-
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్రైజర్స్లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
Play Offs లోకి ఆర్సిబీ
-
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
-
చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..
-
RCB vs DC: మరో కీలక మ్యాచ్
-
కోహ్లి విజృంభణ.. పంజాబ్పై ఆర్సీబీ గెలుపు
-
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
-
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'.. తప్పక గెలవాలి
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్పై దాదాపుగా ఆశలు వదులుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఆర్సీబీని ఢీకొట్టనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలన్నా ఈ మ్యాచ్తో పాటు మిగిలిన మ్యాచ్లన్నీ (రెండు) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలా జరిగినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీ లేదు. ఫైనల్ ఫోర్ రేసులో ఉన్న మిగతా జట్ల జయాపజయాలపై ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ 11 మ్యాచ్లు ఆడి చెరి నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఆర్సీబీ -0.049 రన్రేట్ కలిగి ఉండగా.. పంజాబ్కు -0.049 ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత ముంబై, గుజరాత్లతో తలపడాల్సి ఉండగా..పంజాబ్ ఈ మ్యాచ్ తర్వాత పటిష్టమైన రాజస్థాన్, సన్రైజర్స్ను ఢీకొట్టాల్సి ఉంది.పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ కాస్త బలహీనమైన ప్రత్యర్దులతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్తో పాటు ముంబై, గుజరాత్లపై భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు ఖాతాలో ఉండి సీఎస్కే (12), ఢిల్లీ (12), లక్నోలతో (12) ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడే అవకాశం ఉంది.ఢిల్లీ, లక్నో ఇంకా రెండ్రెండు మ్యాచ్లు, సీఎస్కే మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ (16), రాజస్థాన్ (16) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తులను దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్ (14).. సీఎస్కే, ఢిల్లీ, లక్నోల కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంది.సన్రైజర్స్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో భారీ తేడాతో గెలిచిన ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఆ జట్టు వశమే అవుతుంది. అప్పుడు మిగిలిన నాలుగో బెర్త్ కోసం సీఎస్కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడాల్సి ఉంటుంది. నిన్న లక్నోపై సన్రైజర్స్ భారీ విజయం సాధించడంతో ఈ సీజన్లో ముంబై పోరాటం అధికారికంగా ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్కీపర్), అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ [ఇంపాక్ట్ సబ్: ప్రభ్సిమ్రన్ సింగ్]ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్కుమార్ వైశాఖ్, మహ్మద్ సిరాజ్ [ఇంపాక్ట్ సబ్: రజత్ పాటిదార్] -
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
-
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
-
IPL 2024: టాప్లో రాజస్థాన్.. గెలిచినా ఆఖర్లోనే ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్కు ముందు మరో 24 మ్యాచ్లు మాత్రమే మిగిలాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 28 నాటికి 46 మ్యాచ్లు పూర్తయాయ్యి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..కేకేఆర్, సీఎస్కే, సన్రైజర్స్, లక్నో, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.9 మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. మిగతా మూడు బెర్తుల కోసం ఐదు జట్ల (కేకేఆర్, సీఎస్కే, సన్రైజర్స్, లక్నో, ఢిలీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుజరాత్, పంజాబ్, ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్స్కు చేరలేవు. ఏప్రిల్ 29 నాటికి ఐపీఎల్ 2024 సీజన్ పాయింట్ల పట్టిక..జట్టుమ్యాచ్లుగెలుపుపాయింట్లురన్రేట్ఆడాల్సిన మ్యాచ్లు రాజస్థాన్98160.6945కేకేఆర్85100.9726సీఎస్కే95100.8105సన్రైజర్స్95100.0755లక్నో95100.0595ఢిల్లీ10510-0.2764గుజరాత్1048-1.1134పంజాబ్936-0.1875ముంబై936-0.2615ఆర్సీబీ1036-0.4154 -
విల్ జాక్స్ సుడిగాలి శతకం.. గుజరాత్ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్తో ఇవాళ (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్ సునామీ ఇన్నింగ్స్ ముందు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్ (12 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్ వేసిన 15వ ఓవర్లో 29 పరుగులు, రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్ వికెట్ సాయికిషోర్కు దక్కింది.అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్లో వృద్దిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్తో మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్కీపర్), శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో పటిష్టమైన సన్రైజర్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్రైజర్స్ 6 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
IPL 2024: డీజే టిల్లు పాటకు చిందేసిన విరాట్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆన్ ఫీల్డ్లో డ్యాన్సులేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను మైదానంలో స్టెప్పులేస్తూ కనిపించాడు. సందర్భమేదైనా సరే పాట ప్లే అయ్యిందంటే చాలు విరాట్కు పూనకం వస్తుంది. పక్కన ఎవరన్నా ఉంటే వారితో కలిసి చిందేస్తాడు. లేదంటే ఒక్కడే రెచ్చిపోతాడు. ఇలాంటి సందర్భమే తాజాగా మరోసారి వచ్చింది. నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియం స్పీకర్లలో తెలుగు పాపులర్ డీజే టిల్లు పాట ప్లే అయ్యింది. ఈ పాట వినగానే కోహ్లి రెచ్చిపోయాడు. బీట్కు తగ్గట్టు స్టెప్పులేశాడు. విరాట్కు ఈ పాట ఫాస్ట్ బీట్ బాగా నచ్చినట్లుంది. ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు విరాట్ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.- KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024 ఇదిలా ఉంటే, సన్రైజర్స్కు నిన్న సొంత మైదానంలో చుక్కెదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు చాలాకాలం తర్వాత కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్రైజర్స్ను ఇబ్బంది పెట్టారు.స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్), కమిన్స్ (31), అభిషేక్ శర్మ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
RCB: గెలిచి నెలైంది.. ఆ మాత్రం ఉంటుందిలే.. విరాట్పై దారుణమైన ట్రోల్స్!
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీకి ఎట్టకేలకు రెండో విజయం లభించింది. నిన్న సన్రైజర్స్పై విజయం సాధించిన అనంతరం ఆ జట్టుకు వరుస పరాజయాల నుంచి ఊరట లభించింది. నిన్నటి మ్యాచ్లో డుప్లెసిస్ సేన సన్రైజర్స్పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, పరాభావాల పరంపరకు పుల్స్టాప్ పెట్టింది. మార్చి 25న పంజాబ్పై సీజన్ తొలి విజయం సాధించిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25న మరో విజయం నమోదు చేసింది. ఈ మధ్యలో ఆ జట్టు డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. Happiness on Virat Kohli's face after the win. ❤️ pic.twitter.com/RRRZ1ViWux— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 ఈ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా సంబురాలు చేసుకోవడం టాక్ ఆఫ్ ద సోషల్మీడియాగా మారింది. ఏదో టైటిల్ గెలిచినట్లు ఆనందపడిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Cameron Green hugging Virat Kohli. ❤️ pic.twitter.com/Zl4StHBu6b— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 మ్యాచ్ గెలిచి నెల అవుతుంది కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను ఆర్సీబీ వ్యతిరేకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. RCB REGISTERED A WIN IN THEIR 250TH IPL MATCH. 🫡- A victory against one of the most dangerous sides of IPL 2024. 👌pic.twitter.com/UWn3pZD0OS— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 నిన్నటి మ్యాచ్లో నిదానంగా ఆడినందుకు కూడా విరాట్ కోహ్లి దారుణమైన ట్రోలింగ్కు గురవుతున్నాడు. విరాట్ వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఆడతాడన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు. The emotional hug between Virat Kohli and Faf Du Plessis after the win. ❤️ pic.twitter.com/cb0PlDhS5z— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024 రజత్ పాటిదార్ పుణ్యమా అని ఆర్సీబీ గెలిచింది కానీ.. ఫలితం తారుమారు అయ్యుంటే మాత్రం ఆర్సీబీ అభిమానులే కోహ్లిని ఏకిపారేసి ఉండేవారు. నిన్నటి మ్యాచ్లో పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తే.. విరాట్ 51 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్నాడు. హాఫ్ సెంచరీకి ముందు విరాట్ చాలా బంతులు వేస్ట్ చేశాడు. అతనిలో వ్యక్తిగత మైలురాళ్లు అధిగమించాలనే ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ఇదే అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేసింది.జట్టు కోసం ఎలా ఆడాలో రోహిత్ను చూసి నేర్చుకో అంటూ అభిమానులు చురకలంటిస్తున్నారు. మొత్తానికి మాసం తర్వాత లభించిన విజయానికి అతిగా స్పందించడం.. నిదానంగా ఆడటం వంటి కారణాల చేత విరాట్ నిన్నటి నుంచి ట్రోలింగ్కు గురవుతున్నాడు. -
SRH vs RCB: ఉప్పల్లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
తగ్గేదేలే అంటున్న కమిన్స్..ఆర్సీబీ పరిస్థితి ఏంటో?
-
IPL 2024: తిరుగులేని సన్రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్కతా నైట్రైడర్స్ (10), సన్రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్లోనూ సన్రైజర్స్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ పరుగుల వరద పారి ఆల్టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్లోనే సన్రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement