వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

Published Sun, May 5 2024 8:05 AM

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

గుత్తి/తాడిపత్రి: జిల్లాలోని గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపిన మేరకు... గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన జనార్దన్‌ (46) రెండేళ్లుగా గుత్తి ఆర్‌ఎస్‌లోని సుందరయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా కుదేలైన ఆయన శనివారం ఉదయం ఎంఎంస్‌ హైస్కూల్‌ సమీపంలోని పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

● తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రఫీ, రషీదా దంపతుల కుమారుడు షాహీద్‌ బాషా (20) ఇంటర్‌ పూర్తి చేశాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు. కొంత కాలంగా మానసిక స్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన షాహిద్‌ బాషా అర్ధరాత్రి సమయంలో యల్లనూరు – పుట్లూరు మార్గంలోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని తాడిపత్రి స్టేషన్‌ మాస్టర్‌కు లోకో పైలట్‌ తెలపడంతో శనివారం ఉదయం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప తెలిపారు.

Advertisement
Advertisement