళోజీ సెంటర్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలో ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుందన్నారు.