బీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి

Published Mon, May 6 2024 6:25 AM

బీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి

గోదావరిఖని: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేసి బీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ కోరారు. ఆదివారం రాత్రి స్థానిక రమేశ్‌నగర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. తాలు పేరిట సాగుతున్న దోపిడీకి అడ్డుకట్టవేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని వారు అన్నారు. నాయకులు ఉన్నారు.

‘కూటమి’ అభ్యర్థిని గెలిపించండి

ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో వారు మాట్లాడారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మడ్డి ఎల్లాగౌడ్‌, వైవీరావు, ఎల్‌.ప్రకాశ్‌, కందుకూరి రాజారత్నం, జిగురు రవీందర్‌, ఎంఆర్‌సీ రెడ్డి, మాదన మహేశ్‌, సంకె అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ కల్పన కాంగ్రెస్‌తోనే సాధ్యం

జ్యోతినగర్‌(రామగుండం): నిరుద్యోగలకు ఉద్యోగ కల్పన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే రాజ్‌ఠా కూర్‌ మక్కాన్‌ సింగ్‌ అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్టీపీసీ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్‌ పాషా ఆధ్వర్యంలో జరిగి ఈ సమావేశంలో నాయకులు కొలిపాక సుజాత, బొంతల రాజేశ్‌, వెంగల పద్మలత, కత్తెరమల్ల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

Advertisement
Advertisement