-
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను సైతం ఆహ్వానించింది.మే 27 సాయంత్రం ఆరు గంటలలోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. టీమిండియా హెడ్కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు జస్టిన్ లాంగర్, గౌతం గంభీర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, పాంటింగ్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు అవకాశం లభిస్తే టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు భజ్జీ తెలిపాడు.భారత హెడ్కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మ్యాన్ మేనేజ్మెంట్. భారత ఆటగాళ్లకు క్రికెట్ గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. వారికి మార్గదర్శకత్వంగా ఉంటే చాలు. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవకాశం వస్తే సంతోషిస్తా" అని ఓ స్పోర్ట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. -
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ ప్రదర్శన కనబరిచాడు. కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఏడాది సీజన్కు ముందు ఆల్-క్యాష్ డీల్లో భాగంగా గుజరాత్ నుంచి ముంబై జట్టుకు ట్రేడ్ అయిన హార్దిక్.. కెప్టెన్గా తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రం విజయం సాధించింది. అదే విధంగా హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన పాండ్యా 18 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో హార్దిక్ విఫలమైనప్పటకి టీ20 వరల్డ్కప్ భారత జట్టులో మాత్రం చోటు దక్కింది. కేఎల్ రాహుల్, గిల్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు ఇవ్వకుండా హార్దిక్ను ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే వరల్డ్కప్నకు హార్దిక్ను ఎంపిక చేయడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సపోర్ట్ చేశాడు. వరల్డ్కప్లో పాండ్యా సత్తాచాటుతాడని రైనా జోస్యం చెప్పాడు."హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ తనవంతు న్యాయం చేసేవాడు. ఫామ్ అనేది తాత్కాలికం మాత్రమే. అది శాశ్వతం కాదు. వరల్డ్కప్లో పాకిస్తాన్పై హార్దిక్ బాగా రాణిస్తే, అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతారని" క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. ఇక టీ20 వరల్డ్కప్-2024 జూన్ 1 నంచి ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. -
విరాట్ కోహ్లిని తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
వరల్డ్క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచే. ఈ దాయదుల పోరును వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తుంటున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించే సమయం అసన్నమవుతోంది. ఈ చిరకాల ప్రత్యర్ధిలు మరోసారి అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నారు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ తమ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టును మిస్బా హెచ్చరించాడు."భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లి ఎక్స్ ఫ్యాక్టర్. అతడు ఇప్పటికే చాలాసార్లు పాకిస్తాన్కు ఓటమిరూచిను చూపించాడు. పాకిస్తాన్పైన అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో చెలరేగిపోతాడు. విరాట్ ఎప్పుడూ ఒత్తడితో ఆడినట్లు నేను చూడలేదు. విరాట్ ఒక టాప్-క్లాస్ క్రికెటర్. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉంది. విరాట్ను ఆపాలంటే ప్రత్యేక వ్యూహాలను రచించాలి. అతని స్ట్రైయిక్ రేటు పెద్ద విషయమే కాదు. అతడు తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోడు. కోహ్లి విమర్శలను పొగడ్తలగా భావించి మరింత రాటుదేలుతాడని" స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్బా పేర్కొన్నాడు. -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం భయపెట్టిన ఘనత హిట్మ్యాన్ది. వన్డే క్రికెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక మొనగాడు రోహిత్ శర్మనే. అటువంటి రోహిత్ శర్మ తన కెరీర్లో ఒక బౌలర్కు భయపడ్డాడట. అతడే దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్. రోహిత్ శర్మ తాజాగా దుబాయ్ ఐ 103.8 అనే ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న హిట్మ్యాన్కు ఎదురైంది. అందుకు బదులుగా రోహిత్ శర్మ.. డేల్ స్టెయిన్ అంటూ బదులిచ్చాడు."నేను నా కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. స్టేయిన్ ప్రత్యర్ధి జట్టులో ఉంటే నేను బ్యాటింగ్కు వెళ్లే ముందు అతడి బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడిని. స్టెయిన్ అద్భుతమైన బౌలర్. అతడొక లెజెండ్. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అతడి బౌలింగ్లో ఆడటాన్ని ఆస్వాదిస్తానని" రోహిత్ పేర్కొన్నాడు. -
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్కప్ ఫైనల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్ల వేదికగా జూన్ 1 నుంచి ఈ పొట్టి వరల్డ్కప్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు దాదాపుగా తమ వివరాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్కు చేరే జట్లను వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశాడు. వెస్టిండీస్, భారత్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్కు చేరుతాయని లారా తెలిపాడు. అంతేకాకుండా. జూన్ 29న తుది పోరులో వెస్టిండీస్, భారత జట్లు తలపడతాయని లారా జోస్యం చెప్పాడు.వెస్టిండీస్ ఒక అద్బుతమైన జట్టు. జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఉంది. మరోవైపు భారత వరల్డ్కప్ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటకి.. టాప్-4లో మాత్రం కచ్చితంగా ఉంటుంది.టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్-విండీస్ జట్లు తలపడితే నేను చూడాలనకుంటున్నాను. ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తల పడి అత్యుత్తమ జట్టు ఛాంపియన్స్గా నిలవాలి. అదేవిధంగా భారత్, విండీస్ పాటు అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ కూడా సెమీఫైనల్స్కు చేరే అవకాశముందని లారా క్రికెట్ పాకిస్తాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారా పేర్కొన్నాడు.కాగా ఈ పొట్టి వరల్డ్కప్లో భారత జట్టు కంటే విండీస్కే ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. విండీస్ రెండు సార్లు ఛాంపియన్స్గా నిలిచింది. వెస్టిండీస్ 2012 ,2016లో టైటిల్ను గెలుచుకుంది. మరోవైపు 2007లో జరిగిన టీ20 వరల్డ్కప్ తొలి ఎడిషన్ టైటిల్ను టీమిండియా సొంతం చేసుకుంది. -
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభానికి మరో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్కు సమయం దగ్గరపడతుండడంతో క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో టీమిండియా వరల్డ్కప్ జెర్సీని బీసీసీఐ రివీల్ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్ జెర్సీ రిలీజ్కు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది.టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో జూన్5 న ఐర్లాండ్తో తలపడనుంది.ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రింకూ సింగ్, శుబ్మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు దక్కలేదు.టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ View this post on Instagram A post shared by adidas India (@adidasindia) -
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్-2024కు మరో ఐదు వారాల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్కు బ్రాండ్ అంబాసిడర్గా టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలే మియామీ గ్రాండ్ ప్రిక్స్లో సందడి చేసిన యువరాజ్.. వరల్డ్కప్ ట్రోఫితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. రేసింగ్ ట్రాక్పై వరల్డ్కప్ ట్రోఫితో యువీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను యువరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువీ.. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోనే ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. ఇప్పటికి టీ20 వరల్డ్కప్ అంటే యువరాజ్ సింగ్ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువీని ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. యువీ.. ఉసెన్ బోల్ట్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్కప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. -
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, రింకూ సింగ్లు వంటి స్టార్ ఆటగాళ్లకి భారత సెలక్షన్ కమిటీ చోటుఇవ్వలేదు. ముఖ్యంగా టీ20ల్లో టీమిండియా నయా ఫినిషర్గా మారిన రింకూ సింగ్ను సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం అందరిని షాక్కు గురిచేసింది. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లతో బంతిని పంచుకునే మూడో పేసర్గా అర్ష్దీప్ సింగ్ను సెలక్టర్లు అనూహ్యంగా ఎంపిక చేశారు. ఐపీఎల్-2024లో నామమాత్రపు ప్రదర్శన చేస్తున్న అర్ష్దీప్ను ఎంపిక చేయడం పట్ల భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత వరల్డ్కప్ జట్టులో మూడో పేసర్గా ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ చోటుదక్కుతుందని తను భావించినట్లు వాట్సన్ తెలిపాడు. "నటరాజన్కు భారత టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. నటరాజన్ యార్కర్లను అద్బుతంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడు నిలికడగా రాణిస్తున్నాడు. అతడి బౌలింగ్లో వేరియషన్స్ కూడా ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా నట్టూకు ఉందని" ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన నటరాజన్.. 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. -
టీ20 వరల్డ్కప్కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఇద్దరు
