-
ముగిసిన అంజన్న బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లిచౌరస్తా: ఎర్రవల్లి మండల పరిదిలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాల నడుమ ఆంజనేయస్వామిని ఆలయం నుంచి పల్లకిలో కృష్ణానది వరకు ఊరేగించారు. అర్చకులు కృష్ణానదిలో వేద మంత్రాల నడుమ బీచుపల్లి రాయుడికి అమృతస్నానాన్ని వైభవంగా చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు మట్టి కుండల్లో దాసంగాలు.. నైవేద్యాలను వండి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ తీఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు తదితరులు ఉన్నారు. చివరి రోజు వైభవంగా కృష్ణానదిలో స్వామివారి అవభృత స్నానం -
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలి
వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుందని.. ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ ఎం.నగేష్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన వనపర్తి నియోజకవర్గ కౌంటింగ్ సిబ్బంది మొదటిస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాటించాల్సిన నిబంధనలు, కౌంటింగ్ చేసే విధానంపై మాస్టర్ ట్రైనర్లు ఇచ్చిన శిక్షణను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్, రమేష్రెడ్డి, కిషన్నాయక్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి పూర్ణచందర్, టేబుల్ సూపర్వైజర్లు, సహాయకులు, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఎం.నగేష్ -
త్వరలోనే ఆయిల్ మిల్లు ప్రారంభం
ఎర్రవల్లి చౌరస్తా: ప్రభుత్వం త్వరలోనే విజయవర్ధి ని ఆయిల్ మిల్లును ప్రారంభించి నడిగడ్డ రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి బీచుపల్లి ఆయిల్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష మేరకు విజయవర్ధిని ఆయిల్ మిల్లులో పురాతన సామగ్రిని తొలగించి రూ.150 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఆయిల్ మిల్లుకు 10 వేల ఎకరాల్లో రైతులు పండించిన పంటను ఆయిల్గా మార్చే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటికే నడిగడ్డలో సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు పంట సాగుచేస్తున్నారని, నాగర్కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాల్లో రైతులు పండించిన ఆయిల్పాం గెలలను సైతం ఇక్కడికే తీసుకువస్తామన్నారు. దీంతో ఆయిల్పాం సాగు చేసిన రైతులు ప్రతిఏటా రూ.లక్షల దిగుబడి తీసి అధిక ఆదాయం పొందుతారని చెప్పారు. కార్యక్రమంలో పెబ్బేర్ మార్కెట్ యార్డు చైర్మన్ బుచ్చారెడ్డి, శ్రీరంగాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, మండలాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, ఆయిల్ఫెడ్, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. -
జూన్ 27 నుంచి అడ్మిషన్లు
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చాయి. ఎంసెట్ ర్యాంకులను బట్టి నిర్వహించే ఆన్లైన్ వెబ్ఆప్షన్ ఆధారంగా ఇంజినీరింగ్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. జూన్ 27 నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కళాశాలలో పాలిటెక్నిక్తోపాటు ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. – పరమేశ్వరి, ప్రిన్సిపల్, పాలిటెక్నిక్ కళాశాల, కోస్గి -
సమీకృతం.. అసంపూర్ణం
ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డు నిర్మాణాల్లో కానరాని కదలిక పనుల్లో వేగం పెంచాలి.. ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేస్తే ఫుట్పాత్లపై కూరగాయలు, మాంసం విక్రయాలు చేపట్టే చిరు వ్యాపారులకు మేలు జరుగుతుంది. వ్యాపారులు, వినియోగదారులకు సౌలభ్యంగా మారనున్న వీటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవచూపాలి. – తోట రవి, కూరగాయల వ్యాపారి, ఆత్మకూర్ రెండునెలల్లో పూర్తి.. సమీకృత శాఖాహార, మాంసహార మార్కెట్యార్డు నిర్మాణం పనుల్లో పురోగతిపై దృష్టి సారించాం. కాంట్రాక్టర్ను పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరాం. చేసిన పనులకు డబ్బులు మంజూరుచేస్తే మిగిలిన పనులు చేపడతామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. – నాగరాజు, పుర కమిషనర్, ఆత్మకూర్ ఆత్మకూర్: జిల్లాలోని కొత్త పుర కేంద్రాల్లో అన్ని హంగులతో సమీకృత శాఖాహార, మాంసహార మార్కెట్ల సముదాయాల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిధులు మంజూరు చేసింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్లు విడుదల చేస్తూ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించినా.. నేటికీ సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణాలు ఎప్పుడు పూర్తిచేసి తమకు కేటాయిస్తారని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డు నిర్మాణ పనుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులపై ప్రత్యేక దృష్టి సారించలేకపోతున్నారు. అప్పట్లో వేసిన టెండర్కు.. ప్రస్తుతం పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అదనపు భారం పడుతుందని నిర్మాణాలపై శ్రద్ధ చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు పనుల్లో వేగం పెంచాల్సిన సంబంధిత అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నాలుగేళ్లవుతున్నా .. ముందుకు సాగని పనులు ఒక్కో మున్సిపాలిటీకి రూ.2 కోట్లు కేటాయించిన ప్రభుత్వం జిల్లాలోని కొత్త పురపాలికల్లో ఇదే తీరు.. పూర్తయితే ప్రయోజనం.. ఇంటిగ్రేటేడ్ మార్కెట్యార్డ్ల నిర్మాణాలు పూర్తయితే కూరగాయలు, పండ్లు, పూలు, మాంసాహారం, చేపల విక్రయాలు రహదారులపై ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒకేచోట జరగనున్నాయి. చిరు వ్యాపారులకు దుకాణాలు కేటాయించి వారి నుంచి అద్దె వసూలు చేసి నిర్వహణ కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించారు. కాని నేటికీ నాలుగేళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. -
సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
అమరచింత: ప్రజా సంఘటితంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. ఆ దిశగా ప్రజల పక్షాన ఆందోళనలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో జరిగిన మాస్లైన్ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు శనివారం ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. భారత్ ఎంతో చరిత్ర గల దేశమని.. తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం, మోఘలాయిలు, తురుష్కులు, నవాబులు దేశ సంపదను దోచుకున్నారని.. వారి అవసరాల మేరకు ఇక్కడ రవాణ, వర్తక సదుపాయాలు, విద్యాలయాలు ఏర్పాటు చేశారే తప్పా ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనతో కాదన్నారు. ఇదే విధానాన్ని ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోందని.. ప్రధాని మోది ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలు ముఖ్యమంటునే.. ప్రజలకు అందాల్సిన సంక్షేమాలను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్ల ధనం పేరుతో ధనవంతులు దాచుకున్న డబ్బును వారికే సొంతం చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని తుంగలో తొక్కి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ నిరుద్యోగులతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ ఆరాచకాలు ఎక్కువయ్యాయని.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఐ మాస్లైన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాంచందర్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్కుమార్, హన్మంతు, సాంబశివుడు, ప్రసాద్, వెంకటేష్, గణేష్, దేవదానం, కొండారెడ్డి, శివారెడ్డి, చంద్రన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ వైపు అడుగులు
కోస్గి: పాలమూరు విద్యార్థులకు మరో ఉన్నత విద్య చేరువైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కోస్గిలో ఏర్పాటు చేయడానికి అధికారిక అనుమతులు వచ్చేశాయి. దీంతో విద్యాపరంగా కోస్గి ప్రాంతం ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందనుంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తూ ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులకు ఉన్నత విద్యా శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధికారిక అనుమతులు ఇస్తూ 2024– 25 ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. ఇకపై స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సులతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల కల నెరవేరినట్లయ్యింది. గతంలో రేవంత్రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయగా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తుండటంతో శరవేగంగా సాగుతున్న విద్యారంగ అభివృద్ధి పనులపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి కళాశాల రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుబంధంగా కొనసాగుతున్నాయి. కాగా.. కోస్గిలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మాత్రం కంట్రోల్ ఆఫ్ ద కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ) ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1972 సంవత్సరంలో హైదరాబాద్, అనంతపూర్, కాకినాడలో మాత్రమే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండేవి. తర్వాత అవి జేఎన్టీయూ అనుబంధ కళాశాలలుగా మారాయి. కాగా రాష్ట్రంలో సీటీఈ పరిధిలో పనిచేసే మొదటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను కోస్గిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. అందుబాటులో కోర్సులు.. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే జేఎన్టీయూ అధికారుల బృందం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి సౌకర్యాలు, మౌలిక వసతులతోపాటు ఇతర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. 2024– 25 విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్లో అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, డాటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రతి కోర్సులో 60 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే పాలిటెక్నిక్ కోర్సులతోపాటు ఇంజినీరింగ్ కోర్సులకు సైతం అడ్మిషన్లు చేపట్టాలని, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సులకు కలిపి మొదటి సంవత్సరం 200 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కోస్గిలో ప్రభుత్వ పరిధిలో ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతి పాలిటెక్నిక్ కాలేజీనే ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ రాష్ట్రంలో సీటీఈ పరిధిలోకి వచ్చే మొదటిది ఇదే.. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు పాలమూరు విద్యార్థులకు చేరువైన మరో ఉన్నత విద్య -
నాసిరకం విత్తనాలు అమ్మితే చర్యలు
వనపర్తి: నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ పవార్ హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్లు, రసీదు పుస్తకాల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా అధిక దిగుబడి, లాభసాటి వ్యవసాయం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955, వ్యవసాయ సాంకేతిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేంద్రియ ఎరువులైన మొలాసిస్ ఆధారిత, పచ్చిరొట్ట, సారవంతమైన చెరువు మట్టిని ఉపయోగించి భూసారం పెంచుకునేందుకు రైతులు చొరవ చూపాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి గతేడాది సాగు చేసిన పంట, దిగుబడి, పొలం తీరును తెలుసుకొని అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. విత్తన, ఎరువుల డీలర్లకు ప్రభుత్వం తరఫున కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని.. నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువులను ఈ–పాస్ యంత్రాల ద్వారానే విక్రయించాలన్నారు. ఇన్చార్జ్ డీఏఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దళారులు రైతుల వద్దకొచ్చి తక్కువ ధరకు మేలు రకం విత్తనాలు ఇస్తామని ప్రచారం చేస్తుంటారని.. అలాంటి వాటిని నమ్మొద్దని తెలిపారు. విత్తన ప్యాకెట్పై లేబుల్, ప్యాకింగ్ లేకుండా ఉన్న విత్తనాలు తీసుకోవద్దని.. ఎక్కడైనా ఇలాంటి విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. రిజిస్టర్డ్ డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని.. ప్యాకెట్పై లేబుల్తో పాటు కంపెనీ పేరు, గడువు పూర్తి తేదీ తదితర వివరాలను రైతులు పరిశీలించాలని సూచించారు. బీటీ–3 పత్తి విత్తనాలపై నిషేధం ఉందన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించినప్పుడు బిల్లు పైన రైతు పేరు, తండ్రి పేరు, ఫోన్నంబర్తో పాటు విత్తన కంపెనీ పేరు, క్రమ సంఖ్య తదితర పూర్తి వివరాలు నమోదు చేయాలని తెలియజేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వ్యవసాయ అధికారులు, విత్తన, ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ‘ధరణి’ దరఖాస్తులు పెండింగ్ ఉండొద్దు.. జిల్లావ్యాప్తంగా ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ పవార్ సూచించారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి దరఖాస్తుల పురోగతి వివరాలను ఆన్లైన్లో పరిశీలించారు. తహసీల్దార్లు, ఆర్డీఓ లాగిన్కు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు తన లాగిన్కు పంపించాలని సూచించారు. కలెక్టర్ తేజస్ పవార్ సీఎంఆర్ గడువులోగా అప్పగించాలి.. వానాకాలం 2020–21, యాసంగి 2021–22కు సంబంధించిన సీఎంఆర్ను నిర్ణీత గడువులోగా ఎఫ్సీఐకి అప్పగించాలని కలెక్టర్ తేజస్ పవార్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో మిల్లర్లు, సంబంధితశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లర్లు లెక్క ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని వారిపై ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.నగేష్, ఇన్చార్జ్ డీఎం, డీఎస్ఓలు శ్రీనివాస్, ప్రవీణ్తో పాటు సిబ్బంది, మిల్లర్లు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్
వనపర్తిటౌన్: జిల్లాలో శుక్రవారం పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగిన ప్రవేశ పరీక్షకు 93.0242 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కో–ఆర్డినేటర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 2,394 మంది విద్యార్థులు (బాలురు 1,263, బాలికలు 1,131) మందికి గాను 2,227 (బాలురు 1,182, బాలికలు 1,045) హాజరుకాగా.. 167 మంది (బాలురు 81, బాలికలు 86) గైర్హాజరయ్యారన్నారు. బాలురు 93.5867 శాతం, బాలికలు 92.3961 శాతం హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులను గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. 93 శాతం విద్యార్థులు హాజరు -
సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణపై దృష్టి సారించాలి : డీఎల్పీఓ
అమరచింత: గ్రామపంచాయతీల్లోని సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకొచ్చి సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించాలని డీఎల్పీఓ రఘనాథ్రెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని నందిమళ్ల ఎక్స్రోడ్, కిష్టంపల్లి, మస్తీపురం గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. నిత్యం ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్యార్డ్కు తరలించడమే కాకుండా సేంద్రియ ఎరువు తయారు చేసి విక్రయించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల్లోని వైకుంఠధామాలు, క్రీడా మైదానాలు, ప్రకృతి వనాల సంరక్షణతో పాటు హరితహారం మొక్కలకు రోజు విధిగా నీటిని అందించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదించాలని కోరారు. మిషన్ భగీరథ నీరు క్లోరినేషన్ చేస్తున్నారా లేదా పరిశీలించి సంబంధిత అధికారులకు నివేదించాలన్నారు. ఆయన వెంట ఎంపీఓ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
సమాయత్తం
స్థానిక పోరుకు..జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు క్షేత్రస్థాయిలోకి పార్టీలు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండగ కొనసాగనుంది. ఈ క్రమంలో ఆయా ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకం అయ్యేలా తమ కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని, వరికి రూ.500 బోనస్ విషయంలో తహసీల్దార్లు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని పార్టీ శ్రేణులను నిర్దేశించింది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే వెంటనే ప్రతి స్పందించడం, ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యనేతలను రంగంలోకి దింపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో ఉన్న తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ● గత అసెంబ్లీ ఎన్నికల జోరు మున్ముందు వచ్చే వాటిలోనూ కొనసాగించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులదే భవిష్యత్ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తుపై ఆశావహుల్లో ఉత్తేజం నింపుతోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. ఎన్నికలు ఏవైనా తమ ప్రాబల్యాన్ని చూపేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఇంటింటికీ చేరుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు నేతలు, పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ● ఇప్పటికే పూర్తయిన సర్పంచ్ల పదవీకాలం ● జూలై 3తో ముగియనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ● లోక్సభ ఎన్నికల కోడ్ తర్వాత స్థానిక పోరు ఉంటుందన్న అంచనాలు ● ఏర్పాట్లలో యంత్రాంగం.. ప్రయత్నాల్లో ఆశావహుల నిమగ్నం సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్రంలో ఇప్పటికే లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలవుతుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఏడాది ముగిసేలోగానే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆశావహులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేడి ఆరకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల హీట్ చల్లారక ముందే స్థానిక పోరుతో ఈ ఏడాది మొత్తం రాజకీయ రణరంగం కొనసాగనున్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. పల్లెల్లో ప్రత్యేక పాలన.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సైతం పూర్తికావడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైనే అందరి దృష్టిపడుతోంది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తికావడంతో గత ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 2024 జనవరిలో తిరిగి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టకుండా ప్రత్యేకాధికారులను నియమించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం జూన్ నెలలోనే రిజర్వేషన్ల అంశాన్ని కొలిక్కి తెచ్చి, జూలై, ఆగస్టు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కావాల్సిన యంత్ర సామగ్రి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు మహబూబ్నగర్ 14 184 441 నాగర్కర్నూల్ 20 212 461 వనపర్తి 14 128 255 జోగుళాంబ గద్వాల 12 141 255 నారాయణపేట 11 142 280రిజర్వేషన్లపైనే సర్వత్రా చర్చ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లను ప్రకటించి పంచాయతీ ఎన్నికలను నిర్వహించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లను పదేళ్లకు పొడిగించింది. కాగా.. వచ్చే ఎన్నికల్లోనూ గతంలోని రిజర్వేషనే అమలయ్యే అవకాశ ం ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దా నిపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల కోడ్ ము గిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలవుతుందన్న అంచనాలతో ఇప్పటికే ఆశా వహులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
ఈదురు గాలుల బీభత్సం
మదనాపురం మండలం కరివెనతండాలో కూలిన ఇంటి పైకప్పు రేకులు.. నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మదనాపురం, ఆత్మకూర్ మండలాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగగా.. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మదనాపురం మండలంలోని కరివెనతండాలో బాబునాయక్, రాజునాయక్, అంబ్రేష్ నాయక్, శ్రీనునాయక్ ఇంటి పైకప్పు లేచిపోయాయి. పొలాల్లోని స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా లేక అంధకారం నెలకొంది. అలాగే ఆత్మకూర్లో ఈదురు గాలులకు భారీ వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది చర్యలు చేపట్టినా అర్ధరాత్రి వరకు పూర్తికాలేదు. – మదనాపురం, ఆత్మకూర్ నేలకొరిగిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు రేకులు -
‘సొమ్ము మాయం’పై అడిషనల్ కలెక్టర్ ఆరా..
