ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య

Published Mon, May 6 2024 12:10 AM

-

ఖమ్మంక్రైం: నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చర్చికాంపౌండ్‌ ప్రాంతానికి చెందిన కాళంగి మధు (45) కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు కృపాకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాలీ ఆటో పల్టీ

రఘునాథపాలెం: మండలంలోని రాంక్యాతండా రోడ్డులో మూలమలుపు వద్ద ట్రాలీ ఆటో పల్టీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాపేటకు చెందిన 10 మంది యువకులు ఓ శుభకార్యానికి డీజే తీసుచొచ్చేందుకు ట్రాలీ ఆటోలో రాంక్యాతండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో పల్టీ కొట్టగా ఆనంద్‌, మంగీలాల్‌, నాగేశ్వరరావుతో పాటు వికాస్‌ గాయపడ్డారు. వారందరినీ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement