తిరుమలాయపాలెం: దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించాలని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పిండిప్రోలులో జరిగిన జనరల్బాడీ సమావేశంలో మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి అయి ఉండి మతాల మధ్య కులాల మధ్య చిచ్చురేపేలా బహిరంగంగా ప్రసంగిస్తున్నారని దుయ్యబట్టారు. మతతత్త్వ బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ కేంద్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను హరించే విధానాలను మోదీ అవలంబించడం దారుణమని, దానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం అచ్చయ్య, జిల్లా నాయకులు కమ్మకోటి నాగేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, రాయల రవికుమార్, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, మారుతి మల్లయ్య, పగిడికత్తుల రామదాసు, ఈర్ల వెంకటఅప్పారావు, ఆరెంపుల వెంకన్న, ఎడ్లపల్లి నవీన్, పులిగుజ్జు వెంకటస్వామి, గోకనపల్లి సరోజన పాల్గొన్నారు.
ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం