-
ఆధ్యాత్మికం..
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు డిచ్పల్లి: మండలంలోని ధర్మారం(బి)లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శనివా రం బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వా మివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. సుహాసినులు కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆల య ధర్మకర్త రావుల బ్రహ్మానందం, జంపా ని లక్ష్మీనారాయణ, రవిబాబు, నాగేశ్వరరా వు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి: మండలంలోని మైలారం గ్రామంలో విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆధ్వర్యంలో శ నివారం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ గణపతి పూజ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలను చేపట్టారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు గణేష్, భూమేష్ ,శేఖర్ సుభాష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా బోనాల ఊరేగింపు ఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి గ్రా మంలో పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో భాగంగా శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ముదిరాజ్ సంఘ పెద్దలున్నారు. నిమిషంబికామాతకు ప్రత్యేక పూజలు ఖలీల్వాడి: నగరంలోని కోటగల్లీలో శనివారం నకషి సంఘం ఆధ్వర్యంలో నిమిషంబిక మాత జన్మదినం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞయాగాదులు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం కోటగల్లీలో శోభాయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు తదితరులున్నారు. -
జీలుగా విత్తనాల పంపిణీ
నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్, పాల్దా, ముత్తకుంట, గుండారం వ్యవసాయ సహకార సంఘాలలో శనివారం సబ్సిడీపై జీలుగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏవో జాదవ్ హీరా మాట్లాడుతూ.. రూరల్ మండల సహకార సంఘాల పరిఽధిలో ఉన్న సొసైటీ కార్యాలయాల్లో జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాసు పుస్తకం జిరాక్స్ తీసుకువచ్చి మండల విస్తీర్ణ అఽధికారి వద్ద నమోదు చేసుకొని, తీసుకు వెళ్లాలని తెలిపారు. 60శాతం సబ్సిడీపై 30 కిలోల బస్తా రూ.1116కు అందుబాటులో ఉన్నాయన్నారు, 2.5 ఎకరాలకు ఒక జీలుగు బస్తా మాత్రమే ఇవ్వబడుతుందన్నారు. ఒక రైతుకు గరిష్టంగా 3 బస్తాలు మాత్రమే ఇస్తామన్నారు. మాధవనగర్ చైర్మన్ నాగేఽశ్వర్రావు, సీఈవో వంశీకృష్ణ, ఏఈవో స్వాతి లత, రైతులు తదితులు పాల్గొన్నారు. మోపాల్: మండల కేంద్రంలోని మోపాల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం జీలుగ విత్తనాలను సొసైటీ చైర్మన్ గ్యానాజీ గంగారెడ్డి పంపిణీ చేశారు. డైరెక్టర్లు తిరుపతి, రాజశేఖర్ రెడ్డి, గంగారాం, సీఈవో సాయి చంద్, రైతులు సాయినాథ్ రెడ్డి, ఉదయ్, చిన్నారెడ్డి, భాస్కర్, భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు రాయితీపై జీలుగ విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైభవంగా వాసవీమాత జయంతి
నిజామాబాద్నాగారం: నగరంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యాకాపరమేశ్వరిమాత జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘంలో కన్యాకాపరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డోలారోహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా కుటుంబ సమేతంగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్టే అని, అమ్మ ఆశీర్వాదంతో రామరాజ్య స్థాపన కూడా జరుగుతుందన్నారు. తాను ఎల్లప్పుడూ ఇందూర్ ప్రజలకు అండగా ఉంటానన్నారు. నిరుపేద ఆర్యవైశ్యులకు తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. అనంతరం ఆర్యవైశ్యులలో నిరుపేద వృద్దులకు, వికలాంగులకు నెలవారీ పెన్షన్ కింద తన ట్రస్ట్ ద్వారా నెలకు రూ.200 ఇస్తానని హామీ ఇస్తూ మొదటి నెలగా లబ్దిదారులకు పెన్షన్ ఇచ్చారు. అనంతరం ధన్పాల్ కుటుంబాన్ని వాసవి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. దొంతుల కాశీవిశ్వనాథంగుప్తా, కొండ నరేంధర్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, పాల్తి రవి కుమార్ గుప్తా, గాలి శ్రీనివాస్ గుప్తా, కొండ వీరశేఖర్ గుప్తా, ఆగమయ్య, ఎంసాని రవి, గజవాడ శ్రీనివాస్, ఇల్లెందుల ప్రభాకర్ పాల్గొన్నారు. సిరికొండ: మండలంలోని తాళ్లరామడుగు రామాలయం ఆవరణలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులకు వాసవి మాత చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఆర్య వైశ్య సంఘం మండలాధ్యక్షుడు మురళి, రామాలయ కమిటీ చైర్మన్ పురుషోత్తం, బూస రాజు, బచ్చు మారుతి పాల్గొన్నారు. ధర్పల్లి: మండల కేంద్రంలోవాసవి మాత జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు అమ్మవారికి పల్లకీసేవ, పారాయణం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సభ్యులు నూకల రాజయ్య, రాజశేఖర్, గంగాధర్, సిద్దేశ్వర, ప్రవీణ్, రాములు తదితరులు పాల్గొన్నారు. మోపాల్: మండలంలోని కులాస్పూర్ గ్రామంలో ఆర్యవైశ్యులు వాసవీమాతా జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వాసవీమాతాకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అధ్వానంగా డ్రెయినేజీలు