వనపర్తిటౌన్: పురపాలికలో కాంట్రాక్టర్లకు సంబంధించి ఎఫ్ఎస్డీ, ఈఎండీ ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిన విషయమై ఈ నెల 22న ‘సాక్షిశ్రీలో ‘సొమ్ము మాయం..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో శానిటేషన్, రెవెన్యూ, ఇంజినీరింగ్, అకౌంట్ సెక్షన్ల అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎఫ్ఎస్డీ సొమ్ము ఎటు పోయిందని.. కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. పుర ఖజానా ఖాళీగా ఉండటం.. అప్పట్లో కలెక్టర్ ప్రొసీడింగ్లకు అనుగుణంగా నిధులు డ్రా చేసినట్లు బదులిచ్చారు. ఎంత మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు.. నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది ఉన్నారా? లేరా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది నియామకానికి సీఎండీఏకు లిఖిత పూర్వకంగా విన్నవించాలని సూచించారు. ఇంజినీరింగ్ విభాగంలో తాగునీటి పైప్లైన్ లీకేజీ, పెండింగ్ పనులు, ప్రారంభం కాని పనులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుర ఆదాయం పెంచేందుకు పన్ను వసూళ్లలో వేగం పెంచాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. బహుళ అంతస్తు నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా అసెస్మెంట్ పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ విధిగా వసూలు చేయాలన్నారు. సమావేశంలో కమిషనర్ ఎం.పూర్ణచందర్, ఆర్ఓ అనిల్కుమార్, డీఈ మహాలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కో విభాగం అధికారులతో వేర్వేరుగా సమీక్ష -
పల్లెపాలన అస్తవ్యస్తం
అమరచింత: గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల పదవీకాలం ముగియడం, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం అధికమైంది. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకాకపోవడంతో కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం క్లస్టర్ గ్రామాలుగా ఎంపిక చేసి జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం నిధులు, విధులపై స్పష్టత ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో కనీసం విద్యుత్ బిల్లులు, బోరు మరమ్మతులు, చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. అలాగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఉంది. నిధులు లేక ఇబ్బందులు.. గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ప్రధాన ఆధారం. జనాభా అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15 ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాని 2022, ఆగస్టు నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. పెద్ద పంచాయతీల్లో ఇంటి, వ్యాపార పన్నులు, తైబజార్, ఇంటి నిర్మాణ ఫీజులు, వ్యాపార వాణిజ్య లైసెన్స్ ఫీజుల ద్వారా డబ్బులు జమ అవుతాయి. కాని చిన్న గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పా ఇతర ఆర్థిక మార్గాలు లేవు. ప్రత్యేక అధికారులు గ్రామపంచాయతీల వైపు కన్నెత్తి చూడటం లేదు. పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పడటంతో తప్పని పరిస్థితుల్లో చెత్త తరలింపు వాహనాలతో పాటు నీటిని సరఫరా చేసే ట్యాంకర్కు డీజిల్ కొనుగోలుకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిధులు కరువు.. ఐదు నెలలుగా పంచాయతీలకు నిధులు రావడం లేదు. దీంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాగునీటి బోర్ల మరమ్మతులకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను ప్రత్యేక అధికారులకు విన్నవిస్తున్నా నిధులు లేక పరిష్కరించలేకపోతున్నాం. – రాజీక్, పంచాయతీ కార్యదర్శి, ధర్మాపురం ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది.. గ్రామపంచాయతీల్లో కొత్త పాలక వర్గం ఏర్పడాలి. ఇందుకుగాను పంచాయతీ ఎన్నికలు జరగాలి. ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరుకాకపోవడంతో చిన్న పంచాయతీల్లో ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. – రమణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి కొరవడిన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ నిధులు లేక నిర్వహణ భారం ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులు జిల్లాలో 255 గ్రామపంచాయతీలు కార్యదర్శులపై ఆర్థిక భారం.. గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉండటంతో నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. గతంలో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, ఆటోలు పంచాయతీ కార్యదర్శుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి. దీంతో పంచాయతీల్లో ఉన్న నిధులను ముందస్తుగానే కిస్తులకు చెల్లించడంతో పంచాయతీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులైన మురుగు కాల్వల మరమ్మతులు, తాగునీటి పైప్లైన్ల లీకేజీలు సరిచేసేందుకు డబ్బులు లేక తప్పని పరిస్థితుల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయక తప్పడం లేదు. -
రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలి
● డీఎల్పీఓ రఘునాథ్రెడ్డి పాన్గల్: గ్రామపంచాయతీల్లో రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని డీఎల్పీఓ రఘునాథ్రెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండా గ్రామపంచాయతీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చిన నిధులు, ఖర్చు చేసిన లెక్కల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని కోరారు. వర్షాకాలంలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని చెప్పారు. సెగ్రిగేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువు తయారీ, తాగునీటి సమస్యపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలోని నర్సరీలు, ప్రకృతి వనాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ రఘురాములు, పంచాయతీ కార్యదర్శి నర్మద పాల్గొన్నారు. -
మండల కేంద్రంలో నిరసన
బీఆర్ఎస్ ముఖ్యనేత శ్రీధర్రెడ్డి దారుణ హత్య ఘటనను నిరసిస్తూ కొద్దిసేపు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నంబావి ప్రధాన కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కొత్తగా హింసాయుత వాతావరణం నెలకొన్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గాన్ని కల్లోల ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవద్దని ముందస్తుగా డీజీపీని కలిసి ఫిర్యాదు ఇచ్చినా.. మార్పు లేదని, రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ సంచలన వాఖ్యలు చేశారు. శ్రీధర్రెడ్డి హత్య ఘటనపై తెల్లవారుజాముల 5.30 గంటలకు సమాచారం ఇస్తే.. గంటన్నర తర్వాత పోలీసులు రావడం దారుణమన్నారు. ఆలస్యంగా అక్కడికి వచ్చిన చిన్నంబావి ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉండే కొడుకును రక్తపు మడుగులో చూసి తట్టుకోలేకపోతున్న శ్రీధర్రెడ్డి తండ్రి శేఖర్రెడ్డిని ఓదార్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు ఎవరూ భయపడావల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కొల్లాపూర్ నాయకులు, కార్యకర్తలకు ధైర్యమిచ్చే ప్రసంగాలు చేశారు. -
బదిలీలు జరిగేనా..?
దేవాదాయశాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఏళ్లుగా పెండింగ్లో ఉంది.వివరాలు 8లో u డాగ్ స్క్వాడ్తో పరిశీలన హత్యా ఘటన సమాచారం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగభూషణరావు సంఘటనా స్థలానికి ఉదయమే చేరుకుని విచారణ జరిపారు. అలాగే డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. పోలీసులు తీసుకువచ్చిన జాగిలం హత్యా ఘటన ప్రదేశం నుంచి సమీపంలోని బావి వద్దకు వెళ్లి అక్కడి నుంచి వాగువైపు వెళ్లింది. సరైన ఆధారాలు లభించకపోవడంతో పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు శ్రీధర్రెడ్డి హత్య ఘటనపై తండ్రి శేఖర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వనపర్తి సీఐ నాగభూషణరావు తెలిపారు. ఇప్పటికే కొందరిని అనుమానితులుగా గుర్తించామని పేర్కొన్నారు. సమగ్రంగా విచారణ చేస్తున్నామని, హత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
పాలమూరు: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేయాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై మహబూబ్నగర్ కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఏడీలు, అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ముఖ్య ప్రణాళిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ రవినాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక నష్టం జరగకుండా బీమా రైతులకు ప్రయోజనకరంగా రిస్క్ కవరేజీ కల్పిస్తుందన్నారు. ఫసల్ బీమా పథకం వానాకాలం సీజన్ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు తమ సూచనలు తెలియజేయాలని కోరారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖ, ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత సమర్థవంతంగా అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తుందని చెప్పారు. ఫసల్ బీమా పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పంటలకు నష్టం జరిగినప్పుడు దీని ద్వారా పరిహారం అందుతుందని, ఇందుకు సంబంధించి ప్రీమియం సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని వివరించారు. అధికారులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులు ఆర్థిక అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. ఫసల్ బీమా మార్గదర్శకాల మేరకు గ్రామం, మండలం యూనిట్గా పరిగణిస్తారని, పంట దిగుబడి, వాతావరణ పరిస్థితుల అనుగుణంగా బీమా నిర్ణయిస్తారని చెప్పారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సూచనలు ఇవ్వాలన్నారు. మహబూబ్నగర్ రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయాధికారి, మాస్టర్ ట్రైనర్ కృపాకర్రెడ్డి ఫసల్ బీమాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ పథకం ప్రతి పంట వేసిన ప్రతి రైతుకు ఉపయోగపడేలా నోటిఫై చేసిన పంటలు, ఏరియాకు వర్తింపజేయడం, రైతు ప్రీమియం ప్రభుత్వం చెల్లించడం, టెక్నాలజీ బేస్ ఆధారంగా అమలు చేస్తారన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన పరిశీలకులు జేడీ శైలజ మాట్లాడుతూ ఫసల్ బీమాపై ఉమ్మడి జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయ ఏడీ శ్రీదేవి, మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
అందుబాటులో ఉన్న విత్తనాలు, వాటి ధరలు ఇలా..
విత్తనం రకం బస్తా కిలో ధర (కిలోల్లో..) (రూ.లలో..) వరి ఆర్ఎన్ఆర్–15048 15 50 వరి జేజీఎల్–24423 25 44 వరి కేఎన్ఎం–1638 20 48 వేరుశనగ విశిష్ట రకం 30 108 తెల్లజొన్న సీఎస్వీ–41 3 90 పచ్చజొన్న పీవైపీఎస్–2 3 150 కంది పీఆర్జీ–176, టీడీఆర్జీ–59 3 150 మినుము ఎంబీజీ–1070 6 150 పెసర ఎంజీజీ–385 6 140 -
కేవీకే శాస్త్రవేత్తల సూచనలు..
పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతులకు అవసరమైన వరి, వేరుశనగ, జొన్న, కంది, మినుము, పెసర తదితర విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. అందుకోసం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేయనున్నారు. కృషి విజ్ఙాన కేంద్రం శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆధునిక వంగడాలు, సాగులో మెళకువలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాలంలో పంటలను పట్టిపీడిస్తున్న చీడపీడలు, ఎరువుల వాడకం, సేంద్రియ సాగుపై సూచనలు అందిస్తారు. పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచారు. 94904 09163, 63008 20238 నంబర్లను సంప్రదించి విత్తనాలు పొందవచ్చు. -
పాలమూరులో కలకలం
లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య వనపర్తి/ చిన్నంబావి: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ముఖ్య అనుచరుడు, చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన మండల స్థాయి బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి(50) హత్య ఉమ్మడి పాలమూరులో కలకలం రేపింది. హత్యా ఘటన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు చిన్నంబావికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. శ్రీధర్రెడ్డి పార్థివదేహం స్వగ్రామానికి తరలిస్తుండగా.. ఆయన వాహనం ముందు పార్టీ శ్రేణులతో సుమారు నాలుగు కిలోమీటర్లు కాలినడక లక్ష్మీపల్లి వరకు రావడం కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. అందరి నోట మంచోడు అనిపించుకున్న నాయకుడిని దారుణంగా గొడ్డళ్లు, కత్తులతో దాడిచేసి హతమార్చడాన్ని గ్రామస్తులతోపాటు మండల ప్రజలు, బీఆర్ఎస్ మండల నాయకులను కన్నీళ్లు పెట్టించింది. ఎప్పటిలాగే.. ఇంటికి సమీపంలోని కల్లందొడ్డిలో నిద్రిస్తున్న వ్యక్తిని తెల్లవారే సరికి హతమార్చడం, విగతజీవిగా గ్రామస్తులకంట పండటంతో చిన్నంబావి మండలం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే శ్రీధర్రెడ్డి అవివాహితుడు కాగా.. తల్లిదండ్రులు శేఖర్రెడ్డి, యశోద ఉన్నారు. మరోవైపు నాలుగు నెలల వ్యవధిలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇద్దరు హత్యకు గురికావడం రాజకీయంగా పాలమూరుతోపాటు రాష్ట్రంలోనే కలకలం రేపినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు రాజకీయ హత్యలంటూ కేటీఆర్ ఆరోపణ చిన్నంబావి చౌరస్తాలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు -
పనుల్లో వేగం పెంచాలి
అమరచింత: పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాలతో పాటు స్కూల్ యూనిఫామ్స్ కుట్టే కేంద్రం, మండలంలోని చింతరెడ్డిపల్లి, నందిమళ్ల ఎక్స్రోడ్, కిష్టంపల్లిలోని పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినా పనులు ఎందుకు ప్రారంభించ లేదని ఎంఈఓను ప్రశ్నించారు. పాఠశాలకు సంబంధించిన నిధులు జెడ్పీ ఉన్నత పాఠశాల ఖాతాలో జమయ్యాయని.. బదిలీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎంఈఓ బదులిచ్చారు. ఇన్చార్జ్ డీఈఓ గోవిందరాజులుకు ఫోన్ చేసి సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల యూనిఫామ్స్ తయారీ ఎంతవరకు వచ్చిందని మెప్మా అధికారులను ప్రశ్నించగా కటింగ్ కోసం వస్త్రాన్ని పాలమూర్కు పంపామని కో–ఆర్డినేటర్ యువరాజ్ సమాధానం ఇవ్వగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల పునః ప్రారంభం నిర్మాణ పనులతో పాటు యూనిఫామ్స్ పూర్తి చేయాలని.. ఇందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుద్ధీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ నూరుల్ నదీం, ఎంపీడీఓ కృష్ణయ్యను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ భాస్కర్సింగ్, ఎంపీఓ నరసింహులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య.. ఆత్మకూర్: తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తోందని.. అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రవేశపెట్టిందని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఉర్దూ మీడియం, జూరాల, ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని 18 పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేశామని, ఆయా పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందనుందని.. ఉపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట ఎంఈఓ భాస్కర్సింగ్, ఎంపీడీఓ సుజాత, కమిషనర్ నాగరాజు, ఎంపీఓ నర్సింగ్రావు, జీహెచ్ఎంలు ఉన్నారు. వైభవంగా శివపార్వతుల కల్యాణం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారు దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా గురువారం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. శివపార్వతులకు అర్చకులు తలంబ్రాలు పోయగా.. ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. -
భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి
వనపర్తి: జిల్లాలో వివిధ విభాగాల కింద చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ పవార్ అధికారులను ఆదేశించారు. భూ సేకరణ, ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ వారాంతపు సమీక్ష నిర్వహించారు. భూ సేకరణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణ, పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి కాల్వలు, చెరువు కాల్వల స్థితిగతులను ముందుగానే తెలుసుకొని అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు లష్కర్లను పంపించాలని ఇరిగేషన్ అధికారిని ఆదేశించారు. చెరువు భూములు కబ్జా కాకుండా పరిరక్షించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నగేష్, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ పద్మావతి, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్ మల్లయ్య, ఇరిగేషన్శాఖ ఇంజినీర్లు, భూసేకరణ విభాగం నుంచి గోకుల్దాస్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు.. గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ పవార్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లులకు తరలిన ధాన్యం లెక్కలను తేల్చి రెండ్రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకొని వర్షం వస్తే వెంటనే కప్పాలని సూచించారు. హమాలీల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శేఖర్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ తేజస్ పవార్ -
నేడు పాలిసెట్
వనపర్తిటౌన్: జిల్లాలో శుక్రవారం పాలిసెట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ డా. కె.చంద్రశేఖర్ గురువారం కేంద్రాల వారీగా కల్పించిన వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులను కేంద్రాల్లోకి గంట ముందే అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన అనుమతించరని, నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని కో–ఆర్డినేటర్ తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 పరీక్ష కేంద్రాల్లో 2,394 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని.. ఇందులో బాలురు 1,261, బాలికలు 1,133 మంది ఉన్నారు. పరీక్ష నిర్వహణకు 100 మందికి పైగా ఇన్విజిలేటర్లు, 10 మంది సీఎస్లు, ముగ్గురు రూట్ ఆఫీసర్లు, పాలిటెక్నిక్ కళాశాల పరీక్ష కేంద్రం మినహా మిగతా ప్రతి కేంద్రానికి ఒక్కో పరిశీలకుడి చొప్పున మొత్తం 9 మంది విధులు నిర్వర్తించనున్నారు. కేంద్రాల సమీపంపలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిమిషం నిబంధన కచ్చితంగా అమలు -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి టౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ మద్దిలేటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని సీఎస్, డీఓలను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకుగాను జిల్లావ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు జనరల్ విద్యార్థులు 3,499, ఒకేషనల్లో 479 మొత్తం 3,978.. రెండో సంవత్సరం పరీక్షలు జనరల్ విద్యార్థులు 1,780, ఒకేషనల్లో 376 మొత్తం 2,156 మంది రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఐఈఓ మద్దిలేటి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement