-
దరఖాస్తుల స్వీకరణ
భూపాపల్లి అర్బన్: గ్రూప్–1, సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టును నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిణి శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో నేటి(శనివారం) నుంచి జూన్ 3 తేదీ వరకు గ్రూప్–1 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్కు ఈ నెల 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్కు హాజరయ్యే ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపికకు.. 2024–25 విద్యా సంవత్సరానికి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలకు 1వ తరగతిలో 41 సీట్లు, 5వ తరగతిలో 43 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆదర్శ పాఠశాల, వివేకనంద పాఠశాల, సువిద్య పాఠశాల కాటారం, సెయింట్ పీటర్స్ హైస్కూల్ భూపాలపల్లి పాఠశాలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఎంపిక చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్లు క్లీన్ చేశారు! కాళేశ్వరం: ప్రభుత్వ ‘లక్ష్యం నిరుపయోగం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో వచ్చిన కథనానికి జిల్లా పంచాయతీ అధికారులు స్పందించారు. కాళేశ్వరం, కుదురుపల్లి గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లను క్లీన్ చేసి వాడకంలోకి వచ్చేలా చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా పోగు చేసి ఎరువుల తయారీ ప్రారంభించనున్నారు. జిల్లాలోని పలు పంచాయతీల్లో కూడా క్లీనింగ్ ప్రక్రియ మొదలు కానుందని పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. వినియోదారులు సహకరించాలి ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ సాయికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు, పత్తిపల్లి నుంచి కాశిందేవిపేట, సబ్ స్టేషన్ పరిధి గ్రామాలలో 33కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతుందని తెలిపారు. నేడు(శనివారం) ఉదయం 7నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులు సహకరించాలని కోరారు. వికసించిన ‘మే’ పుష్పం వాజేడు: అరుదుగా కనిపించే మేడే పుష్పం మండల పరిధిలోని పెద్ద గొళ్లగుడెం గ్రామంలో శుక్రవారం వికసించింది. పెద్ద గొళ్లగూడెం గ్రామానికి చెందిన జెజ్జరి సత్యనారాయణ ఇంట్లో ఈ మే పుష్పాలు కనిపించాయి. -
సైబర్ నేరాలపై జాగ్రత్త అవసరం
భూపాలపల్లి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, టెక్నాలజీని వాడుకొని కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు. ప్రజలు అనవసర లింక్లు క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పాస్వర్డ్లు ఎవరికీ చెప్పవద్దన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్లు, లింకులు, ఈ–మెయిల్స్తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దన్నారు. గుర్తు తెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ చాటింగ్కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని సూచించారు. లాటరీలు, బ్యాంకుల రివార్డు పేరిట, జాబ్స్, కమీషన్లు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రజలకు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు.ఎస్పీ కిరణ్ఖరే -
పనులను వేగిరం చేయాలి
భూపాలపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ భవేష్మిశ్రా ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతి, గ్రామాల్లో తాగునీటి సమస్య అంశాలపై అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు, ఏంఈఓలతో సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ మొదటి వారం లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు నిఘా పెంచాలన్నారు. నాణ్యమైన మెటీరియల్ వాడుతూ పనులను పూర్తి చేయాలని చెప్పారు. మెటీరియల్ కొనుగోలు, లేబర్ ఖర్చులు తదితర వివరాలకు సంబంధించి రిజిస్టర్ మెయింటెన్ చేయాలన్నారు. పూర్తిస్థాయిలో పనులు జరిగిన తరువాత మాత్రమే కాంట్రాక్టర్కు డబ్బు ఇవ్వాలని చెప్పారు. పాఠశాలలో జరిగే పనులకు ఇసుకను సమకూర్చడానికి సంబంధిత పంచాయతీరాజ్ అధికారులతో అంచనాలు తీసుకుని తనకు నివేదిక పంపితే సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చి ఇసుకను ఉచితంగా అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీరోజు నీరు అందించాలన్నారు. పైపులైన్ల లీకేజీలు, ఇతరత్రా సమస్యలు ఏర్పడితే ముందుగానే గ్రామస్తులకు తెలియజేయాలన్నారు. పంచాయతీల్లో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి డీపీఓ నారాయణరావు, డీఈఓ రాంకుమార్ పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలి.. సీఎస్ శాంతికుమారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, ధాన్యం కొనుగోళ్లు, ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో శుక్రవారం సచివాలయం నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 117 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 16,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకనూ దాదాపు 45 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 13 మిల్లులు ఓపీఎంఎస్ ద్వారా కేటాయించామన్నారు. మిల్లర్లతో ఎలాంటి సమస్య లేదని, ఏజెన్సీతో చర్చించి, తొందరలోనే పూర్తిస్థాయిలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీఓ నారాయణరావు, డీసీఎస్ఓ నర్సింగరావు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు కలెక్టర్ భవేష్మిశ్రా -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
భూపాలపల్లి: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం తన చాంబర్లో విద్య, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, సమాచార, మున్సిపల్, విద్యుత్, వైద్య, రవాణా, పోస్టల్, ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,015 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 426 మంది, మొత్తం 1,441మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రూట్ల వారీగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంచాల ని, తాగునీరు, గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం ఉండవద్దన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దేవరాజం, డీఈఓ రాంకుమార్, డీపీఓ నారాయణరావు, డీఎంహెచ్ఓ మధుసూద న్, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు -
తీరని నష్టం
భూపాలపల్లి రూరల్/కాటారం/మల్హర్/గణపురం/కాళేశ్వరం/రేగొండ: రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. భూపాలపల్లి మండలంలో గురువారం రాత్రంతా కురిసిన వర్షానికి కమలాపూర్, నాగారం, నందిగామ, గొర్లవీడులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మల్హర్ మండలం తాడిచర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కొయ్యూరులో ధాన్యం తడిసింది. వరద నీరు కుప్పల కిందికి చేరింది. గాలివాన బీభత్సానికి మల్లారం శివారులోని పొలంలో నిర్మించుకున్న షెడ్డు రేకులు ఎగిరిపోయాయి. గణపురం మండలం నగరంపల్లిలో వరిపంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కాటారం మండలంలో రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. పలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై, పొలాల్లో, కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. రంగయ్యపల్లిలో వర్షానికి వరి పంట నేలకొరిగింది. మహదేవపూర్ మండలం మెట్పల్లిలో కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. శుక్రవారం వర్షపాతం వివరాలు (మి.మీ) మహదేవపూర్ 20.6 పలిమెల 8.2 మహాముత్తారం 12.4 కాటారం 19.4 మల్హర్ 14.2 చిట్యాల 14.2 టేకుమట్ల 13.4 మొగుళ్లపల్లి 13.2 రేగొండ 39.8 గణపురం 47.2 భూపాలపల్లి 23.6 రెండురోజులుగా వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం -
భూములు ఇవ్వం..
