యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఈఓ భాస్కర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి శివాలయం ఎదుట ప్రత్యేకంగా టికె ట్ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. శని, ఆది వారాలు, సెలవు రోజుల్లో కొండపైన బస్టాండ్లో తాత్కాలిక అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పా టు చేశామని చెప్పారు. హెల్ప్డెస్క్, వేసవి దృష్ట్యా చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిత్య కై ంకర్యాలు, స్వామివారి సంకీర్తనలు భక్తులకు వినిపించేలా ప్రత్యేక దివ్యవాణి ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్యూకాంప్లెక్స్లో వాల్మోటింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులను ఆహ్లాదం పంచేందుకు ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సంగీత, నృత్య సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
8లక్షల మందికి ఉచిత రవాణా సౌకర్యం
ఒక్క ఏప్రిల్లోనే 369 బస్సులను కొండపైకి, కొండ కిందకు 9,825 ట్రిప్పులు నడిపించామని తెలిపా రు. 8లక్షల మంది భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం పొందారని, ఇందులో 70 శాతం మహిళలు, 30శాతం పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆదాయం రూ.15,64,05,949
ఏప్రిల్ నెలలో దేవస్థానానికి వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.15,64,05,949 ఆదాయం సమకూరినట్లు ఈఓ భాస్కర్రావు తెలిపారు. ఇందులో బ్రేక్ దర్శనాల ద్వారా రూ.69,10,200, వీఐపీ దర్శనం రూ.96,50,650, ఆర్జిత సేవలు రూ.1,34,56,805, వ్రతాలు రూ.43,37,300, ప్రసాద విక్రయం రూ.3,05,08,630, హుండీలు రూ.2,33,53,382, విచారణ శాఖ రూ.24,37, 718, ఇతర పూజల ద్వారా రూ.5,58,51,264 వచ్చినట్లు వెల్లడించారు.