నీటి టబ్బులో పడి చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

నీటి టబ్బులో పడి చిన్నారి మృతి

Published Sun, May 5 2024 8:05 AM

-

చెన్నేకొత్తపల్లి: టబ్బులో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం యర్రజినన్నగారిపల్లి (కొండకింద పల్లి) గ్రామానికి చెందిన బొగ్గు మురళి, అరుణ దంపతులకు ఓ కుమార్తెతో పాటు 14 నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. శనివారం వేసవి తాపం అధికంగా ఉండడంతో సాయంత్రం టబ్‌లో నీరు పోసి అందులో కుమారుడిని కూర్చొబెట్టి తల్లి ఆడించింది. ఈ క్రమంలోనే పనిపై చిన్నారిని టబ్‌లోనే వదిలేసి ఇంట్లోకి వెళ్లిన ఆమె బయటకు వచ్చి చూసే లోపు నీట మునిగి బాలుడు మృతి చెందాడు.

Advertisement
Advertisement