నిజామాబాద్రూరల్: నగరంలోని ఒకటవ డివిజన్ పరిధిలోగల ఖానాపూర్లో డ్రెయినేజీలు అధ్వానంగా మారాయి. డ్రెయినేజీల చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో మురుగునీరు పారకం నిలిచిపోయి, పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ప్రజలు నానా అవస్థలపాలవుతున్నారు. అయినా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. ఖానాపూర్కు ఆమ్లెట్ విలేజ్లుగా ఉన్న మహమ్మద్నగర్, వీరభద్రకాలనీ, విఠలేశ్వర నగర్లలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేదు. పారిశుధ్య కార్మికులు డ్రెయినేజీల్లో వ్యర్థాలను సకాలంలో తొలగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే డ్రెయినేజీల్లో బండరాళ్లు పడటంతో నీటి ప్రవాహానికి అడ్డు వస్తోంది. దీంతో డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకపోయి, నీటి పారకం నిలిచిపోతుంది. అలాగే మురుగుకాలువల చుట్టూ పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో డ్రెయినేజీలు కనబడటం లేదు. దీంతో ప్రజలు డ్రెయినేజీలను గమనించక అందులో పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా పాలకులు అధికారులు స్పందించి డ్రెయినేజీల వద్ద ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. ఖానాపూర్లో మురుగుకాలువల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలు మురుగు నిలిచిపోవడంతో దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు సమస్యను పరిష్కరించాలి.. ఖానాపూర్తోపాటు గ్రామాని కి ఆమ్లెట్ విలేజ్లుగా ఉన్న వీ రభద్రకాలనీ, విఠలేశ్వర నగ ర్, మహ్మద్ నగర్లలో డ్రెయి నేజీలు అస్తవ్యస్తంగా ఉన్నా యి.అధికారులుస్పందించి డ్రె యినేజీలను నిర్మించాలి. –కోర్వ రాజేంద్ర ప్రసాద్, ఒకటో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖనాపూర్ -
సాదాసీదాగా మోపాల్ మండల సమావేశం
మోపాల్: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ లతా కన్షీరాం అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. మండల ప్రజాపరిషత్ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో చివరి సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కూలీలకు వసతుల కల్పన, కూలి డబ్బులు చెల్లింపులు, తదితర అంశాలపై చర్చించారు. కూలీ రూ.150లోపే వస్తుందని, వసతులు కల్పించడం లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ సూచించారు. ఎంపీటీసీలు బొడ్డు రఘు, రాములు, రమేష్, ఎంపీడీఓ లింగం నాయక్, అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మోపాల్: మండలంలోని మోపాల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాంధారి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నీరడి లక్ష్మి(45) శనివారం మృతి చెందింది. ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి తన కుమారుడు సాయికుమార్తో కలిసి బైక్పై నిజామాబాద్ వైపు వస్తున్నారు. అదే సమయంలో నగరంలోని గౌతంనగర్కు చెందిన సాత్విక్, శివ బైక్పై అదే వైపు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న సాత్విక్ బైక్ను అకస్మాతుగా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించారు. వెనుక వస్తున్న సాయికుమార్ అదుపు తప్పి వారి వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో.. పిట్లం: ఇంటి ఎదుట బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని గౌరా రం తండాలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై నీరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మంజుల (38) ఉదయం ఇంటి ఎదుట ఉన్న రేకులకు కట్టిన జే వైర్పై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందింది. తల్లిని కాపాడే ప్రయత్నం చేసిన ఆమె పెద్ద కుమారుడు ప్రదీప్కుమార్కు సైతం గాయాలయ్యాయి. మృతురాలి భర్త లచ్చిరాం ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 12 24 బెండకాయ 30 50 బీరకాయ 60 80 దొండకాయ 30 50 బీర్నిసుకాయ 100 130 కాకరకాయ 40 60 వంకాయ 20 40 పాలకూర 25 50 మెంతికూర 20 40 కొత్తిమీర 40 60 పుదీనా 60 80 క్యాప్సికం 50 80 గాజరుగడ్డ 35 50 పచ్చిమిర్చి 40 60 దోసకాయ 25 50 ఆలుగడ్డ 30 50 గోబి గడ్డ 25 50 గోబి పువ్వు 30 50 బీట్రూట్ 30 60 కరివేపాకు 50 70 చామగడ్డ 50 70 గోరుచిక్కుడు 50 80 చిక్కుడుకాయ 50 80 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.) -
ప్రతిభ పురస్కారాల ప్రదానం
ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిభ పురస్కారాలతో సన్మానించారు. డివిజన్లోని 13 మండలాలకు చెందిన 35 మంది విశ్వకర్మ విద్యార్థులకు పురస్కారాలు అందించారు. ఆర్మూర్లో నిర్వహించిన కార్యక్రమానికి నిజామాబాద్ తహసీల్దార్ నాగార్జున, పెర్కిట్ మహిళ ప్రాంగణం అధికారిణి పద్మ, ముప్కాల్ ఎస్సై భాస్కరచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెవా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు గద్దె గంగాధర్, సభ్యులు వేల్పూర్ శ్రీనివాస్, సత్య నారాయణ, ఉప్పల నటరాజ్, రాజారాం, లక్ష్మీ నారాయణ, వెంకటరమణ, నాగరాజు, గంగాధర్, శివాజి, రవీంద్ర, శంకర్ పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్నాగారం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుపక్ష పార్టీ అని చెప్పుకుంటు రైతులను మోసం చేస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్ఆర్ అంటే రాహుల్, రేవంత్ టాక్స్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఉత్తమ్ టాక్స్ కూడా పెట్టి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ 43 రూపాయలకు బియ్యం అందించాలని చూస్తుంటే రాష్ట్రం 57 రూపాయలకు టెండర్లకు ఆహ్వానిస్తుందన్నారు. వేసవిలో పండించిన పంటకు రూ. 500 తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు పెట్టుబడికి భరోసాగా తీసుకొచ్చిన పసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత శాఖల వారీగా సమీక్ష జరిపి అవినీతి ప్రక్షాళన తప్పకుండ జరుగుతుందన్నారు. బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ న్యాలం రాజు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు భారత్ భూషణ్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మినారాయణ, కార్పొరేటర్స్ బైకన్ సుధా మధు, ఆకుల శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, వెల్డింగ్ నారాయణ, ప్రభాకర్, నాయకులు మఠం పవన్, శిలా శ్రీనివాస్, పవన్ ముందడ, కార్తీక్, కస్తూరి కృష్ణ, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా -
ఫలితాల్లో మెరిసిన జిల్లా వాసులు
పెర్కిట్: టీఎస్ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన దువ్వూరి జ్యోతి సమన్విత్ ఇంజినీరింగ్ విభాగంలో 114 ర్యాంకు సాధించాడు. పెర్కిట్కు చెందిన దువ్వూరి మహేంద్ర, లక్ష్మీ రాజ్యం దంపతుల పెద్ద కుమారుడు జ్యోతి సమన్విత్. పెర్కిట్ సేయింట్ ఆన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. పదో తరగతి వరకు కృష్ణాజిల్లా గుడివాడ విశ్వ భారతి పాఠశాలలో పదో తరగతిలో పది జీపీఏ, హైదరాబాద్ నారాయణ కళాశాలలో ఇంటర్ చదివి 985 మార్కులు సాధించాడు. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ విభాగంలో 144 ర్యాంకు, జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో 112 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్కు సమాయత్తం అవుతున్నాడు. జేఈఈ అడ్వాన్స్లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ మద్రాస్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే లక్ష్యంతో సమన్విత్ పట్టుదలతో చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి మహేంద్ర జక్రాన్పల్లి మండలం తొర్లికొండ సంతోషనగర్ ప్రైమరి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆలూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎం నరేందర్ పెద్ద కుమారుడు మేసా అర్జున్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 579 ర్యాంకు సాధించాడు. భీంగల్ మండలం బెజ్జోరకు చెందిన అర్జున్ జిల్లా కేంద్రంలోని విజయ్ హైస్కూల్లో పదో తరగతి చదివి పది జీపీఏ, హైదరాబాద్లోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి 920 మార్కులు సాధించాడు. ఇటీవల నిర్వహించిన నీట్లో ఉత్తమ ర్యాంకు సాధిస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసి గుండె వైద్య నిపుణుడు కావాలనే సంకల్పంతో అర్జున్ పట్టుదలతో చదువుతున్నాడు. కాగా తండ్రి నరేందర్ ఆలూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా, తల్లి వేల్పూర్ మండలం లక్కోర ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.590 ర్యాంకు సాధించిన వేదాంత్ పెర్కిట్: ఆర్మూర్ మండలం కోమన్పల్లికి చెందిన బోగ శ్రీనివాస్, ఉమారాణి దంపతుల కుమారుడు బోగా వేదాంత్ ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ విభాగంలో 590 ర్యాంకు సాధించాడు. వేదాంత్ ఇంటర్లో 988 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్లో అఖిల భారత స్థాయిలో ఒపెన్ క్యాటగిరిలో 2,200 ర్యాంకు, క్యాటగిరిలో 404 ర్యాంకు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్లో ఉత్తమ ర్యాంకుతో ఉన్నత కళాశాలలో సీటు సాధించి ఇంజినీర్ కావాలనే లక్ష్యంతో వేదాంత్ పట్టుదలతో ఉన్నాడు. -
వెండితెర
ఆర్టీసీ డిపోలో వైద్య శిబిరం బోధన్: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో శనివారం గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డిపోకు చెందిన ప్రతి ఉద్యోగి, కార్మికులకు ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించినట్లు తెలిపారు. మొత్తం 462 మందికి వైద్యులు వైద్య పరీక్షలు చేశారని తెలిపారు.ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–1 అపరిచితుడు (తెలుగు) – 1.30, 7.30 స్క్రీన్–2 ది గార్ఫీల్డ్ మూవీ (ఇంగ్లిష్) – 10.45, 4.30, 7.30, ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 1.40, మిరల్ (తెలుగు) – 10.30 స్క్రీన్–3 అపరిచితుడు (తెలుగు) – 10.35, మిరల్ (తెలుగు) – 1.50, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ది ఏప్స్ (తెలుగు) – 4.40, 10.30, బాక్ (తెలుగు)–7.30 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 కృష్ణమ్మ (తెలుగు) – 1.20, 7.25, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ది ఏప్స్ (ఇంగ్లిష్) – 4.15, అపరిచితుడు – 10.20 స్క్రీన్–2 ది గార్ఫీల్డ్ మూవీ (ఇంగ్లిష్) – 12.00, 2.25, 4.50, 7.15, 9.40 స్క్రీన్–3 కర్తం భుక్తం (హిందీ) – 1.10, ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 4.05, శ్రీకాంత్ (హిందీ) – 7.00, 10.00 స్క్రీన్ –4 నటరత్నాలు (తెలుగు) – 12.10, దర్శిని (తెలుగు) – 2.50, మిరల్ (తెలుగు) – 5.30, 10.30, అక్కడ వారు ఇక్కడ ఉన్నారు (తెలుగు) – 8.25తెలుగు/హిందీ/ఇంగ్లిష్ -
మార్పులు చేర్పులకు కొత్త దరఖాస్తులేనా..?
మోర్తాడ్: రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినా గతంలో జారీ చేసిన కార్డుల్లో మార్పులు చేర్పుల విషయంలో స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డుల నుంచి మరణించిన వారి పేర్లు తొలగించిన గత ప్రభుత్వం పుట్టినవారు, పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టిన వారి పేర్ల నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించిందనే విమర్శలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం కొన్ని కార్డులను జారీ చేయగా ఆ తర్వాత జారీ చేయలేదు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా రేషన్కార్డులను ప్రామాణికం చేసింది. దీంతో అనేక మంది రేషన్ కార్డులు దక్కక పథకాలను సరిగా అందుకోలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే జిల్లాలో 3,81,224 తెల్లరేషన్ కార్డులు ఉండగా, 20,940 అంత్యోదయ కార్డులు, 1,061 అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. కొత్తగా పేర్లు నమోదు చేయడం, మార్పులు చేర్పులకు సంబంధించి జిల్లాలో గతంలో పౌర సరఫరాల శాఖకు అందిన దరఖాస్తుల సంఖ్య 77,758 ఉన్నాయి. వీటిలో కొన్ని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ కార్యాలయం, మరికొన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ, ఆర్డీవో, తహసీల్, ఆర్ఐల పరిశీలనలోనే ఆగిపోయాయి. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో అనేక మంది దరఖాస్తులను సమర్పించారు. రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఒకే చెప్పినా మార్పులు, చేర్పులకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దీనిపై తొందరగా స్పష్టత ఇస్తే గందరగోళానికి తెరదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో జారీ చేసిన రేషన్కార్డుల్లో స్పష్టత కరువు ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసేనా..? -
కూలి రూ.300 చెల్లించాలి
డిచ్పల్లి: ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలి రూ.300లు చెల్లించాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సాయాగౌడ్ డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండలంలో శనివారం ఆయన ఉపా ధి హామీ కూలీలతో మాట్లాడారు. పనులు జరి గే ప్రదేశంలో కూలీలకు టెంట్, తాగునీటి సౌక ర్యం కల్పించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేసే విధంగా నిధుల కొరతను సృష్టిస్తూ పేదలకు పని లేకుండా చేస్తుందని విమర్శించారు. కు టుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వాలని, సంవత్సరానికి కనీసం 250 రోజులు పని ది నాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు. నాయకులు మురళి, సాయిబాబా, మో హన్, మహిపాల్, గంగాధర్, బాబు, సాయి లు, లక్ష్మీ, సుజాత పాల్గొన్నారు. విగ్రహ ఏర్పాటుకు వినతి సిరికొండ: మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఏర్పాటు కోసం శనివారం పంచాయతీ కార్యదర్శి శివకుమార్కు కమిటీ సభ్యులు దరఖాస్తు చేశారు. ఈమేరకు కార్యద ర్శిని కలిసి విగ్రహం ఏర్పాటు చేయడానికి అ నువైన స్థలం చూయించడంతో పాటు అనుమ తి ఇవ్వాలని కోరారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కమిటీ అధ్యక్షుడు బడాల సంతోష్, ఉపాధ్యక్షులు ధర్పల్లి బాబురావు, జోగు గణేష్, కోశాధికారి సాగర్, కార్యదర్శి సాయివర్షిత్, సురేష్ పాల్గొన్నారు. ఉత్తమ సేవలకు సత్కారం నిజామాబాద్నాగారం: ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో విద్యుత్శాఖ సిబ్బంది ఉత్తమ సేవలందించినందుకు సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ డివిజన్ డీఈ ఎం శ్రీనివాస్ శనివారం సమీక్ష సమావేశంలో ప్రత్యేకంగా ఏడీఈ తోట రాజశేఖర్, ఏఈ గంగాశేఖర్(సుభాష్నగర్)ను సన్మానించారు. మి గత అధికారులు, ఉద్యోగులు కూడా శ్రద్ధతో విధులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏఈలు సుమిత, శ్రీనివాస్, అజారుఈ్దన్, సబ్ఇంజనీర్స్ మాలతి, నజ్మా, సిబ్బంది ఉన్నారు. జీవో విడుదల చేయాలి నిజామాబాద్నాగారం: రెడ్డి కార్పొరేషన్ విధివిధానాలు, పాలకవర్గంపై అధికారికంగా జీవో విడుదల చేయాలని రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన శనివారం ప్రభుత్వ సలహాదారు నరేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, విన్నవించారు. ఈ విషయమై క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని కోరారు. ఐక్యవేదిక స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ క్యా తం శివ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఖలీల్వాడి: అకాల వర్షాలకు తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ ర మేష్ బాబు అన్నారు. నగరంలోని పార్టీ కా ర్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాల తో పంటను నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. నాయకులు పెద్ది వెంకట్ రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ రెంజల్(బోధన్): రెంజల్ ఇన్చార్జి తహసీల్దార్గా శ్రావణ్కుమార్ శనివారం బాధ్యతలు స్వీ కరించారు. ఇక్కడ పనిచేసిన సయ్యద్ ఖలీం హజ్ యాత్ర కోసం 50 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బోధన్ ఆర్డీవో కార్యాలయ డీటీ శ్రావణ్కు ఇన్చార్జి బాధ్యతలను జిల్లా అధికారులు అప్పగించారు. -
పౌష్టికాహారంపై అవగాహన
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా పిప్రి సెక్టార్ సూపర్వైజర్ వెంకటరమణమ్మ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింత లు, మూడు సంవత్సరాలలోపు చిన్నారులు వి ధిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించా రు. అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరు లు పాల్గొన్నారు. ప్రమాదకరంగా స్తంభం రుద్రూర్: మండలంలోని కొందాపూర్ శి వారులోగల పంట పొలాల్లో విద్యుత్ స్తంభం వంగిపోయి ప్రమాదకరంగా మా రింది. ఇటీవల రైతు ల వినతితో ట్రాన్స్కో అధికారులు కొత్త స్తంభం వేసినప్పటికీ తీగలు లాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్తంభం వంగిపోవడంతో ఎప్పడు పడిపోతుందోమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్కో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రైయినీ ఐపీఎస్ వాహనం
ఖలీల్వాడి: నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వినాయక్నగర్కు చెందిన అశోక్ పని నిమిత్తం బైక్పై బయటకు వచ్చాడు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రైయినీ ఐపీఎస్ చైతన్యరెడ్డి కారు ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అశోక్ను ట్రైయినీ ఐపీఎస్ చైతన్యరెడ్డి తన కారులోనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు అశోక్ చికిత్స పొందుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చోరీ ఎల్లారెడ్డిరూరల్: నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ శివారులో ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్, కాపర్ చోరీకి గురైంది. స్థానికులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ నుంచి 150 లీటర్ల ఆయిల్తో పాటు కాపర్ తీగలను దొంగలు చోరి చేసినట్లు వారు తెలిపారు. -
లాంగ్ టర్మ్లో ఇద్దరికి ర్యాంకులు
నిజామాబాద్అర్బన్: జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు ఈఏపీ సెట్లో లాంగ్ టర్మ్లో ర్యాంకులు వచ్చాయి. గంగస్థాన్కు చెందిన అర్జున్ 579 ర్యాంకు సాధించాడు. అర్జున్ తల్లిదండ్రులు నరేందర్, రేణుక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. అర్జున్ హైదరాబాద్లోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదివి అగ్రికల్చరల్ విభాగంలో ర్యాంకు సాదించాడు. నగరంలో వినాయక్నగర్కు చెందిన నిషిత రెడ్డి లాంగ్టర్మ్లో అగ్రికల్చర్ విభాగంలో 605 ర్యాంకు సాధించారు. నందిపేట్ ఫార్మసిస్ట్ టర్మినెట్ నిజామాబాద్నాగారం: వైద్యశాఖలో విధులు నిర్వహించే కొంతమంది ఉద్యోగులు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా గతంలో ఉన్న ఇన్చార్జి డీఎంహెచ్వో పీహెచ్సీల్లో విధులు నిర్వహించే సిబ్బంది గు రించి సరిగా పట్టించుకోక పోవడంతో వారి ఆగడాలకు అంతు లేకుండా పోయిందని సమాచారం. వీ రు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఇదేంట ని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నందిపేట్ మండలంలోని పీహెచ్సీలో ఫార్మసిస్టుగా విధులు నిర్వహిస్తున్న రవికుమా ర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మెడికల్ ఆఫీసర్ పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిపోయాడు. విధులకు సక్రమంగా హాజరు కాని రవి జీతం మాత్రం ఫుల్గా కావాలని, అందుకే మెడికల్ ఆఫీ సర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ డీఎంహెచ్వో కా ర్యాలయానికి జీతాలకు సంబంధించి పత్రాలు స మర్పించాడు. దీనిపై అనుమానం వచ్చిన మెడిక ల్ ఆఫీసర్ పవన్ ఏప్రిల్లో డీఎంహెచ్వోకు రవికుమా ర్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని ఫిర్యాదు చేశా డు. దీనిపై విచారణ చేసిన అధికారులు కలెక్టర్కు ని వేదిక అందించారు. దీంతో శుక్రవారం సంతకాన్ని ఫోర్జరీ చేసిన రవికుమార్ను టర్మినెట్ చేశారు. -
షేర్గల్లీలో దోపిడీ దొంగల హల్చల్
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని షేర్గల్లీలో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి దోపిడీకి యత్నించగా వృద్ధురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో పరారయ్యారు. ఈ ఘటన కాలనీలో కలకలం సృష్టించింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాలనీలోని ఓ ఇంట్లో మాసుల భాగమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె సంబంధీకులు అందరూ పక్కనే వరుసగా ఉండే ఇళ్లల్లో ఉంటారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రపోయింది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ మహిళా దొంగ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసు లాక్కునేందుకు యత్నించింది. ప్రతిఘటించిన వృద్ధురాలు దొంగను పక్కకు తోసేసింది. ఇంటి బయటకు పరుగులు తీసి కేకలు వేసింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వారు లేవడం గమనించిన మహిళా నిందితురాలు సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి బైక్పై పరారైనట్లు తెలిసింది. వెంటనే స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. దోపిడీకి యత్నించిన వారి ఆనవాళ్ల కోసం సమీపంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం సైతం కాలనీలో కొందరు మహిళలు గ్రైండర్ల విక్రయం, స్కీములు అంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని, దొంగల బెడదను అరికట్టాలని కోరుతున్నారు. ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి ప్రతిఘటించి కేకలు వేసిన వృద్ధురాలు -
‘ఈఏపీ సెట్’లో కాకతీయ హవా
నిజామాబాద్అర్బన్: ఈఏపీ సెట్ ఫలితాల్లో కాకతీయ జూనియర్ కళాశాల సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లా మొదటి ర్యాంకు కూడా కాకతీయ కళాశాలకు చెందిన విద్యార్థికి లభించింది. శనివారం విడుదలైన ఈ ఫలితాల్లో విద్యార్థులు ఈ ఘనత సాధించినట్లు కళాశాల డైరెక్టర్ రామోజీరావు తెలిపారు. తొమ్మిది వేల లోపు 13 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం విశేషం. కళాశాలకు చెందిన ఎం మహిర జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 1424 ర్యాంకు సాధించింది. మినహాజ్ 2224, ఈ మణికాంత్ 2580, ఎ మల్లిక్ 3290, రిషిక్ సాయి 4161, అంజుమ్ 4247, శ్రీహిత 5084, తయ్యాబ్ 5400, భార్గవ్ సాయి 5629, ఎ ఆది 6500, పి లక్షిత్ 8616, ఎ మొయిద్ 9222 ర్యాంకులు సాధించారు. వీరు ఇంటర్ తొలి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయి ఈఏపీ సెట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కాకతీయ డైరెక్టర్ సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ.. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కాకతీయ ఐఐటీ నీట్, ఏపీసెట్ అకాడమీలోని ప్రత్యేక పాఠ్యప్రణాళిక అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన యాజమాన్యం నిరంతర పర్యవేక్షణతోనే సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు దేశవ్యాప్తంగా తమ ప్రతిభ చాటుతారని అన్నారు. కాకతీయలో చేరిన ప్రతి విద్యార్థి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచడం జరుగుతుందన్నారు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రణాళికను అమలు చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కాకతీయ నడుం బిగించిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలలో కాకతీయ టాలెంట్ మరోసారి నిరూపితమైందన్నారు. కార్యక్రమంలో కాకతీయ కళాశాలకు చెందిన డైరెక్టర్ రామోజీరావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ కళాశాలలో.. నగరంలోని ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈఏపీ సెట్లో ప్రతిభ చాటారు. శ్రేయన్స్ కుమార్ 2098వ ర్యాంకు, రమారాణి ఆకాశ్రెడ్డి 3978, నిహారిక 5040, స్నేహిత 6095, భవ్య 6152, వర్షణి 6252 ర్యాంకులు సాధించారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం గర్వంగా ఉందని కళాశాల డీజీఎం గోవర్ధన్ రెడ్డి, ఇన్చార్జి శ్రీకాంత్ తెలిపారు. కళాశాల చెందిన 14 మంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. నారాయణ విద్యార్థుల ప్రతిభనిజామాబాద్అర్బన్: నగరంలోని నారాయణ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కళాశాలకు చెందిన మర్రి హర్ష రాష్ట్రస్థాయిలో 1579, సాయికిరణ్ 3135, రాజశేఖర్ 5235 ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. 13 మందికి రాష్ట్రస్థాయి ర్యాంకులు తొలి ప్రయత్నంలోనే.. ఎం మహిరకు జిల్లా ప్రథమ, రాష్ట్రస్థాయి ఉత్తమ ర్యాంకు ఇంజినీరింగ్, ఫార్మసీలో సత్తా ప్రతిభ చాటిన ఎస్ఆర్ విద్యార్థులు నిరాశపర్చిన ఇతర కళాశాలలు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన కొన్ని ప్రైవేటు కళాశాలలు ఈఏపీసెట్ ఫలితాల్లో నిరాశపర్చాయి. నగరంలోని ఓ కళాశాల ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించగా ఈఏపీ సెట్ ఫలితాల్లో మాత్రం కనీస ర్యాంకులు కూడా సాధించలేదు. వినాయకనగర్ ప్రాంతంలో ఉన్న మరో కళాశాల సైతం ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రతిభ చాటలేదు. ఇంటర్ ఫలితాల్లో 985 మార్కులు సాధించిన విద్యార్థులకు మెయిన్స్లో అర్హత కోల్పోగా ఎంసెట్లో కూడా అర్హత సాధించలేకపోయారు. ఇలా జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది.తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించా అధ్యాపక బృందం కృషితో నేను తొలి ప్రయత్నంలోనే ఈఏపీ సెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాను. అధ్యాపక బృందానికి, యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. జేఈఈ మెయిన్స్తో ఈఏపీ సెట్లో ప్రణాళిక ప్రకారం చదివాను. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ విభాగంలో ఇంజినీరింగ్ కావాలని ఉంది. నా కలను సాకారం చేసేందుకు కష్టపడతాను. – మిన్హాజ్, కాకతీయ విద్యార్థి చక్కటి ప్రణాళికతో.. నేను ఈఏపీ సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 1424 ర్యాంకు, జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. కళాశాలలో చక్కటి ప్రణాళిక, పరీక్షల నిర్వహణ, వ్యక్తిగత శ్రద్ధతోనే ఈ ర్యాంకు సాధించాను. నా విజయానికి కారణమైన కాకతీయ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. అధ్యాపక బృందం ఎంతగానో తోడ్పాడు అందించింది. – ఎం మహిర, కాకతీయ విద్యార్థి -
జీవితంపై విరక్తితో వివాహిత ఆత్మహత్య
నవీపేట: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన మల్కవ్వ(58)తో భర్త మారన్న తరచూ గొడవ పడేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక మల్కవ్వ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు సాయన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు సదాశివనగర్: మద్యం మత్తులో ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వడ్డె రాజు మద్యం మత్తులో జీపీ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని రాజును సముదాయించి కిందికి దిగేలా చర్యలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులు కానిస్టేబుల్ వెంకటలక్ష్మిని, సిబ్బందిని అభినందించారు. -
వడ్ల కుప్పలకు తప్పిన ముప్పు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలంలోని నర్వ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలకు శనివారం అగ్నిప్రమాద ముప్పు తప్పింది. పంట నూర్పిడి చేసిన ఎండు గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలు వరికొయ్యలను కాలుస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రం వడ్ల కుప్పల వైపు వచ్చాయి. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సిబ్బంది సేవలను గున్కుల్ సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు అభినందించారు. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -
నూతన చట్టాల అమలుపై సమీక్ష
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని కోర్టులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నూతన చట్టాల అమలుపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనర్సయ్య శనివారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భారతీయ న్యాయ సన్నిహిత–2023, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత–2023, పలు చట్టాలపై వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తమ విధులను శ్రద్ధతో నిర్వహించాలని, నూతన చట్టాలను అవలంభించి నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్, రాజగోపాల్ గౌడ్, రాజారెడ్డి, బంటు వసంత్, కావేటి శేషు, నంద రమేశ్, ఖాందేశ్ శ్రీనివాస్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు భూసారపు రాజేశ్ గౌడ్, డాక్టర్ సమ్మయ్య, మహ్మద్ రహిముద్దీన్, అశోక్ శివరాంనాయక్, చిదిరాల రాణి, పొరిక రాజేశ్వరి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో గేదె మృతి
బిచ్కుంద: మండలంలోని వాజిద్నగర్ శివారులో శనివారం విద్యుదాఘాతంతో ఓ గేదె మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గుండెనెమ్లి గ్రామానికి చెందిన నారాయణ నాయక్ మంజీరాలో వాజిద్నగర్ గ్రామానికి తాగునీరు సరఫరా అయ్యే బావి దగ్గర గేదెను మేపుతున్నాడు. మోటర్ స్టాటర్ వైరుతెగి కిందపడి ఉండడంతో మేత మేస్తున్న గేదెకు షాక్ తగిలి మృతి చెందింది. విద్యుత్, వెటర్నరీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందే విధంగా చూస్తామని అధికారులు రైతుకు హామీ ఇచ్చారు. -
ధ్రువపత్రాల కోసం తహసీల్ చుట్టూ చక్కర్లు
● ఆఫీస్లో 250 దరఖాస్తుల పెండింగ్ బిచ్కుంద(జుక్కల్): మండల ప్రజలు, రైతులు ఆయా ధ్రువపత్రాలు, పహాణీ రికార్డుల కోసం నెలల తరబడి తహసీల్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధికారులు పరిశీలన, విచారణ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వందల దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక పెండింగ్లో ఉన్నాయి. అధికారులు సమయ పాలన పాటించడం లేదు. ఓ అధికారి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వచ్చారు. ఆ అధికారి చిక్కడు దొరకడు అన్న రీతిలో ఉంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహాణీ రికార్డులు, కులం, ఆదాయం, బర్త్ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోగా వాటి పరిష్కారానికి నోచుకోక తహసీల్ కార్యాలయంలో సుమారు 250 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ విద్యార్థులు, ప్రజలు చక్కర్లు కొడుతున్నా కనికరించే వారు కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి దారితప్పిన రెవెన్యూ పాలనను సరైన మార్గం తీసుకొచ్చి అన్ని వేళలో అధికారులు స్థానికంగా ఉండే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్ల్లు దగ్ధం
రూ.15 లక్షల ఆస్తి నష్టం లింగంపేట(ఎల్లారెడ్డి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్రపతి వీరమణి, లక్ష్మణ్ గౌడ్, రామకృష్ణగౌడ్లకు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. చుట్టు భవంతిలో మూడు కుటుంబాల సభ్యులు నివాసం ఉంటున్నారు. మూడు కుటుంబాల సభ్యులు పనుల నిమిత్తం తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్ద భవంతి ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టు ప్రక్కలవారు, యువకులు గమనించారు. యువకులు వెంటనే ఇంటిపైకి ఎక్కి బిందెలు, బకెట్లతో నీళ్లు చల్లారు. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మోటార్లు ఏర్పాటు చేసి పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎల్లారెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన 10 తులాల బంగారం, వెండి, సర్టిఫికెట్లు, ఫైల్స్, ఫర్నిచర్, నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా దగ్ధమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు కుటుంబాలకు సంబంధించి సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. -
రేపటి నుంచి సీపీగెట్కు దరఖాస్తుల స్వీకరణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ –సీపీగెట్ – 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల పరిధిలో 294 పీజీ కళాశాలల్లో దేంట్లోనైనా పీజీ కోర్సులతో పాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీకి సంబంధించిన కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల 18 నుంచి సీపీగెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూలై 5 నుంచి కంప్యూటర్ బేస్డ్ మోడ్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూ(హెచ్), తెలంగాణ మహిళా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తారు. తెయూ పరిధిలో.. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వర్సిటీ డిచ్పల్లి మెయిన్ క్యాంపస్, భిక్కనూర్ సౌత్ క్యాంపస్ కళాశాలలతో పాటు 16 అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలలున్నాయి. వర్సిటీ క్యాంపస్లో 26 కోర్సులుండగా, అనుబంధ పీజీ కళాశాలల్లో కలిపి మొత్తం 35 వరకు కోర్సులున్నాయి. వీటిలో సుమారు 4 వేల మంది వరకు విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. వీరిలో బాలికలు సుమారు 65 శాతం, బాలురు సుమారు 35 శాతం మంది మాత్రమే పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ సారి 10 శాతం సీట్లు నిండని కాలేజీలను బ్లాక్ చేసే ఆలోచనలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులున్నారు. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం www.osmania.ac.in,www.ouadimissions.com, www.cpget.tsche.ac.in వెబ్సైట్లను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు. జూలై 5న ఎంట్రన్స్ టెస్ట్ తెయూ పరిధిలో 18 పీజీ కళాశాలలు సీపీగెట్ షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 18–05–2024 రిజిస్ట్రేషన్కు తుది గడువు 17–06–2024 రూ.500 ఆలస్య రుసుముతో గడువు 25–06–2024 రూ.2 వేల ఆలస్య రుసుముతో గడువు 30–06–2024 ప్రవేశ పరీక్షలు 05–07–2024
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement