8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు | Sakshi
Sakshi News home page

8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు

Published Mon, May 6 2024 8:55 AM

-

సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు భగవత్‌ రామానుజాచార్యుల తిరునక్షత్రం పూజలను విశేషంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

ఈ నెల 8, 11, 12 తేదీల్లో రాత్రి 7గంటల వరకే స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. అలాగే, శ్రీవైష్ణవ శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ నెల 13న సాయంత్రం 5గంటలకు హనుమత్‌ వాహనంపై స్వామికి తిరువీధి జరుగుతుందని తెలియజేశారు.

Advertisement
Advertisement