మొగుళ్లపల్లి: న్యూ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇవ్వబోమని మొగుళ్లపల్లి మండల బాధిత రైతులు సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులతో ఆర్డీఓ మంగీలాల్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటుచేశారు. సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. దీంతో తాము భూములు ఇవ్వబోమని రైతులు సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ రేటు ప్రకారం భూములకు ధరలు నిర్ణయించడం రైతులను మోసం చేయడమేనన్నారు. భూమికి బదులు భూమి ఇప్పించాలని రైతులు కోరారు. బలవంతంగా రోడ్డు నిర్మాణం చేపడితే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ సునీత, ఎస్సై అశోక్ ఆర్ఐ సురేందర్రెడ్డి ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. తమ భూములు ఇవ్వబోమని, సర్వే ఆపాలంటూ రైతులు ఆర్డీఓకు వినతిపత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
డెంగీ నివారణ చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: డెంగీ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య కోరారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో వైద్యారోగ్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డెంగీ వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాధి ప్రబలిన సమయంలో తప్పని జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమలు కుట్టకుండా ఇప్పటి నుంచే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽధికారిణి డాక్టర్ ఉమాదేవి, వైద్యాధికారులు, సిబ్బంది డాక్టర్ రోహిణి, రాజయ్య, లక్ష్మణ్, రమేష్, ఆలీం, బృంద, శ్రీదేవి, శ్యామ్ప్రసాద్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: లక్ష్మిబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్యాలియర్ 2024–25 డిప్లొమా, పీజీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జ్ డీవైఎస్ఓ సీహెచ్ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిప్లొమో, పీజీ ప్రవేశాల అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ సూరం జగన్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్సీవీటీ విధానంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 14 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జూన్ 10వ తేదీలోపు గడువు ఉందని పేర్కొన్నారు. ఇసుక క్వారీ పనుల అడ్డగింత పలిమెల: మండలంలో పంకెనలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు గురువారం పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనుషులతో ఇసుకను తీయాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తులు ఇసుక క్వారీలో పనులు కల్పించాలని పనులను అడ్డుకున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో వివిధ గనుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపడుతున్నారని ఐఎన్టీయూసీ బ్రాంచీ ఉపాధ్యక్షుడు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియా నూతన జీఎం బాధ్యతలు స్వీకరించిన తరువాత అందరినీ సమన్వయం చేయాల్సిన అధికారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ నిబంధనలు పాటించకువండా బదిలీలు చేస్తున్నారని చెప్పారు. ఏరియా వర్క్షాపు నుంచి సింగరేణి ఏరియా ఆస్పత్రి, కేఎల్పీలకు బదిలీ చేస్తున్నారన్నారు. ఏకపక్షంగా బదిలీలు చేయడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజేందర్, సమ్మిరెడ్డి, అశోక్, మధుకర్రెడ్డి, రాములు పాల్గొన్నారు. ఉద్యోగులకు డీఏ సొమ్ము చెల్లించాలి హన్మకొండ: ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డీఏల సొమ్ము వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ డీఏల విడుదలపై చర్చించాలని పేర్కొన్నారు. ఒకేచోట 3 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అన్ని కేడర్ల నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సాధారణ బదిలీలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ రెమ్యునషన్ సమానంగా ఇవ్వలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకై నా సమానంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య శిబిరం వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోదాపురం, తిప్పాపురం గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎదిర వైద్యాధికారి భవ్యశ్రీ గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కలిపాక, బోదాపురంలో ఇద్దరు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జూన్ 21 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), పింపుల్ ట్రీట్మెంట్, హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, సారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు. వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం : శ్రీ శైలి బ్యూటీపార్లర్, మొదటి అంతస్తు, భూషణం కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, హనుమకొండ చౌరస్తా, హనుమకొండ. సెల్ : 95055 14424 ఫీజు : రూ.3 వేలు -
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని అనాథ బాలికలు, తల్లిదండ్రులు వదిలేసిన బాలికలు, బాలసదనంలో చదివిన బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాలికలు, పాలిటెక్నిక్ కోర్సులు చదివేందుకు శ్రీదుర్గాభాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్ వారు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 2024–25 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో 60 సీట్లు, డిప్లొమా ఎలక్ట్రికల్స్లో 60సీట్లు, డిప్లమా కంప్యూటర్ ఇంజనీరింగ్లో 60 సీట్లు, డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 60 సీట్లు ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో సమర్పించాలని లేదా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్లో సమర్పించాలని కోరారు. -
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి రూరల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కొనుగోలుకు సంబంధించి డాటా ఎంట్రీ చేయని కొనుగోలు కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీచేయాలన్నారు. రాబోయే 15 రోజులు చాలా కీలకమని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్భాస్కర్, డీఆర్డీఓ నరేష్, పౌర సరఫరాల అధికారి నర్సింగరావు, జిల్లా సివిల్ సప్లయీస్ సంస్థ మేనేజర్ రాఘవేందర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, మార్కెటింగ్ శాఖ అధికారి కనక శేఖర్, రైస్ మిల్లర్లు సంఘం సభ్యులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలపై దృష్టిపెట్టాలి భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాలని కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి స్థల సేకరణ, మహదేవపూర్–సిరోంచ జాతీయ రహదారి నిర్మాణానికి సీఏ ల్యాండ్, మీ సేవా కేంద్రాల దరఖాస్తులు, ధరణి సమస్యలు పరిష్కారంపై తహసీల్దార్లతో కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశపు హాలులో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్, ఈడియం శ్రీకాంత్, తహసీల్దార్లు పాల్గొన్నారు. నాణ్యమైన యూనిఫాంలు అందించాలి కాటారం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంలు అందించాలని కలెక్టర్ భవేష్మిశ్రా మహిళాసంఘాల సభ్యులకు సూచించారు. కాటారం మండలకేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో జీవనజ్యోతి మహిళా సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న యూనిఫాంల స్టిచ్చింగ్ ప్రక్రియను గురువారం కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల కొలతల ఆధారంగా యూనిఫాంలు కుట్టాలని.. నాణ్యమైన మెటీరియల్ వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పోతుల్వాయి, బయ్యారం ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ నరేష్, సీఎంఓ కిషన్రావు, తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ ఉపేంద్రయ్య, పీఆర్ డీఈఈ సాయిలు, మహిళా సంఘం అధ్యక్షురాలు, సభ్యులు ఉన్నారు.కలెక్టర్ భవేష్మిశ్రా -
బాధ్యతలు స్వీకరించిన హాస్టళ్ల డైరెక్టర్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల డైరెక్టర్గా ఫార్మసీ కళాశాల డీన్ ఆచార్యులు గాదె సమ్మయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సేవలు పారదర్శంగా అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా సమ్మయ్యను అధ్యాపకులు డాక్టర్ ఎల్పీ.రాజ్కుమార్, సూర్యనారాయణ, రాజ్కుమార్, బ్రహ్మయ్య, సురేష్, మధుకర్, రాంచందర్, డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్, రాధిక, ఉషాకిరణ్మయి, స్వప్న, లక్ష్మి అభినందించారు. -
అధికారుల పర్యటనకు ఏర్పాట్లు
భూపాలపల్లి: ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం మన జిల్లాకు వస్తున్నారని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్మిశ్రా సూచించారు. ఈ నెల 20నుంచి 24వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బుధవారం ఐడీఓసీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 27మంది అధికారులు 5 రోజుల పాటు జిల్లాలోని భూపాలపల్లి మండలం గొర్లవీడు, కాటారం మండలం గంగారం, మహదేవపూర్ మండలం కాళేశ్వరం, రేగొండ మండలం కొడవటంచ, గణపురం మండలం చెల్పూరు గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తారని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పధకాలపై అధికారుల బృందం అధ్యయనం చేస్తుందన్నారు. అవే గ్రామాల్లో అధికారులు బసచేయాల్సి ఉన్నందున, బసతో పాటు భోజన సౌకర్యాల కల్పనలో లోటుపాట్లు రాకుండా చూడాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వస్తున్నారని, మన ప్రాంతంపై వారికి అవగాహన తక్కువగా ఉంటుందన్నారు. గ్రామాల్లో పరిశీలించే అంశాలపై ఎంపీడీఓలు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అధికారుల బృందానికి చూపించాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నందున అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఈ పర్యటన పర్యవేక్షణకు డీపీఓ నారాయణరావును నోడల్ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ భవేష్మిశ్రా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇనిస్టిట్యూట్ ట్రైనింగ్ మేనేజర్ కుమారస్వామి, డీపీఓ నారాయణరావు, డీఆర్డీఓ నరేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, డీఏఓ విజయ్భాస్కర్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎన్నికకు ఏర్పాట్లు చేయాలి.. ఈ నెల 27వ తేదీన జరుగనున్న వరంగల్– ఖమ్మం–నల్లగొండ పట్టభద్రల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అదనపు ఎన్నికల అధికారి లోకేష్కుమార్ సూచించారు. బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి అదనపు సీఈఓ సర్పరాజ్ అహ్మద్తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్కుమార్ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ భవేష్మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో 8వేల మంది పురుషులు, 4,535మంది మహిళలు మొత్తం 12,535మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 20 జంబో బాక్సులు, 1,679 పెద్ద బాక్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది నియామక ప్రక్రియ రేపటి వరకు పూర్తి చేసి మాస్టర్ ట్రైనర్లతో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ భవేష్మిశ్రా -
అవగాహన ఏది..?
భూపాలపల్లి రూరల్: పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహించే రైతుచైతన్య యాత్రలు నాలుగేళ్లుగా నిర్వహించడం లేదు. దీంతో సాగుపై రైతులకు అవగాహన కొరవడింది. నకిలీ విత్తనాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షలు, ఏ పంటలు వేయాలనే వాటిపై రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మరో పది రోజుల్లో వానాకాలం సాగుకు రైతుల్లో అయోమయం నెలకొంది. రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి పొందడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్యలను వ్యవసాయశాఖ చేపట్టాల్సి ఉంది. ప్రతీ సంవత్సరం వానాకాలంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు చైతన్యయాత్ర పేరిట గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేయాల్సిఉండగా.. కొన్నేళ్లుగా వీటిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఏ పంట వేసుకోవాలనే విషయాలు తెలవని రైతులంతా మూస పద్ధతిలో వరి, పత్తి, మిర్చి మొక్కజొన్న, పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఈ సాగు విధానం వలన ఇటీవల కాలంలో తెగుళ్ల బెడదతో పత్తి, మిరప పంటలో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి భూసార పరీక్షల ఆవశ్యకత, పంటల మార్పిడి, పంటలను ఆశించే చీడపీడల నివారణ, వ్యవసాయం నష్టపోయినప్పుడు పాడిపశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధకశాఖ అందిస్తున్న రాయితీలు, విత్తనోత్పత్తికి సంబంధించిన తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్సవకేంద్రాలుగా రైతు వేదికలు.. రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు అనువుగా ఉండేందుకు గత ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్లుగా విభజించి క్లస్టర్కు ఒక రైతు వేది కను నిర్మించింది. కానీ నాలుగైదు గ్రామాలకు కలి పి ఒక రైతు వేదిక ఉండటంతో అధికారులు రైతు వేదిక ఉన్న గ్రామాల్లో నలుగురు, ఐదుగురు రైతులతో తూతూ మంత్రంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.అటకెక్కిన మన తెలంగాణ–మన వ్యవసాయం నాలుగేళ్లుగా రైతుచైతన్య యాత్రలు కరువు వానాకాలం సాగుకు అన్నదాత సిద్ధం -
కొనుగోలు కేంద్రాల పరిశీలన
మహాముత్తారం: భూపాలపల్లి మండలం దీక్షకుంట, నందిగామ, పందిపంపుల, మహాముత్తారం మండలం రేగులగూడెం, మీనాజీపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఎత్తైన ప్రదేశంలో కల్లాలను ఏర్పాటు చేసుకుంటే దాన్యం తడువకుండా ఉంటుందని రైతులకు సూచించారు. ధాన్యం తడువకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రవాణా చేసేందుకు అవసరమైన సంఖ్యలో వాహనాలను సమకుర్చుకోవాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు సూచించారు. -
రైతులు ధైర్యంగా ఉండాలి
గణపురం: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోవడంతో పాటు పొలాల్లోని వరి నెలకొరిగి ధాన్యం నేలరాలిందని ఈ విషయంపై రైతులు ధైర్యంగా ఉండాలని ప్రతీ ధాన్యంగింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని తడిసిన వరి ధాన్యాన్ని ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలతో నియోజక వర్గంలో కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యంతో పాటు పంట పొలాల్లోని వరి నేల కొరిగి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తడిసిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. అందుకు కావాల్సిన చర్యలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు కూడా ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టార్ఫాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
భూపాలపల్లి అర్బన్: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో వినియోగించిన ఈవీఎంలను మంగళవారం తెల్లవారు జామున వరంగల్కు తరలించారు. జూన్ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని ఈవీఎంలను భద్రపరిచేందుకు వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని 317 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను భారీ కంటైనర్లో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో భారీ భద్రత మధ్య తరలించారు. నియోజకవర్గ ఓట్లను వరంగల్ ఎనుమాములలో లెక్కించనున్నారు. -
ఓటుకు దూరంగా..
నియోజకవర్గంలోని ఓటర్ల వివరాలుభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు. నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, గణపురం, మొగుళ్లపల్లి, రేగొండ, గొరికొత్తపల్లి, శాయంపేట మండలాల్లో 2,76,752 మంది ఓటర్లు ఉండగా సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1,87,395 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగితా 89,357 మంది ఓటు హక్కు వినియోగించుకోకుండా దూరంగా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు సైతం అధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు. కాని మధ్య వయస్సు కలిగిన వారే అధికంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడం శోఛనీయం. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82శాతం పోలింగ్ నమోదు కాగా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 67.71 శాతమే నమోదైంది. ప్రతీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధంగా పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతోంది. మున్సిపాలిటీలో 49శాతమే.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డులలో 47 పోలింగ్ బూత్లు ఉన్నాయి. పట్టణంలో 53,035 మంది ఓటర్లు ఉన్నారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో 26,396 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 13,687, మహిళలు 12,706, ఇతరులు ముగ్గురు మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో పట్టణంలో 49శాతమే పోలింగ్ నమోదైంది. పట్టణం నుంచి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల నిమిత్తం వరంగల్, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లి చదుకుంటున్న వారు ఉంటారు. వారిలో కొంత మంది ఓటు వేయడానికి రాకపోగా పట్టణంలో ఉన్న వారు సైతం ఓటు వేయనట్లుగా కనిపిస్తోంది. ఇందుకు కొంత అధికారుల వైఫల్యం కూడా కారణంగా ఉన్నట్లు చర్చసాగుతోంది. కాలనీలు మారిన వారు ఓటు మార్పిడి చేసుకోకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని జాబితాలో నుంచి తొలగించకపోడం, ఉన్నవారికి పోల్ చీటీలు పంపిణీ చేయకపోవడంతో వారి పోలింగ్ బూత్ ఎక్కడో తెలియక కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉన్న వారు ఉన్నారు. పట్టణంలోని 15వ బూత్లో మొత్తం 1,149 మంది ఓటర్లు ఉండగా కేవలం 376 మంది మాత్రమే ఓటు వేశారు. ఈ బూత్లో 32శాతం మంది ఓటర్లు మాత్రమే ముందుకు వచ్చారు. అదే విధంగా ప్రతీ బూత్లో 40 నుంచి 50 శాతం వరకే ఓటు శాతం నమోదయ్యింది. పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసినప్పటికీ, అధికారులు విస్తృతంగా ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ పోలింగ్శాతం ఏమాత్ర పెరగలేదు.మొత్తం ఓటర్లు 2,76,752 పోలైన ఓట్లు 1,87,395 మహిళలు 94,292 పురుషులు 93,097 ఇతరులు ఆరుగురుపోలింగ్ కేంద్రాలకు వెళ్లని 89వేల మంది నియోజకవర్గంలో ఫైనల్గా 67.71శాతం పోలింగ్ భూపాలపల్లి పట్టణంలో అత్యల్పంగా ఓటింగ్ మున్సిపాలిటీ పరిధిలో 49శాతమే.. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సమష్టి కృషితో ఎన్నికలు విజయవంతం ● హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ భవేష్మిశ్రా భూపాలపల్లి: ప్రజలు, అధికారుల సమన్వయం, సమష్టి కృషితోనే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంపై కలెక్టర్ భవేష్మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి 13వ తేదీ వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతీ ఒక్కరిని అభినందించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. పోలింగ్ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకే అయినప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని తెలిపారు. అందువల్ల గత పార్లమెంట్లో కంటే ప్రస్తుతం అధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని తెలిపారు. ఉపాధ్యాయులపై దాడి అమానుషం భూపాలపల్లి అర్బన్: నారాయణఖేడ్ జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్, రవీందర్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. సిబ్బందికి వచ్చే డబ్బులు ఇవ్వాలని ఆర్డీఓను సంప్రదించగా వారిపై లాఠీచార్జ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఎన్నికల సిబ్బందికి అన్ని జిల్లాల్లో సమాన గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల నిబంధనల ఆసరాగా చేసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తూ తక్కువ గౌరవ వేతనం ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓపీవోలకు తక్కువ డబ్బులు ఇచ్చారని వివరించారు. జిల్లా అధికారులు పున:పరిశీలన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తడిసిన ధాన్యం
మహాముత్తారం: కిష్టాపూర్లో వరదకు కొట్టుకుపోయిన వరిధాన్యం భూపాలపల్లి రూరల్: ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జిల్లాలో పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, నేరేడుపల్లి, నాగారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు తిప్పలు పడుతున్నారు. నత్తనడకన ధాన్యం కొనుగోలు.. జిల్లాలో 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు కేవలం 11,580 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనిని బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. పూర్తిస్థాయిలో నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాతావారణం చల్లబడింది. ఆదివారం రాత్రి భారీ వర్షం వడ్లు ఆరబెట్టుకునేందుకు రైతుల తిప్పలు అపార నష్టం మహాముత్తారం: అకాల వర్షానికి మండలంలోని కిష్టాపూర్, నల్లగుంట మీనాజీపేట, నిమ్మగూడెం, మహాముత్తారం, కొనంపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. కనుకునూర్, రెడ్డిపల్లి, సింగంపల్లి, పోలారం, గండికామారం, సింగారం తదితర గ్రామాల్లో వరిపొలాలు నేలకొరిగాయి. -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. అయితే పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిల్చున్న కలెక్టర్ ఓటేసిన కలెక్టర్, ఎస్పీ భూపాలపల్లి అర్బన్: సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కలెక్టర్ భవేష్మిశ్రా, ఎస్పీ కిరణ్ఖరే ఓటు హక్కును వినియోగించుకున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్నగర్లో 79వ పోలింగ్స్టేషన్లో కలెక్టర్ భవేష్మిశ్రా, ఎస్పీ కిరణ్ఖరే దంపతులు క్యూలైన్లో నిల్చొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. మనం వేసే ఓటు భవిష్యత్ను నిర్దేశిస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం అవుతున్నామని తెలిపారు. -
విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో 33 కేవీ ఫీడర్, 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆరు స్తంభాలు, రెండు ట్రాన్స్ఫార్మర్లు నెలకొరిగాయి. 23 ఇన్సులేటర్లు దెబ్బతినగా, 10 లైన్లు తెగి కింద పడ్డాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి అన్ని ప్రాంతాల్లో సరఫరా పునరుద్దరించామని భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అందించడానికి కృషిచేసిన ఉద్యోగులకు సిబ్బందికి ఎస్ఈ అభినందనలు తెలిపారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి స్వయంగా కార్పొరేట్ కార్యాలయం నుంచి లోడ్, విద్యుత్ సరఫరా మానిటరింగ్ చేస్తూ ప్రతి సర్కిల్లో అధికారులతో అనుక్షణం వారికి సలహాలు, సూచనలు చేస్తున్నారన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24గంటలు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలకు, ఫిర్యాదులు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబరు 1800 425 0028 కు లేదా 1912కు ఫోన్ చేయాలని సూచించారు. -
అకాల వర్షానికి ఆగమాగం
మహాముత్తారం: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం కురిసిన వర్షానికి అన్నదాతలు ఆగమాగమయ్యారు. మహా ముత్తారం, కోనంపేట, కిష్టాపూర్, మీనా జిపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడువకుండా ఉండేందుకు పరదాలు కప్పారు. మీనాజిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం కుప్పలపై కప్పడానికి పరదాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాటారంలో భారీ వర్షం కాటారం: కాటారం మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులు వీచాయి. అనంతరం సుమారు మూడు గంటల పాటు వర్షం ఏకదాటిగా కురిసింది. ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిపోయింది. ముందస్తుగా ధాన్యం కుప్పలపై రైతులు పరదాలు కప్పినప్పటికీ ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పోలింగ్ సిబ్బంది ఇక్కట్లు ● సెల్పోన్స్ లైట్ల వెలుతురులే దిక్కు ● ఏర్పాట్లు చేయని అధికారయంత్రాంగం కాళేశ్వరం: గాలిదుమారంతో కూడిన భారీ వర్షం కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగడంతో పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మహదేవపూర్ మండలం పరిధిలోని కాళేశ్వరం, మజీద్పల్లి, మద్దులపల్లి, పలుగుల, అన్నారం, మెట్పల్లి గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సాయంత్రం మొదలై రాత్రి వరకు కురిసింది. ఆరున్నర గంటల నుంచి ఏకదాటిగా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షంతో విద్యుత్ అంతరాయం కలిగి ఆందోళనకు గురయ్యారు. దీంతో సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో చిమ్మచీకటిలో సెల్ఫోన్స్ వెలుతురులే దిక్కు కావడం గమనార్హం. పోలింగ్ కోసం పేపర్ వర్క్స్ మొత్తం సెల్ఫోన్స్ వెలుతురుతో చేశారు. భోజనాలు కూడా అదే వెలుతురు నీడలో చేశారు. దోమలతో రాత్రంతా కుస్తీ పట్టాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులను జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమని రాత్రి గడిపారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం -
ఎన్నికలకు సహకరించాలి
● ఎస్పీ కిరణ్ఖరే భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నేడు జరిగే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లాలోని ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎస్పీ కిరణ్ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. వెయ్యి మంది కానిస్టేబుళ్లు, 3 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్లతో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.47,80,160 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 3,770 లీటర్ల లిక్కర్ సీజ్, 451మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8 లైసెన్స్ కలిగిన ఆయుధాలను డిపాజిట్ చేశారని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి చర్యలకు ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి భయం లేకుండా ఓటు ఉన్న ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు సిద్ధం.. ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు భూపాలపల్లి అర్బన్: నేడు (సోమవారం) జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. ఓటర్లు ఒత్తిడికి గురికాకుండా క్యూ పద్ధతిలో నిల్చొనే విధంగా కర్రలతో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం తెలిసేలా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 8 మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
పోలింగ్ ప్రక్రియకు పకడ్బందీ చర్యలు
వరంగల్: వరంగల్ లోక్సభ స్థానానికి సోమవారం జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఏనుమాముల మార్కెట్ యార్డ్లో చేపట్టిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్తో కలిసి ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో 230 పోలింగ్ కేంద్రాలకు 21 రూట్లలో, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లలోని 279 పోలింగ్ కేంద్రాలకు 37 రూట్లలో సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ప్రతి బస్సుకు పోలీసుల వాహనాలు ఎస్కార్ట్గా వెళ్లాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామన్నారు. పోలింగ్ శాతం అధికంగా నమోదయ్యేలా ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఆశించిన విధంగా అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పంపిణీ, ఏర్పాట్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏఆర్ఓలు అశ్విని తానాజీ వాఖేడే, సిదం దత్తు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు, విజయ్సాగర్తో పాటు రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట పంపిణీ ప్రశాంతం ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
అధికారులు మాకు సహకరించట్లేదు.. భూ వివాదంపై మల్లారెడ్డి కామెంట్స్
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement