-
ఆంజనేయా.. దీవించయ్యా
ఎర్రవల్లిచౌరస్తా: అభయాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా భక్తులు బీచుపల్లికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయస్వామికి ఉదయం పంచామృత అభిషేకం, చౌకిసేవ, బలిహరణం తదితర పూజలు చేశారు. రాత్రి ప్రభోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా వివిద ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కృష్ణానదిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు మట్టి కుండలలో ప్రత్యేక నైవేద్యం వండి ఆంజనేయస్వామికి సమర్పించారు. జాతరను పురస్కరించుకొని ఆలయ పరిసరాల్లో వివిధ అంగళ్లు భక్తుల కొనుగోళ్లతో సందడిగా కనిపించాయి. రంగుల రత్నాలు తదితర వాటి వద్ద చిన్నారులు ఆటలాడుతూ ఉత్సాహంగా గడిపారు. ప్రతి ఏటా మే నెలలో వేలాది మంది భక్తుల నడుమ నాలుగు శనివారాల పాటు జాతర కనులపండువగా సాగుతోంది. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. సరస్వతీదేవి ఆలయంలో కుంకుమార్చన బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రదాన అర్చకులు సరస్వతి దేవికి అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. అదేవిదంగా ఎర్రవల్లి చౌరస్తాలోని శివాంజనేయస్వామి ఆలయంలో ప్రదాన అర్చకులు నర్సింహస్వామి ఆద్వర్యంలో కుంకుమార్చన పూజలను వైభవంగా నిర్వహించగా.. మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక దాసంగాలు బీచుపల్లిలో భక్తుల సందడి -
జొన్న కొనుగోళ్లు..
చివరిదశకు కొనుగోలు చేసిన జొన్న ధాన్యాన్ని లారీలోకి ఎత్తుతున్న హమాలీలు రాజోళి: రైతులు పండించిన తమ జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో, రైతుల ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. గత నెల 27 నుండి మార్క్ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆద్వర్యంలో కొనుగోలు చేపట్టారు. జిల్లాలో ఈ ఏడాది కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రధానంగా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి, వడ్డేపల్లి మండలాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోనే జొన్నల సాగు ఎక్కువగా ఉండటం, రైతులు కూడా తాము పండించిన ధాన్యాన్ని అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తుండటంతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టారు. వడ్డేపల్లి మండలం కొంకల, రాజోళి మండలంలో రాజోళి, పచ్చర్ల గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత నెల 27 నుంచి.. గడిచిన నెల 27 వ తేదీ నుండి జొన్నల కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తాము పండించిన ధాన్యానికి ధ్రువీకరణ పత్రం రాయించుకుని కేంద్రాల వద్ద తమ ధాన్యం విక్రయించారు. క్వింటాకు రూ. 3,180 మాదిరిగా కొనుగోలు చేసిన ప్రభుత్వం నేటి వరకు రైతుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని కేంద్రాలను తెరిచే ఉంచారు. ఇంకా రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు కేంద్రాల వద్ద వీలు ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే తమ ధాన్యం మొత్తం అమ్ముకున్నారని రైతులు అంటున్నారు. కేంద్రాలు గత నెలలో ఏర్పాటు చేసినప్పటికీ, అంతకంటే ముందే ఏర్పాటు చేసి ఉంటే ఇంకా కొంత మేలు జరిగేదని, అప్పటికే పెట్టుబడుల భారంతో రైతులు కొందరు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు గన్నీ భ్యాగుల కొరత కూడా కొంత వేధించింది. సరైన సమయానికి బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రైతులు ధాన్యం కుప్పలుగా పోసుకున్న చోట వర్షాలు వస్తాయనే అనుమానాలు, ఆందోళనతో గ్రామాల్లోకి వచ్చిన ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడంతో ధాన్యం పూర్తిగా అమ్మకాలు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా గత నెల 27న కేంద్రాల ఏర్పాటు జిల్లాలో మొత్తం మూడు కేంద్రాల ద్వారా కొనుగోలు ఇప్పటికీ 17,896 క్వింటాళ్ల ధాన్యం విక్రయించిన రైతులు మిగతా రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన -
సోమవారంతో కొనుగోళ్లు నిలిపేస్తాం
జొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపుగా రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు కూడా రైతులు రాకపోయినా, ఇంకా ఎవరైనా వచ్చి ధాన్యం విక్రయించాలని అనుకున్నా కేంద్రాలు అందుబాటులో ఉంచాం. కానీ ఒకరిద్దరు రైతులు తప్ప మిగతా ఎవరి నుండి స్పందన లేదు. వారి ధాన్యం కూడా తీసుకుంటున్నాం. సోమవారంతో కేంద్రాన్ని మూసేసి, ధాన్యం కొనుగోలు నిలిపేస్తాం. – గౌరీ నాగేశ్వర్, డీఎం, మార్క్ఫెడ్ ● -
జోగుళాంబ సన్నిధిలో అన్నామలై
జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామవారి ఆలయాలను శుక్రవారం రాత్రి 8:30 గంటలకు తమిళనాడు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ చిన్నకృష్ణయ్య, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్శర్మ ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. రాత్రి పవళింపు సేవ పూర్తి కావడంతో సాధారణ దర్శనం మాత్రమే వారికి లభించింది. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఇదిలాఉండగా, ఆలయానికి దర్శనార్థం వచ్చిన భక్తులు అన్నామలైతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే విధంగా బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్, మరియు బీసీ వెల్పేర్ జాయింట్ సెక్రటరీ తిరుపతి సైతం ఆలయాన్ని దర్శించుకున్నారు. -
పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి
గద్వాల రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న వివిధ రకాల పనులను పాఠశాలల పున:ప్రారంభం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు చేపట్టాల్సి పనులను త్వరతితగతిన పూర్తి చేయాలన్నారు. వారం రోజులలో అన్ని పాఠశాలలో 50శాతం పనులు పూర్తికావాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులపై ఎప్పకప్పుడు పర్యవేక్షణ చేస్తూ పనులు త్వరగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహన్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి
అలంపూర్: ఉర్సుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని గద్వాల ఆర్డీఓ రాంచందర్ అన్నారు. శుక్రవారం షా–అలీ–పహిల్వాన్ ఉర్సు నిర్వహణపై అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గద్వాల ఆర్డీఓ రాంచందర్, మండలంలోని ఆయా శాఖల అధికారులు, దర్గా డెవలప్మెంట్ కమిటి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేది నుంచి జూన్ 2వ తేది వరకు షా–అలీ–పహిల్వాన్ ఉర్సు జరగనున్నట్లు తెలిపారు. 30న రాత్రి గంధోత్సవం, 31వ తేదిన సర్ ముభారక్ దర్గాలో చిన్న కిస్తీలు, జూన్ 1వ తేదిన ధడ్ ముభారక్ దర్గాలో పెద్ద కిస్తీ పోటీలు, జూన్ 2వ తేదిన మహిళల ఉర్సు ఉంటుందని కమిటి సభ్యులు తెలిపారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకండా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ ఆయా శాఖల అధికారులను సూచించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు, భక్తుల ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యం, తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవులు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డిప్యూటి తహశీల్దార్ సురేష్, ఆర్ఐలు మాసుంబాష, కరీం, ఎస్ఐ నాగరాజు, ఆర్టీసీ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
మానవపాడు: గ్రామీణ స్థాయిలో యువకులు క్రీడల పట్ల ఆసక్తి కనబర్చి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని, క్రీడలు మానసిక, శరీరక ఉల్లాసాన్ని ఇస్తాయని డీవైఎస్ఓ బి.ఎస్ ఆనంద్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్క్యాంపు క్రీడలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా వాలీబాల్ ఆడుతూ రాష్ట్రస్థాయి వరకు ఎదిగిన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నారని గుర్తు చేశారు. నేడు వారంతా పోలీసులుగా, ఉపాధ్యాయులుగా, విధులు నిర్వహించడం సంతోషకరమన్నారు. సమ్మర్ క్యాంపు పూర్తి అయిన తర్వాత రాబోయే రోజుల్లో మానవపాడు వేదికగా టోర్నమెంట్లను నిర్వహిస్తామని తెలిపారు. సమ్మర్క్యాంపు నిర్వహించి తమ గ్రామస్థులకు సహకారించిన జిల్లా అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉన్నత విద్య ఉత్తిదే..!
శాంతినగర్: మారుమూల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య కలగానే మిగులుతోంది. జిల్లాలోని 12 మండలాల్లో కేవలం 7 మండలాల్లో మాత్రమే జూనయర్ కళాశాలలు ఏర్పాటుచేశారు. మిగతా 5 మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటుచేయాలని ఆయా మండలాలకు చెందిన విద్యావేత్తలు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నా కళాశాలల మంజూరు కలగానే మిగిలింది. ప్రధానంగా జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో వడ్డేపల్లి, రాజోళి, ఉండవెల్లి, ఇటిక్యాల మండలాలు, గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు. దీంతో ఆయా మండలాల్లోని నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చేరే ఆర్థిక స్థోమత లేక.. ఆయా గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు పదో తరగతి తరువాత ఇంటర్ చదవాల్సి వుంటుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేనందున సుదూర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలల్లో చదవడానికి ఆర్థిక స్థోమత అడ్డురావడం, బాలికలను సుదూర ప్రాంతాలకు పంపకపోవడంతో చదువులు మధ్యలోనే వదిలిపెట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక పాఠశాల విద్య వరకే చదువులు కొనసాగించి అనంతరం ముగిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించాలంటే మొదట ఇంటర్ తొలిమెట్టు. ఇంటర్ కళాశాలలు ఏర్పాటు చేయకుండా కొన్ని చోట్ల డిగ్రీ కళాశాలలు నెలకొల్పారు. దీంతో పదో తరగతి చదివిన విద్యార్థులు అవాక్కవుతున్నారు. ఇంటర్ చదవందే డిగ్రీ ఎలా చదివేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు కొన్ని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఇతర మండలాలకు బాలికలను పంపాలంటే తల్లిదండ్రులు జంకుతున్నారు. అసలే సమాజంలో బాలికలకు భద్రత కరువవడంతో చదివిన కాడికి చదివించి ఓ అయ్యచేతిలో పెడదామనే ఆలోచనల్లో తల్లిదండ్రులు వున్నారు. సమీపంలో ఇంటర్ కళాశాలలు వుంటే చదివిద్దామనే సంకల్పం వున్నా సుదూర ప్రాంతం, అభద్రతాబావం వెంటాడుతుండటంతో బాలికల చదువులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. ఉద్యమాలు చేసినా ఫలితం శూన్యం రాజోళి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటుచేయాలని ఎన్నో ఉద్యమాలు చేపట్టాము. పోస్టుకార్డు ఉద్యమంనుండి నిరాహార దీక్షలు చేపట్టాం. తహసీల్దార్ నుండి కలెక్టర్, మంత్రులు, విద్యాశాఖ కమిషనర్లను కలిసినా ఫలితం లేకపోయింది. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల పరిస్థితులు గమనించి వచ్చే విద్యాసంవత్సరానికై నా రాజోళి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరుచేసి నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకు దోహదపడాలి. – గాజుల ఈశ్వరయ్య, కళాశాలల సాధన సమితి కన్వీనర్, రాజోళి ప్రైవేటు కళాశాలకు పంపుతున్నాం.. రాజోళి మండల కేంద్రంలో మేము ఉన్నప్పటికీ జూనియర్ కళాశాల ఏర్పాటుచేయలేదు. మా కూతురును శాంతినగర్లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివిస్తున్నాను. ప్రతి రోజు శాంతినగర్కు వెళ్లి రావాలంటే రవాణా ఖర్చులతోపాటు కళాశాల ఫీజుల మోతతో సతమతమవుతున్నాను. రాజోళిలో జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి మారుమూల గ్రామాల విద్యార్థులకు ఉన్నత విద్యకు దోహదపడాలి. – అడివిస్వామి, రాజోళి మండల కేంద్రాల్లో కలగానే జూనియర్ కళాశాలల ఏర్పాటు జిల్లాలోని 12మండలాలకు 7 మండల కేంద్రాల్లోనే కళాశాలలు.. సుదూర ప్రాంతాలకు వెళ్లలేక పేద విద్యార్థులు చదువులకు దూరం కళాశాలల సాధన కోసం అధికారులు చుట్టూ విద్యాభిమానుల ప్రదక్షిణలు -
25న ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25న జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లాస్థాయి బాల, బాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, ఎల్.రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్– 13, 15, 17, 19 విభాగాల బాల, బాలికలు, సీనియర్ పురుషులు, మహిళలు, వెటరన్స్లో అండర్–35, 45, 55, 65 విభాగాల్లో ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు కార్య నిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్కు రిపోర్టు చేయాలని, సెల్ 98480 85211, 98669 28835 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు ఇవ్వాలి
గద్వాల అర్బన్: ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ప్రైవేటు వ్యాపారులు విచ్చలవిడిగా రైతులను దోచుకుంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. బుధవారం గద్వాల మండలంలోని లత్తీపురం, బీరేల్లీ, బస్సల్ చేరువు తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసి ధాన్యానికి ప్రభుత్వం 45నుంచి 50శాతం రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. కోనుగోలు కేంద్రాలు దగ్గర క్వింటాకు 4కేజీల తరుగు తీయడం, గన్ని బ్యాగుల కొరత, వడ్లు కాంట, తూకం వేసిన తర్వాత మిల్లులకు తరలించే వరకు రైతులు పడిగాపులు కాయడం, హమాలీ చార్జీలు తదితర విధానాల వల్ల రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి సంబంధించిన దాన్యం ఏపీ, కర్ణాక వంటి రాష్ట్రలకు వెళ్తుతుందన్నారు. ప్రభు త్వం పంట డబ్బులు వేయాలన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
గద్వాల రూరల్: అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా, అదేవిధంగా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అఽన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్ హాలులో జెడ్పీ చైర్పర్సన్ సరిత అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు ఎజెండాలో పొందుపర్చిన అంశాలు, శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలకు తీసుకుంటున్న పరిష్కార చర్యల గురించి మాట్లాడారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సదరమ్ ధ్రువపత్రాలు పొందేందుకు స్లాట్బుకింగ్ సమయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి వలంటీర్ల నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించాలని, వైద్యపరీక్షలను కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారులు పాలన ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. అయిజ నుంచి మేడకొండ వరకు అసంపూర్తిగా కొనసాగుతున్న రహదారిని త్వరగా పూర్తిచేయాలని, ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్నందున ప్లాస్టిక్ వాడాకాన్ని పూర్తిగా కట్టడి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, సీఈవో కాంతమ్మ, జెడ్పీటీసీలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో ప్రతిభచాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి శరత్చంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. శరత్చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. నిరంతరం సాధన చేస్తే క్రీడల్లో విజయం సాధించవచ్చన్నారు. హన్మకొండలో వచ్చే నెల 6, 7 తేదీల్లో రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్బాబు, కోచ్లు ఆనంద్, సునీల్, శ్రీనివాసులు, సీనియర్ పీఈటీలు సి.శ్రీనివాస్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
గద్వాల రూరల్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ శృతిఓఝా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లాలో పర్యటించారు. గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బీఎం సంతోష్తో కలిసి సందర్శించారు. అనంతరం ఆమె అక్కడున్న రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులున్నాయా అడిగారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్చేసి రైస్మిల్లులకు తరలించాలన్నారు. అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో డాటా నమోదు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. అకాల వర్షాలు కురుసే అవకాశాలున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా అవసరమైన టార్పాలిన్లు, గన్నీబ్యాగులు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రబీసీజన్లో 70కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. ప్రస్తుతం 10కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపడుతున్నామన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా ధాన్యం ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలు అధికారుల వరకు ప్రతిఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, సివిల్సప్లూ డీఎం విమల పాల్గొన్నారు. -
సాగుకు సమాయత్తం
గురువారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2024వివరాలు 8లో uజిల్లాలో 3,400 ఎకరాల్లో కూరగాయల సాగు అంచనా సలహాలు పాటించాలి గడిచిన ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు బాగా తగ్గింది. ఈఏడాది వాతావరణ పరిస్థితులు బాగా ఉంటాయని బావిస్తున్నాం. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా కూరగాయల సాగు అంచనా వేశాము. అయితే కూరగాయలు సాగు చేసే రైతులు ఉద్యానశాఖ అధికారుల, సిబ్బంది సలహలు, సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. – ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో కూరగాయల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. గడిచిన ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. అధిక ఉష్ణోగ్రతల వల్ల వానాకాలం సీజన్లో కూరగాయల సాగు సగానికి తగ్గగా.. యాసంగిలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది అయిన కలిసి వస్తుందన్న ఆశతో కూరగాయల రైతులు వానాకాలం సీజన్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుచోట్ల విత్తనాలు.. మరికొన్ని చోట్ల నార వేశారు. బోర్లు, బావుల్లో జలమట్టం తగ్గడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఈసీజన్లో 3,400 ఎకరాల్లో కూరగాయల సాగు అయ్యే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో కూరగాయల సాగు.. జిల్లాలో సాదారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్లతో కలిపి ఏటా దాదాపు 10వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్, క్యాబేజీ ధరూర్ మండలంలో బెండ, టమాట మల్దకల్ మండలంలో చిక్కుడు, టమాట, బీర, సోరకాయ, బెండ, కాకర అయిజలో బెండ, చిక్కుడు వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, ఉల్లి, అలంపూర్లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాట గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటతో ఆయా మండలాల్లో ఆకుకూరలు సైతం సాగు చేస్తారు. తమకున్న పొలంలో రెండు నుంచి ఐదు ఎకరాల్లో బోర్లు, బావుల కింద రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. తగ్గిన నీటి వనరులు.. ఏటా వానాకాలం సీజన్లో 5000 నుంచి 5500 ఎకరాల్లో, యాసంగిలో 4వేల నుంచి 4500 ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతున్నట్లు ఉద్యానశాఖ రికార్డులు చెబుతున్నాయి. గడిచిన ఏడాది వానాకాలం సీజన్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, అధిక ఉష్ణోగ్రతలు ఉండటం మూలంగా కేవలం 2858 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు అయ్యాయి. వానాకాలంలో ఆశించిన స్థాయిలో పడకపోగా, సగటు వర్షపాతం ఏమండలంలోనూ నమోదు కాలేదు. దీని ఫలితంగా భూర్భ జలాల నీటి మట్టాలు తగ్గి పోయాయి. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా 2943 ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతాయని అంచనా వేశారు. ఏటా యాసంగిలో కనీసం 4వేల ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా గడిచిన యాసంగిలో 2943 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా. కేవలం 1,250 ఎకరాల్లో సాగు అయ్యింది. న్యూస్రీల్ నీటి మట్టాల తగ్గుదలతో ఈ ఏడాది తగ్గనున్న సాగు గడిచిన ఏడాది తప్పని నిరాశ సమాయత్తం అవుతున్న రైతు కూరగాయల సాగుకు జిల్లాలో రైతులు సమాయత్తం అవుతున్నారు. కూరగాయలుకు సంబంధించి వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను గడిచిన కొద్దిరోజులుగా ఇక్కడి రైతులు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రైతులు కూరగాయల విత్తనాలను కర్నూలు, రాయచూర్లకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే గడిచిన 15రోజుల్లో నాలుగు సార్లు మోస్తారు వర్షాలు కురవడంతో క్యాబేజీ, క్యాలిఫ్లవర్ వేసే రైతులు పలు చోట్ల నారకోసం విత్తనాలు వేశారు. ఇంకా కొన్నిచోట్ల నార సిద్దం అయ్యింది. మరికొన్ని చోట్ల విత్తనాలు వేశారు. అయితే గడిచిన ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో చాలాచోట్ల బోర్లు, బావుల జల మట్టాలు తగ్గిపోయాయి. దీనివల్ల ఈసారి 3,400 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు అయ్యే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తే అధికారుల అంచనా కరెక్టే అని తెలుస్తోంది. ఎందుకంటే బోర్లు, బావుల కింద మాత్రమే కూరగాయలు సాగు చేస్తారు. అయితే ప్రస్తుతం నీటి లభ్యత ఆధారంగా మూడు ఎకరాలు ఉన్న ఎకన్నర, నాలుగు ఎకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాల్లో మాత్రమే కూరగాయలు వేస్తున్నారు. కాగా సకాలంలో వర్షాలు కురిసి, జలమట్టాలు పెరిగితే సాగు పెరిగే అవకాశం ఉందని, ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు. -
బెట్టింగ్ సూత్రదారులెవరో?
గద్వాల క్రైం: గుట్టుచప్పుడు కాకుండా జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. కాలనుగుణంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆన్లైన్ ద్వారా పందెలు వేస్తూ.. రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. పోలీసులు వీటిని నిలువరించడంలో పూర్తిస్థాయిలో విఫలమవుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఈ నెల 20న ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను జిల్లా టాస్క్ఫోర్స్ విభాగం ఛేదించడంతో వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ యాప్ల ద్వారా.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు మార్చి 22న ప్రారంభమైనప్పటి నుంచి వివిధ ఆన్లైన్ యాప్ల ద్వారా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల, శాంతినగర్, వడ్డేపల్లి, మానపాడుకు చెందిన యువకులు, వ్యాపారులు, ఉద్యోగులు భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారంలో కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి పందెలు కాశారు. చివరకు అప్పుల ఊబిలో పడ్డారు. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితుడి వద్ద రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం, ఇంటి స్థలం పత్రాలను తాకట్టు పెట్టి సుమారు రూ.60 లక్షల నగదును అప్పుగా తీసుకొని క్రికెట్ బెట్టింగ్ పందెలు కాశాడు. చివరకు ఉన్న నగదు అంతా బెట్టింగ్లో పొగొట్టుకున్నాడు. అయితే నగదు పొగొట్టుకున్న వ్యవహారం ఇంటి కుటుంబ సభ్యులకు తెలియడంతో, కుటుంబ సభ్యులు నేరుగా ఎస్పీ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనపై మొరపెట్టుకున్నారు. దీంతో ఎస్పీ రితిరాజ్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దింపి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా గుట్టుగా బెట్టింగ్ వ్యవహారం నడుస్తున్నా.. కనీసం పోలీసులు నిఘా పెట్టకపోవడం వెనుక అనుమానాలు నెలకొన్నాయి. పోలీసుల వైఫల్యం కారణంగా టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. బెట్టింగ్ మాఫియాను నిలువరించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతుందో లేదో త్వరలో తేలనుంది. వెలుగులోకి వచ్చేనా.. జిల్లా కేంద్రంలో బెట్టింగ్ వ్యవహారాన్ని గుర్తించిన టాస్క్ఫోర్స్ బృందాలు ఇంకా ఎంత మంది ఈ వ్యవహారంలో ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అసలైన బెట్టింగ్ నిర్వాహకులను వెలుగులోకి తీసుకోస్తారా..? ఈ నలుగురితో చేతులు దులుపుకొంటారా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అసలు సూత్రదారులు వెలుగులోకి వస్తారా..? లేదా అనేది సందేహాలకు తావిస్తోంది. బెట్టింగ్ వ్యవహారంపై 2017 సంవత్సరంలో అప్పటి ఎస్పీ విజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించి బెట్టింగ్ నిర్వాహకులను కట్టడి చేసి రిమాండ్కు తరలించారు. పాత నేరస్తులైన అయిజ, గద్వాల, శాంతినగర్, ధరూరు, అలంపూర్, మానపాడుకు చెందిన కీలక ముఠా సభ్యులను గుర్తించి రూ.కోట్లలో జరుగుతున్న బెట్టింగ్పై ఉక్కుపాదం మోపారు. స్తబ్దుగా ఉన్న బెట్టింగ్ వ్యవహారం మళ్లీ జిల్లాలో పురుడు పోసుకోవడం కొసమెరుపు. అయితే పోలీస్ అదుపులో నలుగురు వ్యక్తులు పలుకుబడిన ఉన్న వ్యక్తులు కావడంతో వారిని తప్పించేందుకు పెద్దస్థాయిలో పైరవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో జిల్లాలో హాట్టాపిక్గా మారింది. జిల్లాలో మరికొంత మంది.. మంగళవారం ఉదయం నుంచి జిల్లా పోలీస్ యంత్రాంగం మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతోంది. వారి బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, ఇందుకు సహకరిస్తున్న ముఠా సభ్యులు ఎవరనే అంశాలపై కూపీ లాగినట్లు తెలిసింది. ఈ విషయంపై పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ను వివరణ కొరగా.. బెట్టింగ్కు పాల్పడిన వారిని సోమవారం అదుపులోకి తీసుకొని, మరికొంత మంది అనుమానాస్పద వ్యక్తులను సైతం విచారణ చేపడుతున్నామన్నారు. ఇందులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలియజేశారు. జిల్లాలో ఆన్లైన్ మాఫియా పోలీసుల అదుపులో బెట్టింగ్ రాయుళ్లు విచారణలో నిజానిజాలు వెలుగులోకి.. -
‘ఫీజుల దోపిడీని అరికట్టాలి’
గద్వాల అర్బన్: ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పీడీఎస్యూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యను మార్కెట్లో సరుకుగా మార్చేశారని, తద్వారా పేదలకు నాణ్యమైన విద్య అందకుండా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలన్నారు. లేకుంటే పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్, నాయకులు శ్రీనివాసులు, చందు, రవితేజ, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి
మల్దకల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ సూచించారు. మంగళవారం మల్దకల్ రైతువేదికలో వ్యవసాయ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులతో నేరుగా మాట్లాడారు. పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు ఆశించే చీడపిడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే భూమి సారవంతంగా ఉంటుందన్నారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఎ సంగీతలక్ష్మి, ఏఓ రాజశేఖర్, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లపై బీజేపీది కపట ప్రేమ
గద్వాల అర్బన్: రిజర్వేషన్లపై బీజేపీది కపట ప్రేమ అని, అధికారం కోసం అడ్డగోలు అవాస్తవాలను ప్రచారం చేస్తోందని సీపీఎం రాష్ట్ర నాయకుడు ఎంవీ రమణ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఐదు దశలు ముగిసే నాటికి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజల దృష్టి మరల్చేందుకు తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రిజర్వేషన్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన కుల గణన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నియామకంలో, వారి పని విధానంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సిబ్బంది నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. విధులపై బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తున్న వైద్యులు, సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని, అయిజ మున్సిపాలిటీలో పెద్ద వాగు బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని, వానాకాలం సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఎస్ అధునికీకరించి చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, నాయకులు రేపల్లే దేవదాసు, వీవీ నర్సింహ, ఉప్పేరు నర్సింహ, నర్మద, ఈదన్న ఉన్నారు. సీపీఎం రాష్ట్ర నాయకులు ఎంవీ రమణ -
24న పాలిటెక్నిక్ప్రవేశ పరీక్ష
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 24న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తునట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 11 గంటలకు పరీక్ష జరుగుతుందని విద్యార్థులను 9.30 గంటలకు పరీక్ష కేంద్రంలోనికి వదులుతామన్నారు. విద్యార్థులు హాల్టికెట్ బ్లాక్పెన్సిల్, ఎరేజర్, బ్లాక్పెన్నును వెంట తీసుకురావాలనాన్నారు. హాల్టికెట్లు ఆన్ఆలైన్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
అంతా నా ఇష్టం..!
మంగళవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2024వివరాలు 8లో uఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం గట్టు: గట్టులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శశిధర్రెడ్డి కోరారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానునున్నట్లు తెలిపారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటుగా ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి పాసైన విద్యార్థులు అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేరుశనగ క్వింటా రూ.6,711 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 192 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6711, కనిష్టం రూ.3621, సరాసరి రూ.5631 ధరలు పలికాయి. అలాగే, 29 క్వింటాళ్ల ఆముదాలు రాగా, గరిష్టం రూ. 5480, కనిష్టం రూ. 4630, సరాసరి రూ. 4630 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 10336, కనిష్టం రూ. 10216, సరాసరి ధర రూ. 10336 ఽలభించాయి. 648 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2451, కనిష్టం రూ. 1756, సరాసరి ధర రూ. 1819 ధరలు వచ్చాయి. 11 క్వింటాళ్ల వరి (హంస) రాగా, గరిష్టం రూ. 1819, కనిష్టం రూ. 1766, సరాసరి ధర రూ. 1819 పలికాయి. మొక్కజొన్న క్వింటాలు రూ.2,283 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న గరిష్టంగా రూ.2,274, కనిష్టంగా రూ.2,039 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు గరిష్టంగా రూ.5,607, కనిష్టంగా రూ.5,540, ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,481, కనిష్టంగా రూ.1,901 ధరలు పలికాయి. 24 నుంచి ఇంటర్సప్లిమెంటరీ పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, సీఎస్లు, డిపార్ట్మెంటల్ అధికాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మొదటి సంవత్సరం 6,585 మంది, రెండో సంవత్సరం 3,719 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్సు సెంటర్ల మూసివేత, 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఈసీ సభ్యులు ఉమామహేశ్వర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు గాలికి.. సొంత ఆస్పత్రిపైనే మమకారం చర్యలు తీసుకుంటాం జిల్లా ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించే వైద్యులు, ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇష్టానురీతిలో వ్యవహరిస్తున్న వైద్యుడిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై కూడా విచారణ జరుపుతాం. అదేవిధంగా త్వరలోనే మెడికల్ కాలేజీ మొదలుకానున్నండంతో ఎక్కువమంది వైద్యులు రానున్నారు. దీంతో పేషంట్లకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపడతాం. – బీఎం సంతోష్, కలెక్టర్ గద్వాల రూరల్: జిల్లా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ.. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడడంతోపాటు.. కీలక స్థానంలో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు.. ఆయా విధులను గాలికొదిలేశాడు. ఒంటి గంట వరకు హడావుడిగా జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వర్తించి.. అనంతరం సొంత ఆస్పత్రికి వెళ్లి అక్కడ సేవలు షురూ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి పరీక్ష ప్రైవేట్ ల్యాబ్లకు రాయడంతోపాటు.. అత్యవసర సేవలపైనా నిర్లక్ష్యం వహిస్తుండడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు వైద్యుడు అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే రోగులు హడలెత్తిపోతున్నారు. ఈయన నిర్వాకంతో మిగతా వైద్యులకు విధినిర్వహణ సంకటంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలు, పేషంట్ల మరణాలపై ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ గద్వాల జిల్లాసుపత్రిని సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేయడం.. తీరుమార్చుకోకుంటే వేటుతప్పదని హెచ్చరించడంతో సదరు వైద్యుడి అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వైద్యో నారాయణ హరి వైద్యుడు రోగుల పాలిట కనిపించే దైవం. అందుకే ఎంతపెద్ద వారైన వైద్యం కోసం డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు తలవంచి దండం పెడతారు. అయితే జిల్లా ఆసుపత్రిలో కీలకమైన విధులు నిర్వర్తించే వైద్యుడు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వైద్యవృత్తికే కలంకం తీసుకొస్తున్నారనే విమర్శలు బాహటంగా వినిపిస్తున్నాయి. వైద్యమంటే కేవలం డబ్బులు దండుకునే వ్యాపారంగా మార్చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే అపవాదు ఆయనపై ముందు నుంచి వినిపిస్తుంది. చదవింది జనరల్ సర్జన్ అయినా.. తన ప్రైవేట్ ఆస్పత్రిలో గైనకాలజిస్టు అవతారమెత్తి ప్రసూతి ఆపరేషన్లు చేస్తూ రెండు చేతుల దండిగా సంపాదిస్తున్నారు. తను చేసిన తప్పుడు వైద్యానికి బలైపోయిన ప్రాణాలకు ఖరీదు కడుతూ దర్జాగా తప్పించుకోవడంలో ఆయనకు వెన్నతో పెట్టిన వైద్యం. ఇలా చాలాసార్లు ఖరీదు కట్టి తప్పించుకుంటూ దర్జాగా తిరుగుతున్నాడు. వైద్యం అందక ప్రాణాల మీదికి.. నిత్యం వివిధ రోగాలతో బాధపడుతూ వైద్యం కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులు ఇక్కడి వైద్యసేవలపై బెంబేలెత్తిపోతున్నారు. రోగం బాగుచేసుకోవటానికి వస్తే ప్రాణాలే పోయేలా ఉన్నాయంటూ హడలెత్తి పారిపోయో పరిస్థితి దాపురించిందంటే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నెలకొన్న వైద్యసేవల పరిస్థితికి అద్దం పడుతుంది. ఇటీవల కాలంలో గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన ఇద్దరు పేషంట్లు అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వస్తే అక్కడ వైద్యులు లేకపోవడంతో సకాలంలో అందాల్సిన వైద్యం లభించక ప్రాణాలు పోయిన పరిస్థితి. దీంతో బాధిత కుటుంబాలు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. న్యూస్రీల్ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి గద్వాల క్రైం: విద్యార్థిదశ నుంచి ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. దానిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని ఎస్పీ రితిరాజ్ అన్నారు. సోమవారం 10వ తరగతిలో ప్రతిభ చాటిన పోలీసు సిబ్బంది పిల్లలతో ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పట్టుదలతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకరావాలన్నారు. విద్యతో పాటు సామాజిక స్పృహను అలవర్చుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు పలు పుస్తకాలను అందజేశారు. వైద్యం అందక ప్రాణాలు పోతే ఖరీదు కట్టి తప్పించుకోవడంలో దిట్ట సగానికిపైగా అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆయన అనుచరులే.. చదివింది జనరల్ సర్జన్.. గైనకాలజిస్ట్గా అవతారం జిల్లా ఆస్పత్రిలో కీలక స్థానంలో ఉన్న ఓ వైద్యుడి నిర్వాకం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సైతం ఆగ్రహం ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో తరచూ చోటుచేసుకుంటున్న వివాదాలు, వైద్యుల విధుల నిర్లక్ష్యంపై ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ వారం క్రితం ఆస్పత్రిని సందర్శించారు. వైద్యసేవల గురించి నేరుగా పేషంట్లతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరిండెంట్తో పాటు మిగతా వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోకపోతే వేటుతప్పదని హెచ్చరించారు. అలాగే, గతవారం అత్యవసర వైద్యం కోసం గట్టు మండలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వచ్చిన పేషంట్కు సకాలంలో వైద్యం అందకపోవడంతో కడుపులోనే చంటిబిడ్డ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి వైద్యులు సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అన్ని పరీక్షలు ప్రైవేటుకే.. జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు ఉచితంగానే అందించాలనే సంకల్పంతో ఇక్కడ అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన టీ–హబ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఉచితంగా చేయాల్సిన పరీక్షలను ఉద్దేశ్యపూర్వకంగానే చేయకుండా బయటకు రాస్తూ పేషంట్లకు ఆర్థిక భారం మోపుతున్నారనే విమర్శలున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడ పనిచేస్తున్న చాలా మంది వైద్యులకు సొంతంగా ప్రైవేటు ఆసుపత్రులుండడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి
గద్వాల రూరల్: వివిధ రకాల అనారోగ్యతంతో ప్రభుత్వ ఆసుపత్రలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ఎర్రవల్లి, ఉండవెల్లి, కె.టి.దొడ్డి మండలాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలను టాయించినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో చేపడుతున్న జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాలైన టీబీ, లెప్రసీ, మలేరియా, ఎయిడ్స్, ఇమ్యూనైజేషన్, మాతాశిశు సంరక్షణ, సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ శశికళ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లక్కీడిప్ విధానంతో అభ్యర్థుల ఎంపిక
గద్వాల రూరల్: గద్వాల మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసేందుకు వివిధ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వివిధ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను లక్కీడిప్ విధానంతో ఎంపిక చేశారు. మొత్తం 24పోస్టులకుగాను మొత్తం 2370 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ తెలిపారు. ఇందులో 11డాటా ఎంట్రీ ఆపరేటర్ గాను 672, 09ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను 1483, 03ల్యాబ్అడెండెంట్ పోస్టులకు 201, 01థియోటర్ అసిస్టెంట్ పోస్టుకు 14మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో రోస్టర్ విధానంతో రిజర్వేషన్ల వారిగా లాటరీ విధానంతో ఎంపిక చేశారు. ఇందులో థియేటర్ అసిస్టెంట్ పోస్టుకు ఉషారాణి, ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు భవాని, సమ్రిన్బేగం, ఎండి సమీర్ ఎంపిక కాగా, డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సులోచన, రాణి, పూజిత, జయలక్ష్మీ, హారిక, లక్ష్మీ, శేఖర్రెడ్డి, సువర్ణ, యశోద, ప్రసాద్రావు, శైలజ, భాస్కర్ ఎంపికయ్యారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అనిత, సుందర్, రాజు, కళావతి, మంజుల, సుమలత, అన్వర్, భాష, పుష్పలత, ఉమలత, రేపల్లె జనార్ధర్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కాంతమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల రూరల్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి జూన్3వ తేదీ వరకు సంప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3,664మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, హృదయరాజు, డీప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు
గద్వాల రూరల్: ప్రభుత్వం ధాన్యానికి ఇచ్చే మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ రైతులను కోరారు. శుక్రవారం ఆయన గద్వాల మండలం బీరెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఎక్కడైన ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని రైతులకు సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల మేర ధాన్యం సేకరించారంటూ వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు లత్తిపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఆయా పాఠశాలల కమిటీల ద్వారా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయంతో పాటు ఇతర మౌళిక వసతులు త్వరగా పూర్తి చేసి వాటికి సకాలంలో బిల్లులు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో రైస్మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వ్చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, డీఆర్డీవో నర్సింగ్రావు, డీఈవో ఇందిరా, పీఆర్ ఈఈ విజయ్, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement