-
రోహింగ్యాలకు ప్రభుత్వ ఉద్యోగాలా?
పెద్దపల్లిరూరల్: రోహింగ్యా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడాన్ని నిరసిస్తూ ఆదివారం బీజేపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ మాట్లాడుతూ 15 ఏళ్ల కాలంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఆ కోటా కింద ఉద్యోగాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఓబీసీ సర్టిఫికెట్టు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినా కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలారపు పర్వతాలు, దాడి సంతోష్, మేకల శ్రీనివాస్, కావేటి రాజ్గోపాల్, పడాల శ్రీధర్, రాజం మహంత, రమేశ్, కుమారస్వామి, సంపత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాకాసి రోడ్డు!
సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024బీరన్న పట్నాలుజూలపల్లి: మండల కేంద్రంలో మహంకాళి బీరప్ప కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరన్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో సుంకుపట్టడం, బోనాలను పూజించి పట్నాలు వేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎల్కపెల్లి లచ్చయ్య, ప్రధాన కార్యదర్శి బండారి రమేశ్, ఉపాధ్యక్షుడు బొప్పనపెల్లి రవి, గుంటి అశోక్, శంకర్, ఇరుమల్ల పెద్దాపూరం, పెద్ద ఐలయ్య, బొప్పనపెల్లి మల్లేశం, బండారి శంకర్ ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయంజ్యోతినగర్: గోదావరిఖని పీజీ సెంటర్ సబ్స్టేషన్ మల్కాపూర్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఇన్చార్జి విద్యుత్ శాఖ అధికారి మహిపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశాంత్నగర్, జంగాలపల్లె, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో 11కేవీ లైన్లో మరమ్మతులు చేపట్టనున్న సందర్భంగా సోమవారం ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలిగోదావరిఖని: కార్మికుల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.భూపాల్ అన్నారు. ఆదివారం శ్రామికభవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, లేబర్ కోడ్లు అంశాలపై వివరించారు. సీఐటీయూ నినాదమైన ‘ఐక్యత–పోరాటం’ ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్మిక వర్గ హక్కులపై బీఎంఎస్ మినహా కలిసివచ్చే కార్మిక సంఘాలతో పోరాటాలకు సంసిద్దులు కావాలన్నారు. పరిశ్రమల్లో కనీస వేతనాలు పెంచకుండా కేవలం బేసిక్లో కరువు భత్యం (డీఏ)ను కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్లో జిల్లాలోని సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు, సింగరేణిలోని పర్మినెంట్, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, ఎన్టీపీసీలోని ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్, గ్రామపంచాయతీ నాయకులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులతో పాటు పార్టీ ప్రతినిధులు జి.జ్యోతి, రామాచారి, మెండె శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎస్.వెంకటస్వామి, వి.నాగమణి, ఉల్లి మొగిలి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెత్తురొడుతున్న గోదావరిఖని–మంథని రహదారిగోదావరిఖని: గోదావరిఖని–మంథని ప్రధాన రహదారి ప్రమాదభరితంగా మారింది. ప్రధానంగా గోదావరిఖని ఫైవింక్లయిన్ నుంచి ముస్తాల వరకు ఉన్న రోడ్డు మూలమలుపులు, స్పీడ్బ్రేకర్లతో మృత్యుకుహురంగా తయారైంది. ఈక్రమంలో విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికులు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. జీడీకే–6 ఓపీసీ విస్తరణతో.. సింగరేణి యాజమాన్యం జీడీకే–5 ఓసీపీ విస్తరణతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టి గోదావరిఖని నుంచి మంథనికి వెళ్లే రోడ్డును మళ్లించారు. నూతన రోడ్డు నిర్మాణం తర్వాత ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ముగ్గురు మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. రోడ్డు మళ్లింపు తర్వాత కార్మికులకు దూరభారం పెరగడంతో పాటు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. రెండు షిఫ్టు కార్మికులకు వెళ్లే సింగరేణి కార్మికులు ప్రమాదాల పాలవుతున్నారు. రాత్రి 11గంటల షిఫ్టు పూర్తయి ఇంటికి వచ్చే సమయం, రాత్రి షిఫ్టు డ్యూటీకి వెళ్లే సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి బైక్తో బలంగా ఢీకొట్టడంతో రాసపెల్లి నాగరాజు(31) బదిలీ వర్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో జీడీకే–2ఏ మోరీ వద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో జీడీకే–11 గనికి చెందిన సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఇద్దరు కార్మికులు ఈ రోడ్డు వెంట ప్రయాణించే క్రమంలో మృత్యువాత పడగా, పలువురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతోనే ప్రమాదం సింగరేణి యాజమాన్యం నిర్మించిన రోడ్డు వెంట వీధిదీపాలు ఏర్పాటు చేశారు. అయితే శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో వీధిదీపాలు ఆన్చేయక పోవడంతో ఎదురుగా నిలిపిఉన్న లారీ కనపడక బలంగా వెనుక నుంచి ఢీకొనడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. యాజమాన్యం తీరువల్లే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు ఆందోళన నిర్వహించారు. కాగా ప్రమాదం జరిగిందని తెలియడంతో వీధిలైట్లు వేశారని కార్మికులు పేర్కొంటున్నారు. పాతరోడ్డును అనుకూలంగా తీర్చిదిద్దాలి జీడీకే–11 గనికి వెళ్లే పాతరోడ్డును విధులకు వెళ్లేందుకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కార్మికులు కోరుతున్నారు. రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో కొత్త రోడ్డు వెంట ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి జీడీకే–11 గని పాత రోడ్డును ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. కార్మికుడి కుటుంబంలో విషాదం.. రాసపెల్లి పోశం మెడికల్ అన్ఫిట్ అయ్యి కొడుకు నాగరాజుకు ఉద్యోగం పెట్టించాడు. ఏడాదిన్నర కిందటే విధుల్లో చేరిన నాగరాజు అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోశంకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు కాగా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న కార్మికుడి మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీటీసీ, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సందర్శించి నివాళి అర్పించారు. ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్సుల్తానాబాద్: ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెన్షన్ చేసినట్లు ట్రాన్స్కో డీఈ తిరుపతి తెలిపారు. లైన్మెన్ దీన్దయాల్ను మీసేవా కేంద్రాలకు మీటర్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు, లైన్ ఇన్స్పెక్టర్ నర్సయ్యను లేబర్లకు విద్యుత్ షాక్కొట్టి గాయాల పాలు కావడానికి కారణమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. రహదారి వెంట జరిగిన ప్రమాదాలు శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాసపెల్లి నాగరాజు అనే సింగరేణి బదిలీ వర్కర్ కార్మికుడు మృతి చెందాడు. 21మార్చి 2024న జరిగిన రోడ్డు ప్రమాదంలో మండె కిరణ్ అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు రాకేశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల జీడీకే–2ఏ గని మోరీ వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో జీడీకే–11 గనిలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు టి.సంపత్ జనరల్ మజ్ధూర్ మృతి చెందాడు. ఫిబ్రవరిలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో సుందిళ్లకు చెందిన రాజమ్మ అనే మహిళ మృతి చెందింది. గతేడాది డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండీ మన్సూర్ అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. న్యూస్రీల్ రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న సింగరేణి కార్మికులు పట్టించుకోని యాజమాన్యం -
మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడిని దర్శించుకున్నారు. స్వామి వారి పేరిట ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. బోనాలు తయారు చేసి నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశంయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. – ఓదెల(పెద్దపల్లి) -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్
రామగిరి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యాలయాల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ పరీక్ష రామగిరి మండలం సెంటనరీకాలనీ మంథని జేఎన్టీయూలో ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్స్లో జరిగిన పరీక్షలో 106 మంది విద్యార్థులకు 104 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ చెరుకు శ్రీధర్రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును హైదరాబాద్ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు. పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై కె.సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో చెత్త సేకరణకు ఉపయోగించే విలువైన వాహనాలు ఎండకు ఎండుతూ.. వానలకు తడుస్తూ చెడిపోతున్నాయి. బల్దియా కార్యాలయంలో వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్కింగ్ షెడ్డు కూడా లేదు. అలాగే వాహనాలకు సకాలంలో మరమ్మతు చేసేందుకు మెకానిక్ షెడ్డు లేదు. చిన్నపాటి మరమ్మతులకు ప్రైవేట్ గ్యారేజ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్ తదితర వాహనాలు సుమారు 100 వరకు ఉన్నాయి. మరమ్మతుల సమస్యలతో కొన్ని వాహనాలు ప్రైవేట్ గ్యారేజీల్లో మూలకుపడి ఉన్నాయి. బల్దియాలో వాహనాల సంఖ్య పెరుగుతున్నా వాటి రక్షణపై అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు రూ.లక్షల్లో ఖర్చు పారిశుధ్య వాహనాల మరమ్మతులకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. పెద్ద సమస్యలు తలెత్తితే నిధులు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో బల్దియా నిధులు ప్రైవేటు వ్యక్తులకు దరాదత్తం చేయాల్సి వస్తోంది. బల్దియా ఆధ్వర్యంలో మరమ్మతుల కేంద్రం నిర్వహిస్తే ఆ నిధులను ఆదాచేయొచ్చు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో వర్క్షాప్పై ప్రతిపాదన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వర్క్షాప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనపై గతంలో ఉన్నతాధికారులు దృష్టిసారించారు. బల్దియా కార్యాలయం వెనుక వర్క్షాప్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఉన్నతాధికారులు అప్పుడు చర్చించి, ప్రతిపాదన కూడా చేశారు. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. బల్దియాలో వాహనాలుఆటో ట్రాలీలు 50 ట్రాక్టర్లు 18 ఫాగింగ్ వాహనాలు 03 జేసీబీ వాహనం 02 బ్లేడ్ ట్రాక్టర్లు 02 డంపర్ ప్లేసర్ వాహనం 02 కంపాక్టర్ వాహనం 02 జెట్టింగ్ సెక్షన్ మిషన్ వాహనం 01 లిట్టర్ పిక్కర్స్ వాహనం 01 స్వీపింగ్ మిషన్ వాహనం 01 బొలోరో వాహనాలు 02 స్కైలిఫ్టర్ వాహనం 02 వైకుంఠ రథాలు 04 వాటర్ ట్యాంక్ వాహనాలు 06 బాబ్కాట్ వాహనం 01 బల్దియా వాహనాలకు పార్కింగ్ షెడ్డు కరువు తరచూ పాడవుతున్న పారిశుధ్య వాహనాలు వాహనాల సంఖ్య పెరిగినా పట్టించుకోని అధికారులుపార్కింగ్ షెడ్, గ్యారేజీపై దృష్టిసారిస్తాం నగరపాలక సంస్థ వాహనాల పార్కింగ్ కోసం బల్దియా ఆవరణలోనే పార్కింగ్ షెడ్డు నిర్మించడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు చేపట్టడానికి అనుకూలంగా ఉండేలా గ్యారేజీ నిర్మాణాలపై దృష్టిసారిస్తాం. ఇప్పటికే అధికారులు కూడా ఈ విషయంపై తనతో చర్చించారు. దీనిపై ఇంజినీరింగ్ విభాగం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – సీహెచ్.శ్రీకాంత్, నగరపాలక కమిషనర్ -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
జూలపల్లి(పెద్దపల్లి): గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం జూలపల్లిలో దారబోయిన లింగయ్య యాదవ్ స్మారక ఉమ్మడి జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడా టోర్నమెంట్ యువతలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు శారీరక ఆరోగ్యం, స్నేహభావం పెంపొందిస్తాయని అన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులు జాతీయస్థాయిలో ఆడేందుకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, అబ్బాపూర్ ఎంపీటీసీ దండె వెంకటేశం, సుల్తానాబాద్ జెడ్పీటీసీ ప్రకాశరావు, టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ సర్పంచ్ నర్సింహయాదవ్, సీనియర్ క్రీడాకారులు రాజయ్య, భూసారపు రవీందర్, గంగాధర్, అమరగాని వెంకటేశ్, బాలెంగల హన్మయ్య, ఆవుల రాజు, కొమ్మ సతీశ్, టీమ్ క్రీడా సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
ఊరిస్తున్న ‘నామినేటెడ్’
సాక్షి, పెద్దపల్లి: సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్, వివిధ జిల్లాస్థాయి పదవుల్లో నియామకాలు చేపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోని నామినేటెడ్ పదవులన్నీ రద్దు చేసింది. ఆ ర్వాత తొలివిడతలో రాష్ట్రస్థాయిలోని కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు చేపట్టింది. ఇందులో జిల్లా నుంచి రామగుండం ప్రాంతానికి చెందిన హర్కర వేణుగోపాల్రావును ప్రభుత్వ సలహాదారుగా, జిల్లాతో అనుబంధం ఉన్న మంచిర్యాలకు చెందిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ను కనీస వేతనాల కమిటీ చైర్మన్గా నియమించింది. అయితే, తొలివిడతతో జిల్లాపై ప్రభుత్వం శీతకన్ను చూపించినట్లు స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాక నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో పలువురు నేతలు పదవుల కోసం గాంధీభవన్ బాటపడుతున్నారు. ఫలితాల ఆధారంగానే.. పార్లమెంట్ ఎన్నికల వేళ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రచార వేళ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసిన తీరు ఆధారంగానే పదవులు, సీట్లు ఇస్తామని ప్రకటించిడమే దీనికి కారణం. మండలం, గ్రామం, బూత్ల వారీగా వచ్చిన ఓట్లు, ప్రత్యర్థి పార్టీకన్నా సాధించిన ఆధిక్యం ఆధారంగా పనితీరు అంచనా వేస్తామని వారు ప్రకటించడం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. అన్ని పార్టీల్లోంచి బీజేపీకి సైలెంట్ ఓటింగ్ అనూహ్యంగా పెరిగిందని, తద్వారా ఫలితం ఎలా వస్తుందోననే బెంగ కూడా ఆశావహులను వెంటాడుతోంది. పదవి కోసం.. ఏ పోస్టుకు ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? భర్తీ చేస్తారా? లేదా? అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని భావిస్తున్న పలువురు నేతలు.