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా-వెస్టిండీస్లకు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 2 న చెన్నై వేదికగా అమెరికా-కెనడా మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీకోసం 20 మందితో కూడిన అంపైర్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది.ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్లోని నలుగురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్ నుంచి నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్కు చోటు దక్కింది. కాగా మదనగోపాల్కు ఐసీసీ ఈవెంట్లో అంపైరింగ్ చేసే అవకాశం రావడం ఇదే మొదటిసారి. అతడితో పాటు సామ్ నోగాజ్స్కీ, అల్లావుడియన్ పాలేకర్, రషీద్ రియాజ్, ఆసిఫ్ యాకూబ్లు సైతం తొలిసారి ఐసీసీ ఈవెంట్లో అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదే విధంగా 2022 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రీఫిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరోవైపు ఈ ప్రధాన టోర్నీ కోసం మ్యాచ్ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్లను మ్యాచ్ రిఫరీలగా ఐసీసీ నియమించింది. వరల్డ్కప్కు అంపైర్లు వీరే..క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మీనన్, సామ్ నోగాజ్స్కీ, అహ్సన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, లాంగ్టన్ రుసెరే, రోడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్.మ్యాచ్ రిఫరీలు: డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రంజన్ మడుగల్లె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగల్ శ్రీనాథ్. The ICC announced the group of officials for the first round of the T20 World Cup 2024 in the USA and West Indies. The squad includes 20 umpires and 6 match referees.#T20WorldCup2024 pic.twitter.com/lvH9P4trg1— CricTracker (@Cricketracker) May 3, 2024 -
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
టీ20 వరల్డ్కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను వరల్డ్కప్కు ఎంపిక చేయకపోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ మెగా టోర్నీకి రాహుల్ను సెలక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ తమకు కావాలనుకున్నామని, అందుకే రాహుల్ను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు."రాహుల్ టీ20ల్లో ఎక్కువగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ను ఎంపిక చేయాలనకున్నాం. అందుకే రాహుల్ను పక్కన పెట్టి సంజూ శాంసన్, రిషబ్ పంత్లకు స్పెషలిస్టు వికెట్ కీపర్ బ్యాటర్లగా ఎంపిక చేశాము. వీరిద్దరికి మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని" ప్రెస్కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. ఈ ప్రెస్కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
'అతడేం తప్పు చేశాడు.. ఎవరి కోసమో బలి పశువు చేశారు'
టీ20 వరల్డ్కప్-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నారు.అయితే ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, నయా ఫినిషర్ రింకూ సింగ్లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ మెగా ఈవెంట్కు కేఎల్ రాహుల్ను పూర్తిగా పరిగణలోకి తీసుకోని సెలక్టర్లు.. రింకూను మాత్రం స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో రింకూకు ప్రధాన జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రింకూ సింగ్ లాంటి పవర్ హిట్టర్ను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు తీసుకున్న చెత్త నిర్ణయమని శ్రీకాంత్ మండిపడ్డాడు.'రింకూ సింగ్ ఏం తప్పు చేశాడు. సెలక్టర్ల నిర్ణయం నన్ను షాక్కు గురిచేసింది.ప్రస్తుతం ఇదే విషయం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. తను ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ సత్తాచాటాడు. అతడు గతంలో దక్షిణాణఫ్రికాతో సిరీస్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు.అటువంటి అద్భుత ఆటగాడిని ఎందుకు వరల్డ్కప్కు ఎంపిక చేయలేదు? అతడి బదులు జైశ్వాల్ను పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రింకూ సింగ్ కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే. అస్సలు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? కొంతమందిని సంతోషపెట్టడానికి రింకూ సింగ్ను బలి పశువు చేశారని' తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు.భారత టీ20 ప్రపంచకప్ జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్. -
టీ20 వరల్డ్కప్ వేటగాళ్లు.. భారత్ ప్లేయర్స్ బయోడేటా (ఫొటోలు)
-
ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలు ఖారారు. పాక్కు టీమిండియా వెళ్తుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ను ఘనంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీకి పీసీబీ వేదికలను ఖారారు చేసింది. కరాచీ, లాహోర్,రావల్పిండిలలో మ్యాచ్లను నిర్వహించినున్నట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే భారత జట్టు విషయంలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఆసియాకప్-2023లో పాల్గోనందుకు పాకిస్తాన్కు తమ జట్టును పంపించేందుకు నిరాకరించిన బీసీసీఐ.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా టీమిండియా పాకిస్తాన్లో పర్యటించే అవకాశము లేనుందన.. ఈ మెగా టోర్నీ ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్ లోనే జరిగే ఛాన్స్ ఉంది."ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ షెడ్యూల్ను ఖరారు చేశాం. షెడ్యూల్ను ఐసీసీకి పంపించాం. ఐసీసీ భద్రతా బృందంతో మేము సమావేశమయ్యాం. ఈ మీటింగ్ బాగా జరిగింది. పాక్లో టోర్నీ ఏర్పాట్లను వాళ్లు పరిశీలించారు. వారితో స్టేడియం అప్గ్రేడ్ ప్లాన్లను కూడా పంచుకున్నాం. ఈ టోర్నీని మేము విజయవంతంగా నిర్వహిస్తామని నమ్మకం మాకు ఉందని" పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు.కాగా ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. -
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా వైస్ కెప్టెన్గా పంత్!?
టీ20 వరల్డ్కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే వరల్డ్కప్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్కప్ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. -
T20 వరల్డ్కప్కు లారా భారత జట్టు ఇదే.. ఊహించని ప్లేయర్కు ఛాన్స్
టీ20 వరల్డ్కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది. ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకున్నారు. వరల్డ్కప్ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ కోసం వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్, నయా ఫినిషర్ రింకూ సింగ్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇచ్చాడు. అదే విధంగా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, రిషబ్ పంత్లను లారా ఎంపిక చేశాడు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్ సంచలనం మయాంక్ యాదవ్కు సైతం లారా అవకాశమిచ్చాడు.వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లకు ఫాస్ట్ బౌలర్లగా బ్రియాన్ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు. -
బర్త్డే స్పెషల్.. చిన్నారులతో ఫుట్ బాల్ ఆడిన సచిన్! వీడియో వైరల్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ తన బర్త్డే సెలబ్రేషన్స్ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్ ఫౌండేషన్’లో జరపునకున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన విషయాలను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు."ఈసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్ కట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో ఫుట్బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్ అనుకుంటాను. ఈ మూమెంట్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్ను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. Happy birthday paaji! 🎉 From smashing bowlers on the field to smashing life goals, you're the reason I learned to aim higher in life (and sometimes on the field too 🤪) Here's wishing you loads of love, good health and happiness always 🤗❤️@sachin_rt #HappyBirthdaySachin pic.twitter.com/t6qFKgKJmZ— Yuvraj Singh (@YUVSTRONG12) April 24, 2024 -
ఓ జట్టు నుంచి నాకు ఆఫర్ వచ్చింది.. నా పార్టీ బిల్ కంటే: సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అవసరం లేని పేరు. 14 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలు అందించిన సెహ్వాగ్.. క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన కెరీర్లో సెహ్వాగ్ ఎన్నో అద్భుత మైలురాయిలను అందుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచూరియాన్గా వీరేంద్రుడు కొనసాగుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20ల్లొ భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యునిగా సెహ్వాగ్ ఉన్నాడు. సెహ్వాగ్ ఐపీఎల్లో కూడా తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా సెహ్వాగ్ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్తో చిట్ చాట్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.గతంలో బిగ్ బాష్ లీగ్ నుంచి తనకు వచ్చిన గొప్ప ఆఫర్ను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. బిగ్ బాష్ లీగ్లో భారత ఆటగాళ్లు ఆడే అవకాశముందా అన్న ప్రశ్న సందర్భంగా సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. గిల్క్రిస్ట్, సెహ్వాగ్ మధ్య జరిగిన చిట్చాట్పై ఓ లుక్కేద్దాం.ఆడమ్ గిల్క్రిస్ట్: భవిష్యత్తులో భారత ఆటగాళ్లు ఐపీఎల్ కాకుండా ఇతర టీ20 లీగ్ల్లో ఆడే ఛాన్స్ ఉందా?వీరేంద్ర సెహ్వాగ్: "లేదు , మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా రిచ్. పేద దేశాలకు వెళ్లి ఆడము (నవ్వుతూ). నేను భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు నాకు బిగ్ బాష్ లీగ్లో ఆడమని ఓ ఫ్రాంచైజీ నుంచి ఆఫర్ వచ్చింది. ఎంత మొత్తం ఇస్తారని నేను ఆడిగాను. అందుకు వారి నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయాను.వారు నాకు లక్ష డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.84 లక్షలు) ఇస్తామని చెప్పారు. వెంటనే నేను నవ్వుకుని అంతకంటే ఎక్కువ డబ్బులను నా సెలవుల్లో ఖర్చుచేస్తానని, గత రాత్రి పార్టీ బిల్లు కూడా లక్ష డాలర్లు దాటిందని వారికి చెప్పానని" సెహ్వాగ్ తెలిపాడు. -
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ జట్టులో విరాట్ కోహ్లి?
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా క్రికెట్ టోర్నీ జూన్ 1 నుంచి 29 వరకు జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్తో జరగనున్న మ్యాచ్తో టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్కప్ను భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించే అవకాశముంది. ఐపీఎల్-2024లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్కప్ జట్టు నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని తప్పించనున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు కోహ్లిని పక్కన పెట్టాలని మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. అయితే అవన్నీ రూమర్సే అని, టీ20 వరల్డ్కప్ జట్టు ఎంపికలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడని ప్రముఖ క్రీడా వెబ్ సైట్ క్రిక్బజ్ తమ తాజా రిపోర్ట్లో పేర్కొంది. కాగా కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరపున దుమ్ములేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే ఓ సెంచరీ సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్స్కోరర్గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆటగాడిని సెలక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయకుండా వదిలేయరని క్రిక్బజ్ తెలిపింది. -
హార్దిక్, రాహుల్, బుమ్రా కాదు.. భారత ఫ్యూచర్ కెప్టెన్ అతడే
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్కు మంచి మార్కులు పడుతున్నాయి. ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట గుజరాత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం తన కెప్టెన్సీతో అందరని అకట్టుకున్నాడు. అతడు బౌలర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికి గిల్ మాత్రం కెప్టెన్గా విజయవంతమయ్యాడు. తొలుత బౌలింగ్లో తన కెప్టెన్సీ మార్క్తో లక్నోను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవకావడంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత పరిణితి చెందుతున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని" గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు. హార్దిక్ పాండ్యా,రాహుల్, బుమ్రా వంటి వారు రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికి వాన్ మాత్రం గిల్ను ఫ్యూచర్ కెప్టెన్గా ఎంచుకోవడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 వరల్డ్కప్కు భారత జట్టు ఇదే!.. ఎవరూ ఊహించని ప్లేయర్కు ఛాన్స్!?
టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్లకు అవకాశమిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్గా మొహ్సిన్ ఖాన్ను తన జట్టులోకి తీసుకున్నాడు. పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్ -
టీ20 వరల్డ్కప్ 2024.. భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారు! ఎప్పుడంటే?
భారత్ మొత్తం ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో టీమిండియా ఆటగాళ్లు మొత్తం బీజీబీజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 22 నుండి మే 26 వరకు జరగనుంది. ఐపీఎల్ ముగిసిన నాలుగు రోజులకే మరో క్రికెట్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్కప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటనకు ముహర్తం ఖారారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో భారత జట్టు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు పీటీఐ తమ రిపోర్ట్లో పేర్కొంది. "ఏప్రిల్ చివరి వారంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్లో టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. అప్పటికి ఐపీఎల్ తొలి దశ ముగిస్తోంది. కాబట్టి జట్టులో చోటు కోసం పోటీపడే ఆటగాళ్ల ఫామ్ను, ఫిట్నెస్ను సెలక్టర్లు అంచనా వేసే ఛాన్స్ ఉందని" బీసీసీఐ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి. -
'రోహిత్, బాబర్ కాదు.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే'
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2024లో బీజీబీజీగా ఉన్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గోన్న స్టీవ్ స్మిత్కు ఓ ప్రశ్న ఎదురైంది. వరల్డ్క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న స్మిత్కు ఎదురైంది. వెంటనే స్మిత్ ఏమీ ఆలోచించకుండా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లినే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అంటూ సమాధనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా విరాట్ కోహ్లి వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కింగ్ కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టిన ఘనత విరాట్ ది. కింగ్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 77 పరుగులతో అదరగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మార్చి 29న కేకేఆర్తో మ్యాచ్కు కోహ్లి సిద్దమవుతున్నాడు. -
'వెంటనే ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ను తీసేయండి'.. క్లారిటీ ఇచ్చిన ఆకాష్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్లో ఎటాక్లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్కు చోప్రా రిప్లే ఇచ్చాడు. -
KKR Vs SRH: టీమిండియాలో తుస్సుమన్పించాడు.. ఇక్కడ కూడా! ఇక నీ పని అంతే
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. కేకేఆర్ కెప్టెన్గా బరిలోకి దిగిన అయ్యర్.. డకౌట్గా వెనుదిరిగాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. నటరాజన్ బౌలింగ్లో కమ్మిన్స్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఈ క్రమలో అయ్యర్ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటతో భారత జట్టులోకి ఎంట్రీ కష్టమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్హెచ్పై 4 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఎస్ఆర్హెచ్ 7 పరుగులు మాత్రమే చేయడంతో సన్రైజర్స్ పరాజయం పాలైంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్(29 బంతుల్లో 63) విరోచిత పోరాటం చేశాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: డమ్ డమ్లో... విజయఢంకా మోగించేదెవరో!
- గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
- Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
- ‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
- Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
- తాపీగా తప్పుడు కేసులు
- అమెరికాలో సుడిగాలుల బీభత్సం
- PM Narendra Modi: ‘ఇండియా’ కూటమి గెలిస్తే... హిందువులు రెండో తరగతి పౌరులే..
- పేదింట ఆర్థిక వెలుగుకు ఉపాధి హామీ జేగంట!
- 13 నిమిషాలు యథాతథం
Advertisement