-
ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ నేతలు, వారి ఇళ్లపైన పచ్చ మూక దాడి చేస్తున్నా సీఐగా ఉన్న నారాయణస్వామి అడ్డుకుంటే ఒట్టు. పల్నాడు జిల్లాలో టీడీపీ రౌడీల దాడికి కొమ్ముకాసినందుకు పలువురు పోలీసు అధికారులను ఇప్పటికే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసినా నారాయణస్వామిపై వేటు వేయకపోవడం గమనార్హం. పోలింగ్కు రెండు రోజుల ముందు ఆయనను కారంపూడి సీఐగా ఒక ఉన్నతాధికారి పంపారు. నాటి నుంచి టీడీపీ సేవలోనే నారాయణస్వామి తరించారు. పోలింగ్ నాడు టీడీపీ గూండాల దాడికి ఆయన అణువణువునా సహకరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలను పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లనీయకుండా తన అధికారాన్ని సీఐ ఉపయోగించారు. ‘టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నారు.. వచ్చి అడ్డుకోండి’ అని వైఎస్సార్సీపీ వాళ్లు సమాచారం ఇచ్చినా సీఐ నారాయణస్వామి పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో బుడగ జంగాలపై టీడీపీ రౌడీలు దాడులు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పైగా గొడవలో గాయపడిన, ఘటన ప్రదేశంలో లేని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు.ఆ సీఐపై ఇలా ఎన్ని ఫిర్యాదులు వచి్చనా పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొందరు పోలీసు ఉన్నతా«ధికారులు పథకం ప్రకారం ఎన్నికలకు ముందు కారంపూడి సీఐ చిన్నమల్లయ్యను బదిలీ చేయించారు. ఆ స్థానంలో టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, యరపతినేని శ్రీనివాసరావుకు అనుకూలంగా ఉన్న, వారి సామాజికవర్గానికే చెందిన నారాయణస్వామిని సీఐగా పంపారు. నారాయణస్వామి అరాచకాలు అన్నీఇన్నీ కావు.. సీఐగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే నారాయణస్వామి చెలరేగిపోయారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ నేతలను వేధించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటేశ్వరరెడ్డిని ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండొద్దని బెదిరించారు. రెంటచింతల మండలంలో టీడీపీ అనుకూల గ్రామాల్లో పర్యటించి ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడాలని.. తాను ఉన్నానని వారికి భరోసా ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రెంటచింతలలో వైఎస్సార్సీపీ నేత ఉమామహేశ్వరరెడ్డిని ఎన్నికలకు దూరంగా ఉండాలని బెదిరించినట్టు సమాచారం.ఇక ఎన్నికల రోజు రెంటచింతల, కారంపూడి మండలాల్లోని పాల్వాయి గేట్, తుమృకోట, ఒప్పిచర్ల, చింతలపల్లిలో టీడీపీ రౌడీ మూకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను పోలీంగ్ కేంద్రాల నుంచి తరిమికొడుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తన వద్ద కేంద్ర బలగాలు ఉన్నా వాటిని ఉపయోగించి హింసను ఆపే ప్రయత్నం నారాయణస్వామి చేయలేదు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడి చేసి తరిమేశారు. ఆ ఏజెంట్లు సీఐ నారాయణస్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక పోలింగ్ అనంతరం టీడీపీ మూక అర్ధరాత్రి గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ఇళ్లపై దాడికి దిగినా సీఐ స్పందించలేదు. నారాయణస్వామి అతీతుడా? పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల హింసపై ఎన్నికల సంఘం స్పందించింది. కారంపూడి ఎస్సై రామాంజనేయులు, గురజాల డీఎస్పీ, పల్నాడు ఎస్పీలపై వేటు వేసింది. కానీ హింస ప్రజ్వరిల్లడానికి అసలు కారకుడైన నారాయణస్వామిపై చర్యలు తీసుకోలేదు. ఈయనపై వేటు పడకుండా ఓ పోలీసు ఉన్నతాధికారి కాపాడారని అంటున్నారు. దీంతో సీఐ నారాయణస్వామి మరింత రెచి్చపోతున్నారు. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఆ పారీ్టలో చురుగ్గా ఉంటున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎస్ఐగా పనిచేసినప్పుడూ అంతే.. మొదటి నుంచి సీఐ నారాయణస్వామి తీరు వివాదాస్పదమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కారంపూడి ఎస్ఐగా పని చేసిన సమయంలో కూడా ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. నరగామాలపాడు గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ నాయకుడు అయిన రామ్మడుగు బ్రహ్మంను టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు ఆ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆయన తమ్ముడ్ని తన ప్రోద్భలంతోనే టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారనే ఆరోపణలను నారాయణస్వామి ఎదుర్కొన్నారు.అలాగే చినగార్లపాడులో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై మారణాయుధాలతో దాడి చేసి వెంటాడి చంపారు. అయినా వారిపై నారాయణస్వామి చర్యలు తీసుకుంటే ఒట్టు. చివరకు ఎస్ఐగా ఉన్న ఆయన టోపీని టీడీపీ కార్యకర్తలు నెత్తిన పెట్టుకుని లాఠీతో ఫోజులిచ్చే స్థాయిలో వారితో అంటకాగారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ను అడ్డాగా మార్చుకుని వైఎస్సార్సీపీ నాయకులపై వేధింపులకు పాల్పడిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. దీంతో ఎట్టకేలకు ఎస్ఐగా పనిచేస్తున్న నారాయణస్వామిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పిన్నెల్లిపై అక్రమంగా కేసు... కారంపూడిలో ఈ నెల 14న జరిగిన గొడవల్లో స్థానిక వీఆర్వో ఇచి్చన ఫిర్యాదు ఆధారంగా పది మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై కేసు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదు లేదు. అయితే ఈవీఎం పగలగొట్టారని నమోదు చేసిన కేసులో పిన్నెల్లికి బెయిల్ వస్తే కౌంటింగ్కు హాజరవుతారని, ఆయనను ఎలాగైనా నిలువరించాలన్న టీడీపీ నేతల కుట్రకు సీఐ నారాయణస్వామి సహకరించారు.ఇందులో భాగంగా ఈ నెల 22న ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో తనను పిన్నెల్లి సోదరులు, ఆయన అనుచరులు గాయపరిచారని ఆరోపించారు. దీని ఆధారంగా కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ24, ఏ25 నిందితులుగా చేర్చారు. మరోవైపు మే 14న సీఐ నారాయణస్వామికి చిన్న గాయమైతే ఐదారురోజులు యథావిధిగా విధులు నిర్వహించారు. అయితే కేసులో పిన్నెల్లిని ఇరికించాలన్న కుట్రతోనే మే 20న నరసరావుపేటలో టీడీపీ అనుకూల ఆస్పత్రిలో నారాయణస్వామి చికిత్స పొందారు.మా నాన్నను అక్రమంగా ఇరికించారు.. కారంపూడిలో జరిగిన గొడవలకు మా నాన్న కొత్త కాశిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. పోలీసులు మా నాన్నను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారు. ఆ సమయంలో మా నాన్న కారంపూడి చుట్టుపక్కల లేరు. సీఐ నారాయణస్వామి రమ్మంటున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లి జైలుకు పంపారు. – కొత్త నర్సిరెడ్డి, దేవారిపల్లి, కారంపూడి మండలం దళితులపై అక్రమ కేసులు పెట్టారు.. కారంపూడిలో హింసాత్మక ఘటనలకు ఏమాత్రం సంబంధం లేని మా మామ బంకా ప్రతాప్పై పోలీసులు అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మా మామ వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్నందుకు కేసు పెట్టారు. బైండోవర్ సంతకం కోసం సీఐ నారాయణస్వామి పోలీస్స్టేషన్కు రమ్మన్నారు అని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు అక్కడి నుంచి జైలుకు పంపారు. – ఎల్. ప్రభుకుమార్, చింతపల్లి -
మహిళా పోలీస్కే రక్షణ లేదు..
దర్శి: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నాయకులకు వత్తాసు పలకడమే కాకుండా, కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం బూత్ నం.213లో మే 13న మహిళా పోలీస్ కట్టా అనూష బీఎల్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ బూత్లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారనే విషయమై వివాదం చెలరేగింది.ఓటు వేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే కూర్చున్న టీడీపీ నాయకులను ఓ కానిస్టేబుల్ వెళ్లిపోవాలని సూచించినా లెక్క చేయలేదు. అదే సమయంలో బీఎల్వో కల్పించుకుని మీరంతా ఇక్కడే ఉంటే ఇబ్బంది కలుగుతుందని చెబుతుండగా టీడీపీ నాయకుడు జిల్లెళ్లమూడి రామకృష్ణ, మరో 12 మంది ఒక్కసారిగా రెచ్చిపోయారు. అనూషను అసభ్యకరంగా తిడుతూ జుట్టు పట్టుకుని లాగారు. గొంతు పట్టుకుని కింద పడేసి కొట్టారు. కులం పేరుతో తిడుతూ కాలితో తన్నబోతుండగా అక్కడే ఉన్న కానిస్టేబుల్, బస్ డ్రైవర్ వచ్చి పక్కకు నెట్టినా ఆవేశంతో ఊగిపోయారు. పట్టించుకున్నవారు లేరు.. తనపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మహిళా పోలీస్ అనూష మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్కు ఫోన్ చేసి చెప్పగా, దర్శి సీఐ షమీఉల్లాను కలవాలని సూచించారు. ఆ రోజు సీఐ, ఎస్ఐకి విషయం చెప్పినా పట్టించుకోలేదు. 14న ఎస్ఐ సెలవులో ఉన్నారని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. 16న కేసు ఎందుకు కట్టలేదని ఏఎస్ఐని ప్రశ్నించగా ఉన్నతాధికారులను అడగాలని సమాధానమిచ్చారు.కేసు నమోదు చేయాలని అనూష నిలదీయడంతో నిందితులుగా ఉన్న కోటేశ్వరరావు, మరి కొందరిని స్టేషన్కు పిలిపించారు. వారు ఏఎస్ఐ ఎదుటే మహిళా పోలీస్ను బెదిరించారు. కాగా, మే 17న దర్శి సీఐని కలిశానని, అయితే టీడీపీ నేతలను పిలిపించి రాజీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని అనూష చెబుతోంది. అదే రోజు మధ్యాహ్నం ఆమె ఒంగోలులో ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా.. ఎస్పీ ఉన్నప్పటికీ లేరని చెప్పి వెనక్కు పంపారు. 17న కలెక్టర్ దినేష్కుమార్ ఎదుట అనూష తన గోడు వెళ్లబోసుకున్నారు.వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్పీ కార్యాలయానికి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో ముండ్లమూరు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు 13 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేరోజు బాధితురాలు అనూషపైనా టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అట్రాసిటీ కేసుపై దర్శి డీఎస్పీ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. -
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్ చేసి.. దొంగ వీడియోలను లీక్ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు. -
‘రిగ్గింగ్’ వదిలేసి అడ్డుకుంటే కేసులా?
నరసరావుపేట: ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిన వారిని వదిలేసి అడ్డుకున్న వారిపై ఈసీ కన్నెర్ర చేయడం ఏమిటని గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం నరసరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఈవీఎం ఘటనను పదేపదే చూపిస్తున్న టీడీపీ అనుకూల మీడియా అదేచోట వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై జరిగిన దాడులను ఎందుకు దాచి పెడుతోందని నిలదీశారు. మిగతా వాటి సంగతేంటి? ఒక్క ఈవీఎం ఘటనను చూపిస్తూ పిన్నెల్లి నిందితుడిగా చేర్చారు. మరి పల్నాడులో పలుచోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఆ వీడియోలను ఎందుకు బయట పెట్టడం లేదు? టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడి ఈవీఎంలను పగులకొట్టిన వీడియోలు ఎందుకు బహిర్గతం చేయడం లేదు? పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చిన ఈసీ పది రోజులుగా మేం ఘోషిస్తున్నా ఎందుకు స్పందించలేదు?రిగ్గింగ్ జరగలేదని నిరూపించాలి..మాచర్లలో ఈసీకి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులొచ్చాయి? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి. పాల్వాయి గేటుతో సహా మేం చెబుతున్న చోట్ల రిగ్గింగ్ జరగలేదని వెబ్ కెమెరా వీడియోలను బయటపెట్టి నిరూపించగలరా? ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. కొత్త గణేశునిపాడులో మహిళల నిర్బంధంపోలింగ్ రోజు మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో అర్ధరాత్రి యాదవులు, ఎస్టీల ఇళ్లపై టీడీపీ మూకలు దాడులకు దిగి స్వైరవిహారం చేశాయి. మహిళలు ప్రాణభయంతో 24 గంటల పాటు ఓ దేవాలయంలో తల దాచుకుంటే ఇరువర్గాలపై కేసులు పెడతారా? ఇదేనా ఈసీ చేసే న్యాయం? పోలింగ్కు ముందు పల్నాడులో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన ఈసీ ఆ స్థానంలో తాను నియమించిన వారు విధుల్లో అలసత్వం ప్రదర్శించారంటూ సస్పెండ్ చేసింది. ఈసీ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారంటే ఎవరు విఫలమైనట్లు? రీపోలింగ్కు హైకోర్టుకెళ్లి పోరాడతాం..ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ సీపీ అందించిన ఫిర్యాదులన్నింటికీ సమాధానం చెప్పాల్సిందే. రిగ్గింగ్ జరిగినట్లు మేం ఫిర్యాదు చేసిన ప్రతి పోలింగ్ కేంద్రం వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ బహిర్గతం చేయాల్సిందే. అధికారుల నియామకాలు, ఆ తర్వాత వారిని సస్పెండ్ చేయడం, ఎన్నికల ప్రక్రియలో లోపాలపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం. రీపోలింగ్ నిర్వహించేలా పోరాటం చేస్తాం. రిగ్గింగ్ ఆరోపణలు వచ్చిన చోట వెబ్ కెమెరాలను తనిఖీ చేసి రీపోలింగ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు, ఏజెంట్లు కలసి రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేయడంతో పిన్నెల్లి అక్కడకు చేరుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. మేం చెప్పేది నిజం కాకుంటే పూర్తి నిడివి వీడియోలను ఈసీ బయట పెట్టాలి. పిన్నెల్లి నాలుగు సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా మాచర్ల ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా కచ్చితంగా విజయం సాధిస్తారు. నలుగురు అధికారులను మేనేజ్ చేసి ఎడిటెడ్ వీడియోలు లీక్ చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశాం. బాబు నోట నీతులా..?నరసరావుపేటలో కోడెల ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా నలుగురు చనిపోతే ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన చంద్రబాబు నీతులు చెబుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై ఏ 1గా ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్ లీడర్లను ప్రోత్సహించేది చంద్రబాబేనని అందరికీ తెలుసు.'గేట్’ వీడియోలన్నీ బయట పెట్టాలి..మాచర్ల నియోజకవర్గంలోని తుమృకోట, వెల్దుర్తి, చింతపల్లి, వేపకంపల్లె, ఒప్పిచర్లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బూత్ల నుంచి బయటకు లాక్కెళుతున్న వీడియోలను ఎన్నికల కమిష¯Œన్ దృష్టికి తెచ్చాం. పాల్వాయిగేట్లో మా పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాక్కెళ్లి కొడుతుంటే పిన్నెల్లి రిగ్గింగ్ను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు రెండు మూడు గంటల పాటు సాగిన టీడీపీ మూకల దౌర్జన్యాలు, విధ్వంసకాండను ఎందుకు బయట పెట్టడం లేదు? అక్కడ ఉదయం నుంచి జరిగిన ఘటనల వీడియోలన్నీ బహిర్గతం చేయాలి. -
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురంలో టీడీపీ మూకలు అన్యాయంగా ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్వస్థలం కావడం గమనార్హం. చిన్నవెంకటాపురం పోలింగ్ బూత్లో వైఎస్సార్సీపీ తరఫున తోట మాధవరావు ఏజెంట్గా ఉండడంతో టీడీపీ కార్యకర్తలు కక్ష పెంచుకుని అతని తండ్రి మల్లేష్ పై ఇటీవల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువుతో పోరాడుతూ ఆదివారం ప్రాణాలు విడిచారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామ దేవత పండగను ఆసరాగా చేసుకుని మల్లేష్పై దాడి చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మాడ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని, ఈ సారీ ఎన్నికల్లో రిగ్గింగ్కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపేస్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించారు. మల్లేష్ మృతికి బాధ్యులైన అచ్చెన్నాయుడు, హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హామీ ఇచ్చారు. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్స్టేషన్కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్చేశారు. ‘‘ పొలిటికల్ హిట్మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్సర్కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
మలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్పై దాడిని ఆప్ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్ కుమార్పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్పై జరిగిన దాడిపై కేజ్రీవాల్ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్ కుమార్తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్కు ఛైర్పర్సన్గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్ మాట్లాడకపోవడం షాక్కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు -
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్లో ఉన్న కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్ కుమార్ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్ లైన్స్లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్ రూమ్లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్ చర్యలతో పూర్తిగా షాక్కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి మలీవాల్వె ల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్తో నాగాలాండ్ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్ను నాగాలాండ్లోని దిమాపూర్తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
రెచ్చిపోయిన పచ్చమూకలు..BC నేత వెంకటేశ్వరులు ఇంటిపై రాళ్ళ దాడి
-
ఏపీలో ఎందుకిలా ?..రాష్ట్రం రావణకాష్టంగా మారటానికి అసలు కారణం
-
టీడీపీ నాయకుల దాష్టీకం..
-
ఏలూరులో చల్లారని రగడ...
-
పచ్చమూక దౌర్జన్యం
-
కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట: పోలింగ్ ముగిసినా పల్నాడులోటీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్ïపీకి ఓటేశారన్న అక్కసుతో జిల్లాలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం నుంచి అమాయకులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. ఇళ్లపై విచక్షణారహితంగా దాడులు చేస్తుండటంతో పురుషులు గ్రామాలు వదిలి ప్రాణాలు దక్కించుకోగా, మహిళలు, పిల్లలు దేవాలయంలో తలదాచుకుంటున్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపైనా దాడులకు తెగబడుతున్నారు. చివరకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి నాయకులను గ్రామాలు దాటించాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ఎస్పీ బాధితులను రక్షించే చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.కొత్త గణేశునిపాలెంలో యథేచ్ఛగా దాడులుమాచవరం మండలం కొత్త గణేషునిపాడు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్ వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ రౌడీలను, గూండాలను తీసుకువచ్చి దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తూ వారి ఇళ్లపై దాడులు చేశారు. మోటారు బైకులు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామాన్లు, టీవీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ, భౌతికదాడులకు పాల్పడ్డారు. భయానక పరిస్థితుల్లో పురుషులంతా పొలాల్లోకి పరుగులు పెట్టి, అర్ధరాత్రి వరకూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని తెలిసి, దేవాలయంపైకి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. చేతులెత్తేసిన పోలీసులు...గ్రామంలో టీడీపీ చేస్తున్న దాడులపై పోలీసులకు ఫోన్ద్వారా, వీడియో సందేశాల ద్వారా బాధిత మహిళలు సమాచారం అందించినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోర్సు తక్కువగా ఉందన్న నెపంతో తప్పించుకున్నారని మంగళవారం ఆ గ్రామానికి వెళ్లిన మీడియాకు వారు తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్రెడ్డి మంగళవారం మ«ధ్యాహ్నం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చూసి వారు చలించిపోయారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది టీడీపీ మూకలు వారిని చుట్టిముట్టి, వాహనాలపై రాళ్లు రువ్వారు. గ్రామం నుంచి బయటకు వెళ్లనీయకుండా రహదారిని దిగ్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మరింత రెచ్చిపోయిన టీడీపీ మూక దాడులను అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారుఓట్లు వేసి ఇంటికి వచ్చాం. అంతా బాగుంది అనుకున్నాం. ఒక్కసారిగా టీడీపీ వాళ్లు గుంపులు, గుంపులుగా వచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇంటిపైనున్న రేకులు పగులగట్టారు. ఇంట్లోని టీవీ, ప్రిడ్జ్ కూలర్, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. బూతులు తిడుతూ మగవాళ్లను బతకనీయమంటూ బెదిరించారు. మేము బెదిరిపోయి గంగమ్మ గుడిలో తలదాచుకున్నాం.– అంబటి శ్రీలక్ష్మి, బాధిత మహిళవైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నామనే...గ్రామంలో టీడీపీ బలంగా ఉండేది. 2019 ఎన్నికల నుంచి జగనన్నపై నమ్మకంతో మేము వైఎస్సార్సీపీలో యాక్టివ్గా ఉంటున్నాం. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగనన్నను గెలిపించాలని బాగా పని చేశాం. దానిని తట్టుకోలేక మా ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఇంటిపై రాళ్లు వేశారు. బూతులు తిట్టారు. భయంతో మా వాళ్లు రాత్రంతా పొలాల్లో తలదాచుకున్నారు. చాలా భయమేçస్తోంది. – చల్లగుండ్ల కోటేశ్వరమ్మ బాధిత మహిళకనీసం స్పందించని ఎస్పీగ్రామంలో ఇంత అరాచకం జరుగుతుంటే జిల్లా ఎస్పీ బింధుమాదవ్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు, వైఎస్సార్సీపీ నాయకులు వాపోతున్నారు. ఆయన గ్రామాన్ని సందర్శించలేదు. అవసరమైన బలగాలను పంపలేదు. వారి వైఖరి ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. కారంపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసమైందని తెలియగానే వెళ్లిన ఎస్పీ కొత్త గణేషునిపాడుకు ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మూకల ఆగడాలు, రౌడీయిజానికి అంతేలేకుండా పోయింది. పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి 9.45 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వీరి పైశాచిక విధ్వంసకాండ కొనసాగింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, స్థానిక సర్పంచి కొటాల చంద్రశేఖర్రెడ్డి ఇంటిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కుమారుడు వినీల్ ఆధ్వర్యంలో పచ్చ మంద దాడి చేసింది.సర్పంచి ఇంటికి నిప్పు పెట్టింది. విలువైన వస్తువులు, నగదు, బంగారం, ల్యాప్టాప్ వంటి వస్తువులను లూటీ చేసింది. పంచాయతీలో అధిక శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా ఓటింగ్లో పాల్గొన్నారనే అక్కసుతోనే పచ్చ మంద ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. దాడికి గురైన సర్పంచి చంద్రశేఖర్రెడ్డిని పరామర్శించేందుకు రామిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డిని టీడీపీ శ్రేణులు, చిత్తూరు నుంచి దిగుమతి చేస్తున్న రౌడీలతో ఉన్న వినీల్ అడ్డుకున్నారు. మోహిత్రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆయన కారును పెట్రోలు పోసి దగ్ధం చేశారు. మరో కారును రాడ్లు, కర్రలు, బండరాళ్లతో ధ్వంసం చేశారు. కారు డ్రైవర్, మాజీ సైనికుడిని కట్టేసి కొట్టారు. ఈ దాడిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నానీయే మోహిత్రెడ్డి అనుచరులను కొట్టారు. బాధితులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చిపోయిన పచ్చ మూకలు తిరుపతిలో మంగళవారం ‘పచ్చ’ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పచ్చమూకలను రెచ్చగొట్టారు. దీంతో వర్సిటీ ముందు రోడ్డుపై బైఠాయించి ఈ మూకలు ఆందోళన చేశాయి. రోడ్డుపై వెళ్తున్న అమాయకులను సైతం పట్టుకుని ‘మీరు వైఎస్సార్సీపీ వాళ్లే కదా... ’అంటూ విచక్షణా రహితంగా కొట్టాయి. వర్సిటీ రోడ్డు మీదుగా తుమ్మలగుంటకు వెళ్తున్న తిరుపతి రూరల్ మండలం తిరుమల నగర్ పంచాయతీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మొదలియార్ రమేష్, అతని అనుచరుల కారును అడ్డగించాయి. రమేష్తో పాటు కారులో ఉన్న అనుచరులను రోడ్డుపైకి లాగి.. పది మంది కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ, స్పృహ తప్పిపోయేంతగా కొట్టారు. అంతటితో ఆగక, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఎస్వీయూ, మహిళా వర్శిటీ, పద్మావతి కళాశాల ఉద్యోగులపై సైతం దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సోదరుడు రఘునాధరెడ్డికి చెందిన బుల్లెట్, మరో 10 వాహనాలపై వైఎస్సార్సీపీ గుర్తులు ఉన్నాయని కాల్చి వేశారు. వీడియోలు తీస్తున్న మీడియాపై సైతం దాడికి పాల్పడ్డారు. ‘పులివర్తి నాని అన్న చెప్పాడు.. వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను తరిమి తరిమి కొట్టండి’ అంటూ గంజాయి మత్తులో ఉన్న పచ్చమూక రెచ్చిపోయింది. ఈ గూండాల విధ్వంసంతో వర్సిటీ పరిసరాలు హాహాకారాలు.. రక్తపు గాయాలు.. ఎగిసిపడే మంటలతో యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. చివరకు పోలీస్ బలగాలు భారీగా తరలివచ్చి లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చి0ది. -
రఫాలో ఇజ్రాయెల్ సైన్యం దాడి..భారత మాజీ సైనికాధికారి మృతి
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో భారతీయ మాజీ సైనికాధికారి కల్నల్ వైభవ్ అనిల్ కాలే(46) బలయ్యారు. గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో అతడు ప్రయాణిస్తున్నవాహనం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన అనిల్ కాలే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ విచారం వ్యక్తం చేసింది. తమ సైన్యం చేసిన దాడిపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించింది. అనిల్ కాలే ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బి.ఎ. చదివాడు. ‘బిహేవియరల్ సైన్స్’, ‘ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియల్ లా’లో డిగ్రీలు సాధించారు.ఐఐఎం–లక్నో, ఐఐఎం–ఇండోర్లో ఉన్నత విద్య అభ్యసించారు. 2004 ఏప్రిల్లో భారత సైన్యంలో చేరారు. 2009, 2010లోఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కంటింజెంట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సేవలందించారు. సైనికుడిగా జమ్మూకశీ్మర్లో పని చేశారు. 2022లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే ఐక్యరాజ్యసమితి డిపార్టుమెంట్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ(డీఎస్ఎస్)లో సెక్యూరిటీ కో–ఆర్డినేషన్ ఆఫీసరుగా చేరారు.అనిల్ కాలే సోమవారం ఉదయం ఐక్యరాజ్యసమితి వాహనంలో మరో డీఎస్ఎస్ అధికారితో కలిసి రఫాలోని యూరోపియన్ హాస్పిటల్కు బయలుదేరగా ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో అనిల్ కాలే మృతిచెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. ఐరాస సెక్రెటరీ జనరల్ గుటేరస్ ది్రగ్బాంతి కల్నల్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కాలే మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేశారు. అనిల్ కాలే కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. గాజాలో విధి నిర్వహణలో ఉన్న ఐక్యరాజ్యసమితి సిబ్బందిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను గుటేరస్ ఖండించారు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు.బందీలను విడుదల చేయాలని హమాస్ మిలిటెంట్లకు హితవు పలికారు. కల్నల్ వైభవ్ అనిల్ కాలే మరణం పట్ల ఐక్యరాజ్యసమితిలోని భారత ప్రతినిధి బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సంతాపం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం మొదలైన తర్వాత గాజాలో ఇప్పటివరకు 190 మందికిపైగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది మరణించారు. గాజాలో ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన తొలి విదేశీయుడు అనిల్ కాలే కావడం గమనార్హం. మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన అనిల్ కాలే కుటుంబం పుణేలో స్థిరపడింది.మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ప్రయతి్నస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యుడు రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రశాంత్ కర్దే చెప్పారు. పుణేలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. అనిల్ కాలేకు భార్య అమృత, కుమారుడు వేదాంత్, కుమార్తె రాధిక ఉన్నారు. ఆయన సోదరుడు విశాల్ కాలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెపె్టన్గా పనిచేస్తున్నారు. సోదరుడి వరుసయ్యే కల్నల్ అమేయ్ కాలే భారత సైన్యంలో పనిచేస్తున్నారు. -
చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
చీరాల టౌన్/చీరాల: బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ అనుచరులు జరిపిన దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం గవినివారిపాలెం పోలింగ్ కేంద్రానికి కొండయ్య యాదవ్ అనుచరులతో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆయనపై కొండయ్య దురుసుగా ప్రవర్తించారు. ఇదే అదనుగా ఆయన అనుచరులు రాడ్లు, కర్రలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారు.పోలీసుల కళ్లముందే ఇదంతా జరుగుతున్నా చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ, డీఎస్పీ బేతపూడి ప్రసాద్ చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడానికి యత్నించలేదు. పైగా దాడిలో గాయపడిన చీదరబోయిన రమణమ్మ, మరో ముగ్గురిని బలవంతంగా పక్కకు నెట్టేశారు. గవిని శ్రీను, మరో నలుగురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు జీపులో ఎక్కించుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడకు చేరుకున్న కొండయ్య కుమారుడు మహేంద్ర, అతని అనుచరులు కర్రలతో వచ్చి భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు డీఎస్పీ బేతపూడి ప్రసాద్ రంగంలోకి దిగి కొండయ్యను బతిమిలాడి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తరువాత పిట్టువారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ టీడీపీకి ఓట్లు వేయకపోతే అందరి అంతూ చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి దౌర్జన్యంచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కొండయ్య గెలవాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నేత బలగంశెట్టి అంకమ్మరావుపై దాడికి దిగారు. రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద అంకమ్మరావు ప్రజలకు నమస్కరిస్తూండగా కారులోంచి దిగిన ఆమంచి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన చీరాల ఏరియా వైద్యశాలలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కరణంపై ఆమంచి దాడిచీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులతో కలసి బీభత్సం సృష్టించారు. ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు పట్టణంలోని ఏడో వార్డుకు సోమవారం సాయంత్రం వెళ్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ను కులం పేరుతో దూషించి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తన అనుచరులతో కలసి దాడికి తెగబడ్డారు. వెంకటేష్ కారు అద్దాలు పగులకొట్టించారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చీరాల వన్టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్ ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమంచి వర్గీయులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
గన్నవరంలో టీడీపీ గలాటా
సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట అర్బన్/ఉంగటూరు: కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకులు గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీపై దాడులకు పాల్పడ్డారు. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు, వైఎస్సార్సీపీ కేడర్ను రెచ్చగొట్టడంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ⇒ ఉంగుటూరు మండలం తేలప్రోలు జెడ్పీహైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు పరీశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు తన అనుచరులతో ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా వల్లభనేని వంశీని, సీఎం జగన్ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చేరడంతో దాడికి పాల్పడ్డారు.వల్లభనేని వంశీమోహన్ అక్కడకు చేరుకుని కవ్వింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి రవికుమార్, ప్రత్తిపాటి జీవన్కుమార్, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా అవుటుపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.⇒ అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలంకలో వైఎస్సార్సీపీ నాయకుడైన మండల బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఆయన కుమార్తె కేసాని తేజశ్రీలపై జనసేన నాయకులు దాడికి దిగారు. తండ్రిని కొడుతుండగా కుమార్తె తేజశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టారు.కౌన్సిలర్ భర్తపై టీడీపీ గూండాల దాడిఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం పోలింగ్ బూత్లోకి వెళ్లిన 16వ వార్డు కౌన్సిలర్ తన్నీరు నాగమణి భర్త, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్రపై స్థానిక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చెరువుబజారులోని బీసీ కమ్యూనిటీ భవన్లో ఏర్పాటుచేసిన 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఒక మానసిక దివ్యాంగుడికి సహాయంగా అతని కుటుంబ సభ్యుని అనుమతించాలని తన్నీరు నాగేంద్ర ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకునేందుకు బూత్లోకి వెళ్లారు.అదే సమయంలో స్థానిక టీడీపీ వ్యక్తులు నడిగొండ్ల సతీష్, తాళ్లూరి సోమయ్య, అతని కుమారుడు తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు అరగంట ముందు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం చినబాబు అదే బూత్ వద్దకు వచ్చి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపాడనీ, ఆయన సూచనతోనే ఈ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సామినేని రవిచంద్, ఉదయభాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్(చిన్నా), పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్(బాజి) ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉదయభాను సోదరి చాముండేశ్వరి(బేబి)ని కూడ దుండగులు తోసేయడంతో ఆమె కింద పడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. -
పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
సాక్షి, నరసరావుపేట/రెంటచింతల/నరసరావుపేట/మాచర్ల: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడులో పచ్చ మూక పేట్రేగింది. ఓటమి ఖాయమని ముందే తెలిసిపోవడంతో ఓటర్లు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు, దళితులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. దీంతో పల్నాడు జిల్లా రణరంగాన్ని తలపించింది. యథేచ్ఛగా టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినవారిని, అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని టీడీపీ నేతలు, కార్యకర్తలు చితకబాదారు. చివరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా విడిచిపెట్టలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు, డ్రైవర్పై, ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడి కారుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.నూజెండ్ల మండలంలో దళితులను చితకబాదారు. దాచేపల్లి మండలం కేశానుపల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ వారిని టీడీపీ నేతలు చావగొట్టారు. పాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. తంగెడలో టీడీపీ నేతలు పెట్రోలు బాంబులతో దాడులు చేయడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చేష్టలుడిగి వేడుక చూశారు.దీంతో టీడీపీ మూక పల్నాడులో భయానక వాతావరణం సృష్టించింది. ముందస్తు ప్లాన్లో భాగంగా పెట్రోల్ బాంబ్లు, కర్రలు, రాళ్లు సమకూర్చుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలు మూకుమ్మడి దాడులు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలలో బయటి ప్రాంతాల నుంచి బౌన్సర్లు, గూండాలను తీసుకువచ్చి దాడులు చేయించారు.మాచర్లలో భయానక వాతావరణం సృష్టించిన బ్రహ్మారెడ్డి..మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా ఫ్యాక్షన్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని తెచ్చిన చంద్రబాబు పోలింగ్ రోజు ఆయనతో బీభత్సం సృష్టించి.. ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. రెంటచింతల మండలం పాల్వాయి వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను కొట్టి లాగేశారని తెలిసి అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్పై బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ మూక దాడులు చేసింది. విచక్షణారహితంగా కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతం రెడ్డి, డ్రైవర్ అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అదే మండలంలోని తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలపై విచక్షణారహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. తుమృకోటలో 5 ఈవీఎంలు, పాల్వాయి, జెట్టిపాలెంలలో ఒక్కో ఈవీఎంను ధ్వంసం చేశారు.కారంపూడి మండలం ఒప్పిచర్లలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్లుగా ఉన్న వైఎస్సార్సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి. పొట్టి శ్రీరాములు కాలనీలో బూత్ వద్ద రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్తో పాటు పలువురికి తలలు పగిలాయి. వెల్దుర్తిలో పలు బూత్ల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు లాగి పడేసి టీడీపీ రౌడీ మూకలు రిగ్గింగ్లకు పాల్పడ్డాయి.మర్సపెంటలో పుల్లారెడ్డి అనే అధికారిపై దాడి చేశారు. దుర్గి మండలం ముట్టుకూరులో టీడీపీ మూకల రాళ్లదాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నరసరావుపేట నియోజకవర్గం పమిడిపాడులో టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ఓటర్లును పోలింగ్ కేంద్రానికి రాకుండా కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దొండపాడులో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. గురజాలలో గూండాగిరిదాచేపల్లి మండలం కేశానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా వ్యవహరిస్తున్న బొల్లా శ్రీనివాసరావు, ఆయన కుమారులు దిలీప్, మధు, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు పిడిగుద్దులు కురిపించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లి మరీ దాడులు చేశారు. తంగెడలో పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. దీంతో రెండు దుకాణాలు, నాలుగు బైకులు దగ్ధం కావడంతోపాటు 8 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లిలో మంత్రి అంబటితో సీఐ దురుసు ప్రవర్తనముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద మహిళలను సీఐ అన్యాయంగా కొట్టాడని ప్రశ్నించడానికి వెళ్లిన మంత్రి అంబటి రాంబాబుతో సీఐ రాంబాబు దురుసుగా ప్రవర్తించారు. రివాల్వర్తో బెదిరించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వర్గీయులు 20 మంది గూండాలతో దాడులకు పాల్పడ్డారు. ముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలను ధ్వంసం చేశారు. నకరికల్లు మండలం రూపనగుంట్ల, కుంకలగుంటలలో 8 మందికి గాయాలయ్యాయి.రాజుపాలెం మండలం గణపవరంలో టీడీపీ కార్యకర్తలు రాడ్డులు, కర్రలతో వైఎస్సార్ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పెదకూరపాడు మండలం లగడపాడు, క్రోసూరు మండలం ఎర్రబాలెం, బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం, అచ్చంపేట మండలం మాదిపాడులో టీడీపీ మూకల రాళ్లదాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. నూజెండ్ల మండలం పాతచెరుకుంపాలెం, జంగాలపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతుండగా అడ్డుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై దాడి చేయడానికి ప్రయత్నించారు.పోలీసుల ‘పచ్చ’పాతంప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ చేయాల్సిన పోలీసు శాఖ పచ్చపాతంతో పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రౌడీలు, గూండాలతో టీడీపీ బీభత్సకాండ సృష్టించినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. సాక్షాత్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లపై దాడి చేస్తున్నా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పదుల సంఖ్యలో పోలీసులు, ఆర్మ్డ్ సిబ్బంది నియమించి టీడీపీ రిగ్గింగ్ చేసే గ్రామాల్లో మాత్రం ఒకరిద్దరు సిబ్బందితోనే సరిపెట్టారు.మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కుంకులగుంటలో డీఎస్పీ స్థాయి అధికారి అక్కడే ఉండి టీడీపీ ఏజెంట్లకు రక్షణ కల్పించారు. మాచర్ల చుట్టుపక్కలే ఉన్న ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు వైఎస్సార్సీపీ నేతలపై దాడులను నిలవరించలేకపోయారు. పోలింగ్ రెండు మూడు రోజుల ముందు టీడీపీ అరాచకాలను అడ్డుకుంటారని భావించిన పలువురు సీఐ, ఎస్ఐలను అక్కడి నుంచి బదిలీ చేయించారు. దీంతో టీడీపీ మూకలకు మరింత స్వేచ్ఛనిచ్చినట్టయింది. పోలింగ్కు ముందు 48 గంటల నుంచి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండటానికి వీల్లేదు.అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రౌడీలు, బౌన్సర్లు ఉన్నా పోలీసుశాఖ వారిని చూసిచూడనట్టు వదిలేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ కార్యకర్తల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పలుమార్లు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు విన్నవించుకొన్నా సరిగా స్పందించలేదని వాపోతున్నారు. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్పీ బిందుమాధవ్ స్పందించలేదని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. -
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్సీపీ నాయకులు హాస్పటల్లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడులు
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement