-
వైభవంగా వసంతసేవ, పూర్ణాహుతి
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామికి యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, పండితులచే వైభవంగా వసంతసేవ నిర్వహించారు. అనంతరం కృష్ణానదిలో స్వామిఅమ్మవార్లకు చక్రతీర్థం స్నానాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు దోపోత్సవ పూజలు పూర్తిచేసిన హోమశాలలో రెండురోజులుగా చేపట్టిన మహాలక్ష్మీ హోమాన్ని పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్ దంపతులు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, లక్ష్మనాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, బ్రహ్మాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
రాకేష్రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలి
సూర్యాపేట: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సువెన్ కంపెనీలో పట్టభద్రులైన ఓటర్లను కలిసి రాకేష్రెడ్డికి ఓటువేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చామన్న కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 90 శాతం దొడ్డురకం వడ్లు పండుతుంటే సన్నవడ్లకే బోనస్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాకేష్రెడ్డిని గెలిపించి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటాలన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలపాలని కొందరు పిచ్చి కలలు కంటున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు చూడడానికి సోనియా మాత్రమే కాదు ఎవరైనా రావచ్చన్నారు. కానీ ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానిస్తామనడం కరెక్ట్ కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రామచందర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తాహెర్పాషా, సుంకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
‘అమ్మ ఆదర్శ’ పనులు వేగవంతం
సూర్యాపేట టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్య మైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. జిల్లాలో 950 పాఠశాలలు ఉండగా గత ప్రభుత్వం 329 పాఠశాలల్లో మన ఊరు – మనబడి పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టింది. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీలను రద్దు చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను నియమించి అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇందుకోసం జిల్లాలో మౌలిక వసతులు, సౌకర్యాలు లేని 536 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ.10.87కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు ప్రతి మండలానికి రూ.3లక్షల చొప్పున 23 మండలాలకు రూ.69లక్షలు విడుదలయ్యాయి. పాఠశాలల్లో బాత్రూంలు, తాగునీరు, విద్యుత్, తరగతి గదులు, ప్రహరీలకు మరమ్మతులు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో ఇప్పటివరకు 165 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా పాఠశాలల్లో వివిధ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. బడులు తెరిచే నాటికి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. పనుల పురోగతిపై నిత్యం పర్యవేక్షణ ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. నిత్యం ఏదో ఒక పాఠశాలను సందర్శించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జూన్ 10వ తేదీ లోగా పనులు పూర్తి చేయాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఫొటోలు పంపాలని స్పష్టం చేశారు. ఇటు పర్యవేక్షణ బృందాలు, అటు కలెక్టర్, డీఈఓ నిత్యం పర్యవేక్షణ చేస్తుండడంతో పనులు వేగవంతమయ్యాయి. ఫ జిల్లాలో 536 పాఠశాలలు ఎంపిక ఫ ఇప్పటివరకు 165 పాఠశాలల్లో పనులు పూర్తి ఫ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి వసతులు కల్పించేలా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నాం. చాలా వరకు పాఠశాలల్లో 90శాతం వరకు పనులు పూర్తయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
27న సెలవు
భానుపురి (సూర్యాపేట): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున ఓటుహక్కు వినియోగానికి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు ప్రత్యేక సాధారణ (క్యాజువల్) సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకటరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక క్యాజువల్ సెలవు మంజూరు చేయాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం లేకపోవడంతో డ్యూటీ షిఫ్టుల వారీగా మార్పులు చేయాలని సూచించారు. విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు మునగాల(కోదాడ): గ్రామాల అభివృద్ధితోపాటు విధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేయొద్దని డీపీఓ సురేష్కుమార్ అన్నారు. శనివారం ఆయన మునగాల మండలం గణపవరం గ్రామంలో పర్యటించారు. సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠథామాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట మండల పంచాయతీ అధికారి భూపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దేవిరెడ్డి వీరారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి చిలుకూరు: ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి కోరారు. శనివారం చిలుకూరులో నిర్వహించిన ఎస్టీయూ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు వారు హాజరై మాట్లాడారు. ఉపాద్యాయులు నిత్య విద్యార్థుల్లాగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సుధాకర్, పున్న గణేష్, శ్రీనివాస్, నాయకులు బందం వెంకటేశ్వర్లు, ఎలగొండ శ్రీనివాస్, సురగాని లింగయ్య, కొండా రామాంజనేయులు, బీఆర్సీ.రెడ్డి, వీరేంద్రవర్మ, భిక్షం, చంద్రశేఖర్, అంజయ్య, నాగరాజు, శివయ్య, గోవిందునాయక్, రామిరెడ్డి, రాజేష్, నర్సింహారావు, బూర వెంకటేశ్వర్లు, కస్తూరి అప్పారావు, గోపి, సురేష్, సాదె వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గొల్లకుర్మలకు నగదు బదిలీ చేయాలి అర్వపల్లి: గొల్ల కుర్మలకు నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జె వినయ్యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీఎంపీఎస్ ఆధ్వర్యంలో శనివారం అర్వపల్లిలోని పశువైద్యశాల ఎదుట ధర్నా నిర్వహించారు. రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం డీడీలు తీసి ఏడాది దాటినా ఇంతవరకు నగదు బదిలీ చేయలేదని చెప్పారు. గొల్లకుర్మలు అప్పులు తెచ్చి డీడీలు తీసి ప్రభుత్వానికి చెల్లించారని, వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు గుడిపాటి సత్తయ్య, వజ్జె జయమ్మ, భయ్య భద్రమ్మ, వజ్జె మల్లమ్మ, వజ్జె వెంకన్న, వినోద్, అవిలమ్మ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక కాన్పులు జరగాలి
ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం సూర్యాపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధిక కాన్పులు జరిగేలా ఆరోగ్య వైద్యసిబ్బంది కృషిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కోటాచలం అన్నారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వివిధ విభాగాల వైద్య నిపుణులు, ప్రజారోగ్య ప్రోగ్రామ్ అధికారులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని, ఇక్కడ నిపుణులైన డాక్టర్లచే సాధారణ ప్రసవాలు చేస్తారన్నారు. అవసరం లేకున్నా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసి డెలివరీలు చేస్తారని, దీంతో గర్భిణులకు మున్ముందు అనారోగ్య సమస్యల బారిన పడతారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన గర్భిణులను మధ్యవర్తులతో తమ ఆస్పత్రులకు తరలిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనునయి, గర్భిణుల వైద్య విభాగాధిపతి ప్రొఫెసర్ ఆది సుజాత, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జయ శ్యామసుందర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
సూర్యాపేట
యాదాద్రిలో భక్తులకు అస్వస్థత యాదాద్రి ఆలయ క్యూకాంప్లెక్స్లో ఫ్యాన్లు పనిచేయక శనివారం భక్తులు ఉక్కపోతతో అస్వస్థతకు గురయ్యారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది.7- 8లోఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024గరిష్టం / కనిష్టంభారీగా నల్లబెల్లం పట్టివేత అక్రమంగా తరలిస్తున్న టన్ను నల్లబెల్లం, 600 కేజీల పటికను కోదాడ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. - 8లో -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం
సూర్యాపేట : పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంటుందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం అని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లాకేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గ పట్టభద్రుల ఓటర్ల సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. అధికార యావ తప్పా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై పట్టింపు లేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని, ఆరు ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రాకపోతేనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. ఉద్యోగ క్యాలెండర్ పేరుచెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ను ఆరునెలలైనా వేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత లేని పార్టీ అని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక కాదు.. ప్రభుత్వంలో పిల్లి అన్నారు. చెప్పిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, 4వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రపంచ దేశాలు శభాష్ మోదీ అంటుంటే ప్రతిపక్షాలు సన్నాయినొక్కులు నొక్కుతున్నాయని దుయ్యబట్టారు. ప్రేమేందర్రెడ్డి ని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నేతి సుభాష్రెడ్డి, కేఎస్ రత్నం, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మున్సిపల్ మాజీచైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జనార్దన్రెడ్డి, కడియం రామచంద్రయ్య, మన్మథరెడ్డి, శ్రీలతరెడ్డి, రుక్మారావు, చలమళ్ల నర్సింహ పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటర్ల సమ్మేళనంలో ఈటల రాజేందర్ -
కల్యాణం.. కమనీయం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని గురువారం తెల్ల వారు జామున 5గంటలకు వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. అర్చకులు క్రిష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు, పద్మనాభా చార్యులు, బ్రహ్మ చార్యులు, ఫణిభూషణమంగాచార్యులు బృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్ర,బెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు ,తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో కల్యాణతంతును ముగించారు. కల్యాణతంతును వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు గుండ్లపల్లి భక్తులు ఎదుర్కోళ్ల దివిటీలు సమర్పించగా , పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామస్తులు, సూర్యాపేట జిల్లా లింగగిరి వాస్తవ్యులు శ్రీస్వామి, అమ్మవార్లకు వార్షికంగా మెట్టెలు, మంగళసూత్రం ,ఉత్తర జంధ్యాలు, వస్త్రాలు, తలంబ్రాల బియ్యం సమర్పించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీకేశవతీర్థ ఆశ్రమంలో కల్యాణమూర్తులకు గరుడవాహనసేవ నిర్వహించారు. అదేవిధంగా నృసింహోపాసనం పద్యపఠనం, వేదపఠనం, భక్తిసంగీతం, శ్రీసీతారామకళ్యాణం హరికథ, శ్రీమట్టపల్లి క్షేత్రమహత్యం బుర్రకథ చేపట్టారు. భక్తిసంగీతవిభావరి అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మీసమేతంగా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్రెడ్డి, సీఐ చరమందరాజు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేందర్కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో వైఽభవంగా శ్రీలక్ష్మీనృసింహుడి తిరుకల్యాణం భారీగా తరలివచ్చిన భక్తులు -
ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
నాగారం : ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద బుద్ధ ధ్యానవనంలో గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా వైశాఖ బుద్ధపూర్ణిమ వేడుకలను గురువారం బోధిసత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య మాట్లాడారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. అనంతరం బౌద్ధక్షేత్రంపై ఉన్న మహాస్థూపం వద్ద అఖండ జ్యోతిని వెలిగించి దమ్మదీక్ష, బుద్ధవందన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్, గోవర్ధన్, కొత్తగట్టు మల్లయ్య, నాతి వెంకన్న, అశోక్రెడ్డి, కిరణ్కుమార్, కమటం శోభ, విజయ్, లింగమల్లు పాల్గొన్నారు. నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో..ఫణిగిరిలో వైశాఖ బుద్ధ పూర్ణిమ వేడుకలను నవయాన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షుడు రాంబాబు, డీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు, పీపీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య, బాలకృష్ణ, మణికుమారి, తిరుపత్తి, నాగరాజు, మల్లేష్, కరుణాకర్, రమేష్, వెంకటేష్, బాబేష్ పాల్గొన్నారు. -
నేడు కోదాడకు బండి సంజయ్ రాక
కోదాడరూరల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కోదాడలో జరిగే సమ్మేళనానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్ రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమ్మేళనానికి పట్టభద్రులతో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు చొరవ చూపాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపునకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ అసెంబ్లీ కో ఆర్డినేటర్ విద్యాసాగర్, కనగాల వెంకటరామయ్య, అక్కిరాజు యశ్వంత్, నూనె సులోచన, యాదా రమేష్, వంగవీటి శ్రీనివాసరావు, బొలిశెట్టి కృష్ణయ్య, బంగారు కవిత పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి
సూర్యాపేటటౌన్ : ‘జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్లు తగ్గించాలి.. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ కాన్పులు చేస్తే ఆస్పత్రులను అనుమతులు రద్దు చేస్తాం’ అని డీఎంహెచ్ఓ కోటా చలం హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సిజేరియన్ సెక్షన్ ఆడిట్ కమిటీ సమావేశంలో ఆయన సమీక్షించి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి సిజేరియన్ సెక్షన్ కాన్పులపై ఆడిట్ జరుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా కడుపుకోత ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రుల నుంచి వివరణ కోరుతామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించిన సిజేరియన్ సెక్షన్ కాన్పుల ప్రతి కేస్ షీట్ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రొఫెసర్లు డాక్టర్ అమితకుమారి, డాక్టర్ దమయంతి క్షుణ్ణంగా పరిశీలించి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమీక్షలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్యామ్సుందర్ పాల్గొన్నారు.23 ఎస్పిటి 47 డీఎంహెచ్ఓ కోటాచలం -
ఓ వైపు సీజ్.. మరోవైపు అనుమతి!
కోదాడ: అర్హతలేని డాక్టర్లతో వైద్యం చేయిస్తున్న కొన్ని ప్రైౖవేట్ ఆస్పత్రుల విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో వాటిని తనిఖీ చేసి సీజ్ చేసిన అధికారులు నెలరోజులు తిరగకుండానే అర్హతగల డాక్టర్ వచ్చాడంటూ మళ్లీ అనుమతులు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ వ్యవహారం కోదాడలో చర్చనీయాంశమైంది. అసలు విషయం ఏమిటంటే..గత నెలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోదాడలోని కొన్ని ప్రైవేట్ వైద్యశాలలను తనిఖీ చేసి సీజ్ చేశారు. విదేశాలలో చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కాకుండా, రిజిస్టర్ నంబర్ లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని, మరి కొందరు ఎంబీబీఎస్ డిగ్రీకి బదులు ఎండీ అని రాసుకుంటున్నారని చెబుతూ ఆయా వైద్యశాలలను జిల్లా వైద్యాధికారి కోటాచలం ఆధ్వర్యంలో సీజ్ చేశారు. నెల రోజులు తిరగక ముందే ఒక వైద్యశాలను తిరిగి తెరవడానికి అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇక్కడ పని చేసిన వైద్యులకు అర్హతలు లేకపోవడంతో సీజ్ చేశామని వారికి నోటీసులు కూడా ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అర్హతలు లేని వైద్యుల చేత ఐదు సంవత్సరాలుగా వైద్యశాల నిర్వహిస్తుంటే జిల్లా అధికారులు ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కనిప్రశ్న. ఇదే వైద్యశాల నిర్వాహకులు అర్హతలున్న డాక్టర్ వచ్చాడని దరఖాస్తు చేసుకున్నారని అందుకే అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. మొక్కుబడిగా తనిఖీలుఅర్హతలేని వైద్యుల చేత నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కొంత మంది అధికారుల, సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇలాంటి వైద్యశాలలఫై ఫిర్యాదులు రావడంతో అఽధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి కొన్నింటిని సీజ్ నెలరోజులు తిరగక ముందే మళ్లీ అనుమతులు ఇస్తూ వస్తున్నారు.ఇదీ కోదాడలో ఐదేళ్లగా నిర్వహిస్తున్న ప్రైవేట్ వైద్యశాల. ఇందులో ఇద్దరు అర్హత లేని వైద్యులు పనిచేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో గత నెల18న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. కానీ నెల రోజులు కాకముందే తిరిగి తెరవడానికి ఆ వైద్యశాల నిర్వాహకులకు అనుమతులు ఇచ్చారు. గతంలో అర్హతలు లేని వైద్యులు పని చేయడంతో ఈ వైద్యశాలను సీజ్ చేశామని ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యుడి పేరుతో దరఖాస్తు చేసుకోవడంతో అనుమతిచ్చామని, గతంలో పని చేసిన వైద్యులకు నోటీసులు జారీ చేశామని చెప్పడం గమనార్హం. ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో అధికారుల తీరుపై అనుమానాలు ఐదేళ్లుగా అర్హత లేని డాక్టర్లతోనే నిర్వహణ కనీస చర్యలు తీసుకోకుండా మళ్లీ అనుమతులుఅర్హతలున్న వైద్యుడి పేరుతో దరఖాస్తు చేశారు కోదాడలోని హుజూర్నగర్ రోడ్డులో ఉన్న న్యూనాగార్జున వైద్యశాలలో ఇద్దరు అర్హతలు లేని వైద్యులు పని చేస్తుండడంతో తనిఖీ చేసి సీజ్ చేశాం. వైద్యశాలకు, వైద్యులకు నోటీసులు జారీ చేశాం. వైద్యశాల నిర్వాహకులు ఎంబీబీఎస్ వైద్యుడి పేరుతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అందుకే అనుమతి ఇస్తున్నాం. మళ్లీ అందులో పాతవారే పని చేస్తుంటే తనిఖీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికలెక్టర్ జోక్యం చేసుకోవాలి అర్హతలేని వైద్యశాలల విషయంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. కోదాడలో జిల్లా ఉపవైద్యాధికారి, మరోజిల్లా స్థాయి అధికారి నివాసం ఉంటున్నారు. వారు కనీసం పట్టించుకోవడంలేదు. అర్హతలు లేని వైద్యులు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – కుదరవల్లి బసవయ్య, సామాజిక కార్యకర్త, కోదాడ -
తప్పును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నం
కోదాడ: చేసిన తప్పును కప్పి పుచ్చుకునే క్రమంలో కోదాడ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు అడ్డంగా దొరికిపోయారు. మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో వేసిన నాలుగు బోర్ల మోటార్లు మాయం అయిన విషయాన్ని ‘ప్రభుత్వ నిధులు హాంఫట్’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో బుధవారం కోదాడ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు ఆగమేఘాల మీద సమావేశం ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ల మద్య నెలకొన్న విభేదాలే గొడవకు కారణమని చెప్పుకొచ్చారు. అధికారుల తప్పిదం ఏమి లేదని, పత్రికలకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం వేసిన బోర్లు ఎండిపోవడంతో వాటిలో ఉన్న మోటార్లు చోరికి గురికాకుండా తెచ్చి స్టోరూంలో ఉంచామని కమిషనర్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి బుధవారం స్టోర్రూం పరిశీలిస్తే రెండు పాత మోటార్లు, ఒక కొత్త మోటారు ఉన్నాయి. బోరు నుంచి తీస్తే అది పాతమోటారుగా ఉండాలి. కానీ స్టోర్రూంలో కొత్త మోటారు ఉంది. అంటే ఒక బోరులో అసలు మోటార్ వేయలేదని తెలుస్తోంది. బోర్ల విషయంలో గొడవ జరగడంతో ఆ కాంట్రాక్టర్ రెండు రోజుల క్రితం ఒక కొత్తమోటారు తెచ్చి స్టోర్రూంలో పెట్టినట్లు సమాచారం. మూడు మోటార్లకు సంబంధించి బోరులో వేసిన పైపులు 60 నుంచి 80 వరకు ఉండాలి. కానీ అక్కడ కేవలం 15 పైపులు ఉన్నాయి.ఎంబీ పరిశీలిస్తే ఎన్ని పైపులు కొన్నది తెలుస్త్తుంది.ప్యానల్ బోర్డులు, వైర్లు, ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మూడు మోటార్లు తెచ్చి స్టోర్రూంలో వేసిన కోదాడ మున్సిపల్ అధికారులు వాటిలో ఒక్కటి మాత్రమే కొత్త మోటారు పైపులు తేవడం మరిచిన సిబ్బంది -
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు నేడు చివరి గడువు
భానుపురి (సూర్యాపేట) : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు శుక్రవారం చివరి గడువు అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు వెల్లడించారు. ఎమ్మెల్సీ పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగుల కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను అదనపు కలెక్టర్ సీహెచ్.ప్రియాకంతో కలిసి గురువారం పరిశీలించి మాట్లాడారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని సూచించారు. ఈనెల 22, 23 తేదీల్లో 182 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసినట్లు తెలిపారు.నేటి నుంచి ఇంటర్ ‘అడ్వాన్స్డ్’ పరీక్షలుసూర్యాపేటటౌన్ : జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం జనరల్లో 5,879 మంది, ఒకేషనల్లో 725 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ 2076 మంది, ఒకేషనల్ 465 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్కు ఒక సీఎస్, డీఓను నియమించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ కృష్ణయ్య తెలిపారు. నేడు పాలిసెట్సూర్యాపేటటౌన్ : పాలిటెక్నిక్ కళాశాల్లో ప్రవేశాలకు పాలిసెట్ను శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్.నర్సింహారావు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లు వేశారు. ఆయన పలు సెంటర్లను పరిశీలించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 2,382 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 11గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 11గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు పెన్సిల్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎరైజర్ తెచ్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన బాల బాలికలకు 2024లో అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు జూలై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిణి వి.వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా మెడల్, సర్టిఫికెట్, ఇతర గిఫ్ట్లు ఉంటాయని, 5 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, ధైర్య సాహసాలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సాంస్కృతిక కళలు వంటి సేవ రంగాలో ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించారు. ఆన్లైన్లో https://awards.gov.in దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతిని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అందించాలని కోరారు. జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలుసూర్యాపేటటౌన్ : జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరుతాయని పేర్కొన్నారు. జిల్లాలో 471 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. వీరి కోసం హుజుర్నగర్ ఉన్నత పాఠశాల, జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి సిబ్బందికి, విద్యార్థులకు, చీఫ్ సూపరింటెండెంట్లకు సెల్ ఫోన్ అనుమతి లేదని పేర్కొన్నారు. -
నేడు విత్తన మేళా..
కంపాసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వరి విత్తన మేళా నిర్వహించనున్నారు.- 8లోరికార్డెడ్ వాయిస్తో ఫోన్కాల్స్ కొందరు అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు రికార్డెడ్ వాయిస్తో కూడిన ఫోన్కాల్స్ చేస్తూ తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఓటర్లకు రోజూ ఐదు నుంచి పది కాల్స్ చేసేలా ఏర్పాట్లు చేశారు. మరికొందరు తమ పార్టీ అభ్యర్థుల తరఫున పట్టభద్రుల ఓటర్లకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థి తరఫున ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో అయితే ఒక్కో వార్డులో 500 లోపే ఓటర్లు ఉన్నందున వారిని గుర్తించడం సులభం కాబట్టి వారిని కలిసి అభ్యర్థించే పని పెట్టుకున్నారు. లేదంటే ఓటరు జాబితాలోని ఫోన్ నంబర్ల ఆధారంగా ఫోన్ చేస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. -
యూనివర్సిటీని ఎంతో అభివృద్ధి చేశా
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీని ఎంతో అభివృద్ధి చేశానని, నల్లగొండ నేలను మరువలేనని ఎంజీయూ మాజీ వీసీ గోపాల్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పదవీ విరమణ సందర్భంగా ఎంజీయూలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పానగల్ పీజీ సెంటర్ అధ్యాపకుఇగా పనిచేసి వీసీగా బాధ్యతలు నిర్వహించడం గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. సిబ్బంది కొరతను అధిగమించి కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని, నూతన భవనాలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, అధ్యాపకులు అంజిరెడ్డి, ఉపేందర్రెడ్డి, రమేష్, ప్రేమ్సాగర్, మద్దిలేటి, అరుణప్రియ, సుధారాణి, రమేష్, ప్రశాంతి, రవి, నారాయణరెడ్డి, రేఖ, అన్నపూర్ణ, కేశవులు పాల్గొన్నారు. -
యూనిఫామ్ కుట్టించడంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
యూనిఫామ్ కుట్టించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఎస్. వెంకటరావు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తో కలిసి స్కూల్ యూనిఫామ్ కుట్టుతున్న తీరుపై సమీక్షించి మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 11,576 యూనిఫామ్ కుట్టించినట్లు తెలిపారు. వచ్చేనెల 2వ తేదీలోపు వందశాతం యూనిఫామ్ కుట్టించి 41,427 మంది విద్యార్థులకు మొదటి జత పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు లో కూడా బాగా పనిచేశారని ట్యాబ్ ఏంట్రీ బాగా చేయడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు అతి తక్కువ సమయంలో పడ్డాయని మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన్ రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డీపీఎంలు, ఏపీఎంలు, స్కూల్ కో ఆర్డినేటర్లు, హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు ఐదు కేంద్రాలు
సూర్యాపేటటౌన్ : ఈ నెల 24న జిల్లా కేంద్రంలో నిర్వహించే పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్.నర్సింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 2,362 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు 10గంటల వరకు చేరుకోవాలని, 11గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోరని పేర్కొన్నారు. ఎడ్సెట్కు నాలుగు కేంద్రాలు నల్లగొండ రూరల్: ఎడ్ సెట్–2024 నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎడ్సెట్ చైర్మన్ గోపాల్రెడ్డి తెలిపారు. కోదాడలో మూడు, నల్లగొండలో ఒక కేంద్రంలో మొత్తం 1,100 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు రాయనున్నట్టు పేర్కొన్నారు. 13 మంది ఓపీఓల సస్పెన్షన్ భానుపురి (సూర్యాపేట) : ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన శిక్షణకు హాజరుకాని 13 మంది ఓపీఓ(అదర్ప్రిసైడింగ్ ఆఫీసర్)లను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు వివరణ సమర్పించాలని ఆదేశించారు. 632.80 అడుగులకు మూసీ నీటిమట్టం కేతేపల్లి: మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం 632.80 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు మూసీలోకి బుధవారం 732 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 632.80 అడుగులకు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ నాటికి ప్రాజెక్టులో నీటిమట్టం 618 అడుగుల కనిష్ట స్థాయికి పడిపోగా, గత 48 రోజుల్లో దాదాపు 15 అడుగుల మేర నీరు ప్రాజెక్టులోకి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నీటిమట్టం 642 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాన్పుల సంఖ్య పెంచాలి నేరేడుచర్ల : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ఓ కోటాచలం ఆదేశించారు. బుధవారం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 62శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సీతామహాలక్ష్మి విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో షోకాజ్ నోటీసులకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. మంగళ, బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కాలేదని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి షోకాజ్ నోటీసులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో వైద్యాధికారుల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఆయన వెంట నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు నాగిని, సౌమ్యశ్రీ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, పట్టభద్రుల సమస్యలు నెరవేర్చేదాకా పోరాటం చేస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రులు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు, జిల్లా అధ్యక్షుడు భాగ్యారెడ్డి, కర్నాటి కిషన్, ఆబిద్, నర్సింహ, లక్ష్మణ్రావు, పరిపూర్ణచారి, శివ, రమేష్, శైలేందర్, ఉపేందర్ పాల్గొన్నారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భకులు పోటెత్తారు. శ్రీస్వామి వారి జయంత్యుత్సవాల సందర్భంగా బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్ జంటనగరాలు తదితర ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, బస్టాండ్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, క్యూలైన్లు వంటి ప్రాంతాలు సందడిగా మారాయి. శ్రీస్వామిని సుమారు 30వేలమందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.35,64,770 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
పీఓలు, ఏపీఓల బాధ్యతలు కీలకం
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఓ, ఏపీఓల బాధ్యతలు కీలకమని కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్. వెంకటరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పీఓలు, ఏపీఓలకు మాస్టర్ ట్రైనర్ రమేష్తో నిర్వహించిన శిక్షణ తరగతులకు అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27వ తేదీ ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలో 51,497 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని, వీరికోసం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ నిర్వహణకు రిజర్వ్తో కలిపి 85 మంది పీఓలు, 85మంది ఏపీఓలు, 170 మంది ఓపీఓలను నియమించినట్లు వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తామని తెలిపారు. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున జంబో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశామన్నారు. గుర్తింపు కార్డు చూపించి.. గ్రాడ్యుయేట్ ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చన్నారు. పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్నుతోనే బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేరుకు ఎదురుగా ఏర్పాటు చేసిన జోన్లో ప్రిఫరెన్స్ ప్రకారం సీరియల్గా నంబర్లు, లేదంటే రోమన్ అంకెలు వేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు సతీష్ కుమార్, అప్పారావు, మధుసూదనరాజు, సురేష్, లక్ష్మానాయక్, ఆర్డీఓ వేణుమాధవ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస రాజు పాల్గొన్నారు.ఫ జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు -
అంగన్వాడీల్లో రిటైర్మెంట్లు
109మంది గుర్తింపు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల వివరాలను జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి 65 నిండాల్సి ఉండగా.. పదో తరగతి మెమో, టీసీ, బోనోఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో వివరాలు సైతం ఉన్నాయి. టీచర్ల వయస్సు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఆయాలు పెద్దగా చదువుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న వివరాలకు ఆయాల ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అప్పటికే అధికారులు సేకరించిన వివరాల మేరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడి రిటైర్మెంట్కు ఐదుగురు టీచర్లు, 104 మంది ఆయాలతో కలిపి మొత్తం 109 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.భానుపురి (సూర్యాపేట): అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 65 ఏళ్లు నిండిన టీచర్కు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో 65 ఏళ్లు నిండిన వారి వివరాలను పంపించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది. దీంతో జిల్లా అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అర్హులైన వారంతా గత నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. వచ్చే నెల చివరిలోగా అర్హులైన వారు ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా తక్కువగా ఇస్తున్నారని కొందరు నిరాశకు గురవుతున్నారు. 1,206 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో సూర్యాపేట, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,206 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 87 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉండగా ప్రధాన సెంటర్లలో టీచర్, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్లలో రిటైర్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో వయస్సు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50వేల బెన్ఫిట్ కల్పిస్తామని ప్రకటించింది. 65 ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాలకు వర్తింపు వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం ఇప్పటికే 109 మంది గుర్తింపు వచ్చే నెల చివరినాటికి ఉద్యోగ విరమణ ప్రక్రియ పూర్తి వయస్సు నిర్ధారణలో కొంత అయోమయం -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
సూర్యాపేటటౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞానవంతుడు, ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్లతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రంథాలయంలో పాఠకులతో మాట్లాడారు. అనంతరం బూత్ లెవల్ ఇన్చార్జ్ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు, సమస్యలపై పోరాడేతత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఇన్నేళ్లుగా ప్రశ్నించే గొంతుక అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మోసగించే గొంతుకగా మారాడని ఎద్దేవా చేశారు. ఓ యూట్యూబ్ చానల్ ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డ మల్లన్న బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. మల్లన్న మీద ఉన్న కేసుల్లో అత్యధికంగా మహిళలు పెట్టినవే అని పేర్కొన్నారు. అవి ఏదో ఉద్యమాల కేసులైనట్టు గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు యువతను మోసగించినవేనని.. ఓ పార్టీ దేవుని పేరుతో రాజకీయాలు చేస్తుందని.. మరో పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో ఉందన్నారు. అందుకే ఆరెండు పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి -
ఎమ్మెల్సీ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పోలింగ్కు 600 పోలింగ్ కేంద్రాలు, మరో 5ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాకు వచ్చిన 5లక్షల బ్యాలెట్ పేపర్లను సంబంధిత జిల్లాలకు పంపించామన్నారు. ఓట్ల లెక్కింపునకు నల్లగొండలోనే సంబందిత కేంద్రంలో 96 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ చందన దీప్తి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఏఆర్వోలు రవికుమార్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం భానుపురి(సూర్యాపేట): ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో ఎస్పీ రాహుల్హెగ్డే, అదనపు కలెక్టర్లు ప్రియాంక, బీఎస్ లతతో కలిసి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, డీపీఓ సురేష్, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఫ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన -
రైతన్నకు బాసట!
భానుపురి (సూర్యాపేట) : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయనుంది. వానాకాలం సీజన్ నుంచే ఈ పథకాన్ని వర్తింప జేయాలని భావిస్తుండగా.. ఇందుకోసం వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం, ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం తదితర వాటితో పాటు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమా పథకాలను అధ్యయనం చేస్తోంది. పదేళ్ల కాలంలో పంటల బీమా పథకాలు పక్కాగా అమలు కాక జిల్లావ్యాప్తంగా రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటల బీమా పథకం ఈ సారి అమలు చేస్తే జిల్లాలో దాదాపు 2.70 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. జిల్లాలో 6.34 లక్షల ఎకరాల సాగు..జిల్లావ్యాప్తంగా 2.70 లక్షల మందికి రైతులు 6.34 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో వరి సాగు 4.65 లక్షల ఎకరాలు ఉండగా రెండోస్థానంలో పత్తి 90వేల ఎకరాల వరకు ఉంటుంది. ఏటా ఏదో రకంగా రైతులు పంటలను నష్టపోతున్నారు. గతంలో అమలు చేసిన పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95శాతం ప్రీమియం చెల్లించగా.. మిగిలిన అయిదు శాతాన్ని రైతాంగం భరించేది. ఈ సమయంలో గ్రామం యూనిట్గా తీసుకోవడంతో పంటలు నష్టపోయిన కర్షకులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పరిహారం పొందడంలో సమస్యలు ఉండటం, పెద్దగా ఉపయోగం ఉండటం లేదనే కారణంతో మొదట్లో అమలు చేసిన గత ప్రభుత్వం.. తర్వాత బీమా పథకాన్ని పక్కన పెట్టింది. పక్కాగా అమలుకు ప్రణాళికలు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించనుందని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. అయితే గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇప్పటికే క్లస్టర్లవారీగా వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న క్రాష్ బుకింగ్ను పరిగణనలోకి తీసుకోనున్నారు. చాలామంది ఈఏఓలు పంట పొలాలకు వెళ్లకుండా రైతులను అడిగి రాస్తుండటం, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పంటల నమోదుపై గొడవలు జరుగుతుండటంతో పంటల బీమాను పకడ్బందీగా అమలు చేయాలంటే బయోమెట్రిక్ తీసుకోవడంతోపాటు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల వారీగా పంటల సాగు అంచనాలు, ప్రీమియం తదితర వాటికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని కోరారు. పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడం, బీమా కంపెనీలను సంప్రదించడం, ప్రీమియాన్ని నిర్ధారించి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో వచ్చే ప్రయోజనాలను వినియోగించుకోవడంతో పాటు రైతులపై ఎలాంటి భారం పడకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్ నుంచే ఉచిత పంటల బీమా అమలు ప్రీమియం మొత్తం చెల్లించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం 2.70 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం -
బంగారం దొంగిలించిన మహిళ అరెస్ట్
కోదాడరూరల్: బస్టాండ్లో ప్రయాణికురాలి నుంచి బంగారం చోరీ చేసిన మహిళను కోదాడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 4వ తేదీన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన తిమ్మారెడ్డి వరమ్మ మునగాల నుంచి కోదాడకు వెళ్లింది. అక్కడి నుంచి చింత్రియాలకు వెళ్లేందుకు బస్టాండ్లో బస్సు ఎక్కి కూర్చున్న ఆమె కొద్దిసేపటి తర్వాత తన బ్యాగు చూసుకోగా అందులో ఉన్న రూ.2లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే కోదాడ పట్టణ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం కోదాడ పట్టణంలోని గోల్డ్షాప్ బజారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి మండలం బుడగుంట గ్రామానికి చెందిన కర్రెద్దుల లలితను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన బంగారంతో పాటు రూ.30వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఆమైపె ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలో 50కి పైగా కేసులు ఉన్నాయని, పలుసార్లు జైలు జీవితం గడిపినట్లు పేర్కొన్నారు. నిందితురాలని పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన పట్టణ సీఐ రంజిత్రెడ్డి, సిబ్బంది సతీష్, యల్లారెడ్డిని సీఐ అభినందించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
- సిరుల విరులు..కొండ చీపుర్లు
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
Advertisement