● మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నెహ్రూసెంటర్: దేశ సమాగ్రాభివృద్ధి, పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియా కూటమిని (కాంగ్రెస్) గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎత్తుగడలు ఎండగట్టాలని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు పేదలు, పెట్టుబడిదారులకు, మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైందని, ఇందులో ఇండియా కూటమి తప్పక గెలుస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుంకరి వీరయ్య చెప్పారు. సభలో డోర్నకల్, మానుకోట ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డితోపాటు జి.నాగయ్య, వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ సత్తా చాటాలి
మరిపెడరూరల్: మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మరిపెడ మండలం గాలివారిగూడెం స్టేజీ ఏఎన్నార్ గార్డెన్స్లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బలరాంనాయక్ను గెలిపించాలని కోరారు.