దేశంలోని ఆరు రాష్ట్రాల హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాల హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని కేంద్ర న్యాయ శాఖ ఒక నివేదికలో తెలిపింది. దీంతోపాటు మరో 478 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.
దీని ప్రకారం ఆగస్టు ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్/తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, సిక్కిం, త్రిపుర హైకోర్టులు తాత్కాలిక న్యాయమూర్తులతోనే పనిచేస్తునట్లు తెలిపింది. దేశంలోని 24 హైకోర్టుల్లో మొత్తం 601 జడ్జిలు పనిచేస్తున్నారని, వాస్తవంగా ఈ సంఖ్య 1079గా ఉండాలని నివేదిక వెల్లడించింది.