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతోఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల అండదండలతో వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సీని యర్ నేతలు రాష్ట్రస్థాయిలోని కార్పొరేషన్ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఆశావహులు జిల్లాస్థాయి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆదినుంచీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నవారు, వివిధ పార్టీల నుంచి ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పార్టీలో చేరినవారు, వివిధ జేఏసీ ల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమా న్ని ఉధృతంగా నడిపించిన వారు పదవులు తమకు దక్కుతాయనే ఆశతో ఉన్నారు. ఆశావాహుల జాబితా పెద్దదే.. ● పెద్దపల్లి నుంచి గోపగాని సారయ్య, సయ్యద్ మస్రత్, అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, గీట్ల రాజేందర్రెడ్డి, భూషణవేని రమేశ్గౌడ్, ఎలువాక రాజయ్య, రేగుంట అశోక్, డి.దామోదర్రావు, ఎల్.జలపతిరెడ్డి, మెండే పోశాలు, సాంబిరెడ్డి, బైరి రవిగౌడ్, పుప్పాల శంకర్, గట్టుయాదవ్, ఈర్ల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, గుండేటి అయిలయ్య యాదవ్, కట్ట నరేంద్రాచారి, శ్రీమాన్, చీటీ సతీశ్రావు, కల్లెపల్లి జానీ, మాదాసు వెంకన్న పటేల్, చిలుక సతీశ్, వేగోళం అబ్బయ్యగౌడ్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. ● మంథని నుంచి గంట వెంకటరామణారెడ్డి, శశిభూషణ్ కాచె, తోట చంద్రయ్య, ఆరెపల్లి కొ మరయ్య, ఇనుముల సతీశ్, ఒడ్నాల శ్రీనివాస్, తొట్ల తిరుపతియాదవ్, ఉప్పట్ల శ్రీనివాస్, నాగినేని జగన్మోహన్రావు, చొప్పరి సదానందం పదువుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ● ఇక రామగుండం ప్రాంతం నుంచి ఏఐసీసీ నేత గుమ్మడి కుమారస్వామి, సీనియర్ నేత బాబర్ సలీం పాషా, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, సూర సమ్మయ్య తదితరులు పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. కోడ్ ముగిశాక పదవుల పందేరం లెక్కలేసుకుంటున్న ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు కోసం ప్రయత్నాలు జిల్లాస్థాయి పదవులు, మార్కెట్ కమిటీలకు ఫుల్ డిమాండ్ -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీమదలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఈ క్రతువు నిర్వహించారు. ఆలయంలో చక్రతీర్థం, బలిహరణం, సాయంత్రం పుష్పయాగం, ధ్వజారోహణం, భూతబలి, సప్తవరణాల సేవ వంటి పూజాకార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. 15రోజులు గా సాగుతున్న ఉత్సవాలు రథోత్సవం, జాతరతో ముగిశాయి. ఆలయ అర్చకులు కొండపాక రామాచార్యులు, రామిడి వెంకటరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కొండల్రెడ్డి, నిరంజన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ నారగోని ఎల్లవ్వ, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్రెడ్డి తదితరులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముప్పిరితోటలో ముగిసిన తిరుకల్యాణోత్సవం -
గాలివాన బీభత్సం
● విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో శుక్రవా రం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డా యి. బసంత్నగర్ కేశోరాం స్టాఫ్కాలనీ, వర్కర్స్కాలనీల్లో పదుల సంఖ్యలో చెట్లు కూలి క్వార్టర్లపై పడిపోయాయి. దీంతో గోడలు, ప్రహరీలు ధ్వంసమ య్యాయి. పోచమ్మవాడలో పార్కింగ్ చేసి ఉన్న కా రుపై చెట్టు విరిగి పడటంతో ధ్వంసమైంది. బసంత్ నగర్ బస్టాండ్ – ఈసాలతక్కళ్లపల్లి మధ్య ప్రధాన రహదారిపై చెట్లు ఎక్కడికక్కడే విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక కోదండ రామాలయంలోని రావిచెట్టు కూలి నవగ్రహాల ఆలయంపై పడింది. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. కేశోరాం పరిశ్రమ సిబ్బంది శనివరాం ఉదయం పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు కన్నాల రజ్వీకాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. -
అక్రమార్కులపై ఉక్కుపాదం
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. కొందరి పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. – శ్రీనివాస్, పోలీస్కమిషనర్, రామగుండం గోదావరిఖని: ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను నకిలీ విత్తనాలు, ఎరువులు నిండా ముంచుతున్నా యి. అందమైన ప్యాక్లు, ఆకట్టుకునే డిజైన్లు, అ ద్భుతమైన పేర్లతో విత్తనాలను వ్యాపారులు రైతులకు అంటగడుతున్నారు. ఇవేమీ తెలియని అన్నదాతలు.. పంటవేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తక పోవడం, మరికొన్ని ఆశించిన దిగుబడి రాకపోవడంతో నష్టపోతున్నారు. వాణిజ్య పంటల్లో పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన కొందరు రైతులు మనస్తాపంతో ఆత్మహత్య లు చేసుకున్న సంఘటలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, రైతులను మోసం చేసే విత్తన సంస్థలపై కఠిన చర్యలకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. వర్షాకాలం సమీపించడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై రైతులు దృష్టి సారించారు. దీనిని అదనుగా చేసుకుని నకిలీవి అంటగట్టి అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలని కొందరు వ్యాపారులు కాచుకుకూర్చున్నారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆగని నకిలీ విత్తనాల దందా.. ● ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ● కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలుగా చెప్పి రైతులకు అంటగడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ● తీరా ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ● రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ● వానాకాలంలో సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నిఘా కోసం టాస్క్ఫోర్స్ కమిటీలు.. నకిలీ, కల్తీ విత్తనాల స్మగ్లింగ్పై ఉక్కుపాదం మో పాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అక్రమార్కులను అరికట్టడం కోసం వ్యవసాయ శాఖ, పోలీసు టాస్క్ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలు, ఎరువులను సరఫరా చేసే వారిని గుర్తించేందుకు నిఘా పెడతాయి. ● సమాచారం సేకరించి అక్రమార్కులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయి. ● ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విత్తన, ఎరువుల దుకాణాలు, గోదాముల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాయి. ● అనుమానం వస్తే విత్తన శాంపిళ్లు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపిస్తున్నారు. ● విత్తనాలు రవాణా చేసే వాహనాలనూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ● లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై చర్యలు చేపడుతున్నారు. ● అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ● రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపట్టారు. ● ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేసేలా ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రైతులకు ఈ కమిటీల సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. ● ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. ● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ● మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణా, సరఫరా నిరోధించేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు నమోదైన కేసులు, ఇతర సమాచారం ఏడాది కేసులు అరెస్ట్లు సీజ్ విత్తనాలు విలువ (కేజీల్లో) (రూ.లక్షల్లో) 2021 65 158 5,083 95.92 2022 13 27 1,483 27.97 2023 04 13 1,333 26.81 2024 02 02 6.5 0.13 నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నిఘా రామగుండం కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు అనుమానం వస్తే విత్తనాల శాంపిళ్ల సేకరణ -
జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
గోదావరిఖని: చిన్నారులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగి సింగరేణి పేరును దేశస్థాయిలో నిలపాలని ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ కోరారు. స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నెలరోజులపాటు కొనసాగిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. క్రీడలతో గెలుపొందాలనే తపన పోటీతత్వం, క్రమశిక్షణ అలవర్చుతుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సెల్ఫోన్, టీవీలపై విద్యార్థులు ఆసక్తి పెంచుకుని మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన సమయాన్ని క్రీడలపై వెచ్చిస్తే జీవితం అందంగా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, కరాటే విభాగాల్లో 150మందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు లక్ష్మీనారాయణ, రాంమోహన్, మల్లేశ్, రంగు శ్రీనివాస్, సారంగపాణి, రమేశ్, గాండ్ల రాజయ్య, కోచ్లు షాభాన, సోనియా, వినోద్, శ్రీనివాస్, మొండయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ -
స్టడీ మెటీరియల్ అందజేత
సాక్షి, పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని స్టడీ స ర్కిల్ విద్యార్థులకు అదనపు కలెక్టర్ అరుణశ్రీ శనివారం స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి నాగలైశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం బొగ్గు ఉత్పత్తిగోదావరిఖని: రాబోయే వర్షాకాలంలో ఓసీపీ ల్లో బొగ్గు, ఓబీ వెలికితీతకు అంతరాయం లే కుండా చర్యలు చేపట్టాలని సింగరేణీ సీఎండీ బలరాం కోరారు. శనివారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ హాజరయ్యారు. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన బొ గ్గు ఉత్పత్తిపై దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం దృష్ట్యా నూతన పంపుల ఏర్పాటు, వాటి సా మర్థ్యం పెంపొందించేందుకు చేపట్టవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూగర్బ గనుల్లో యంత్రాల వినియోగం, వాటిపనితీరు గురించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్జీ–1 ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. పుట్నూరులో డీపీవో పర్యటన పాలకుర్తి(రామగుండం): జిల్లా పంచాయతీ అ ధికారి(డీపీవో) ఆశాలత శనివారం పుట్నూరు గ్రామంలో పర్యటించారు. వైకుంఠధామం, షె గ్రిగేషన్షెడ్డు, పల్లెప్రకృతి వనం, క్రీడాప్రాంగ ణం, నర్సరీ పరిశీలించారు. నర్సరీలో మొక్క లు ఎండిపోకుండా కాపాడి, వచ్చే హరితహా రం కోసం సిద్ధం చేయాలని సూచించారు. గ్రా మంలో సేకరించిన చెత్తను షెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి తడి, పొడ్డి చెత్తను వేరుచేయాలని, తడిచెత్తతో ఎరువు తయారు చేసి విక్రయించి పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలని పంచాయతీ కార్యదర్శి పవన్కు సూచించారు. మండల పంచాయతీ అధికారి షబ్బీర్పాషా, కార్యదర్శి పవన్, కారోబార్ సతీశ్ ఉన్నారు. కనీస వేతనాలు చెల్లించండి యైంటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరే ణిలో పనిచేస్తున్న దాదాపు 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల ని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ డిమాండ్ చేశారు. ఆర్జీ–2 ఏరియాలోని జోన్–2లో శని వారం ఆయన వివిధ సెక్షన్ల కార్మికులతో స మావేశమయ్యారు. చట్టబద్ధమైన హక్కులతోపాటు కోల్ ఇండియా తరహాలో వేతనాలు చె ల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్డు తీ ర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈకార్యకరమంలో నాయకులు మధునమ్మ, రాజేశ్వరి, లింగయ్య, రాయమల్లు, నాగరాజు, లక్ష్మి, స్వామి, రజిత, నరేశ్ తదిరుతరులు పాల్గొన్నారు. ‘బకాయిలు ఎప్పుడిస్తారు?’రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు సెక్యూరిటీ సి బ్బంది, గేట్ మెయింటనెన్స్ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో కుటుంబ పోషణకు కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో భా గంగా 8 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా, కార్మిక చట్టం ప్రకారం కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు జోక్యం చేసుకుని తమకు బకాయిలతోపాటు కార్మిక చట్ట ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. రెండోరోజు ప్రశాంతం సాక్షి, పెద్దపల్లి: రెండోరోజు శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 512 మంది, ద్వితీయ సంవత్సరంలో 187 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొ దటి సంవత్సరం పరీక్షకు 45 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 10 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అన్నారు. రెండోరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 31లోగా దరఖాస్తు చేయాలి సాక్షి పెద్దపల్లి: ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గు రుకుల సొసైటీ జిల్లా సమన్వయ అధికారి జేజే థెరిసా తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి నాన్ సీవోఈ కళాశాలల్లో ఇంటర్ మొ దటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. -
ప్రజలను జాగృతం చేస్తున్న కళాకారులు
గోదావరిఖని: కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నారని ‘ఇప్టా’ నాయకుడు కె.స్వామి, సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ అన్నారు. స్థానిక భాస్కర్రావుభవన్లో శనివారం జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(ఇప్టా) ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. దేశ స్వాతంత్య్రానికి ముందు ముంబయిలో 1943 మే 25న ఇప్టా ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుంచి నేటివరకు దేశం, రాష్ట్రంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాటాలకు సంసిద్ధం చేస్తోందని తెలిపారు. ఎంతోమంది కళాకారులు ఇప్టాలో భాగస్వాములై కళలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పేరిట తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను కళారూపాల ద్వారా చైతన్యవంతం చేశారని గుర్తుచేశారు. సమస్యలపై కళాకారులు అనేక గీతాలు రచించి తమ గళం ద్వారా ప్రజలు, కార్మికులను చైతన్యం పరిచేందుకు మాభూమి, వీధి బాగోతంలాంటి కళలు ప్రదర్శించారన్నారు. కళాకారులు నాగభూషణం, మాదాల రంగారావు, అట్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, టి.కృష్ణ ప్రజానాట్య మండలి, ఇప్టా సభ్యులుగా, సినీ కళాకారులుగా కొనసాగారని గుర్తుచేశారు. ఇప్టాలో పనిచేసి అమరులైనవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుముల రాజమౌళి పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎజ్జ రాజయ్య, గౌతం గోవర్ధన్, తాళ్లపెల్లి మల్లయ్య, తొడుపునూరి రమేశ్కుమార్, సూర్య, ఓదెమ్మ, పడాల కనకరాజు, సంబోదు కొమురయ్య, నూకల మొండయ్య, జూల మోహన్, ఆసాల రమ తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. నృసింహుని రథోత్సవం
ధర్మారం(ధర్మపురి): ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తదితరులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
కార్మికులను ఇబ్బందులకు గురిచేయొద్దు
● ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ గోదావరిఖని: సింగరేణి కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్) చేపట్టిన డిజిటలైజేషన్ పేరిట కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ అ న్నారు. సీఎంపీఎఫ్ రీజియన్ కమిషనర్ హరిపచోరీని ఆయన శుక్రవారం కలిశారు. కార్మికులు ఎదు ర్కొంటున్న పలు సమస్యల గురించి ఆయనతో ప్రస్తావించారు. క్లెయిమ్స్ చెల్లింపుల్లో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కొన్నినెలలుగా కార్మికులకు ఒక అడ్వాన్స్ క్లెయిమ్ కూడా చేయలేదని ఆరోపించారు. ఈవిషయంలో సింగరేణి అధికారులు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సమన్వయంతో పనిచేసి క్లెయిమ్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. -
92శాతం ధాన్యం కొనుగోలు
సుల్తానాబాద్రూరల్: యాసంగిలో జిల్లావ్యాప్తంగా 92శాతం ధాన్యం కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. సుద్దాల లోని వినాయక రైస్మిల్లు, గోదామును శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 2.75లక్షల మె ట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 38,720మంది రైతుల నుంచి రూ. 605.20 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేసి 35,653మంది బ్యాంకు ఖాతాల్లో రూ. 499.58కోట్లు జమచేశామని ఆయన వెల్లడించారు. రైస్మిల్లర్లు లారీల్లోంచి ధాన్యం వేగవంతంగా అన్లోడ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యంలో కోత విధించకూడదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.రైల్వేస్టేషన్ సందర్శన రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబా ద్ డివిజనల్ మేనేజర్ భరతేశ్ కుమార్ గుప్తా శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్ను సందర్శించా రు. అమృత్ భారత్ పథకంలో చేపట్టిన రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ప నుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈసందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియ న్ నాయకులు ఆయనను కలిసి ఒక వినతిప త్రం అందజేశారు. శిథిలమైన క్వార్టర్లు మరమ్మతు చేయాలని, ఉద్యోగులకు సరిపడా కొ త్తవి నిర్మించాలని, ఐఆర్ఆర్టీ ఉద్యోగులను ఆర్వోహెచ్ డిపో నుంచి రిలీవ్ చేయాలని, ఎస్ అండ్ టీ, టీఆర్డీ, సీ అండ్ డబ్ల్యూలోని ఖాళీ లు భర్తీ చేయాలని, పెద్దపల్లి, రాఘవాపూర్, కొలనూర్, పొత్కపల్లి, కరీంనగర్ రైల్వేస్టేష న్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరా రు. రామగుండం రైల్వేస్టేషన్కు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలన్నారు. యూనియన్ రామగుండం బ్రాంచి చైర్మన్ మెట్ట రామారావు, సెక్రటరీ ఓవై స్వామి, మోజెస్, దేవ వీరన్న, రాథోడ్ ఆనంద్, అరవింద్, రాజ్కుమార్, బినోద్, రజనీకాంత్ పాల్గొన్నారు. పైకప్పుల ఏర్పాటుకోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జన రల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రమాదకరమైన సెఫ్టిక్ ట్యాంక్పై అధికారులు పైకప్పులు వేశారు. ‘ప్రాణం పో యినా పట్టింపు లేదా?’ శీర్షి క ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సెఫ్టిక్ ట్యాంక్పై పైకప్పులు ఏర్పాటు చేయించారు. సమస్య పరి ష్కారం అయ్యేలా ‘సాక్షి’ తీసుకున్న చొరవను పేషెంట్లు, స్థానికులు అభినందించారు. వికసించిన మే పుష్పం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఏడాదిలో కే వలం ఒక మేలోనే వి కసించే బ్ర హ్మకమలం(మే పుష్పం) శనివారం వికసించింది. స్థానిక హనుమాన్నగర్లోని గుండేటి రాజేశ్ – లక్ష్మి దంపతుల ఇంట్లో వికసించిన పుష్పాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
గోదావరిఖని: విధుల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ పోలీసు డ్రైవర్లకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కుటుంబ భవిష్యత్ను రోడ్డు పాలు చేస్తుందన్నారు. పోలీసు వాహనాలను కండిషన్లో ఉంచుకోవాలని ఆయన అన్నారు. పరిసరాలను నిశితంగా గమిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవాలని, స మయం వృథా చేసి, వాహనం నడిపే సమయంలో ఇబ్బంది పడవద్దని సూచించారు. వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ ఎంటీవో మధు, ఆర్ఐలు మల్లేశం, శ్రీనివాస్, రామగుండం ఎంవీఐ మధు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు. ● రామగుండం సీపీ శ్రీనివాస్ -
ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషా పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన ఫస్టియర్కు 1,063 మంది విధ్యార్థులకు 993 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవ త్సరం పరీక్షకు 468 మంది విద్యార్థులకు 436మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. పాలిసెట్కు 2,116మంది హాజరు సాక్షి, పెద్దపల్లి: పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం జిల్లా కేంద్రంలో శుక్రవారం పాలిసెట్ నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,330మంది విద్యార్థులకు 2,116మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. 90.8 హాజరు శాతంగా నమోదైనట్లు పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ కె.లక్షీనర్సయ్య తెలిపారు. -
పెద్దపల్లి
వచ్చే ఐదు రోజులు భగభగలేనేరెళ్ల(జగిత్యాల) 45.6కమాన్పూర్(పెద్దపల్లి) 44.4కరీంనగర్ 42.7రాజన్న సిరిసిల్ల 42.67ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్లో..)జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో వచ్చే ఐదురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగానే ఉండి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 41నుంచి 43 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24నుంచి 28 డిగ్రీల సెల్సియస్గా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. గాలిలో తేమ ఉదయం 34–57శాతం, మధ్యాహ్నం 13–21శాతం ఉండే అవకాశం ఉందన్నారు. వాయవ్యదిశ నుంచి ఈదురుగాలులు గంటకు 5–16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. -
డంపింగ్ యార్డుకు చోటేది?
● రోడ్డు వెంట పారబోస్తున్న చెత్త మంథని: మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సరిపడా ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక సమస్య తలెత్తుతోంది. ఫలితంగా సమీప గ్రామ పంచాయతీల్లో చెత్త పారబోస్తే.. అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. రోడ్డు వెంట.. ఆరు బయట.. ● బల్దియా జనాభా సుమారు 40వేలు ఉంటుంది. మొత్తం 13 వార్డులు ఉన్నాయి. ● మొత్తం 45మంది పారిశుధ్య సిబ్బంది ఇంటింటా నిత్యం చెత్త సేకరిస్తున్నారు. ● ఇందుకోసం 20 రిక్షాలు, ఆరు స్వచ్ఛ ఆటోలు, నాలుగు ట్రాక్టర్లు కేటాయించారు. ● పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. ● డంపింగ్ యార్డు లేక మంథని – కాటారం – గోదావరిఖని మార్గంలో రోడ్డు వెంట చెత్త పారబోస్తున్నారు. ● వ్యర్థాలు కుళ్లి కంపు కొట్టడంతో శివారు కాలనీల ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. ● కొందరు చెత్తను కాల్చివేస్తుండడంతో పొగ కమ్ముకుంటోంది. ● వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ● పందులు, పశువులు చెత్తను చిందరవందర చేయడం నిత్యకృత్యమైంది. ● సమీపంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలోని పేషెంట్లు, సిబ్బందికీ అసౌకర్యం కలుగుతోంది. స్థలం కేటాయింపుపై అభ్యంతరాలు.. డంపింగ్ యార్డు ఏర్పాటుకు మున్సిపల్ పరిధిలో అనువైన స్థలం లేదు. దీంతో మంథని – కాటారం ప్రధాన రహదారిలో ఎక్లాస్పూర్ సమీప గాడుదల గండిఘాట్ వద్ద చెత్త రీసైక్లింగ్, డంపింగ్యార్డుకు స్థలం కేటాయించారు. అది అటవీభూమి కావడంతో సమస్య తలెత్తింది. ఆ తర్వాత బిట్టుపల్లి, కాకర్లపల్లి శివారుల్లో ప్రతిపాదించినా ఇదే సమస్య ఎదురైంది. నాలుగు నెలల క్రితం ఖానాపూర్ శివారులో భూమి కేటాయించగా గ్రామస్తులు అడ్డుకుని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తాజాగా బిట్టుపల్లి శివారు రచ్చపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో రెండెకరాలు కేటాయించగా రీసైక్లింగ్కు ఓ ఏజెన్సీ ముందుకు వచ్చింది. అయితే, చెత్త తీసుకెళ్లి డంప్ చేసేందుకు యత్నించగా ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. డంపింగ్యార్డు నిలిపివేయాలని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పరిష్కారానికి చర్యలు డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టా. రచ్చపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో రెండెకరాల్లో రీసైక్లింగ్ కోసం కలెక్టర్ నుంచి అనుమతులు వచ్చాయి. కానీ, గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. గ్రామస్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తున్నాం. చెత్తను వేర్వేరుగా విభజించి దుర్వాసన రాకుండా, అసౌకర్యం ఉండదని కాంటాక్టు కంపెనీ చెప్పింది. ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలి. ప్రస్తుతం పట్టణ సమీపంలోని రోడ్డు వెంట వేస్తున్న చెత్తను పొక్లెయిన్ ద్వారా తరచూ శుభ్రం చేయిస్తున్నాం. – పెండ్రి రమ, చైర్పర్సన్, మంథని మున్సిపాలిటీ -
ఆటాడిస్తున్నారు..
●సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసను చేస్తూ జేబులు గుల్లచేస్తోంది. నగరపాలక సంస్థ అయిన రామగుండం, పురపాలిక స్థాయిలోని పెద్దపల్లిలో ఈ ఆట ‘మూడు ముక్కలు.. ఆరు షోలు’గా మా రి.. పట్టణాలు, మండల కేంద్రాలేకాకుండా గ్రామా ల్లోకి సైతం వ్యాపిస్తోంది. పోలీసులకు పట్టుబడితే సాధారణ కేసులతో ‘మూడు ముక్కలు.. ఆరు మా మూళ్లు’గా సాగుతోంది. ఇంతకుముందు క్లబ్బుల్లో నూ, ఊరుబయట నిర్వహించే ఈ ఆటను ఇప్పుడు నివాసాల్లోనే ఆడుతున్నారు. ఇందుకు కొన్ని లాడ్జిలు అడ్డాలుగా మారుతున్నాయి. ఎక్కడికక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆటాడుతున్నారు. చట్టరీత్యా నేరమైనా.. ● లాడ్జిలు, అద్దె గదుల్లో పేకాట నిర్వహించడం చట్టరీత్యా నేరం. ● కానీ గిరాకీ లేదనో, గదులు ఖాళీగా ఉన్నాయనో.. తెలిసిన వారు ఉన్నారనే కొందరు నిర్వాహకులు జూదరులకు సహకరిస్తున్నారు. ● పోలీసులకు పక్కా సమాచారం ఉండి, దాడులు చేస్తే దొరికిపోతున్నారు. ● కానీ, పేకాట నిర్వహణలో అసలు సూత్రదారులు తప్పించుకుంటున్నారు. ● కొందరికి ఇది ఆదాయవనరుగా మారింది. ● దీంతో వాళ్లు పేకాట ఆడించటమే కాకుండా అలసిన ఆటగాళ్లకు ఉత్సాహం తెప్పించేందుకు మందు, విందుతో ఖుషీ చేస్తున్నారు. ● ఆటగాళ్ల జేబులు ఖాళీ అయితే అధిక వడ్డీలకు అప్పు కూడా ఇస్తున్నారు. ● డబ్బులొస్తాయన్న ఆశకు వెళ్తూ ఆటగాళ్లు తమ జీవితాలు, సంసారాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అందర్.. బాహర్.. ● పేకాటలో అధిక మొత్తం డబ్బులు పెట్టడంతోపాటు అతి త్వరగా ముగించే ఆట అందర్–బాహర్ అని పేర్కొంటున్నారు. దీనిద్వారా ఒక్కొక్కరు రూ.లక్షలు పోగొట్టుకున్న వారు సైతం ఉంటున్నారు. కేవలం మూడు ముక్కలతో ఆడే ఆటలో ఎవరికి పెద్దముక్క వస్తే వారే ఆటలో గెలిచినట్లుగా భావిస్తారు. పెద్దముక్క వచ్చిందని భావించే వ్యక్తి పోగా.. మిగిలినవారు కూడా పందెంలో అదనంగా డబ్బులు డిపాజిట్గా పెడతారని చెబుతున్నారు.తనిఖీలు చేస్తాం పేకాట ఆడినట్లు తెలిస్తే కఠినచర్యలు తప్పవు. ఎవరైనా పేకాట ఆడటానికి ఇళ్లు, లాడ్జిలు అద్దెకు ఇస్తున్నట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. పేకాట ఆడుతున్నావారి సమాచారం అందిస్తే ప్రణాళిక బద్ధంగా దాడులు చేస్తాం. సమాచారం ఇచ్చిన వారిపేరు గోప్యంగా ఉంచుతాం. – శ్రీనివాస్, పోలీసు కమిషనర్, రామగుండం ఆన్లైన్ పేమెంట్స్తో కాయిన్స్ ఇస్తున్నారు.. పేకాట ఆడించే వ్యక్తులు పక్కా వ్యూహం రచిస్తారు. పేకాటలో పాల్గొనాలనుకునే వారు కూడా ఆడించే వ్యక్తికి పరిచయస్తుడు గానీ, లేకపోతే ఇప్పటికే పేకాటకు వస్తున్నవారికి తెలిసిన వ్యక్తిగానీ అయి ఉండాలి. ఎవరైనా తెలిసిన వ్యక్తి ద్వారా మాత్రమే పేకాట కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. వారివద్ద డబ్బులు తీసుకుని దానికి తగినట్లు కాయిన్స్ ఇస్తున్నారు. వాటిద్వారా దాడుల్లో పోలీసులకు డబ్బులు పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఆన్లైన్లో పేకాట ఆడటం నిషేధం కావడంతో ఫేక్ జీపీఎస్ యాప్ సాయంతో ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ ఖాతా ఖాళీ చేసుకుంటున్నారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్రకు.. జిల్లాలో పేకాట ఆడేవారే కాకుండా మరికొందరు మంచిర్యాల, మహారాష్ట్రకు వెళ్లి అక్కడ పేకాట ఆడిపిస్తున్నారు. అక్కడి పేకాట క్లబ్ నిర్వాహకులు స్థానికంగా ఏజెంట్లను నియమించుకుని, వారిద్వారా పేకాటరాయళ్లను కారులో తీసుకువెళ్లి మరీ ఆడిస్తున్నారు. మరికొందరిని గోవా, బెంగళూర్ ప్రాంతా ల్లోని పేకాట స్థావరాలకు వాహనాల్లో తరలించి ఆడిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జోరుగా మూడు ముక్కలాట రహస్య ప్రదేశాలు, లాడ్జిలే అడ్డాలు నిర్వహణకు ప్రత్యేక బృందాలు చేతులు మారుతున్న రూ.లక్షలు మద్యం, బిర్యానీ, సిగరెట్లూ సప్లై జేబులు నింపుకుంటున్న నిర్వాహకులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గోదావరిఖనిలోని ఓ లాడ్జిపై ఇటీవల దాడి చేశారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.2.5లక్షల నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయినా, కార్మిక కేత్రంతోపాటు జిల్లాలోని చాలాప్రాంతాల్లో పేకాట జోరు తగ్గడం లేదు -
ఆక్వా హబ్ రాదా.. ఉపాధి లేదా?
● నీరులేక మిడ్మానేరు వెలవెల ● సిరిసిల్ల ఆక్వా హబ్పై నీలినీడలు ● చీర్లవంచ, చింతల్ఠాణా వద్ద భూకేటాయింపు ● ఆసక్తి చూపిన మూడు కంపెనీలు వెనక్కి ● అగమ్యగోచరంగా రూ.102 కోట్లు, 365 ఎకరాలు ● అసలు ప్రాజెక్టే ఉండకపోవచ్చంటున్న బీఆర్ఎస్ నేతలు ● 23 వేలమందికి ఉపాధి కల్పన కలే!సాక్షిప్రతినిధి, కరీంనగర్: గత ప్రభుత్వం సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా హబ్ రద్దయ్యిందా? దాదాపు 23 వేల మందికి ఉపాధి కల్పన ల క్ష్యంగా దేశీయ, బహుళజాతీ కంపెనీలను సిరిసిల్ల కు ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో మిడ్మానేరులో నీటి లభ్యత, స్థానిక వాతావరణం ఆక్వా హబ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయా ల కల్పన(టీఎస్ ఐఐసీ) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలంలో 365 ఎకరాల భూ సేకరణ, ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అధ్యయనం కూడా పూర్తిచేసింది. కానీ.. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు కోసం సిద్ధం చేసిన రూ.102 కోట్లు, 365 ఎకరాల కేటాయింపులు అగమ్యగోచరంగా మారాయి. ఎక్కడ నిర్మించతలపెట్టారు? దాదాపు రూ.102.9 కోట్ల వ్యయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్ఠాణాలోని ముంపు గ్రామాల్లో ఆక్వా హబ్ ఏర్పాటు చేయాల్సింది. దీనిపై ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూకేటాయింపులు కూడా జరిపారు. రెండు గ్రామాల పరిధిలో 365 ఎకరాలు ఇందుకోసం కేటాయించారు. ఇవి మిడ్మానేరు ముంపు గ్రామాలు కావడం, గోదావరి బేసిన్లో మిడ్మానేరు ఉండటం, కాళేశ్వరం నుంచి నిరంతరం నీటిని ఎత్తిపోసే సౌలభ్యం ఉండటంతో టీఎస్ ఐఐసీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహాత్మకంగా ఈ రెండు గ్రామాలను ఎంపిక చేసింది. ఆక్వా రంగంలో సత్తా చాటాలనుకునే కంపెనీలకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి భూమి, రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. అప్పటికే ఇక్కడ ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ఫ్రెష్ టు హోమ్ సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మత్స్య పరిశ్రమ ఏర్పాటై ఉండేది. అయితే, ప్రభుత్వం మారడంతో టీఎస్ ఐఐసీ, స్థానిక కలెక్టర్, రెవెన్యూ అధికారులెవరూ ప్రాజెక్టు మనుగడపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బంజరు భూమి, కొండ ప్రాంతాలు.. వాస్తవానికి చీర్లవంచ, చింతల్ఠాణా రెండూ ముంపుగ్రామాలే. ముంపు పోను రెండు గ్రామాల్లో మిగిలిన సర్వే నంబర్లు 224, 225, 226, 310, 613, 614, 698, 699, 701, 702, 704, 715, 718, 719లోని 365 ఎకరాలను ఈ పరిశ్రమ నిర్మాణానికి కేటాయించారు. ఇందులో అధికశాతం బంజరుభూమి, కొండ ప్రాంతం. అందుకే, ఇక్కడ ఆక్వా హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్వా హబ్కు ప్రతీరోజు 15.52 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందించాలనుకున్నారు. పరిశ్రమల నుంచి 10.8 ఎంఎల్డీ రిసైకిల్డ్ వాటర్ విడుదలవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా నీటి వ్యర్థాల శుద్ధికి 13 ఎంఎల్డీల సామర్థ్యంతో భారీ ఎస్టీపీ, ఇక ఘన వ్యర్థాలు, ఎలక్ట్రిక్వ్యర్థాల నిర్వహణను టీఎస్ ఐఐసీ చూసుకుంటానంది. ఆ కంపెనీలు వెనక్కే? ఆక్వా హబ్ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ఫ్రెష్ టు హోమ్ సంస్థలు ఆసక్తి చూపాయి. కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా 194 ఎకరాలు ప్లాటింగ్, 79 ఎకరాల్లో పచ్చదనం, రోడ్ల కోసం 31 ఎకరాలు, సామాజిక సదుపాయాల కింద 14 ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా తంగళపల్లి నుంచి 120 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలిదశలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. మరిన్ని కంపెనీలు హబ్లో కొలువు దీరితే.. తొలిదశలో దాదాపు 5,000 మందికి, ప్రాజెక్టు పూర్తయ్యాక దాదాపు 17,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. అందులోనూ తొలుత మిడ్మానేరులోని ముంపుగ్రామాలకు.. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా యువతకు కొలువుల్లో ప్రాధాన్యం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రాజెక్టు ఇక రద్దయినట్లేనని బీఆర్ఎస్ నేతలు వాఖ్యానిస్తుండటంతో స్థానిక యువతలో తీవ్ర నిరాశ ఆవహించింది. -
సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి
● బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య గోదావరిఖని: సింగరేణిలోని సెక్యూరిటీ గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. శు క్రవారం ఆర్జీ–1 పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎండీ క్యాంప్ ఆఫీస్ వద్ద సెక్యూ రిటీ పోస్టు ఏర్పాటు చేయాలని, జనరల్ మేనేజర్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ గార్డుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జీ డీకే–5 ప్రాజెక్టు మెయిన్గేట్ వద్ద ఎలక్ట్రికల్ భూమ్ బ్యారియర్ బిగించాలని, జీడీకే–1, 3, 2, 2ఏ గను ల వద్ద సెక్యూరిటీ సిబ్బందికి పర్మినెంట్ సెక్యూరిటీ పోస్టులు నిర్మించాలన్నారు. రికార్డింగ్ సెక్యూరిటీ పోస్టుల్లో కాలం చెల్లిన ఏసీలకు బదులు కొత్త ఏసీలను బిగించాలన్నారు. విద్యుత్ సౌకర్యం లేనిచెక్ పోస్టుల వద్ద సోలార్ ప్యానల్ లైటింగ్ సిస్టం ఏర్పా టు చేయాలని, లాంగ్వాల్షెడ్లో బుష్ కటింగ్, జంగిల్ కటింగ్ పూర్తిస్థాయిలో చేసి కూలిన గోడలు నిర్మించాలని అన్నారు. ప్రతీగని, డిపార్ట్మెంట్లో రెండో షిఫ్ట్, నైట్షిఫ్టులో రెండోపోస్టు ఏర్పాటు చే యాలన్నారు. మొబైల్టాస్క్ఫోర్స్లో సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆకుల హరిణ్, పుప్పాల నాగేంద్రప్రసాద్, తా ట్ల లక్ష్మయ్య, చెన్న సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘జల్సా’మహోత్సవం
ట్రాన్స్జెండర్ల కుటుంబంలోకి నూతనంగా చేరిన సుష్మితకు కోలాహలం మధ్య ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన సుష్మిత ట్రాన్స్జెండర్గా మారడంతో గురువారం జల్సా మహోత్సవం నిర్వహించారు. పెళ్లికూతురుగా ముస్తాబు చేసి సుష్మితను వేదికపై కూర్చోబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి ట్రాన్స్జెండర్ల పెద్దలందరూ వచ్చి సుష్మితను ఆశీర్వదించారు. అనంతరం కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లు పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. స్థానికులు సైతం ఈ జల్సా మహోత్సవాన్ని ఆసక్తిగా తిలకించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
జీజీహెచ్లో మెరుగైన ఈఎన్టీ సేవలు
కోల్సిటీ: గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఈఎన్టీ సేవలను మెరుగుపర్చినట్లు సూపరింటెండెంట్ దయాల్సింగ్, ఆర్ఎంవో అరుణ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొత్తగా సమకూర్చిన ప్రత్యేక ఆధునిక వైద్య పరికరాలతో సేవలను మరింత మెరుగుపర్చినట్లు వెల్లడించారు. దీంతో ఈఎన్టీ విభాగంలో ఈఎన్టీ డాక్టర్ మనుంజయ్ నేతృత్వంలో అన్ని ప్రధాన శస్త్ర చికిత్సలను చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అడెనో టాన్సెలెక్టమీ(కుతికల సమస్య)తో బాధపడుతున్న ఓ పేషెంట్కు ఇటీవల ఈఎన్టీ డాక్టర్ మనుంజయ్ విజయవంతంగా తొలి శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. జీజీహెచ్లో ఉచితంగా అందిస్తున్న ఈఎన్టీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement