-
Kalki 2898 AD: మీ నగరానికి వచ్చేస్తున్న 'బుజ్జి'.. ఎందుకో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రతో పాటు బుజ్జి కూడా చాలా కీలకంగా ఉండనుంది. ఈ క్రమంలోనే చాలా గ్రాండ్గా బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.బుజ్జి అనే పేరుతో కనిపించిన ఈ వాహనం పట్ల సోషల్మీడియాలో భారీగా క్రేజ్ ఉంది. కొద్దిరోజుల క్రితం ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. ఆ తర్వాత నాగచైతన్య కూడా తనదైన స్టైల్లో డ్రైవ్ చేసి అభిమానులను మెప్పించాడు. బుజ్జికి పెరుగుతున్న క్రేజ్ వల్ల దానిని క్రియేట్ చేసిన టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలో బుజ్జి అభిమానుల కోసం వారు సరికొత్త ప్లాన్ చేస్తున్నారట. భారతదేశంలోని కొన్ని నగరాల్లో బుజ్జి చుట్టేయనుందట. ఆ సమయంలో అభిమానులకు ఒక భారీ ఆఫర్ను మేకర్స్ ప్రకటించనున్నారు. బుజ్జితో సెల్ఫీలు తీసుకునే అవకాశాన్ని వారు కల్పించనున్నారు. ఆ సమయంలో కల్కి టీమ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. జూన్ 27న ఈ కల్కి విడుదల కానున్నడంతో ఇలా సరికొత్తగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్లాన్ వేశారట. బుజ్జి పర్యటన షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. -
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్చరణ్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే -
'బిగ్బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
బిగ్బాస్ రియాలిటీ షో ఇప్పటివరకు 7 సీజన్లు పూర్తి చేసుకోగా, చాలామంది నటీనటులు ఇందులో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అమ్మాయిల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలా మూడో సీజన్లో పెద్దగా అంచనాల్లేకుండా పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన పునర్నవి.. ఇప్పుడు ప్రేమలో పడిందా అనే సందేహం వస్తోంది.(ఇదీ చదవండి: 'మంజుమ్మెల్ బాయ్స్'లో ఆ సీన్ కోసం ఓరియో బిస్కెట్స్: డైరెక్టర్)హైదరాబాద్కి చెందిన పునర్నవి.. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. అలా బిగ్బాస్ 3వ సీజన్లో ఏకంగా 11 వారాల పాటు ఉంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో ఈమె నడిపిన ప్రేమ కహానీ గురించి చాలామందికి తెలుసు. అదంతా స్క్రిప్ట్ అయినప్పటికీ ఈ జంటకు చాలామంది కనెక్ట్ అయ్యారు.ఇక ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసిన పునర్నవి.. ఆ తర్వాత పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. యూకేలో ఉంటున్న ఈ భామ.. ఇప్పుడు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడితో ఉన్న ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఇతడు బాయ్ ఫ్రెండ్ లేదంటే ఇంకెవరైనా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!) -
ఐదోసారి ఆ స్టార్ హీరో సినిమాలో నయనతార.. భారీ రెమ్యునరేషన్
సౌత్ ఇండియాలో నయనతార జోరు మామూలుగా లేదుగా. నాలుగు పదుల వయసు.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. చేతి నిండా చిత్రాలు.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బిజీ. ఇంకోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోవడం, ఇదీ లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుత పొజిషన్. ఇటీవల నయనతార నటించిన చిత్రాలు పెద్దగా ఆడకపోవచ్చునేమోగానీ, ఆమె క్రేజ్, అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఈ భామ హిందీలో షారూక్ఖాన్ సరసన నటించిన జవాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం, ఆ తరువాత వరుసగా అవకాశాలు తలుపు తట్టడమే. ప్రస్తుతం నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం మన్నాంగట్టి సిన్స్ 1960 చిత్రాన్ని పూర్తి చేశారు. మరో పక్క మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న టెస్ట్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా హీరో అజిత్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అజిత్, నయనతారలది సూపర్హిట్ జంట అనే చెప్పాలి. వీరిద్దరూ ఇప్పటికి ఏగన్, బిల్లా, ఆరంభం, విశ్వాసం తదితర నాలుగు చిత్రాల్లో నటించారు. వీటిలో ఏగన్ చిత్రం మినహా మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ జంట ఐదోసారి జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అజిత్ ప్రస్తుతం విడాముయర్చి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీని తరువాత ఆయన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ను ఖారారు చేసిన విషయం తెలిసిందే. దీనికి సినీ వర్గాలు, అభిమానుల నుంచి విశేష స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఆయనకు జంటగా టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా ఈ వరుసలో లేడీ సూపర్స్టార్ నయనతార పేరు వినిపించడం విశేషం. అంతే కాదు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకుంటున్న ఈ క్రేజీ చిత్రం జూన్ నెలలోనే సెట్పైకి వెళ్లనుందని, ఈ చిత్రం తొలి షెడ్యూల్లో నయనతార మూడు రోజులు పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం కోసం ఈ భామ పారితోషకాన్ని ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నటుడు అజిత్ రూ.163 కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం చాలా కాస్టీలీ గురూ అంటున్నారు నెటిజన్లు. -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?
ప్రభాస్ 'కల్కి' కోసం తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సరైన మూవీ థియేటర్లలోకి రాలేదు. అలా వేసవి అంతా వృథా అయిపోయింది. దీంతో ఆడియెన్స్ని 'కల్కి'.. మళ్లీ థియేటర్లలోకి రప్పిస్తుందని అందరూ అనుకుంటున్నారు. విడుదలకు దాదాపు మరో నెలరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టేశారు. తాజాగా ఓటీటీ డీల్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఒప్పుకొన్న పాన్ ఇండియా సినిమాల్లో 'కల్కి' ఒకటి. 'మహానటి'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దాదాపు ఐదారేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాడు. అలా విడుదలకు సిద్ధం చేశారు. జూన్ 27న గ్రాండ్గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే మూవీని రెండు ఓటీటీలకు అమ్మేశారట.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)హిందీ వెర్షన్ హక్కుల్ని దాదాపు రూ.200 కోట్లకు నెట్ఫ్లిక్స్ దక్కించుకుందని, అలానే దక్షిణాది భాషలకు కలిపి రూ.175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం రికార్డ్ ఓటీటీ డీల్ 'కల్కి'దే అని చెప్పొచ్చు.ఇకపోతే 'కల్కి'లో ప్రభాస్తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి భారీ తారాగణం ఉంది. అలానే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఉన్నారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్ దేవరకొండ) -
సినిమా కోసం నిజమైన బంగారం.. కారణం ఇదే
మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో 'రామాయణ' పేరుతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.బారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ధరించే ఆభరణాల నుంచి దుస్తులు, ఆయన ఉపయోగించే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి. ఆ నగరం మొత్తం బంగారంతో నిర్మితమై ఉందని ఇతిహాసాల్లో చెప్పారు. దీంతో సినిమాలో కూడా ఆ గొప్పతనాన్ని అలాగే చూపించాలని చిత్ర యూనిట్ భావించిందట. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రాన్ని నమిత్ మల్హోత్రా , యశ్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాషలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
లిప్లాక్ సీన్ కోసం కీర్తి సురేష్కు కండిషన్
ఇండియన్ సినిమా పాశ్చాత్య సంస్కృతికి మారి చాలా కాలమే అయ్యింది. అయితే దక్షిణాదిలో సంప్రదాయ విలువలు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడా వాటికీ కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా లిప్లాక్ సన్నివేశాల్లో నటించడానికి మన కథానాయకలు సంకోచించే వారు. అయితే ఇప్పుడు అలాంటి సన్నివేశాలు పుంకాను పుంకాలుగా చూస్తున్నాం. అదేమంటే అలా నటించడంలో తప్పేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. కాగా నటి కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె తమిళంలో గానీ, తెలుగులో గానీ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్నారు. ఇక మహానటి చిత్రంలో అయితే సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఆ తరువాత గ్లామర్ పాత్రల్లో నటించినా హద్దులు దాటలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పాశ్చాత్య సంసృతికి మారిపోయారని సమాచారం. ప్రస్తుతం ఈమె బేబీజాన్ అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లిప్లాక్ సన్నివేశంలో నటించాలని ముందుగానే కండిషన్ పెట్టారట. బాలీవుడ్లో రాణించాలంటే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదని భావించిన కీర్తి సురేష్ బేబీజాన్ చిత్ర దర్శక నిర్మాతలకు ఓకే చెప్పారట. అలా ఆమె ఆ చిత్రంలో లిప్లాక్ సన్నివేశాల్లో నటించారని తాజా సమాచారం. ఆ సన్నివేశాలు ఎంత కిక్ ఇస్తాయో చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. కాగా మరో విషయం ఏమిటంటే ఈమె ఇంతకు ముందు కోట్ల రూపాయలు ఇచ్చినా లిప్లాక్ సన్నివేశాల్లో నటించను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కీర్తి సురేష్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తను తలకిందులుగా వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్) -
రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
కన్నడలో కిరాక్ పార్టీ అనే చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్నా తర్వాత నేషనల్ క్రష్గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. చేతినిండా చిత్రాలు ఉన్నా మరిన్ని అవకాశాలు ఈమె వైపే చూస్తుండడం విశేషం. రష్మిక చేతినిండా సినిమాలు..ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో చావ, సికిందర్ చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ విజయ్దేవరకొండతో మరోసారి కొత్త చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే తమిళంలో ఈమె నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రష్మిక మందన్నకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కోలీవుడ్లో మరో ఛాన్స్అలా త్వరలో సూర్యకు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమెను మరో అవకాశం వరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. శివ కార్తికేయన్ ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ చిత్రం పూర్తి చేసి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో డాన్ ఒకటి. ఈ మూవీ ద్వారా సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. శివకార్తికేయన్తో వన్స్మోర్ఆ తర్వాత ఆయన రజనీకాంత్కు కథను సిద్ధం చేశారు. ఆ చిత్రంలో రజనీకాంత్ నటిస్తారని ప్రచారం జరిగినా, అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నానికి కథ చెప్పారు, అదీ వర్కౌట్ కాలేదు. దీంతో సిబి చక్రవర్తి తన తొలి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తోనే మరో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రష్మికను భాగం చేయాలనుకుంటున్నారట!చదవండి: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..? -
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్ దుస్తుల్లో కార్పెట్పై హొయలుపోతూ కనిపించింది.యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్తో ఆ ఫెస్టివల్కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?
అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు) -
'నరేంద్ర మోదీ' బయోపిక్లో స్టార్ యాక్టర్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్యరాజ్కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
భర్త కోసం హీరోయిన్ స్పెషల్ పోస్ట్.. ప్రెగ్నెంట్ అని హింట్ ఇస్తోందా?
బర్త్డే అంటేనే సెలబ్రేషన్స్.. సెలబ్రిటీలు కూడా ఈ స్పెషల్ డేలో వర్క్ పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్కు, ఎంజాయ్మెంట్కు పెద్ద పీట వేస్తుంటారు. గురువారం (మే 16న) బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ 36వ బర్త్డే జరుపుకున్నాడు. అతడి భార్య కత్రినా కైఫ్.. విక్కీ బర్త్డేను తనకు తోచిన రీతిలో సెలబ్రేట్ చేసింది. అంతేకాకుండా అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో మూడు హార్ట్ సింబల్స్, మూడు కేక్ ఎమోజీలను క్యాప్షన్లో జత చేసింది. ఆ క్యాప్షన్కు అర్థమదేనా!ఇది చూసిన కొందరు ఆ క్యాప్షన్లో ఇంకేదో అర్థం దాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 'అక్కడ హార్ట్స్, కేక్స్.. అలాగే విక్కీ ఫోటోలు.. అన్నీ మూడు మాత్రమే వచ్చేలా ఎందుకు పోస్ట్ చేసింది. అంటే తన కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని హింటిస్తోంది కాబోలు' అని అభిప్రాయపడుతున్నారు. మరో వ్యక్తయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా.. అని ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం కూడా..కాగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే నెలలో కత్రినా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె టీమ్.. సదరు వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈసారి కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలు ఉట్టి పుకార్లుగానే మిగిలిపోతాయా? లేదంటే నిజమవుతాయా? అనేది చూడాలి!ఇద్దరూ సినిమాలతో బిజీవిక్కీ కౌశల్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు చావా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ పీరియాడిక్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల కానుంది. కత్రినా సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరగా మేరీ క్రిస్మస్ అనే మూవీలో నటించింది. ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో జీలే జరా అనే సినిమా ఉంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) చదవండి: డైరెక్టర్ త్రివిక్రమ్ తీరుపై హీరోయిన్ ఈషా రెబ్బా అసహనం.. కానీ! -
స్టార్ డైరెక్టర్తో నయనతార కొత్త సినిమా
కోలీవుడ్లో తాజాగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గౌతమ్మీనన్ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్మీనన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్మీనన్కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్మీనన్ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్ తరువాత గౌతమ్మీనన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో లేడీ సూపర్స్టార్ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్స్టార్ మమ్మట్టి నటించనున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. ఈ పేరు చెబితే తెలుగు గుర్తుపట్టేస్తారు. 'సీతారామం' బ్యూటీ అంటే ఇంకా త్వరగా గుర్తుపట్టేస్తారు. చేసినవి మూడు నాలుగు సినిమాలే అయినా గోల్డెన్ లెగ్ అనిపించింది. 'ఫ్యామిలీ స్టార్' తప్పితే మిగతా రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయినా సరే ఆచితూచి సినిమాలు చేస్తోంది. మరోవైపు తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం)2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మృణాల్కి 'సీతారామం' సినిమాతో బోలెడంత గుర్తింపు దక్కింది. హిట్ దక్కింది కదా అని వరసపెట్టి మూవీస్ ఏం చేసేయలేదు. కానీ ఫొటోషూట్స్తో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటోంది. అలానే మొన్నీమధ్య ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు బాలీవుడ్ యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ చేస్తుందా అనే డౌట్ వస్తోంది.ఎందుకంటే తాజాగా సిద్ధాంత్-మృణాల్.. ముంబయిలోని ఓ రెస్టారెంట్కి కలిసి వెళ్లారు. తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. ఇతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వీళ్లిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి ఉంటారని పలువురు నెటిజన్లు అంటున్నారు. వీటిలో ఏది నిజమనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024 -
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో 'సలార్'తో హిట్ కొట్టాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. దీని తర్వాత 'రాజా సాబ్', 'సలార్ 2'కి రెడీ అవుతున్నాడు. సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది. ఏంటి సంగతి? ఆ సినిమా ఏది?(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)పైన చెప్పిన సినిమాలతో పాటే ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ విషయం చాలారోజుల క్రితమే బయటకొచ్చింది. అయితే ప్రభాస్, శివుడిగా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం. ఇందులో నటిస్తున్నందుకు గానూ పూర్తిగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట.ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప'లో అక్షయ్ కుమార్ (హిందీ), శివరాజ్ కుమార్ (కన్నడ), మోహన్ లాల్ (మలయాళం) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు. ఈనెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'కన్నప్ప' టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనిబట్టి సినిమాపై ఓ అంచనాకు రావొచ్చు.(ఇదీ చదవండి: రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?) -
నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలుసా?
టిల్లు స్క్వేర్తో మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తూ పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకుంది. అయితే ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్కు గేట్లెత్తేసింది. గ్లామర్కు ఓటేసిన బ్యూటీటిల్లు స్క్వేర్ చిత్రంలో లిప్లాక్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. అదేమంటే గ్లామర్ రోల్ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. ఈ మూవీ సక్సెస్తో అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మరిన్ని అవకాశాలు తలుపులు తడుతున్నాయి. చీర ధరెంతో తెలుసా?దీంతో ఈ కేరళ బ్యూటీ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ రూ.కోటి తీసుకుంటున్న ఈ జాణ టిల్లు స్క్వేర్ నుంచి దాన్ని రెండింతలు చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. తాజాగా నీలి రంగు చీరలో ఉన్న ఫోటోలను అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో సింపుల్గా కనిపిస్తున్న ఈ బనారస్ చీర ధర రూ.15000 అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో విజయ్ దేవరకొండ స్టైల్ వేరే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి రెండు మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తర్వాత తర్వాతే అడుగులు తడబడ్డాయి. సినిమాల రిజల్ట్ అటకెక్కేసింది. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకునేందుకు రౌడీ హీరో రెడీ అయ్యాడని అంటున్నారు. అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్)'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో వరస హిట్స్ కొట్టి విజయ్ దేవరకొండ.. స్టార్ అయిపోయాడు. కొందరైతే ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్తో పోల్చారు. కానీ ఈ సక్సెస్ని కొనసాగించలేకపోయాడు. 'నోటా' దగ్గర నుంచి వరసగా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. గతేడాది వచ్చిన 'ఖుషి' పర్వాలేదనిపిస్తే.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' దారుణమైన ఫలితాన్ని చూసింది. కానీ విజయ్ చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.వీటిలో 'శ్యామ్ సింగరాయ్' తీసిన రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. రీసెంట్ గానే కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఉన్నంతలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాహుల్ గత సినిమా మాదిరిగానే ఇందులోనూ హీరో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలని అంటున్నారు. మరి వేర్వేరు టైమ్ జోన్స్కి చెందినవా? లేదంటే ఒకసారి తెరపై కనిపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనా సరే కెరీర్ కాస్త డేంజర్లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలంటే సాహసమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్) -
రీల్ విలన్తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్.. ఇక మిగిలింది పెళ్లే?
టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ గురించి మరోసారి బయటపడిపోయింది. ప్రియుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. వాటిని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ.. లేటెస్ట్ స్టిల్స్ చూస్తుంటే మాత్రం త్వరలో పెళ్లి పక్కా అనిపిస్తుంది. ఇంతకీ రీల్ విలన్-హీరోయిన్ జోడీ సంగతేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఆస్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్.. 2006లో తమిళ మూవీతో నటిగా మారింది. ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగా ది దొంగ, రాజ్, చట్టం, నువ్వా నేనా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. గతేడాది రిలీజైన 'గాండీవధారి అర్జున' చిత్రంలో చివరగా కనిపించింది.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?)విమలా రామన్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.(ఇదీ చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుం ఆ సినిమాకు సీక్వెల్ పనులు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘డబుల్ ఇస్మార్ట్’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీని తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో అనేది ఇంకా వెల్లడి కాలేదు. అయితే తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్తో రామ్ ఒక వెబ్సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన డీల్ కుదుర్చకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించి చర్చలు కూడా పూర్తి అయ్యాయి అని తెలుస్తోంది. త్వరలో ప్రకటన కూడా రావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రామ్ పుట్టినరోజు ఈనెల 15న ఉంది. ఆరోజునే ఈ ప్రకటన విడుదల కావచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.మరోవైపు రామ్ రెండు ప్రాజక్ట్లపై గురి పెట్టినట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ కథను ఆయన ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం. అంతేకాకుండా త్రివిక్రమ్ కూడా రామ్కు ఒక కథ చెప్పారట. మంచి లవ్ స్టోరీ కావడంతో రామ్ ఆసక్త చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. -
రూ. 2 కోట్లు ఆఫర్ ఇచ్చినా అందుకు నో చెప్పిన సాయిపల్లవి
నటిగా తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ను పెట్టుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె చదివింది వైద్యవిద్య అయినా అయ్యింది నటి. తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న సాయిపల్లవి. దీంతో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే నటిగా కొన్ని నిర్ధిష్టమైన భావాలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో చాలా క్లియర్గా ఉంటారు. తన పాత్రకు అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్ నటుడి చిత్రం అయినా సరే. అలా జరిగింది కూడా. అలాంటి నటి ఇప్పుడు సైలెంట్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదీ రామాయణ్ చిత్రంలో సీతగా నటించే అవకాశం వరించింది. ఇటీవల ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోలను చూస్తే సీత పాత్రలో సాయిపల్లవి ఎంతగా ఒదిగి పోయారో అని అనిపిస్తుంది. ఇకపోతే తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న అమరన్ చిత్రాన్ని పూర్తి చేశారు.కాగా నటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది ఒక సౌందర్య సాధనకు చెందిన ప్రకటన కావడమేనట. అలాంటి సౌందర్య వస్తువులతో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు. -
కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్ కాలి బూడిద అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ సంఘటన వల్ల నిర్మాతకు కూడా భారీ నష్టం వాటిల్లందని టాక్.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్.. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) -
భైరవకి మహేశ్బాబు వాయిస్ ఓవర్?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మహేశ్బాబు భాగం కానున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్లో మహేశ్బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్కి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ‘జల్సా’, ‘బాద్ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement