Business
-
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్ అమౌంట్ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుల కొత్త మినిమమ్ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ను ఎస్బీఐ కార్డ్ తమ వెబ్సైట్లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
మారుతీ కార్లు కొనేవారికి ఊరట..
ఆటోమొబైల్స్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు వాహన రుణాల సదుపాయాన్ని అందించేందుకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, వాణిజ్య వాహనాలకి రిటైల్ రుణాల కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది.మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు అందించేందుకు ఇది తోడ్పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.👉 ఇది చదివారా? టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్.. మహీంద్రా చేతికి ఎస్ఎంఎల్ ఇసుజు వాణిజ్య వాహన తయారీ కంపెనీ ఎస్ఎంఎల్ ఇసుజులో మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) అనుమతి పొందింది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా ఎక్స్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఎస్ఎంఎల్ ఇసుజులో 58.96 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో ఎంఅండ్ఎం ప్రకటించింది.ఇందుకు రూ. 555 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సంస్థలో సుమితోమో కార్పొరేషన్కున్న పూర్తి వాటా(43.96 శాతం)ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో పేర్కొంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుగా ఉన్న ఇసుజు మోటార్స్ నుంచి 15 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. -
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్లో 116 ఎకరాల సువిశాల టౌన్షిప్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్ను తెలియజేస్తోంది.గురుగ్రామ్లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.👉ఇది చదివారా? హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్ చేసిన ప్రివానా సౌత్, ప్రివానా వెస్ట్ ప్రాజెక్ట్లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి. హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది. -
జియో బ్లాక్రాక్ కొత్త ప్లాట్ఫామ్ ‘అలాదీన్’
జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ‘అలాదీన్’ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో బ్లాక్రాక్కు చెందిన పెట్టుబడుల విశ్లేషణ, రిస్క్ నిర్వహణ ప్లాట్ఫామ్ మొదటిసారి భారత ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.‘‘పెట్టుబడులు ఇక ఎంతో సులభం. జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్ సంయుక్తంగా ఇదే నమ్మకాన్ని ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొచ్చాయి. జియో డిజిటల్ ఫస్ట్ విధానానికి, బ్లాక్రాక్ సంస్థకు అంతర్జాతీయంగా పెట్టుబడుల్లో ఉన్న నైపుణ్యం కలగలసి ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్లను అందించనున్నాం’’అని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ప్లాట్ఫామ్పై ట్వీట్ చేసింది.ఇది ఆరంభం మాత్రమేనంటూ.. అందరికీ అందుబాటు ధరలకే పెట్టుబడుల సేవలను అందించనున్నట్టు పేర్కొంది. జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్), యూఎస్ ఆధారిత బ్లాక్ రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 81,237 వద్ద కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 138.64 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 24,812.05 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.46 శాతం, 0.23 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మీడియా 1.27 శాతం నష్టపోగా, నిఫ్టీ ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రియల్టీ, ఎనర్జీ, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.టీసీఎస్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ షేర్లు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ 4.4 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 0.89 శాతం క్షీణించి 14.27 పాయింట్ల వద్ద స్థిరపడింది.ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం తీవ్రతరం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాటాంజ్ వద్ద ఇరాన్ భూగర్భ యురేనియం కర్మాగారం దెబ్బతిన్నదన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు ఐదో రోజు కూడా కొనసాగాయి.దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, భవిష్యత్తులో రేట్ల కోత, ముడిచమురు ధరలు పెరగడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాలపై చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యానం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. -
జాబ్లో చేరకుండానే రూ.25 లక్షలు..
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.👉 సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.కోర్టు ఏం చెప్పిందంటే..వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు. -
భారత ఆటబొమ్మల నాణ్యత భేష్
భారత ఆటబొమ్మల (టాయ్స్) నాణ్యత ప్రమాణాలు అంతర్జాతీయ బెంచ్మార్క్ కంటే మెరుగైనవని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సైంటిస్ట్ డైరెక్టర్ (వెస్టర్న్ రీజినల్ ఆఫీస్ ల్యాబరేటరీ) అద్భుత్ సింగ్ తెలిపారు. దేశీ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడంలో ఈ ప్రమాణాలు సాయపడుతున్నట్టు చెప్పారు.టాయ్స్కు సంబంధించి భౌతిక, రసాయన, ఎలక్ట్రికల్ భద్రతా ప్రమాణాలను బీఐఎస్ రూపొందించి, అమలు చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఐఎస్వో, ఐఈసీ సంస్థలు నిర్ణయించిన బెంచ్మార్క్ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ ప్రమాణాలను బీఐఎస్ అభివృద్ది చేసింది. వీటి ప్రకారం దేశీయంగా తయారీకి, దిగుమతులకు గాను ఏడు రకాల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారత ఆటబొమ్మల అమ్మకాలు పెరిగేందుకు సాయపడినట్టు అద్భుత్ సింగ్ తెలిపారు. పోటీకి అవకాశం..బీఐఎస్ ప్రమాణాలు ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు దిగ్గజ కంపెనీలతో పోటీపడే అవకాశం కల్పించినట్లు ముంబైకి చెందిన జెఫిర్ టాయ్మేకర్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఈవో మోయిజ్ గబ్జీవాలా తెలిపారు. ‘బీఐఎస్ ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత (2021 జనవరి 1 నుంచి) మా ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల ఆదాయం సాధించాం. 2025–26లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం’ అని ప్రకటించారు. ఇదీ చదవండి: ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్తమ ఉత్పత్తుల్లోకి వినియోగించే ముడి సరుకుల్లో 99 శాతం దేశీయంగా తయారైనవేనని చెప్పారు. 15 కేటగిరీల్లో 100కు పైగా రకాలతో 1–1.5 లక్షల బొమ్మలను నెలవారీగా ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. భారత కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన ఆటబొమ్మలను అందుబాటు ధరలకే ఉత్పత్తి చేయగలుగుతున్నట్టు వివరించారు. బీఐఎస్ సర్టిఫికేషన్ ఉంటే సంబంధిత ఆటబొమ్మల్లో పాదరసం, థాలేట్స్ వంటి విషపూరిత పదార్థాలు లేవని, మింగేందుకు అవకాశం ఉన్న చిన్నపాటి విడిభాగాల్లేవని, పదునైన అంచుల్లేవన్న భరోసానిస్తుందని అద్భుత్ సింగ్ తెలిపారు. గ్లోబ్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం చూస్తే.. 2023–24లో టాయ్స్ ఎగుమతులు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 154 మిలియన్ డాలర్ల నుంచి 152 మిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. -
ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.కొత్త ప్రోగ్రామ్లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.ఇదీ చదవండి: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రంఈ ఫీచర్తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది. -
Fastag: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రం
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్ యాక్టివేషన్, రెన్యువల్ కోసం ప్రత్యేక లింక్ను త్వరలో రాజ్గార్ యాత్ర యాప్తో పాటు ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.Important Announcement 📢 🔹In a transformative step towards hassle-free highway travel, we are introducing a FASTag-based Annual Pass priced at ₹3,000, effective from 15th August 2025. Valid for one year from the date of activation or up to 200 trips—whichever comes…— Nitin Gadkari (@nitin_gadkari) June 18, 2025ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపదఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. -
ఊరించి.. ఉసూరుమనిపించి! మళ్లీ పెరిగిన పసిడి ధరలు
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. రెండు రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపద
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ.3.59 లక్షల కోట్ల చొప్పున నికర విలువతో ఇండియాలో సంపద సృష్టికర్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. క్రిసిల్ సహకారంతో 360 వన్ వెల్త్ దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను తయారు చేసింది.ఈ సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ఉన్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వారసులు, పెట్టుబడిదారులు, వృత్తి నిపుణులు చోటు సంపాదించుకున్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి, 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.ఇదీ చదవండి: ఐదు రెట్లు పెరిగిన ఉత్పాదకతమహిళా పారిశ్రామికవేత్తల్లో ఇషా అంబానీ రూ.3.58 లక్షల కోట్లతో అత్యంత ధనిక వ్యాపార యజమానిగా నిలిచారు. వ్యాపారాలను స్థాపించిన లేదా అధిక విలువ జోడించేందుకు గణనీయమైన పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. మొత్తం ప్రమోటర్ సంపదలో రిలయన్స్, టాటా, అదానీ గ్రూపుల వాటా 24 శాతంగా ఉంది. దేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 360 ఐటీ వెల్త్ క్రియేటర్స్ జాబితాలో ఉన్న కంపెనీల మొత్తం సంపదలో 59 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇందులో 12% వాటాను కలిగి ఉన్నాయి.అంబానీల ప్రభావంటెలికాం, రిటైల్, ఎనర్జీ, డిజిటల్ సర్వీసెస్.. వంటి కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుస్థిర నాయకత్వాన్ని అంబానీ కుటుంబం కొనసాగిస్తోంది. భారతదేశ డిజిటల్ విప్లవానికి జియో నాయకత్వం వహించడం, రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరించడంతో అంబానీ కుటుంబం ఆర్థిక సామ్రాజ్యం రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. -
ఏఐ భయాలు సరైనవేనా..? మూర్తి ఏమన్నారంటే..
కృత్రిమ మేధ (ఏఐ) భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఉపయోగించడం వల్ల తన ఉత్పాదకత ఐదు రెట్లు పెరిగిందని మూర్తి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలను హరించివేస్తుందన్న భయం సరికాదన్నారు. ఇది మరో రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్ను చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఏఐ చాలా ఉద్యోగాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐ సాకుతో లేఆఫ్స్ కూడా ప్రకటిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ తరుణంలో నారాయణమూర్తి తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. తన ప్రసంగాలకు చాట్జీపీటీను వాడుతున్నట్లు చెప్పారు. అయితే ఏఐను సరైన ప్రశ్న అడగడంలోనే అసలు తెలివితేటలు ఉన్నాయని తెలిపారు.‘భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే..ప్రోగ్రామర్లు, విశ్లేషకులు మెరుగైన, మరింత సంక్లిష్టమైన అవసరాలను తీర్చడంలో స్మార్ట్ అవుతారు. వారు పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి కృత్రిమ మేధ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటును ఎలా పెంచుతుందనే దాని గురించి నేను సానుకూలంగా ఉన్నాను’ అని తెలిపారు. భారత ఐటీ పరిశ్రమలో వృద్ధి, ఉద్యోగ నియామకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరాయం మధ్య ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇటీవల ఐటీ వ్యాపార నమూనాల్లో సమూల మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా ఉన్న సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనాకు విఘాతం కలుగుతోందని, ఇప్పటికే ఆ మోడల్కు సమయం అయిపోయిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ గతంలో తెలిపారు. కృత్రిమ మేధను సపోర్ట్గా ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో గమనిస్తే సాఫ్ట్వేర్ పరిశ్రమ వృద్ధి వేగం పెరుగుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు. -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు లాభపడి 24,942కు చేరింది. సెన్సెక్స్(Sensex) 259 ప్లాయింట్లు పెరిగి 81,836 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలు
దేశీయంగా మే నెలలో ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) విక్రయాలు స్వల్పంగా 0.8% తగ్గాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 3,44,656 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఇదే మేలో 3,47,492 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మారుతీ నుంచి డీలర్లకు సరఫరాలు 1,44,002 నుంచి 1,35,962కు తగ్గాయి. ఎంఅండ్ఎం సరఫరా 43,218 నుంచి 52,431కు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాలు 49,151 నుంచి 43,861 యూనిట్లకు తగ్గాయి.ద్విచక్ర వాహనాల విక్రయాలు 2% వృద్ధితో 16,20,084 నుంచి 16,55,927 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో మోటార్సైకిళ్ల విక్రయాలు 10,39,156 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 5,79,507 యూనిట్లుగా ఉన్నాయి. త్రి చక్రవాహన అమ్మకాలు 3.3% క్షీణించి 53,942 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మేలో ఈ విక్రయాలు 55,763గా ఉన్నాయి. ఇదీ చదవండి: తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!‘గడిచిన ఆరునెలల్లో ఆర్బీఐ 3 సార్లు రెపోరేటు మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సాధారాణ వర్షపాతం నమోదు అంచనాలు, వినియోగదారుల సెంటిమెంట్ బలపడటం తదితర అంశాలు వాహన విక్రయాల డిమాండ్ కొనసాగేందుకు దోహదపడ్డాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
ఐపీఓలకు సెబీ లైన్ క్లియర్
కొత్త ఏడాదిలో తిరిగి జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. ఈ ప్రభావంతో తాజాగా మూడు కంపెనీలు లిస్టింగ్ బాట పట్టాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిపొందాయి. జాబితాలో సన్షైన్ పిక్చర్స్, లూమినో ఇండస్ట్రీస్, ఎంఅండ్బీ ఇంజినీరింగ్ చేరాయి. ఈ మూడు కంపెనీలు ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..విపుల్ షా సంస్థటీవీ, సినిమాల నిర్మాత, దర్శకుడు విపుల్ షా కంపెనీ సన్షైన్ పిక్చర్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 33.75 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవోలో 83.75 లక్షల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లలో ప్రధానంగా విపుల్ అమృత్లాల్ షా 23.69 లక్షల షేర్లు, షెఫాలీ విపుల్ షా 10 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. వీటితోపాటు రూ. 94 కోట్లు భవిష్యత్ వృద్ధి, కార్యకలాపాల నిర్వహణకు వెచ్చించనుంది.ఈపీసీ కంపెనీప్రధానంగా ఈపీసీ కార్యకలాపాలు నిర్వహించే కోల్కతా కంపెనీ లూమినో ఇండస్ట్రీస్ ఐపీవో బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రూ. 15 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది.పీఈబీ సేవలు ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ)తోపాటు సెల్ఫ్సపోర్టెడ్ రూఫింగ్ సర్వీసులందించే ఎంఅండ్బీ ఇంజినీరింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గుజరాత్ కంపెనీ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 328 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో ద్వారా రూ. 653 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 64 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచి్చంచనుంది. రూ. 60 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 110 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించయనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.గ్లోబ్ ప్రాజెక్ట్స్ @ రూ. 67–71మౌలిక సదుపాయాల అభివృద్ధి కంపెనీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 67–71 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 1,67,60,560 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 119 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 14 కోట్లు పరికరాలు, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన 9 నెలల కాలానికి దాదాపు రూ. 255 కోట్ల ఆదాయం, రూ. 18 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 మార్చి31కల్లా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 669 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990స్టార్బిగ్బ్లాక్ ఐపీవో బాటస్టార్బిగ్బ్లాక్ బిల్డింగ్ మెటీరియల్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు వాటాదారులు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. బీఎస్ఈ లిస్టెడ్ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్కు పూర్తి అనుబంధ సంస్థఇది. ఐపీవో ద్వారా సంస్థకు సరైన విలువను వెలికితీయడం, విస్తరణకు అవసరమైన పెట్టుబడుల సమీకరణ తదితరాలకు వీలుంటుందని మాతృ సంస్థ బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ పేర్కొంది. అయితే నియంత్రణ సంస్థల అనుమతులు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితులు, ఇతర క్లియరెన్స్లపై ఆధారపడి ఐపీవో చేపట్టనున్నట్లు వివరించింది. 2015లో ఏర్పాటైన బిగ్బ్లాక్ కన్స్ట్రక్షన్ దేశీయంగా ఏఏసీ బ్లాకు తయారీలో ఏకైక లిస్టెడ్ కంపెనీగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలోగల ప్లాంట్ల ద్వారా వార్షికంగా 1.3 మిలియన్ ఘనపు మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 225 కోట్ల ఆదాయం సాధించింది. -
తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా ‘2025 ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్’ పేరుతో అడ్వెంచర్ బైక్ను విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 755 సీసీ లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది.ఇది 9,500 ఆర్పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్కు 6–స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో థ్రోటిల్–బై–వైర్ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్–కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్లులున్నాయి. ఇదీ చదవండి: కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్ఇంజిన్ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్ వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. -
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు మెటల్, ఫార్మా, ఆయిల్అండ్గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 93 పాయింట్లు పతనమై 24,853 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 369 పాయింట్లు కోల్పోయి 81,427 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 24,814 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.ఆసియాలో కొరియా, జపాన్ నికాయ్ ఇండెక్సులు లాభాల్లో.., చైనా, హాంగ్కాంగ్ ఇండెక్సులు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడి 86.34 వద్ద స్థిరపడింది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.96 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.96 – 86.28 శ్రేణిలో ట్రేడైంది.ఓస్వాల్ పంప్స్ ఐపీఓకు 34 రెట్ల స్పందన ఓస్వాల్ పంప్స్ పబ్లిక్ ఇష్యూకు 34.42 రెట్ల అధిక స్పందన లభించింది. క్యూఐబీ కోటా 88.08 రెట్లు, రిటైల్ కోటా 3.60 రెట్లు, నాన్ ఇన్స్టి ట్యూషనల్ కోటా 36.7 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. -
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ రేసు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోనే జరుగుతుంటుంది. ఇటీవల నగదు విభాగంలోనూ టర్నోవర్ భారీగా పెరిగినప్పటికీ ఎఫ్పీఐలు, డీఐఐలు అధికంగా పొజిషన్స్ తీసుకునే డెరివేటివ్స్దే ఆధిపత్యం. అయితే కొన్నేళ్లుగా ఎన్ఎస్ఈలో ఎఫ్అండ్వో కాంట్రాక్టుల గడువు ప్రతి నెలా చివరి గురువారం ముగుస్తుంటే.. బీఎస్ఈలో వీటికి చివరి మంగళవారం తెరపడుతోంది.ఈ నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఒకే రోజు ఈక్విటీ డెరివేటివ్స్ ముగింపు ప్రయోజనకరంగా ఉంటుందంటూ గత నెల(మే)లో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సూచించింది. కానీ.. బీఎస్ఈ గడువుకు ఎన్ఎస్ఈ, ఎన్ఎస్ఈ గడువుకు బీఎస్ఈ తాజాగా సెబీ నుంచి అనుమతులు పొందడం విశేషం! అటూఇటూ మార్పు(స్వాప్) ఇలా.. ఈక్విటీ డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రతి నెలా చివరి మంగళవారం ముగించేందుకు సెబీ అనుమతించినట్లు ఒక ప్రకటనలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి నెలా చివరి గురువారం ఎఫ్అండ్వో ముగింపును చేపడుతోంది. మరోపక్క బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సైతం డెరివేటివ్ కాంట్రాక్టుల గడువును ప్రతి నెలా చివరి మంగళవారం నుంచి గురువారానికి మార్చుకునేందుకు సెబీ అనుమతించినట్లు తెలియజేసింది.వెరసి ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ ప్రతీ నెలా చివరి మంగళవారం, బీఎస్ఈ కాంట్రాక్టులు ప్రతి నెలా చివరి గురువారం ముగియనున్నాయి. ఎఫ్అండ్వో గడువు మార్పును రెండు ఎక్స్ఛేంజీలు సర్క్యులర్లో పేర్కొన్నాయి. వెరసి 2025 సెపె్టంబర్ 1 నుంచి డెరివేటివ్ కాంట్రాక్టులకు కొత్త షెడ్యూల్ అమలుకానుంది. -
డిజిటల్ ఎకానమీలో భారత్ పవర్హౌస్!
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీ వృద్ధి పరుగులు తీస్తుండటంతో భారత్ తిరుగులేని శక్తి (పవర్హౌస్)గా ఆవిర్భవించిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో సుస్థిర ప్రగతికి భద్రత, విశ్వసనీయత అత్యంత కీలకమని, వీటిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా హెడ్గా ఇటీవలే ఎంపికైన ప్రీతి.. ఏఐ రంగంలో భారత్ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో గూగుల్ భద్రతా చార్టర్ను మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.ఆన్లైన్ మోసాలు, స్కామ్ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడం.. ప్రభుత్వం, కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి వంటి అంశాల్లో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ చార్టర్ ఒక బ్లూప్రింట్గా నిలుస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రీతి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ విషయానికొస్తే మరింత మెరుగైన, వృద్ధిదాయకమైన డిజిటల్ ఎకోసిస్టమ్ను రూపొందించేందుకు గూగుల్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాగా, గుత్తాధిపత్యానికి సంబంధించి భారత్లో గూగుల్పై కేసుల గురించి మాట్లాడుతూ.. గూగుల్ ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిరంతరం కలిసి పనిచేస్తామని ఆమె తేల్చిచెప్పారు.కొత్త టెక్నాలజీతో సవాళ్లు...ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీస్తున్నాయని.. అయితే, వాటివల్ల డీప్ఫేక్స్ వంటి సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రీతి అంగీకరించారు. ‘అందుకే మా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే ఏ కంటెంట్లో అయినా వాటర్మార్క్లు ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల యూజర్లు ఈ కంటెంట్లో దేనినైనా అప్లోడ్ చేస్తే, వాటిలోని ‘సింథ్ఐడీ’ని ఆయా షేరింగ్ టూల్స్ గుర్తించగలుగుతాయి’ అని వివరించారు. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని, డీప్ఫేక్స్ సవాళ్లను ఎదుర్కోవాలంటే పరిశ్రమవ్యాప్తంగా సహకారం అవసరమన్నారు. గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ ఈ కీలక అంశంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు.యూపీఐ.. అద్భుతంభారత్లో డిజిటల్ ఆర్థిక స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తమకు తిరుగులేదని నిరూపించిందన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) శరవేగంగా విస్తరించడం దీనికి మచ్చుతునక. గూగుల్ పే వంటి పేమెంట్ ప్లాట్ఫామ్లు అంచనాలను మించి విజయం సాధించాయి. కొన్నేళ్ల క్రితం యూపీఐ ప్రజల దైనందిన జీవితాల్లో ఇలా చొచ్చుకుపోతుందని ఎవరైనా ఊహించారా. ఇప్పుడు దేశంలో ఇదో అద్భుతమైన డిజిటల్ విప్లవంగా మారింది. వందల కోట్ల లావాదేవీలతో యూపీఐ ప్రజల వినియోగం, కొనుగోళ్ల తీరునే సమూలంగా మార్చేసింది’ అని ప్రీతి పేర్కొన్నారు. భారత్ కీలక మార్కెట్...గూగుల్కు భారత్ అత్యంత కీలక మార్కెట్గా కొనసాగుతోందని.. సమీప భవిష్యత్తులోనే ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరే దిశగా దేశ డిజిటల్ ఎకానమీ పరుగులు తీస్తోందని ప్రీతి పేర్కొన్నారు. అడ్వర్టయిజింగ్, క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ రంగాల్లో గూగుల్కు ఉన్న పట్టు, నైపుణ్యాలను భారత్ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు.దేశ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా డిజిటల్ రంగంలో గూగుల్ ఇతోధికంగా సహకారం అందిస్తున్న ‘ఈ కీలకమైన, ఉత్తేజకరమైన తరుణం’లో కంపెనీ ఇండియా హెడ్గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా ఉత్సాహాన్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గూగుల్ ప్రపంచవ్యాప్త వ్యూహంలో భారత్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుందనడానికి యూట్యూబ్ షార్ట్స్, జీపే తొలుత ఇక్కడే ప్రారంభించడం నిదర్శనమని కూడా గుర్తుచేశారు. -
పసిడికి అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి పసిడి నష్టపోయింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,200 నష్టంతో రూ.1,00,170 స్థాయికి (పన్నుతో కలిపి) దిగొచ్చింది. అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణుల మధ్య జ్యుయలర్లు, స్టాకిస్టులు అమ్మకాలకు దిగడంతో బంగారం నష్టపోయినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.1,100 నష్టంతో రూ.99,450 స్థాయికి పడిపోయింది. ‘‘ఇరాన్ దౌత్య పరిష్కారం కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తలతో, అప్పటి వరకు ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న అంచనాలను ట్రేడర్లు సమీక్షించుకున్నారు.యుద్ధ విరమణకు అవకాశం ఉన్న నేపథ్యంలో బంగారం ట్రేడర్లలో బేరిష్ సెంటిమెంట్ ఏర్పడింది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి రూ.100 పెరిగి రూ.1,07,200 స్థాయిని (పన్నుతో కలిపి) తాకింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఔన్స్కు 10 డాలర్ల నష్టంతో 3,400 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ అధిక ధరల వద్ద పసిడి పెట్టుబడుల నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి వివరించారు. యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు వెండి ధరలు సైతం రోజులో గరిష్ట స్థాయిల నుంచి కిందకు దిగొచ్చినట్టు చెప్పారు. -
కార్డీలియా క్రూయిజెస్ ఐపీవో బాట...
న్యూఢిల్లీ: లగ్జరీ క్రూయిజ్ల నిర్వాహక కంపెనీ వాటర్వేస్ లీజర్ టూరిజం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 727 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో దాదాపు రూ. 553 కోట్లను డిపాజిట్ లేదా అడ్వాన్స్డ్ లీజ్ రెంటల్కు చెల్లించనుంది. అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్(ఐఎఫ్ఎస్సీ) ప్రయివేట్ లిమిటెడ్కు నెలవారీ లీజు చెల్లింపులకు సైతం వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.కార్డీలియా క్రూయిజెస్ బ్రాండుతో ప్రస్తుతం వాటర్వేస్ లీజర్ ఎంవీ ఎంప్రెస్ క్రూయిజ్ వెస్సల్ను నిర్వహిస్తోంది. నార్వేజియన్ స్కై, నార్వేజియన్ సన్ అనే మరో రెండు క్రూయిజ్ల నిర్వహణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. ఒక్కో క్రూయిజ్ షిప్ ద్వారా సుమారు 2,000 మంది అతిథులకు సేవలు అందించనుంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న ఎంప్రెస్ క్రూయిజ్ ప్రధానంగా ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్, విశాఖపట్టణం, పుదుచ్చేరిలకు సేవలందిస్తోంది.శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నాకు సైతం సర్వీసులు నిర్వహించడంతోపాటు.. ఇటీవలే ఆగ్నేయాసియాకు కూడా సేవలు విస్తరించింది. తొలిసారి ఫుకెట్ (థాయ్లాండ్), సింగపూర్, కౌలాలంపూర్ (మలేసియా) తదితర ప్రాంతాలకూ జూలైలో సర్వీసులను మొదలు పెడుతోంది. 2024 డిసెంబర్31తో ముగిసిన తొలి 9 నెలల్లో రూ. 409 కోట్ల ఆదాయం, రూ. 139 కోట్ల నికర లాభం ఆర్జించింది.చదవండి: అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో.. -
కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్ను ప్రారంభించింది. కేవలం రూ.349తో యూజర్లు ఈ ప్యాక్ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా సిమ్ కొనుగోలు చేసే యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ, కస్టమర్ల అనుభవాన్ని పెంచే లక్ష్యంతో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది.జియో స్టార్టర్ ప్యాక్ ప్రయోజనాలు..5G నెట్వర్క్లో 28 రోజుల పాటు అపరిమిత సేవలు వినియోగించుకోవచ్చు.50 రోజుల ఉచిత జియోఫైబర్/ ఎయిర్ఫైబర్ ట్రయల్ కనెక్షన్ (టీవీ + వైఫై + OTT యాప్లు) పొందవచ్చు.50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ పొందవచ్చు.4K క్వాలిటీతో టీవీ / మొబైల్లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్స్టార్ వీక్షించవచ్చు.ఇదీ చదవండి: ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపుఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలాఉండగా, ఏప్రిల్ 2025కి విడుదలైన ట్రాయ్ నివేదిక ప్రకారం.. అత్యంత పోటీ ఉన్న వైర్లెస్ (మొబైల్) విభాగంలో అధికంగా సబ్స్క్రైబర్లను జోడించింది. జియో 95,310 కొత్త సబ్స్క్రైబర్లను జోడించి మార్చి 2025లో 3,17,76,074 ఉన్న మొత్తం వినియోగదారులను ఏప్రిల్ 2025లో 3,18,71,384కి పెంచుకుంది. -
ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపు
గ్రీన్ లాజిస్టిక్స్, సమర్థవంతమైన వెహికల్ డిస్పాచ్ కోసం మారుతి సుజుకి తన మానేసర్ ఫెసిలిటీలో భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ను ప్రారంభించింది. లాజిస్టిక్స్లో కార్బన్ ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, రహదారి రద్దీని కట్టడి చేయడం ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా హరియాణా ఆర్బిటల్ రైల్ కారిడార్ (హెచ్ఓఆర్సీ)తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని మారుతి సుజుకి ఈ సదుపాయాన్ని సోనిపట్ నుంచి పల్వాల్ వరకు 126 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసింది.ఈ సదుపాయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మల్టీ మోడల్ కనెక్టివిటీకి గేమ్ ఛేంజర్ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. సమర్థవంతమైన ఆటోమొబైల్ రవాణాలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ, గ్రీన్ లాజిస్టిక్స్లో మారుతి సుజుకి ఆవిష్కరణలు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?రైల్ లాజిస్టిక్స్ ద్వారా సుస్థిరతభారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు దాని సరఫరా గొలుసును ఆప్టిమైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైల్వే సైడింగ్ వాహనాల డిస్పాచ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కంపెనీ భావిస్తుంది. ఇది రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని చెప్పింది.రైల్వే సైడింగ్ ముఖ్య లక్షణాలు46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ను పూర్తిగా విద్యుదీకరణ చేశారు. నాలుగు ఫుల్ లెంత్ ట్రాక్లు, ఒక ఇంజిన్ ఎస్కేప్ ట్రాక్ ఉన్నాయి.4,50,000 వాహనాల వార్షిక డిస్పాచ్ సామర్థ్యం కలిగి ఉంది. నిర్మాణాత్మక మల్టీ మోడల్ కనెక్టివిటీ విధానం ద్వారా భారతదేశం అంతటా 380 నగరాలకు సేవలు అందిస్తుంది.ముంద్రా, పిపావావ్తో సహా ఇతర ఓడరేవులతో అనుసంధానం చేశారు. ప్రపంచ మార్కెట్లకు వాహన ఎగుమతులను ఇది క్రమబద్ధీకరిస్తుంది.హెచ్వోఆర్సీ అభివృద్ధికి రూ.325 కోట్లు, అంతర్గత రైల్వే యార్డు మౌలిక సదుపాయాలకు రూ.127 కోట్లు కేటాయించారు.ఈ కొత్త వ్యవస్థ ఏటా 1,75,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 60 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేస్తుందని అంచనా. -
రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?
రిచ్డాడ్ పూర్డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రతిఒక్కరి భవిష్యత్తు కోసం ఉన్నతమైన ఆలోచనలు ఎప్పుడు చేయాలో తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. దాంతో ఈ పోస్ట్ కాస్తా వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్ల్లో వైరల్గా మారింది.ఎక్స్ వేదిక రాబర్ట్ కియోసాకి తెలిపిన పోస్ట్లో..‘మీ భవిష్యత్తు ఈ రోజే నిర్ణయించబడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. దయచేసి దాన్ని వృథా చేయకండి. ఈ రోజు నేను మరింత బిట్ కాయిన్ కొనుగోలు చేస్తున్నాను. దాంతోపాటు ఆంత్రప్రెన్యూర్షిప్కు సంబంధించి కొత్త పుస్తకంపై పనిచేస్తున్నాను. ఈ రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఏమి చేస్తున్నారు..? దయచేసి మీ ఈ రోజును గొప్ప రోజుగా మలుచుకోండి. జాగ్రత్త’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపుYOUR FUTURE is decided TODAY!!!Saying it another way:“TODAY is the most IMPORTANT DAY of YOUR LIFE. Please do not waste it.”TODAY I am buying more BITCOIN and working on a new book on ENTREPRENEURSHIP.What are you doing today….for your future?You are important. Your…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 11, 2025 -
త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెల్ ఫౌండ్రీ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.నిర్ణయం బాధాకరమైనా తప్పదుకంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇంటెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం’ అని చెప్పారు.జాగ్రత్తగా, గౌరవంతో..ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను ‘జాగ్రత్తగా, గౌరవంతో’ చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్లో 3,000 మంది ఉన్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీగట్టిదెబ్బ..రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది. -
ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీ
ప్రభుత్వరంగ బ్యాంక్ల చీఫ్లతో ఈ నెల 27న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కానున్నారు. బ్యాంకుల పనితీరుతోపాటు పలు ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల లక్ష్యాలపైనా చర్చ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును అర శాతం తగ్గించిన తర్వాత ఆర్థిక మంత్రి బ్యాంక్లతో నిర్వహిస్తున్న మొదటి సమీక్ష కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంజీడీపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.5 శాతానికి తగ్గడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఉత్పాదక రంగాలకు రుణ వితరణ పెంచాలని ఆర్థిక మంత్రి ఈ సమావేశంలో బ్యాంక్లను కోరే అవకాశాలున్నట్టు తెలిపాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పరంగా పురోగతిని మంత్రి సమీక్షించనున్నట్టు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంక్ల లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 26 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. -
అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో..
న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలల పాటు సానుకూల వృద్ధిని నమోదు చేసిన వస్తు ఎగుమతులు మే నెలలో స్వల్పంగా క్షీణించాయి. మొత్తం 38.73 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.29 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడమే ఎగుమతుల విలువ తగ్గడానికి దారితీసినట్టు తెలుస్తోంది. మే నెలలో వాణిజ్య లోటు 21.88 బిలియన్ డాలర్లకు (రూ.1.86 లక్షల కోట్లు) పరిమితమైంది. ఇక మే నెలలో వస్తు దిగుమతులు (Imports) సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్లుగా (రూ.5.15 లక్షల కోట్లు) ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బంగారం, ముడి చమురు దిగుమతులు క్షీణించడం మొత్తం మీద దిగుమతులు తగ్గేందుకు సానుకూలించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు (ఏప్రిల్–మే) కలిపి చూస్తే వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కంటే 3.11 శాతం అధికంగా 77.19 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు సైతం 8 శాతం పెరిగి 125.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 48.33 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరగడం, ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఎగుమతులు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎగుమతుల పరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ ఈ వారంలోనే అంతర్ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది. సేవల ఎగుమతులు జూమ్ మే నెలో సేవల ఎగుమతులు 33 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 మే నెలలో ఇవి 29.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల దిగుతులు సైతం మే నెలలో 17.14 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 16.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.సవాళ్ల మధ్య మెరుగైన పనితీరు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతుల పరంగా భారత్ మెరుగైన పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు. వాణిజ్యానికి సంబంధించి విధానపరమైన అనిశ్చితులు, పలు దేశాల మధ్య ఘర్షణలను ప్రస్తావించారు. బ్రిటన్, ఈయూ, యూఎస్లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా వాణిజ్య శాఖ చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను ఎగుమతిదారులు సర్దుబాటు చేసుకుంటున్నట్టు భారత ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రయ్.. బియ్యం, ఐరన్ఓర్, రత్నాభరణాలు, ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఉత్పత్తులు దిగుమతులు క్షీణించడానికి దారితీశాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మే నెలలో 30 శాతం తగ్గి 5.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ముడి చమురు దిగుమతులు 26 శాతం తగ్గి 14.75 బిలియన్ డాలర్లు, బంగారం దిగుమతులు 12.6 శాతం తగ్గి 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తేయాకు, కాఫీ, దినుసులు, రెడీమేడ్ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు సానుకూలంగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 54 శాతం పెరిగి 45.7 బిలియన్ డాలర్లకు చేరాయి.చదవండి: జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ -
పాత బంగారానికి 2 క్యారెట్ల అదనపు విలువ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంకస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. -
తగ్గిన ఇంధన వాడకం
దేశీయంగా వివిధ ప్రాంతాల్లో ముందుగా వర్షాలు పడుతుండటంతో ఈ నెల(జూన్) తొలి రెండు వారాల్లో ఇంధన వినియోగం మందగించింది. ప్రొవిజనల్ పారిశ్రామిక గణాంకాల ప్రకారం రెండు నెలల పురోగతి తదుపరి డీజిల్ వినియోగం క్షీణించింది. ఈ బాటలో రెండు నెలల వినియోగ వృద్ధి తదుపరి పెట్రోల్కు సైతం డిమాండ్ నీరసించింది.జూన్ 1–15 మధ్య పెట్రోల్ డిమాండ్లో వృద్ధి 2.3 శాతానికి పరిమితమై 1.4 మిలియన్ టన్నులను తాకింది. దేశీయంగా 90 శాతం మార్కెట్ వాటా కలిగిన మూడు ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ సంస్థల గణాంకాలివి. మే నెలలో పెట్రోల్ డిమాండ్ 9 శాతం పుంజుకున్న సంగతి తెలిసిందే. జూన్ తొలి అర్ధభాగంలో డీజిల్ వినియోగం 4.8 శాతం క్షీణించింది. 3.26 మిలియన్ టన్నులకు పరిమితమైంది.ఇదీ చదవండి: రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లుదేశీయంగా అత్యధిక వినియోగమున్న డీజిల్ ఏప్రిల్లో 4 శాతం బలపడగా.. మే నెలలో 2 శాతం వృద్ధి నమోదైంది. ఈ నెల తొలి రెండు వారాల్లో పెట్రోల్ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. మే నెల 1–15 మధ్య 1.5 మిలియన్ టన్నుల పెట్రోల్ వినియోగం నమోదైంది. అయితే 2023 జూన్ 1–15తో చూస్తే వినియోగం 7 శాతం ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో డీజిల్ డిమాండ్ 5.2 శాతం క్షీణించగా.. వినియోగం మే నెలతో పోలిస్తే 3.1 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరగడానికి వినియోగం ఊతమిచ్చింది. -
ఇకపై వాట్సప్లో ప్రకటనలు?
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్(Whatsapp) యూజర్ ప్రైవసీ, ఎన్క్రిప్షన్ ప్రమాణాలను పాటిస్తూ ఆదాయాన్ని ఆర్జించాలనే వ్యూహంతో చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా యాప్లో యాడ్స్ ద్వారా రెవెన్యూ సంపాదించాలని చూస్తుంది. ఇతర ప్లాట్ఫామ్ల మాదిరిగా కాకుండా ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండానే మెటా వాట్సప్లో మెసేజింగ్ సర్వీసులను ఉచితంగా అందించింది. ఇకపై వాట్సప్ స్టేటస్లో యాడ్ల ద్వారా ఆదాయం సంపాదించాలని భావిస్తుంది. అయితే ఈ యాడ్స్ కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయని, పర్సనల్ చాట్స్ ఎప్పటిలానే యాడ్ఫ్రీగా ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.వాట్సప్ యాప్లోని అప్డేట్స్ ట్యాబ్ ఆప్షన్లో ప్రకటనలకు చెందిన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అప్డేట్స్ ట్యాబ్లో ప్రస్తుతం ఛానళ్లు, స్టేటస్ బ్లాక్లో అడ్వర్టైజ్మెంట్లు కనిపించనున్నాయి. నిత్యం దాదాపు 2 బిలియన్ల వినియోగదారులు ఈ అప్డేట్ బ్లాక్ చూస్తున్నారని వాట్సప్ తెలిపింది. దాంతో విభిన్న సంస్థలు ప్రమోట్ చేయాలనుకునే ఉత్పత్తులు లేదా ఇతర వివరాలను యాడ్ ఇచ్చేందుకు దీన్నో అవకాశంగా చూపుతుంది. మూడు రకాల యాడ్ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు పేర్కొంది.పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్లుక్రియేటర్లు, వ్యాపారాలు లేదా ఇన్ఫ్లూయెన్సర్ల నుంచి ప్రత్యేక కంటెంట్ను యాక్సెస్ చేసేందుకు నెలవారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది టెలిగ్రామ్, యూట్యూబ్లో కనిపించే ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్స్ మాదిరిగానే ఉంటుంది.ప్రమోటెడ్ ఛానల్స్..వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు తమ ఛానళ్లను ప్రమోట్ చేయడం ద్వారా విజిబిలిటీని పెంచుకోవచ్చు. యాప్లోని డిస్కవరీ సెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ఛానల్స్ కనిపిస్తాయి.స్టేటస్ యాడ్స్ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో స్టేటస్ ఫీచర్లో యాడ్స్ ఉంటాయి. స్టేటస్ అప్డేట్ల మధ్య టార్గెట్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ను యూజర్లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..Ads in status. 🥲#WhatsApp pic.twitter.com/vn7yUmJInr— Abhishek Yadav (@yabhishekhd) June 16, 2025ప్రైవసీ పట్ల నిబద్ధతతాజాగా ప్రతిపాదించిన మార్పులు ఉన్నప్పటికీ వ్యక్తిగత సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్గానే ఉంటాయని వాట్సప్ తెలిపింది. అంటే ప్రైవేట్ చాట్ల్లో ఎటువంటి ప్రకటనలు కనిపించవని వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలు ఎట్టిపరిస్థితుల్లో ప్రకటనదారులతో పంచుకోమని వాట్సప్ స్పష్టం చేసింది. వినియోగదారుల లొకేషన్, భాష.. వంటి సాధారణ డేటా ఆధారంగా ప్రకటనలు ఉంటాయని తెలిపింది. -
జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా
న్యూఢిల్లీ: జీ20 షెర్పా పదవికి అమితాబ్ కాంత్ రాజీనామా సమర్పించారు. 1980వ బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ 45 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలు అందించిన అనంతరం చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడానికి ముందు.. 2022 జూలైలో ఆయనను జీ20 షెర్పాగా కేంద్రం నియమించింది. ‘నా కొత్త ప్రయాణం’ అంటూ లింక్డెన్లో అమితాబ్ కాంత్ (Amitabh Kant) తాజాగా ఒక పోస్ట్ చేశారు.‘‘45 ఏళ్లపాటు ప్రభుత్వ సేవల తర్వాత కొత్త అవకాశాలను స్వీకరించి, జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారత వృద్ధికి, పురోగతికి ఎన్నో అభివృద్ది చర్యల దిశగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా.. జీ20 షెర్పా పదవికి నేను సమర్పించిన రాజీనామాకు ఆమోదం తెలిపినందుకు భారత ప్రధానమంత్రికి ఎంతో కృతజ్ఞతలు’’ అని పోస్ట్లో రాసుకొచ్చారు. భారత జీ20 షెర్పాగా ఎన్నో బహుపాక్షిక చర్చలకు నాయకత్వం వహించడం తన కెరీర్లో ఒకానొక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.జీ20 షెర్పా బాధ్యతలకు ముందు 2016 నుంచి 2022 మధ్య నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కాంత్ పనిచేయడం గమనార్హం. ఆ కాలంలో 115 వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథకంలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అంతకుముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ కాంత్ సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ చూపించిన మార్గదర్శనం, ప్రోత్సాహకానికి కాంత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.చదవండి: ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలు.. భారత్ కంపెనీల విలవిల -
గరిష్ఠాల నుంచి పడిన పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారం కాస్త ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రూ.10,000లోపు కొత్త 5జీ ఫోన్లు
సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ యువతరం ముందుంటోంది. నిత్యం మొబైళ్ల తయారీలో వస్తున్న మార్పులను వీరు స్వాగతిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల పనితీరు మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఫోన్లలో ఫీచర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచుల మేరకు వినూత్న మోడళ్లను నిత్యం ఆవిష్కరిస్తున్నాయి. లేటెస్ట్గా విడుదలైన రూ.10,000 లోపు ధర(ధరలు రిటైలర్ను అనుసరించి మారే అవకాశం ఉంటుంది) ఉన్న కొన్ని 5జీ మొబైళ్ల గురించి తెలుసుకుందాం.పోకో సీ75 5జీ - రూ.9,499స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.74 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్రెడ్మీ ఏ4 5జీ - రూ.8,999మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్ఏసర్ సూపర్ జెడ్ఎక్స్ 5జీ - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.8 అంగుళాల ఎఫ్హెచ్డీ+ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ33వాట్ ఛార్జింగ్పోకో ఎం7 5జీ - రూ.8,799స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్6.88 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5160 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్రెడ్మీ 14సీ 5జీ - రూ.9,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్శాంసంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ - రూ.8,499మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ25వాట్ ఛార్జింగ్ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ-రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా షార్క్ 5జీ - రూ.7,999యూనిసోక్ టీ765 ప్రాసెసర్6.75 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్13 మెగా పిక్సల్ రేర్ కెమెరా5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్లావా బోల్డ్ ఎన్1 ప్రో - రూ.9,999మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్50 మెగా పిక్సల్ రేర్ కెమెరా8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా5000 ఎంఏహెచ్ బ్యాటరీ18వాట్ ఛార్జింగ్నోట్: మార్కెట్లో రూ.10వేలులోపు మరెన్నో మొబైళ్లు ఉన్నాయి. పైన తెలిపిన మోడళ్ల వివరాలు కేవలం ఒక అంచనాకు మాత్రమే తెలియజేశాం. కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుందని గమనించాలి. -
ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను రేట్లు ఉన్న దేశాలు
ప్రతి దేశ ఆర్థిక చట్రంలో పన్నులు కీలకమైన పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక విధానాలు, సామాజిక కార్యక్రమాలు, పొరుగు దేశాలతో ఆర్థిక పోటీతత్వాన్ని ఇవి రూపొందిస్తాయి. 2025లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లు వివిధ దేశాల్లో గణనీయంగా మారింది. కొన్ని దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి ప్రగతిశీల పన్ను నమూనాలను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి తక్కువ పన్నులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2025లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఉన్న టాప్ 10 దేశాల వివరాలు కింద తెలుసుకుందాం.భారత్లో ఇది గరిష్ఠంగా 30 శాతం ఉంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:58 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు నష్టపోయి 24,876కు చేరింది. సెన్సెక్స్(Sensex) 233 ప్లాయింట్లు తగ్గి 81,562 వద్ద ట్రేడవుతోంది.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.94 శాతం పెరిగిందిమధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. బ్రెంట్ చమురు బ్యారల్ 74 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరుగుతోంది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
14 నెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహారం, కూరగాయలు, ఇంధన ధరల తగ్గుదలతో టోకు ద్రవ్యోల్బణం మరింత కనిష్టానికి దిగొచ్చింది. మే నెలలో టోకు ధరల ఆధారిత సూచీ 0.39 శాతంగా నమోదైంది. ఇది 14 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉంటే, గతేడాది మే నెలలో 2.74 శాతంగా ఉంది. ఆహార వస్తువుల విభాగంలో 1.56% ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!ఏప్రిల్ నెలలో ఇది మైనస్ 0.86%గా ఉంది. ముఖ్యంగా కూరగాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుల విభాగంలో ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. కూరగాయల్లో అయితే ఏకంగా మైనస్ 21.6% ద్రవ్యోల్బణం నెలకొంది. ఇంధనం, విద్యుత్ విభాగంలోనూ మైనస్ 2.3% ద్రవ్యోల్బణం నమోదైంది. ఏప్రిల్లో ఇదే విభాగంలో 2.18% ద్రవ్యోల్బణం ఉండం గమనార్హం. తయారీ వస్తువుల విభాగంలో 2.04% ద్రవ్యోల్బణం నెలకొంది. మే నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 2.82 శాతానికి దిగిరావడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్ని విభాగాల్లోనూ కనిపించినట్టు ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
దేశీ కంపెనీలకు రేర్ తిప్పలు!
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలను కఠినతరం చేయడంతో భారతీయ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ప్రధానంగా వాహన విడిభాగాల పరిశ్రమను ఈ అనిశ్చితి వెంటాడుతోంది. నేరుగా చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతి కోసం లైసెన్స్లకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశీ కంపెనీల దరఖాస్తుల సంఖ్య రెట్టింపైనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. జూన్ మధ్య నాటికి సుమారు 21 కంపెనీలు మీడియం, హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతి పరి్మట్ల కోసం చైనా వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతిదారులు కొనుగోలుదారు నుంచి ఎండ్–యూజర్ సరి్టఫికెట్ను తీసుకోవడం సహా అధికారిక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ చైనా ఏప్రిల్ 4న ఆదేశాలు చేసిన నేపథ్యంలో వీటి ఎగుమతులకు తీవ్ర అండ్డంకులు నెలకొన్నాయి. ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్ మెటీరియల్స్ను ఎలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ ఉపయోగించబోమని హామీ ఇవ్వడంతో పాటు నిర్దిష్ట డిక్లరేషన్లు ఈ సరి్టఫికెట్లో ఉంటాయి. చైనాకు దరఖాస్తు చేసిన కంపెనీల్లో బాష్ ఇండియా, మారెల్లి పవర్ట్రెయిన్ ఇండియా, మాహల్ ఎలక్ట్రిక్ డైవŠస్ ఇండియా, టీవీఎస్ మోటార్స్, యూనో ఇండియా తదితర దిగ్గజాలు ఉన్నాయి. విధానపరమైన కారణాలతో గతంలో తిరస్కరణకు గురైన సోనా కామ్స్టర్ తిరిగి దరఖాస్తు చేసుకుంది. చైనా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 52 కంపెనీలు... భారతీయ వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్) వివరాల ప్రకారం భారతీయ ఆటోమబైల్ కంపెనీలకు సరఫరా చేయడం కోసం దాదాపు 52 కంపెనీలు పూర్తిగా చైనా మాగ్నెట్లపైనే ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు తమ తాజా పర్మిట్ల కోసం అన్ని లాంఛనాలను పూర్తి చేసి చైనా సరఫరాదారులకు డాక్యుమెంట్లను పంపించాయి. అయితే, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వాటికి ఇంకా తప్పనిసరి ఎగుమతి లైసెన్స్ రాకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క, భారతీయ అధికారులు కూడా చైనాతో చర్చల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూరోపియన్ సంస్థలు మాత్రం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకున్నాయి. వాస్తవానికి యూఎస్ సుంకాలకు ప్రతిగా చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్లపై నిబంధనలను కఠినతరం చేయగా.. అమెరికా ప్రభుత్వం వాటి సరఫరా విషయంలో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యూరప్ వాహన విడిభాగాల తయారీ సంస్థలకు కూడా అనుమతులు లభించాయి. భారతీయ కంపెనీలు మాత్రం అనుమతుల కోసం నానాతప్పలు పడుతున్నాయి.ఉత్పత్తికి విఘాతం... వీలైనంత త్వరగా లైసెన్స్లు దక్కకపోతే తయారీకి తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన పరిశ్రమ స్థాయితో పోలిస్తే రేర్ ఎర్త్ మాగ్నెట్ల దిగుమతుల విలువ తక్కువే అయినప్పటికీ.. వాటిని ఉపయోగించి తయారు చేసే ఒక్క విడిభాగం లేకపోయినా వాహనాల తయారీ నిలిచిపోతుందని ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. 2024–25లో భారత్ రూ.306 కోట్ల విలువైన 870 టన్నలు రేర్ ఎర్త్ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీల వద్దనున్న నిల్వలు జూన్ మొదటి నాటికి పూర్తిగా అయిపోతాయని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. -
పీఎఫ్ సేవల కోసం ఏజెంట్ల సాయం తీసుకోవద్దు
న్యూఢిల్లీ: పీఎఫ్ క్లెయిమ్లు, ఆన్లైన్ సేవల విషయంలో ఏజెంట్ల సాయం తీసుకోవద్దంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన సభ్యులకు కీలక సూచన చేసింది. తమ భవిష్యనిధికి సంబంధించి సేవల కోసం ఆన్లైన్ పోర్టల్ను వినియోగించుకోవాలని సూచించింది. దీనివల్ల వ్యక్తిగత వివరాలు రిస్క్ లో పడకుండా ఉంటాయని పేర్కొంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలు, వినియోగ అనుకూలమైన ఎన్నో సంస్కరణ చర్యలను ఈపీఎఫ్వో అమలు చేసినట్టు కేంద్ర కారి్మక శాఖ సైతం గుర్తు చేసింది. ఈపీఎఫ్వో సభ్యులు ఉచితంగా పొందాల్సిన సేవలపై సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. సభ్యులు నేరుగా ఉచితంగా వినియోగించుకోతగిన ఈపీఎఫ్వో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ఈ ఆపరేటర్లు వినియోగిస్తున్నట్టు పేర్కొంది. మూడో పక్ష కంపెనీలు లేదా ఏజెంట్లను ఆశ్రయించడం వల్ల సభ్యుల సున్నితమైన ఆర్థిక డేటా లీకయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. సీపీజీఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ఐజీఎంఎస్ పోర్టల్స్లో ఫిర్యాదు చేయొచ్చని, సకాలంలో పరిష్కారమయ్యేంత వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. క్లెయిమ్ దాఖలు, నిధుల బదిలీ, కేవైసీ అప్డేషన్, ఇతర ఏ ఫిర్యాదు అయినా ఉచితమేనని.. వీటి కోసం ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే ఈపీఎఫ్వో హెల్ప్ డెస్క్లు లేదా ప్రాంతీయ కార్యాలయాల్లో పీఆర్వోలను సంప్రదించొచ్చని సూచించింది. ఈపీఎఫ్వో పరిధిలో 7 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. -
ఎస్బీఐ ఇంటి రుణం కారు చౌకగా..!
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పెద్ద ఉపశమనాన్ని కలి్పంచింది. ఆర్బీఐ రెపో రేటు 0.50 శాతం తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా రుణ గ్రహీతలకు బదలాయించింది. వివిధ రకాల రుణాలపై 50 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ నిర్ణయించింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఎస్బీఐ రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గించింది. ఈ తగ్గింపు అనంతరం ఆర్ఎల్ఎల్ఆర్ రేటు 7.75 శాతానికి దిగొచి్చంది. అలాగే, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటును (ఈబీఎల్ఆర్) సైతం 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. సవరించిన రేట్లు జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ (ఎంసీఎల్ఆర్) రేట్లలో ఎస్బీఐ ఎలాంటి సవరణలు చేయలేదు. దీంతో ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 8.2 శాతంగా, మూడు నెలల రేటు 8.55 శాతం, ఆరు నెలల రేటు 8.90 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతం, రెండేళ్ల రేటు 9.05 శాతం, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.10 శాతం చొప్పున ఉన్నాయి. ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంక్లు తమ రుణ రేట్లను సైతం వేగంగా సవరించడం గమనార్హం. ఇప్పుడు ఎస్బీఐ సైతం ఇదే నిర్ణయాన్ని అమలు చేసింది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోరును బట్టి ఎస్బీఐ గృహ రుణ రేటు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండనుంది. డిపాజిట్ రేట్లకూ కోతమరోవైపు వివిధ కాల వ్యవధి డిపాజిట్లపై రేటును సైతం ఎస్బీఐ తగ్గించింది. రూ.3 కోట్ల వరకు అన్ని కాల వ్యవధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 1–2 ఏళ్ల డిపాజిట్లపై రేటు తగ్గింపు అనంతరం 6.50 శాతానికి దిగొచి్చంది. 2–3 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.70 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గింది. 3–5 ఏళ్లలో మెచ్యూరిటీ తీరే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30 శాతం, 5–10 ఏళ్ల డిపాజిట్లపై రేటు 6.05 శాతానికి తగ్గింది. 444 రోజుల అమృత్ వృష్టి డిపాజిట్పై రేటు 6.85 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గింది. 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు సాధారణ రేట్లపై 50 బేసిస్ పాయింట్లు, 80 ఏళ్లు నిండిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్ల అదనపు రేటు డిపాజిట్లపై లభిస్తుంది. పెద్ద ఊరటే.. రూ.50 లక్షల గృహ రుణం, 8 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే తాజా 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు రూపంలో రుణ గ్రహీతకు రూ.3.70 లక్షలు ఆదా కానుంది. 8 శాతం రేటుపై రేటు సవరణకు ముందు నెలవారీ ఈఎంఐ 41,822 కాగా, సవరణ తర్వాత రూ.40,280కు దిగివస్తుంది. ఈఎంఐ తగ్గించుకోకుండా పూర్వపు మాదిరే చెల్లిస్తూ వెళ్లేట్టు అయితే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే రుణం తీరిపోతుంది. -
ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది!
ఆదాయం అస్సలు సరిపోవడం లేదు.. నెలాకరు రాకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయి.. చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదు.. సగటు మధ్యతరగతి జీవి తరచూ చెప్పుకొనే మాటలివి. నిజమే.. ప్రస్తుత రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. కొన్ని వ్యయాలు మన అదుపులో ఉండవు. కానీ నిశ్శబ్దంగా, తెలియకుండానే జేబులు ఖాళీ చేసే ఖర్చులు కొన్ని ఉన్నాయి. సబ్స్క్రిప్షన్లు, చిన్న రోజువారీ కొనుగోళ్లు లేదా రుసుములు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ ఖర్చులను తెలుసుకోవడం, తగ్గించడం వల్ల మీరు తీవ్రమైన జీవనశైలిలో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా మీ పొదుపును చాలా వరకు పెంచుకోవచ్చు.సబ్స్క్రిప్షన్ ఆడిట్అనవసరమైన సబ్స్క్రిప్షన్ లను గుర్తించండి. చాలా మంది తాము అరుదుగా ఉపయోగించే సేవలకు సబ్ స్క్రైబ్ చేసుకుంటుంటారు. అన్ని యాక్టివ్ సబ్ స్క్రిప్షన్ లను జాబితా రాసుకుని వాటి అవసరాన్ని అంచనా వేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ఆడిట్ నిర్వహించండి. పనికిరాని లేదా అరుదుగా ఉపయోగించే వాటిని రద్దు చేయండి. ఈ చిన్న నని మీకు ప్రతి నెలా చాలా డబ్బును ఆదా చేస్తుంది. దీన్ని మరింత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు.రోజువారీ ఖర్చులపై పర్యవేక్షణరోజువారీ చేసే చిన్న చిన్న కొనుగోళ్లను పర్యవేక్షించండి. రోజువారీ చిరు ఖర్చులు అంటే కాఫీ, స్నాక్స్ వంటి కోసం చేసేవి. ఇవి తక్కువే కదా అనిపించవచ్చు. కానీ నెలాఖరున లెక్కిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుస్తుంది. ఈ ఖర్చులను ఒక వారం పాటు తనిఖీ చేయండి. అవి మీ బడ్జెట్ను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడండి. అలా అని సరదా విషయంలో రాజీపడాల్సిన పని లేదు. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇంట్లో కాఫీ, స్నాక్స్ చేసుకుని ఆస్వాదించవచ్చు.అనవసర షాపింగ్ వద్దుషాపింగ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ కొంత మంది తరచూ షాపింగ్కు ప్రేరేపితం అవుతుంటారు. ఈ ప్రేరేపిత కొనుగోలు అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయిస్తుంది. బయటకు వెళ్ళే ముందు షాపింగ్ జాబితాలను తయారు చేయడం లేదా అత్యవసరం కాని వస్తువులను కొనుగోలు చేయడానికి ముందు వెయిటింగ్ పీరియడ్ సెట్ చేయడం వంటి వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా, మీరు ఆకస్మిక నిర్ణయాలను నియంత్రించగలుగుతారు. బదులుగా మీ ఆర్థిక ప్రాధాన్యతలకు సరిపోయే ఆలోచనాత్మక కొనుగోళ్లు చేయగలరు.ఛార్జీలపై అవగాహనబ్యాంకు ఫీజులు, ఛార్జీలను సమీక్షించుకోవడం అవసరం. ఇవే నిశ్శబ్దంగా వచ్చే ఖర్చులు. వీటిని అవగాహన, అప్రమత్తతో తగ్గించుకోవచ్చు. మెయింటెనెన్స్ ఛార్జీలు లేదా ఏటీఎం ఫీజులు వంటి ఏదైనా పునరావృత రుసుము కోసం బ్యాంక్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా సమీక్షించండి. తక్కువ ఖర్చులు లేదా ఎటువంటి రుసుము లేని ఖాతాల కోసం ఎంపికలను అన్వేషించండి. బ్యాంకులు లేదా ఖాతా రకాలను మార్చడం కాలక్రమేణా గణనీయమైన పొదుపునకు దారితీస్తుంది.వినియోగ సామర్థ్యంయుటిలిటీ బిల్లులు మన అసమర్థ వినియోగ అలవాట్ల కారణంగా నిశ్శబ్ద ఖర్చుల ఉచ్చులో పడే మరొక ప్రాంతం. గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లను ఆపివేయడం. విద్యుత్తును తక్కువ వినియోగించే ఉపకరణాలను ఉపయోగించడం లేదా థర్మోస్టాట్ సెట్టింగులను సర్దుబాటు చేయడం వంటి సాధారణ చర్యలు ఇంట్లో సౌకర్య స్థాయిలతో రాజీపడకుండానే కాలక్రమేణా యుటిలిటీ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఒక్క నెల ఇవన్నీ ప్రయత్నించి చూడండి. మీ ఖర్చుల్లో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకుంటారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి. ఏఐ రాకతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మార్పులుసాఫ్ట్వేర్ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్హబ్ కోపైలట్, కర్సర్చాట్ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్ ప్రాంప్ట్ ఇస్తే చాలు ఎలాంటి కోడ్ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్ సిలికాన్ వ్యాలీకి చెందిన టాప్ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి. ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదుటెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు. వ్యూహాత్మక దృక్పథం అవసరం కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.👉 ఇది చదివారా? ఈ టెక్ దిగ్గజంలో తొలగింపులు -
బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్.. పదే పదే కుదరదు
యూపీఐ లావాదేవీల విషయంలో కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. యూపీఐ చెల్లింపులకు ప్రతిస్పందన సమయాన్ని 10 సెకన్లకు తగ్గిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం (జూన్ 16) నుండి యూపీఐ ద్వారా లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి.యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అనేది మొబైల్ ఫోన్ల ద్వారా అంతర్-బ్యాంకు లావాదేవీలను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ అభివృద్ధి చేసిన రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ. ఎన్పీసీఐ ఇటీవలి సర్క్యులర్ ప్రకారం నగదు బదిలీ, స్టేటస్ చెక్స్, రివర్సల్స్తో సహా లావాదేవీలు ఇక 10 నుంచి 15 సెకన్లలో పూర్తవుతాయి. ఇంతకు ముందు దీనికి 30 సెకన్ల వరకూ సమయం పట్టేది. బ్యాలెన్స్ చెకింగ్పై పరిమితిఎన్పీసీఐ మరో సర్క్యులర్ ప్రకారం, వినియోగదారులు తమ యూపీఐ యాప్ల ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోగలరు. ఇంతకు ముందు దీనిపై ఎలాంటి పరిమితి ఉండేది కాదు. రోజులో ఎన్ని సార్లైనా ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉండేది. సిస్టమ్ సామర్థ్యం, లోడ్ను సులభతరం చేయడానికి ఎన్పీసీఐ బ్యాలెన్స్ చెక్పై పరిమితి విధించినట్లు తెలుస్తోంది.మే నెలలో యూపీఐ ద్వారా లావాదేవీల సంఖ్య 33 శాతం పెరిగి 1,868 కోట్లకు చేరుకోగా, వాటి విలువ 23 శాతం పెరిగి రూ.25.14 లక్షల కోట్లకు చేరింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నట్లు వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్లు లావాదేవీల కోసం అంతిమ లబ్ధిదారుని పేరును మాత్రమే ప్రదర్శించాలని ఎన్పీసీఐ ఇదివరకే ఆదేశించింది. -
జియోకి ఏమైంది? గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు తలెత్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, మొబైల్ సిగ్నల్, జియో ఫైబర్ సేవలకు సంబంధించిన సమస్యల గురించి వేలాది మంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దేశంలోని కేరళ ప్రాంతంలో జియో నెట్వర్క్ ద్వారా కాల్స్, ఇంటర్నెట్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివేదిస్తున్నారు.ఇప్పటివరకు 12,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయని అంతరాయాల ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డిటెక్టర్ తెలిపింది. ఇందులో ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ డేటా వైఫల్యాలకు సంబంధించినవే. 32 శాతం మంది యూజర్లు కాల్ సంబంధిత సమస్యలను నివేదించగా, 12 శాతం మంది వినియోగదారులు జియో ఫైబర్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఫిర్యాదు చేశారు.మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి దాదాపు 400 మంది వినియోగదారులు జియో సేవలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలను నివేదించారు. తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు కేరళ ప్రాంతం నుంచి గణనీయమైన సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేరళ ప్రాంతంలో మాత్రమే కొంత సమయం నెట్ వర్క్లో సమస్యలు వచ్చాయని, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఎటువంటి సమస్యా లేదని జియో వర్గాలు వెల్లడించాయి. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ప్చ్.. టాటా మోటర్స్ మాత్రం..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉండి, వేగంగా పుంజుకున్నాయి. బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 దాదాపు 1 శాతం చొప్పున పెరిగాయి.ఇంట్రాడేలో 81,865.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 677.55 పాయింట్లు (0.84 శాతం) పెరిగి 81,796.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 అయితే ఏకంగా 227.9 పాయింట్లు లేదా 0.92 శాతం ఎగిసి 24,946.50 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.93 శాతం, 0.95 శాతం లాభాలతో ముగిశాయి.రంగాల వారీగా చూస్తే అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ సూచీలు వరుసగా 1.57 శాతం, 1.32 శాతం, 1.11 శాతం, 1.07 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2.4 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు టాటా మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ మాత్రమే నష్టపోయాయి. టాప్ లూజర్ గా నిలిచిన టాటా మోటార్స్ 3.76 శాతం నష్టపోయింది.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 1.6 శాతం క్షీణించి 14.83 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక క్రూడాయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.6 శాతం తగ్గుదలతో 72.56 డాలర్లకు క్షీణించింది. -
తత్కాల్ కొత్త రూల్ తెలుసు కదా.. ఆధార్ లింక్ చేశారా మరి!?
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయంఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.ఆధార్ లింక్ చేసుకోండిలా..ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. -
యువతకు బెస్ట్ పెట్టుబడి మార్గాలు
పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస్మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.స్టాక్ మార్కెట్స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో నిర్ణీత షార్ట్టర్మ్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్టర్మ్లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్లు(కొన్ని స్టాక్స్ కలిపి ఉన్న ఫండ్) మార్కెట్లో నేరుగా లైవ్లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సెక్టార్ వారీగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్ మేనేజర్ నిర్వహిస్తుంటారు.బాండ్స్బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?విద్య, నైపుణ్యాలువిద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్మెంట్. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్లో అంత ప్రయోజనం పొందుతారు. -
ఉద్యోగాల కోతకు ఏఐ సాకు!
కృత్రిమమేధకు ఆదరణ పెరుగుతున్న కొద్దీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు అధికమవుతోంది. తమ ఉద్యోగాల స్థానంలో ఏఐ పాగా వేస్తుందని చాలామంది జంకుతున్నారు. ఇదే అదనుగా కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని చెబుతూ కొన్ని కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు తమ మోడళ్ల అమ్మకాలను పెంచుకోవడానికి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు ఏఐ కోడింగ్ ప్లాట్ఫామ్ విండ్సర్ఫ్ వ్యవస్థాపక బృందం సభ్యుడు అన్షుల్ రామచంద్రన్ తెలిపారు.‘ఏఐ ప్రభావం పెరుగుతోందని చెబుతున్నవారిలో చాలా మంది ఎలాగైనా కొందరు ఉద్యోగులను తొలగించాలని కోరుకుంటున్నారు. అందుకు ఏఐను సాకుగా వాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ కోసం ప్రత్యేకంగా ఏఐ నమూనాలను రూపొందిస్తున్నారు. మరిన్ని మోడళ్లను విక్రయించడానికి ఇది వ్యాపార వ్యూహంగా పని చేస్తుంది. డెవలపర్ అడాప్షన్, ఎంటర్ప్రైజ్ పార్ట్నర్షిప్ పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరిస్తోంది. భారత్లో 1.7 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?‘వాస్తవంగా కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడానికి భారత్కు సరిపడా శక్తి ఉంది. భారత్లో జీపీయూ క్లస్టర్లను నిర్మించడంపై చురుగ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీలతో వివిధ స్థాయిల్లో కలిసి పనిచేస్తున్నాం. ఇండియన్ ఐటీ కంపెనీలు తమ అంతర్జాతీయ సహచరుల కంటే వేగంగా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు ఇప్పటికే టెక్నాలజీని వివిధ విభాగాల్లో వైవిధ్యపరిచాయి’ అని రామచంద్రన్ తెలిపారు. -
కోతల రాయుళ్లకు వాతలు తప్పవు!
ఐటీఆర్ 1, ఐటీఆర్ 4లలో కొన్ని మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ మీరు ఐటీఆర్ దాఖలు చేసే 2024–25 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ఈ మార్పుల ప్రకారం క్లెయిం చేసే ప్రతి డిడక్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలి. ఇన్నాళ్లు డిడక్షన్ ఎంతో రాసిస్తే వదిలేసేవారు. ఇక నుంచి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే. దీని ప్రకారం ఒక్కొక్క డిడక్షన్, దానికి సంబంధించిన కాగితాలు/వివరాలు ఏమిటో తెలుసుకుందాం. మీ దగ్గర పూర్తి వివరాలు లేనిదే ఫారం నింపలేరు. ఇంటి అద్దె అలవెన్సు.. బేసిక్ జీతం. ఇంటి అద్దె అలవెన్సు ఎంత చేతికి వచ్చింది. మీరు అద్దె ఎంత చెల్లించారు. అద్దె ఎవరికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు. అంటే నగదా..? బ్యాంకు ద్వారానా..? రశీదులు మొదలైనవి.80 సీ.. ఇంతకుముందే తెలుసుకున్నాము. ఈ సెక్షన్ క్రింద ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా పాలసీ నెంబరు చెప్పాలి. అలాగే మిగతా ఇన్వెస్ట్మెంట్లకు, డాక్యుమెంటు ఐడెంటిఫికేషన్ నెంబరు రాయాలి. మిగతా వాటి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు కానీ క్లెయిం చేసే ముందు కాగితాలు సిద్ధంగా పెట్టుకోవాలి. చెల్లింపు తేదీలు, అది ఏ సంవత్సరానికి సంబంధించినదో చాలా ముఖ్యం. ఈ సెక్షన్లో డిడక్షన్లు చెల్లింపు జరిగిన సంవత్సరంలోనే బెనిఫిట్ ఇస్తారు.80 డీ.. ఇది మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించినది. ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబరు వివరాలు ఇవ్వాలి. 80 ఈ... ఇది విద్యా రుణానికి సంబంధించినది. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు..? లోన్ అకౌంటు నెంబరు.., మంజూరు తేది .. ఎంత రుణం తీసుకున్నారు.. ఇంకా ఎంత రుణం చెల్లించాలి .. ఇలా వివరాలన్నీ తెలియపరచాలి. 80 ఈఈ... ఇంటి కోసం రుణం తీసుకుంటే కొన్ని షరతులకు లోబడి రూ.50,000 డిడక్షన్ ఇస్తారు. ఈ రుణానికి సంబంధించి బ్యాంకు, లోన్ అకౌంటు నెంబరు, మంజూరు లెటర్ తేదీ, ఎంత రుణం తీసుకున్నారు..? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది. ఇవన్నీ వివరాలు చెప్పాలి. 80 ఈఈబీ... ఇది ఎలక్ట్రిక్ వెహికల్ లోన్కి సంబంధించినది. బ్యాంకు పేరు ఏమిటి..? లోన్ అకౌంటు నెంబరు, లోన్ ఎంత, వెహికల్ రిజి్రస్టేషన్ నెంబరు, లోన్ మొత్తం ఎంత..? మొదలైన వివరాలు ఇవ్వాలి.80 డీడీబీ... ఇది కొన్ని నిర్దేశిత జబ్బుల ట్రీట్మెంట్కి సంబంధించినది. ఆ నిర్దేశిత జాబితాలోంచి ఏ జబ్బు వచ్చింది? దానికైన ఖర్చు.., హాస్పిటల్కి చెల్లించిన మొత్తం ఎంత? తదితర పూర్తి వివరాలు తెలిపాలి. ఈ మార్పులతో అన్ని విషయాలు సేకరిస్తున్నారన్నమాట. ఒకప్పుడు మన మీద అభిమానం, నమ్మకం, మంచి విశ్వాసంతో మొత్తాన్ని తెలియజేయమనేవారు. దీనిని ఆసరా తీసుకుని అన్ని సెక్షన్ల ప్రకారం అర్హత ఉన్నంత క్లెయిమ్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. అద్దె ఇంట్లో లేకుండా అద్దె క్లెయిమ్ చేసే ఉద్యోగస్తులు ఎందరో ఉన్నారు. భార్యభర్తలు ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరూ విడిగా వారి వారి అస్సెస్మెంట్లలో హెచ్ఆర్ఏ క్లెయింలు చేసే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్స్’ ఎంతోమంది ఉన్నారు. ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..ఒక్క హెచ్ఆర్ఏ విషయంలోనే డిపార్ట్మెంట్ వారు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే కొంప కొల్లేరు అయిపోతుంది. అలాగే దొంగ స్కూల్ ఫీజుల రశీదులు .. పిల్లలు లేని వారు కూడా దొంగ రశీదులు పెడుతున్నారు. జీవిత బీమా చెల్లించకపోయినా ప్రీమియంలు చెల్లించినట్లు రాయడం, లేని చెల్లింపులు, లేని ఇన్వెస్ట్మెంట్లు, లేని అంగవైకల్యం దొంగ పత్రాలు సృష్టించి తద్వారా క్లెయిమ్లు పొందడం లాంటివి చేసేవారున్నారు. డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉందని తిట్టి, ప్రచారం చేసి డిపార్ట్మెంట్ వారి మీద అపవాదాలు వేసి, పిడివాదన చేసి, వాదనలు, ప్రతివాదనలు చేసి, పన్నుభారం తగ్గించుకునే కోతరాయుళ్లకి వాతలు తప్పవు.కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్యట్యాక్సేషన్ నిపుణులు -
బంగారం ధరల్లో స్వల్ప ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం కాస్తా ఊరటనిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,050 (22 క్యారెట్స్), రూ.1,01,510 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. క్రితం రోజు ముగింపు ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.170 తగ్గింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,510 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 దిగి రూ.93,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.170 తగ్గి రూ.1,01,660 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు సోమవారం తగ్గినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా వినియోగదారులకు కొంత ఊరట కల్పించాయి. క్రితం ముగింపు ధరలతో పోలిస్తే కేజీ వెండి ధరపై రూ.100 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,19,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హోర్ముజ్ జలసంధి మూసివేత..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఆధ్వర్యంలోని హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తుంది. అయితే యుద్ధం నేపథ్యంలో దీని గుండా చేసే చమురు సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ జలసంధి ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు 20% రవాణాను సులభతరం చేస్తుంది.ఇరాన్-గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఈ హోర్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. చమురు ఉత్పత్తి చేసే దేశాలకు ప్రధానంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, ఇరాక్, కువైట్లకు ఒక ముఖ్యమైన సప్లై కారిడార్గా పనిచేస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ జలసంధి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణలు, ఆర్థిక ఆంక్షలకు గురవుతుంది. దీని గుండా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే తీవ్రమైన సరఫరా గొలుసు అవరోధాలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ముడి చమురు ధరలను పెంచుతుందని చెబుతున్నారు.ముడిచమురు ధరలపై కీలక ప్రభావంసరఫరా అంతరాయాలుఅమెరికా, ఇతర గల్ఫ్ దేశాలతో ఇరాన్కు ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఆంక్షల వల్ల ప్రపంచ క్రూడ్ ఎగుమతులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇది చమురు ధరలు పెరగడానికి, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడటానికి దారితీస్తుంది.మార్కెట్ ఒడిదొడుకులుఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇటీవలి సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ 10% పైగా పెరగడానికి దారితీశాయి. ఇది దీర్ఘకాలిక సంక్షోభంతో కూడిన మార్కెట్ భయాలను ప్రతిబింబిస్తుంది. పశ్చిమాసియాలో అస్థిరతపై పెట్టుబడిదారులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.పరిశ్రమలపై ప్రభావం..పెరుగుతున్న ముడి చమురు ధరలు పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెయింట్స్, కెమికల్స్ పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్పై ఆధారపడతాయి. టైర్లు, రబ్బరు తయారీ సంస్థలు పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులతో ప్రభావితమవుతాయి. ఏవియేషన్, షిప్పింగ్ పరిశ్రమ పెరిగిన ఇంధన ఖర్చులతో రవాణా వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్రష్యాకు అవకాశం..హోర్ముజ్ జలసంధి దిగ్బంధం చేస్తారనే భయాలతో రష్యన్ క్రూడాయిల్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆంక్షల తరువాత ఇప్పటికే రష్యన్ చమురు రాయితీతో లభిస్తుంది. దాంతో భారతదేశం, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను పెంచాయి. ఈ పరిస్థితి ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ ఇలాగే హోర్ముజ్ జలసంధి గుండా సరఫరాను నిలిపేస్తామని ఇరాన్ భయాలు సృష్టిస్తే గల్ఫేతర చమురు సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుతుందనే వాదనలున్నాయి.ఇరాన్ బెదిరింపుల వెనుక కారణాలుఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు సమర్థంగా సమాధానం చెబుతామని ఇరాన్ ప్రతిస్పందించింది. అందులో భాగంగా హోర్ముజ్ జలసంధిని నిలిపేయడం దాని వ్యూహాత్మక ఎంపికల్లో ఒకటి. ఈ జలసంధి ముఖ్యమైన చమురు రవాణా మార్గం. ఇది ప్రపంచ ముడి చమురులో 20% రవాణాకు తోడ్పడుతుంది. దీనికి విఘాతం కలిగిస్తే చమురు ధరలు పెరుగుతాయి. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇరాన్ చారిత్రాత్మకంగా హోర్ముజ్ను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ బేరసారాలు సాగించింది. కానీ ఎన్నడూ దాన్ని నిలిపేయలేదు.పూర్తి మూసివేత సాధ్యం అవుతుందా..?ఇరాన్ కూడా తన చమురును ఎక్కువగా హోర్ముజ్ జలసంధి ద్వారానే ఎగుమతి చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ యూకే, ఫ్రెంచ్ మిత్రదేశాలతో కలిసి ఆ జలమార్గంలో గస్తీ నిర్వహిస్తుంది. దీన్ని పూర్తిగా నిలిపేస్తే పాశ్చాత్య దేశాల సైనిక జోక్యం పెరుగుతుందనే వాదనలున్నాయి. -
ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు లాభపడి 24,729కు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 ప్లాయింట్లు పెరిగి 81,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.08 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.13 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.3 శాతం దిగజారింది.అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రత్యామ్నాయ పెట్టుబడులకు డిమాండ్
ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలకు (ఏఐఎఫ్/ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్) ఆదరణ పెరుగుతోంది. వీటి నిర్వహణలోని ఆస్తులు 2025 మార్చి త్రైమాసికం చివరికి రూ.5.38 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం చివరికి ఉన్న రూ.4.07లక్షల కోట్లతో పోల్చి చూస్తే 32 శాతం పెరిగినట్టు సెబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ధనవంతులు, ఫ్యామిలీ ఆఫీస్ల అస్సెట్ అలోకేషన్లో (పెట్టుబడుల కేటాయింపులు) స్పష్టమైన మార్పును ఈ గణంకాలు సూచిస్తున్నాయి.ఈక్విటీ మార్కెట్లో అస్థిరతలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టబుడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడమే ఏఐఎఫ్ ఆస్తుల వృద్ధికి దోహదపడినట్టు పెట్టుబడి సలహా సేవల సంస్థ ‘మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్’ వెల్లడించింది. సంప్రదాయ ఈక్విటీ, డెట్ పెట్టుబడులకే పరిమితం కావడం నుంచి ఇతర సాధనాల వైపు ఇన్వెస్టర్లు మళ్లుతున్నారనడానికి నిదర్శనంగా పేర్కొంది.ముఖ్యంగా హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు (హెచ్ఎన్ఐలు/ధనవంతులు), అల్ట్రా హెచ్ఎన్ఐలు ఏఐఎఫ్ విభాగం వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలిపింది. ఏఐఎఫ్ ఫండ్స్ కిందకు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేటు క్రెడిట్, ఇతర సంప్రదాయేతర పెట్టుబడి సాధనాలు వస్తాయి. మార్కెట్లు అస్థిరతలకు గురైన సందర్భాల్లో ఏఐఎఫ్ పెట్టుబడులు స్థిరత్వంతోపాటు, అధిక రాబడులు అందించడం వీటి పట్ల ఆసక్తి పెరగడానికి కారణంగా మల్టీ యాక్ట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?వైవిధ్యం–హెడ్జింగ్‘ఫ్యామిలీ ఆఫీసులు పెట్టుబడులను దీర్ఘకాల దృష్టిలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇతర ఇన్వెస్టర్లతో పోలిస్తే ప్రైవేటు పెట్టుబడుల్లో వీరి భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది’ అని ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వైవిధ్యంతోపాటు ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు హెడ్జింగ్ వంటివి ఏఐఎఫ్ పెట్టుబడుల వృద్ధికి కారణాలుగా పేర్కొంది. సాధారణంగా ఏఐఎఫ్లను కేటగిరీ –1, 2, 3లుగా విభజిస్తుంటారు. ఆరంభ స్థాయి వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ, ప్రైవేటు క్రెడిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్–షార్ట్ హెడ్జ్ వ్యూహాలతో ఏఐఎఫ్లు పనిచేస్తుంటాయి. ఈ భిన్నమైన అవకాశాల ద్వారా ఈక్విటీ, డెట్ మార్కెట్లలోని అస్థిరతలను హెచ్ఎన్ఐలు అధిగమించగలుగుతారని, రిస్క్ను మెరుగ్గా నిర్వహించగలరని ఈ నివేదిక వివరించింది. భిన్న మార్కెట్ సైకిల్స్ను సమర్థవంతంగా అధిగమించే విధంగా వారి పోర్ట్ఫోలియో నిర్మాణం ఉంటుందని తెలిపింది. భారత్లో 10 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు కలిగిన వారు 85,698 మంది ఉన్నట్టు నైట్ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 ఇటీవలే వెల్లడించింది. -
‘ఫండ్స్’ను బహుమతిగా ఇవ్వొచ్చా..?
ఈఎల్ఎస్ఎస్ పథకాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయా..? – వివేక్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాలు పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను ఆదా ప్రయోజనం కలిగినవవి. ఈ పథకాల్లో రాబడులు దీర్ఘకాలంలో సగటున 15–20% మధ్య ఉంటాయి. ఈ విభాగంలో బలహీన పనితీరు చూపించిన పథకాన్ని గమనించినా.. పీపీఎఫ్ కంటే అధిక రాబడులు కనిపిస్తాయి. కాంపౌండింగ్ (వడ్డీపై వడ్డీ జమ కావడం) ప్రయోజనంతో పెట్టుబడి వృద్ధి చెందుతుంది.మంచి పథకాన్ని ఎంపిక చేసుకుని, అది అన్ని కాలాల్లోనూ మంచి పనితీరు చూపిస్తుంటే దానితోనే కొనసాగొచ్చు. మార్కెట్తో అనుసంధానమైన సాధనాల్లో పెట్టుబడులు ఆటుపోట్లకు గురువుతుంటాయి. కనుక వాటి పనితీరును కాలానుగుణంగా పరిశీలిస్తూ ఉండాలి. ఎందుకంటే కొంత కాలం పాటు మంచి పనితీరు చూపించినవి, ఆ తర్వాత చెత్త పథకాలుగా మారొచ్చు. అందుకే పెట్టుబడులను సమీక్షించుకోవడమనే సూత్రాన్ని అనుసరించాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈఎల్ఎస్ఎస్ పథకం పనితీరు ఆశాజనకంగా లేకపోతే, దాని నుంచి మూడేళ్ల తర్వాత బయటకు వచ్చేయవచ్చు. ఎందుకంటే మూడేళ్లకు పెట్టుబడుల లాకిన్ ముగిసిపోతుంది. ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారిపోయి ఉంటే అలాంటి వారు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ బదులు రిస్క్, కాల వ్యవధి, రాబడుల అంచనాలకు అనుగుణంగా ఫ్లెక్సీక్యాప్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ తదితర పథకాలను పరిశీలించొచ్చు.మ్యూచువల్ ఫండ్స్లో నా పెట్టుబడులను మరొకరికి బహుమతిగా ఇవ్వడం ఎలా? – నీరజ్ ప్రసాద్మ్యూచువల్ ఫండ్స్ పథకంలోని యూనిట్లు ఒకరికి బదిలీ చేయడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ కుదరదు. ఇన్వెస్టర్ తన పేరిట ఉన్న యూనిట్లు వేరొకరికి బదిలీ చేయడం అన్నది కేవలం.. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. అటువంటి సందర్భంలో నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను పిల్లలకు బహుమతిగా ఇవ్వాలన్నా కుదరదు. పిల్లల కోసం అయితే వారి పేరుతో ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మార్గం. పిల్లల వయసు 18 ఏళ్లలోపు ఉన్నా ఇది సాధ్యపడుతుంది.ఇదీ చదవండి: ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?పిల్లలు మేజర్ అయ్యే వరకు (18 ఏళ్లు నిండే వరకు) తల్లిదండ్రులే సంబంధింత పెట్టుబడులకు సంరక్షకులు అధికారం కలిగి ఉంటారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్తోపాటు, గార్డియన్ కేవైసీ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ అడుగుతుంది. పిల్లల పేరిట (మైనర్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విక్రయించగా వచ్చిన ఆదాయం.. తల్లిదండ్రుల ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లల వయసు 18 ఏళ్లు నిండిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే అది వారి వ్యక్తిగత ఆదాయం కిందకే వస్తుంది. పిల్లలు కాకుండా వేరొకరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఇవ్వాలనుకుంటే ముందుగా వాటిని విక్రయించాలి. అలా వచ్చిన నగదును బహుమతిగా ఇవ్వాలనుకునే వారికి బదిలీ చేయాలి. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి స్వయంగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఒక్కటే ఫండ్.. అన్ని చోట్లా పెట్టుబడులు
పెట్టుబడులు ఎప్పుడూ కూడా తగినంత వైవిధ్యంతో ఉండాలి. దీనివల్ల అస్థిరతలను మెరుగ్గా ఎదుర్కోవచ్చు. ఇలా పెట్టుబడులకు మంచి వైవిధ్యాన్ని ఇచ్చేవే మల్టీ అస్సెట్ ఫండ్స్ ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అస్సెట్ ఫండ్ పనితీరు విషయంలో నంబర్ 1గా కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఇటీవలి కాలంలో భారీ దిద్దుబాటును చూశాం.మరీ ముఖ్యంగా మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో స్టాక్స్ విలువల పతనం లార్జ్క్యాప్ కంటే మరింత అధికంగా ఉంది. ఇలా ప్రతీ పెట్టుబడుల విభాగంలోనూ వివిధ కాలాల్లో ఆటుపోట్లు ఉంటుంటాయి. అందుకే పెట్టుబడులు అన్నింటినీ ఒకే చోట ఉంచేయకూడదు. రాబడులు, రిస్్కకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. నిపుణుల సాయంతో ఈ పనిని మల్టీ అస్సెట్ ఫండ్స్ సులభతరం చేస్తాయి. కనుక అన్ని రకాల ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో వీటిని చేర్చుకోవచ్చు. రాబడులు.. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 14.53 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల కాలంలో పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 22 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ ఏటా 27.23 శాతం, ఏడేళ్లలో 17.18 శాతం, పదేళ్లలో 15.69 శాతం చొప్పున వార్షిక రాబడిని ఈ పథకం డైరెక్ట్ ప్లాన్ అందించింది. మల్టీ అస్సెట్ ఫండ్ విభాగం సగటు రాబడి గత ఏడాది కాలంలో 12 శాతంగా, మూడేళ్లలో 17.55 శాతం, ఐదేళ్లలో 19.89 శాతం, ఏడేళ్లలో 11.53 శాతం, పదేళ్లలో 10.78 శాతం చొప్పునే ఉండడం గమనించొచ్చు.అంటే మల్టీ అస్సెట్ ఫండ్ విభాగంతో పోల్చితే ఈ పథకమే వివిధ కాలాల్లో 7 శాతం వరకు అధిక రాబడులను అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పథకం 2002లో ప్రారంభం అయింది. మొదట్లో రెగ్యులర్ ప్లాన్ ఒక్కటే అందుబాటులో ఉండేది. రెగ్యులర్ప్లాన్లో ఆది నుంచి చూస్తే వార్షిక రాబడి 21 శాతంగా ఉంది. రెగ్యులర్ ప్లాన్లో ఫండ్స్ సంస్థలు మధ్యవర్తులకు కమీషన్ చెల్లిస్తాయి. డైరెక్ట్ ప్లాన్లో అలాంటివేమీ ఉండవు. కనుక దీర్ఘకాలంలో ఒక శాతం వరకు డైరెక్ట్ప్లాన్లోనే అధిక రాబడి అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం పేరులో ఉన్నట్టు ఈ పథకం ఒకటికి మించిన అస్సెట్లలో (పెట్టుబడి సాధనాలు) ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈక్విటీలకు 10 నుంచి 80 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. అలాగే, డెట్ సాధనాలకు 10 శాతం నుంచి 35 శాతం వరకు, బంగారం ఈటీఎఫ్లకు 0–10 శాతం వరకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇని్వట్)లకు 0–10 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంటుంది. దాదాపు అన్ని రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోగల సౌలభ్యం ఈ ఒక్క పథకం ద్వారా సాధ్యపడుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మల్టీ అస్సెట్ ఫండ్స్ మూడు అంతకంటే ఎక్కువ సాధనాల్లో.. కనీసం 10 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఈ పథకం అన్ని ముఖ్య సాధనాల్లోనూ ఎక్స్పోజర్కు వీలు కల్పిస్తోంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 57,485 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీల్లో 49 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాలకు 14.17 శాతం కేటాయించింది. కమోడిటీల్లో (బంగారం, వెండి) 11.3 శాతం, రియల్ ఎస్టేట్ సాధనాల్లో 1.45 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. 23.95 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉండడం గమనార్హం. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్క్యాప్ కంపెనీల్లో 84 శాతం పెట్టుబడులు పెట్టింది. మిడ్క్యాప్లో 13.39 శాతం, స్మాల్క్యాప్లో 1.63 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్లో అధిక శాతం రిస్క్ తక్కువ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
నేటి నాన్నకు.. ‘మల్టీ అసెట్’ బాసట
నేటి తరంలో తండ్రులు ఏకకాలంలో అనేక పాత్రలను పోషించాల్సి వస్తోంది. కుటుంబం.. ఉద్యోగ బాధ్యతలను చూసుకోవడం, పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రణాళికలు వేస్తూనే ఆర్థిక భద్రతకు ప్లానింగ్ చేయడం, మరో ఇంటిని కొనుగోలు చేయడం, విహారయాత్రల ప్లానింగ్, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం ఇలా అనేకానేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఇలాంటి వైవిధ్యమైన అవసరాలను తీర్చాలంటే సంప్రదాయ పద్ధతిలో పొదుపు చేస్తే సరిపోదు.దీని కోసం నిర్దిష్ట లక్ష్యంతో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఫాదర్స్ డే సందర్భంగా తమకిష్టమైన వారి భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక తండ్రులకు బాసటగా ఉంటున్న మల్టీ అసెట్ ఫండ్స్పై ఒకసారి దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. నేటి తరం తండ్రుల్లో ఈ కేటగిరీ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణాలేమిటంటే.. వైవిధ్యం వివిధ బాధ్యతలు తలో వైపునకు లాగేసే పరిస్థితుల్లో వివిధ సాధనాలవ్యాప్తంగా తమ పెట్టుబడులను రీబ్యాలెన్స్ చేసుకునేందుకు లేదా వేర్వేరు ఫండ్స్ను నిర్వహించుకునేందుకు నాన్నలకు తగినంత సమయం ఉండటం లేదు. మల్టి–అసెట్ ఫండ్స్ ఈ విధులను ఆటోమేటిక్గా నిర్వహిస్తాయి. దీనితో పెట్టుబడుల కేటాయింపు, రిసు్కల సర్దుబాటు సముచితమైన విధంగా ఉంటుంది. డైనమిక్గా కేటాయింపులు మల్టీ అసెట్ ఫండ్స్ కూడా క్రియాశీలకంగా ఉంటాయి. స్థూల ఆర్థిక సూచీలు, మార్కెట్ సెంటిమెంట్, వేల్యుయేషన్లను బట్టి చాలా మటుకు ఫండ్స్ మేనేజర్లు వ్యూహాత్మకంగా కేటాయింపులను మారుస్తూ ఉంటారు. వృద్ధి, మందగమన దశల్లో ఇన్వెస్టర్లు సమర్ధవంతంగా ముందుకెళ్లేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది. సరళతరంగా ప్రణాళికలు పదేళ్ల తర్వాత పిల్లల చదువుల కోసం పొదుపు చేయడం కావచ్చు లేదా ముందస్తుగానే రిటైర్ అయ్యేందుకు అవసరమైన నిధి సమకూర్చుకో వడం.. లక్ష్యం ఏదైనా సరే సరళతరమైన పెట్టుబడి మార్గాన్ని ఈ ఫండ్స్ అందిస్తాయి. ఒక్కో లక్ష్యం కోసం అనేకానేక పోర్ట్ఫోలియోలను నిర్వహించుకోవాల్సిన బాదరబందీ లేకుండా, తమ రిస్కు సామర్థ్యాలు, కాలవ్యవధిని బట్టి వైవిధ్యమైన ఒకే సాధనంలో సిప్ చేయడం సులభతరంగా ఉంటుంది. వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం.. రిస్కులను అధిగమించడం ఈక్విటీ ఆధారిత వ్యూహాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. డెట్ ఆధారిత పోర్ట్ఫోలియోలనేవి ద్రవ్యోల్బణానికన్నా తక్కువగా రాబడులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇక పుత్తడిని తీసుకుంటే ఎక్కువగా సంక్షోభ సమయాల్లోనే మాత్రమే మెరుస్తుంది. కానీ వీటన్నింటినీ సమతూకంలో మేళవించి, సరిగ్గా నిర్వహించుకోగలిగితే, దీర్ఘకాలంలో అర్ధవంతమైన రాబడులను అందిస్తాయి. షాక్లు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఆర్థిక స్థిరత్వ సాధనను లక్ష్యంగా పెట్టుకున్న వారు రిస్కులకు తగ్గ వృద్ధి అవకాశాలను పొందేందుకు ఈ వ్యూహం అనుకూలంగా ఉంటుంది. అనిశ్చితిలోనూ నిశ్చింత పెట్టుబడుల పోర్ట్ఫోలియో సముచిత స్థాయిలో వైవిధ్యంగా ఉండటంతో పాటు ప్రొఫెషనల్స్ నిర్వహణలో ఉంటుందనే విషయం తెలియడం వల్ల ఎంతో నిశ్చింతగా ఉంటుంది. ఫండ్ మేనేజర్లు ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తూ, లోతైన పరిశోధనలు చేస్తూ, ఆర్థిక ధోరణులను విశ్లేíÙస్తూ, రిసు్కలను తగ్గించి రాబడులను పెంచే విధంగా పోర్ట్ఫోలియోను క్రియాశీలకంగా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.దీనితో వివిధ రకాల పెట్టుబడులను వేర్వేరుగా పరిశోధించి, ఎంచుకుని, ఇన్వెస్ట్ చేసేందుకు బోలెడంత సమయం వెచి్చంచాల్సిన భారం తండ్రులకు కాస్త తగ్గుతుంది. ఇటు కెరియర్లు అటు కుటుంబ బాధ్యతల మధ్య నిరంతరం పరుగులు తీసే తండ్రులకు ఈ విధానం ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మార్కెట్ హడావుడి గురించి ఆందోళన చెందకుండా వారు ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా, తమ పిల్లల క్రికెట్ గేములు.. సైన్స్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టేలా మల్టి–అసెట్ ఫండ్స్ సహకరిస్తాయి. నేటి నాన్న ఏదో కాస్త పొదుపు లేదా ప్యాసివ్ ఇన్వెస్టింగ్కి మాత్రమే పరిమితం కావడం లేదు. కుటుంబం నేటి ఆనందాలను కోల్పోకుండా చూసుకోవడంతో పాటు భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేందుకు అన్ని విషయాలూ తెలుసుకుని, చురుగ్గా వ్యవహరిస్తూ, తగిన పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు సన్నద్ధంగా ఉంటున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్ ఇలాంటి సమతూకాన్నే ప్రతిఫలిస్తాయి. సంరక్షకుడిగా, ప్రణాళిక కర్తగా, భాగస్వామిగా, అన్నింటికీ మించి ఒక పేరెంట్గా వివిధ పాత్రలను పోషించే తండ్రులకు సమగ్రమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన పెట్టుబడి ఆప్షన్గా మల్టీ అసెట్ ఫండ్స్ ఉపయోగపడతున్నాయి. ఇలా తమ కోసమే కాకుండా రాబోయే తరాల కోసం కూడా ఆర్థికంగా కొత్త బాటలు వేస్తున్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే! మల్టీ–అసెట్ ఫండ్స్ అంటే .. ఇవి కనీసం మూడు వేర్వేరు ఆర్థిక సాధనాల్లో, అంటే ఈక్విటీలు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, పసిడిలాంటి కమోడిటీల మేళవింపులో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని కొంత వరకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) లేదా ఇంటర్నేషనల్ ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక్కడ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడ కీలకాంశం. -
ఆటుపోట్లకే అధిక చాన్స్
అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయి. మరోపక్క ఫైనాన్షియల్ మార్కెట్లలో అత్యంత కీలకమైన బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలు చేపట్టనున్నాయి. దేశీయంగా చూస్తే రుతు పవన కదలికలు, టోకు ధరల గణాంకాలు ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.5 శాతం తగ్గించడంతో తొలుత జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో డీలా పడ్డాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ఈ వారం సైతం మార్కెట్లపై ప్రభావం పడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.మధ్యప్రాచ్యంలో ఆందోళనలు తలెత్తడంతో ఇప్పటికే ముడిచమురు ధరలు బలపడ్డాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 78 డాలర్లను తాకగా.. పసిడికి డిమాండ్ పెరిగింది. విదేశీ మార్కెట్లో ఔన్స్ బంగారం 3450 డాలర్లను దాటేసింది. 3,500 డాలర్ల చరిత్రాత్మక గరిష్టంవైపు పరుగు తీస్తోంది. దీంతో ప్రధానంగా విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని అంచనా వేశారు. వడ్డీ రేట్లపై కన్ను బ్యాంక్ ఆఫ్ జపాన్ రేపు(17న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. మే నెల సమావేశంలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. 2008 తదుపరి గరిష్ట స్థాయిలో వడ్డీ రేట్లు కదులుతున్నాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సైతం బుధవారం(18న) పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. గత నెలలో చేపట్టిన సమీక్షలో ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతం వద్దే కొనసాగించేందుకు ఎఫ్వోఎంసీ నిర్ణయించింది.వాణిజ్య సుంకాల నేపథ్యంలో తలెత్తిన గ్లోబల్ అనిశ్చితి, యూఎస్ ఆర్థిక మందగమనం, ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో రేట్ల కోతకు తొందరపడబోమని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత గల కేంద్ర బ్యాంకుల రేట్ల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్, ఆల్మండ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సేల్స్ హెడ్ కేతన్ వికమ్ తెలియజేశారు. గణాంకాల తీరు మే నెలకు చైనా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు నేడు(16న) విడుదలకానున్నాయి. మార్చిలో నమోదైన 7.7 శాతం నుంచి ఏప్రిల్లో 6.1 శాతానికి తగ్గింది. ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు 5.9 శాతం నుంచి 5.1 శాతానికి నీరసించాయి. యూఎస్ మే రిటైల్ అమ్మకాలు 17న వెల్లడికానున్నాయి. మార్చిలో నమోదైన 1.7 శాతం నుంచి తగ్గి ఏప్రిల్లో 0.1 శాతానికి పరిమితమయ్యాయి.జపాన్ మే వాణిజ్య గణాంకాలు 18న వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో వాణిజ్య లోటు 116 బిలియన్ జపనీస్ యెన్లకు దిగివచి్చంది. ఏప్రిల్లో జపాన్ ద్రవ్యోల్బణం 3.6 శాతంకాగా.. మే వివరాలు 20న తెలియనున్నాయి. దేశీయంగా మే టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు 16న వెలువడనున్నాయి. ఏప్రిల్లో డబ్ల్యూపీఐ 2.05 శాతం నుంచి వెనకడుగువేసి 0.85 శాతానికి పరిమితమైంది. ఇతర అంశాలు దేశీయంగా రుతుపవన కదలికలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, టోకు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. ప్రపంచ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్తోపాటు.. రంగాలవారీగా వెలువడే వార్తలు దేశీయంగా ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. గత వారమిలా...ఆర్బీఐ లిక్విడిటీ పెంపు చర్యలు, గ్లోబల్ ఆందోళనల మధ్య గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,070 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 81,119 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 284 పాయింట్లు(1.1 శాతం) నీరసించి 24,719 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం, స్మాల్ క్యాప్ 0.1 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. సాంకేతికంగా... సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి 24,500 దిగువకు చేరితే అమ్మకాలు ఊపందుకోవచ్చని అంచనా. 24,450 వద్ద మరోసారి మద్దతు లభించవచ్చు. ఎగువముఖంగా చూస్తే 25,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,600వరకూ బలపడవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. -
ఐటీఐ మ్యూచువల్ ఫండ్ ‘డివినిటీ సిఫ్’
హైదరాబాద్: ఐటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ‘డివినిటీ సిఫ్’ పేరుతో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) కోసం కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించింది. ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వ్యాప్తంగా వినూత్నమైన పెట్టుబడి పరిష్కారాలను డివినిటీ సిఫ్ అందిస్తుందని ఐటీఐ అస్సెట్ మేనేజ్మెంట్ తెలిపింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ల మధ్య వారధిగా ఇది ఉంటుందని ఐటీఐ మ్యూచువల్ ఫండ్స్ సీఈవో జతిందర్ పాల్ సింగ్ పేర్కొన్నారు.మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనగుణంగా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కాలను అందిస్తుందన్నారు. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ఇటీవలే ప్రత్యేక పెట్టుబడుల విభాగం ‘సిఫ్’ను అనుమతించడం తెలిసిందే. ఇందులో కనీసం రూ.10 లక్షల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
ఆస్తుల బదిలీ సాఫీగా.. సులభంగా!
సుధాకర్ (71) తన మరణానంతరం తనకున్న ఏకైక ఇల్లు ఇద్దరు కుమారులకు సమానంగా చెందుతుందని వీలునామా రాశాడు. అనారోగ్యంతో సుధాకర్ 2022లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మూడేళ్లు గడుస్తున్నా కానీ సుధాకర్ కోరిక నెరవేరలేదు. ఆ ఇంటి కోసం సోదరులిద్దరి మధ్య అంగీకారం కుదరడం లేదు. ఇంటిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకుందామని ఒకరు అంటుంటే.. మరొకరు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. దేశంలో వారసత్వ వివాదాల్లో ఎక్కువగా ఇళ్ల గురించే ఉంటున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. – సాక్షి, బిజినెస్ డెస్క్బెంగళూరు సంస్థ ‘దక్ష్’ 2017లో చేపట్టిన అధ్యయనం ప్రకారం.. దేశంలో మూడింట ఒక వంతు వివాదాలు భూమి, ఇంటి గురించే ఉంటున్నాయి. ఇందులో 80 శాతం వారసత్వ హక్కులకు సంబంధించినవే కావడం గమనార్హం. 2016 నాటి ఒక సర్వే ప్రకారం చూసినా 66 శాతం సివిల్ వివాదాలు భూమి, ఇల్లు గురించే ఉన్నాయి. ఒకరికి మించిన వారసుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, వీలునామాలో ఆస్తుల పంపకం అసమంజసంగా ఉండడం, వీలునామాల ఫోర్జింగ్, ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలన్నీ కోర్టుల్లో న్యాయపోరాటాలకు దారితీస్తున్నాయి.ఆస్తుల పంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వివాదాలను సాధ్యమైన మేర తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘చట్టపరమైన సంక్లిష్టతలు, పరిపాలనా ప్రక్రియలకు దూరంగా ఉండడం అసాధ్యం. అయినప్పటికీ, ఆస్తులను ఎప్పుడు, ఎలా బదిలీ చేయాలన్నది నిర్ణయించడం ద్వారా వీటిని పరిమితం చేయొచ్చు’’అని 5నాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ రోహిరా సూచించారు. అందరికీ ఒక్కటే పరిష్కారం కాదు.. బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో పెట్టుబడులు తదితర ఆర్ధిక ఆస్తుల బదిలీ ఎంతో సులభం. వీటి విలువను ఏరోజుకారోజు సులభంగా లెక్కించొచ్చు. కనుక వీటిని ఎంత మంది వారసుల మధ్య అయినా సులభంగానే పంపిణీ చేయొచ్చు. స్థిరాస్తులైన భూమి, ఇల్లుతోపాటు ఆభరణాలు, పెయింటింగ్లు, కళాకృతుల పంపిణీ సవాళ్లతో కూడుకున్నదే.వీటి అసలైన విలువను అంచనా వేయడంలోనే సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఒకే ఇంటిని ఒకటికి మించి భాగాలుగా పంచే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అది న్యాయవివాదానికి దారితీయవచ్చు. కనుక ఈ విషయంలో సాధ్యమైన మేర వివాద రహితంగా పరిష్కారాన్ని చూడాల్సి ఉంటుంది. వీలునామా, ట్రస్ట్, గిఫ్ట్ డీడ్, ఆస్తులను విక్రయించి పంచడం.. ఆస్తుల బదిలీకి ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో సానుకూలతలే కాదు, ప్రతికూలతలూ ఉన్నాయి. తమకు అత్యంత అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. జీవించి ఉండగా /మరణానంతరం..జీవించి ఉండగా ఆస్తుల బదిలీకి గిఫ్డ్డీడ్ చేయడం, ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేయడం తదితర మార్గాలున్నాయి. ఆస్తులను విక్రయించి అందిరికీ సమానంగా పంచొచ్చు. లేదా హెచ్యూఎఫ్కు గిఫ్ట్డీడ్ చేయొచ్చు. మరణానంతరం ఆస్తులు ఎవరికి చెందాలన్నది వీలునామా ద్వారా నిర్దేశించొచ్చు. ఆస్తుల విక్రయం తమ తదనంతరం ఆస్తుల పంపకంలో సమస్యలు వస్తాయని సందేహించే వారు జీవించి ఉండగానే వాటిని విక్రయించి వారసులకు బదిలీ చేయడం ఒక పరిష్కారం. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లలు కలిగిన వారికి ఇది మరింత అనుకూలం. అనవసర ప్రక్రియలను నివారించి, సమయాన్ని ఆదా చేస్తుంది. న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదు. స్వార్జితం అయితే తమకు నచ్చిన విధంగా పంపకాలు చేసుకోవచ్చు.వీలునామా తన మరణానంతరం ఆస్తుల సాఫీ బదిలీకి వీలునామా ఉపకరిస్తుంది. చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించొచ్చు. ఆస్తులను ఎలా పంచాలనే విషయంలో ప్రత్యేక సూచనలు ఇవ్వొచ్చు. మైనర్ పిల్లల కోసం సంరక్షకులను నియమించొచ్చు. వీలు నామా రాసినా కానీ, ఆ ఆస్తులపై జీవించి ఉన్నంత కాలం యజమానికే హక్కు, అధికారం ఉంటాయి. వీలునామాను ఎప్పుడైనా సమీక్షించొచ్చు. సులభంగా తిరగరాయొచ్చు. కానీ, అస్పష్టతకు తా విస్తే భవిష్యత్తులో కోర్టు వివాదాల చిక్కు ఇందులో ఎక్కువ. వీలునామా ద్వారా ప్రైవేటు ట్రస్ట్ను సైతం ఏర్పాటు చేసి, మరణానంతరం అమల్లోకి వచ్చేలా నిర్ణయించొచ్చు. గిఫ్ట్ డీడ్ బహుమతి కింద ఒక వ్యక్తి తన స్థిర, చరాస్తులను స్వచ్ఛందంగా బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ అనుకూలిస్తుంది. జీవించి ఉండగా బదిలీ చేస్తున్నారు కనుక, తమ తదనంతరం న్యాయపరమైన, వారసత్వ వివాదాలకు అవకాశాలు చాలా తక్కువ. స్వీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే గిఫ్ట్ డీడ్ అనంతరం ఆ ఆస్తులపై బదిలీ చేసిన వారు హక్కును కోల్పోవడం ఇందులో ఉన్న ప్రతికూలత. ఫ్యామిలీ/ప్రైవేటు ట్రస్ట్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, 1882 కింద ఫ్యామిలీ లేదా ప్రైవేటు ట్రస్ట్ను ఏర్పాటు చేసి వాటికి ఆస్తులను బదిలీ చేయడం ఒక పరిష్కారం. ఇదొక చట్టబద్దమైన సంస్థ. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎవరికి ఏ మేరకు ఆస్తుల ప్రయోజనాలు అందించాలో ఇందులో పేర్కొనొచ్చు. ట్రస్టీల బాధ్యతలు, లబ్ధి్దదారులు, అస్తుల నిర్వహణ గురించి స్పష్టంగా ట్రస్ట్ డీడ్లో పొందుపరచాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, వారసులు, ఇతరులు చట్టపరంగా సవాలు చేయడాన్ని నిరోధిస్తుంది. లబ్ధిదారులకు రుణ దాతల నుంచి రక్షణనిస్తుంది.ఇందులో ఉన్న ప్రతికూలత ఆస్తులను ట్రస్ట్కు బదిలీ చేసిన తర్వాత వాటిపై స్వీయ నియంత్రణ కోల్పోతారు. హక్కులన్నీ ట్రస్టీ చేతుల్లోకి వెళతాయి. కాకపోతే ఆ ఆస్తుల హక్కుదారులను నిర్ణయించే అధికారం ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటుకు ఎంతో సమయం తీసుకుంటుంది. నిర్వహణ కూడా సంక్లిష్టమైనది. కొన్ని ఆస్తులు కాకుండా పెద్ద మొత్తంలో ఆస్తులున్న వారికి ఇది అనుకూలిస్తుంది. ట్రస్ట్ తరఫున ప్రత్యేక రికార్డుల నిర్వహణ, రిటర్నుల దాఖలు తప్పనిసరి. దీని సవరణ, రద్దు అన్నది ఎంతో కష్టమైనది. సెటిల్మెంట్ డీడ్ ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అంగీకార పత్రం ఇది. కనుక న్యాయవివాదాలకు ఆస్కారం తక్కువ. దీన్ని రిజిస్టర్ చేసుకోకపోయినా కోర్టుల ముందు ఆధారంగా నిలుస్తుంది. రిజిస్టర్ చేసుకుంటే మంచిది. నిపుణుల సహకారంతో శ్రద్ధగా డ్రాఫ్టింగ్ చేసుకోవడం ద్వారా న్యాయవివాదాలను నివారించొచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే తిరిగి కోర్టు అనుమతి లేకుండా రద్దు చేసుకోవడం కుదరదు. దీన్ని కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చు. ఉమ్మడి యజమాని మరొకరితో ఉమ్మడిగా ఆస్తులను కలిగి, సరై్వవర్షిప్ హక్కుతో ఉంటే.. అప్పుడు ఒకరి మరణానంతరం మరొకరికి ఆస్తులు బదిలీ అయిపోతాయి. నామినేషన్, బెనిఫీషియరీ (లబ్దిదారు) నమోదు చేస్తే, మరణానంతరం ఆస్తులను వారు క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించినట్టు అవుతుంది. ఈ విధానంలో వివాదాలకు అవకాశాలు ఎక్కువ.నామినేషన్ ఉంటే ఆస్తులపై హక్కులు వారసులకు ఆలస్యంగా బదిలీ అవుతాయని గుర్తుంచుకోవాలి. బెనిఫీషియరీ నమోదు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే సరైన లబ్ధిదారులకు ఆస్తుల బదిలీ జరగకపోవచ్చు. ఆస్తుల బదిలీ ఏ రూపంలో చేస్తున్నా.. దీనికంటే ముందు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవడం ద్వారా సాధ్యమైన మేర వివాదాలు తలెత్తకుండా నివారించొచ్చు. ప్రాపర్టీ పంపకం సంక్లిష్టం చేయొద్దు..ఒక్కరే వారసులు ఉన్న సందర్భాల్లో ఆస్తుల బదిలీకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవు. ఒకరికి మించి వారసుల మధ్య ఆస్తుల బదిలీయే సంక్లిష్టం అవుతుంది. ఒక ఇల్లు ఉంటే సమానంగా పంచుకోండంటూ చెప్పడం సులభమే. కానీ, ఈ విషయంలో వారసుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే వివాదాలతో విలువైన సమయం హరించుకుపోతుంది. రెండు ఇళ్లు ఉంటే ఇద్దరు వారసులకు చెరొకటి పంచడం కూడా అంత సులభమేమీ కాదు. రెండూ ఒకే ప్రాంతంలో, ఒక్కటే విస్తీర్ణంతో ఉంటే ఫర్వాలేదు. వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు వాటి విలువ ఒకే రకంగా ఉండదు.ఇద్దరు వారసులూ ఒకే ప్రాపర్టీ కోరుకోవచ్చు. వారసుల్లో ఒకరు విదేశాల్లో ఉండి, ఒకరు ఇక్కడే స్థిరపడొచ్చు. విదేశాల్లో స్థిరపడిన వారు భారత్లో ఆస్తుల పట్ల ఆసక్తి చూపించరని, వాటి నిర్వహణ, పన్నుల చెల్లింపు వారికి భారంగా మారొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. కనుక విదేశాల్లో స్థిరపడిన వారికి భౌతిక ఆస్తుల కంటే ఆరి్థక ఆస్తుల రూపంలో పంపకం మెరుగైన మార్గం అవుతుంది. ఒక్కటే ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి, మరే ఆస్తుల్లేని వారు.. తమ తదనంతరం ఆ ఇంటిని విక్రయించి, వ చ్చిన మొత్తాన్ని వారసులకు సమానంగా బదిలీ చేయాలంటూ వీలునామా రాసుకోవడం మంచి ఆలోచన అని నిపుణుల సూచన. అంతేకానీ, ఒకే ప్రాపర్టీకి సమాన హక్కులు చెందేలా రాసినట్టయితే ఏకాభిప్రాయం కుదరని సందర్భాల్లో వివాదాలకు తావిచ్చినట్టు అవుతుంది. అన్నీ ఆలోచించాకే అడుగు..⇒ ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా? అన్నది పూర్తిగా వ్యక్తిగత ఎంపికే. వారసుల కంటే ముందు తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆరి్థక వనరులు/ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ తమ అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు. ⇒ కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి. ⇒ పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచి్ఛన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు. ⇒ ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇ చ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది. ⇒ ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి. ⇒ ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి. ⇒ ఆస్తుల పంపకం అసంబద్ధంగా ఉంటే అది న్యాయ వివాదాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్ల విలువైన కాలంతోపాటు న్యాయపోరాటానికి ఎంతో వ్యయం చేయాల్సి వస్తుంది. ఆస్తుల బదిలీలో సాధ్యమైన మేర పారదర్శకతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ పిల్లలు ఇతర పట్టణాలు, విదేశాల్లో స్థిరపడినప్పుడు వారసత్వ ఆస్తుల పరిష్కారానికి తరచూ రావాల్సి వస్తే అది కష్టంగా మారుతుంది. ⇒ సక్సెషన్ సర్టిఫికెట్, చట్టబద్ధమైన వారసులేనన్న ధ్రువీకరణ, లెటర్ ఆప్ అడ్మిని్రస్టేషన్ పొందాలంటే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలి. వీటికి కూడా ఎన్నో సార్లు తిరగాల్సి వస్తుంది. ⇒ తల్లిదండ్రుల పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఇతర పెట్టుబడులు పిల్లలకు తెలియకపోవచ్చు. వీటి వివరాలను పిల్లలతో పంచుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. ⇒ ఆస్తుల బదిలీ విషయంలో కొంత ఫీజు చెల్లించి నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడొద్దు. -
హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
నివాస విభాగాన్ని కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్ కంటే ముందు వరకూ అపార్ట్మెంట్ విస్తీర్ణంలో కార్పెట్ ఏరియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అంటే ఫ్లాట్ ఏరియాలో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం ఎంత ఉందని చూసుకునేవారు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ఫ్లాట్లో నివాసితుడు వినియోగించే స్థలం కంటే క్లబ్హౌస్, పార్క్, గార్డెన్, లాబీ వంటి వసతులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారనే దానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టయిల్ను కోరుకునే యువ జనరేషన్ పెరుగుతుండటంతో అపార్ట్మెంట్లో కార్పెట్ ఏరియా క్రమంగా తగ్గుతోందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఅపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఫ్లాట్ల స్థలంతో పాటు లిఫ్ట్, మెట్లు, క్లబ్హౌస్, పార్క్ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కలిపితే దాన్ని సూపర్ బిల్టప్ ఏరియాగా పేర్కొంటారు. ఇక, ఫ్లాట్లో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం(గోడ నుంచి గోడ వరకూ ఉండే స్పేస్)ను కార్పెట్ ఏరియాగా పేర్కొంటారు. కరోనా మహమ్మారి కంటే ముందు వరకూ గృహ కొనుగోలుదారులు కార్పెట్ ఏరియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కోవిడ్ తర్వాత నుంచి కార్పెట్ కంటే అపార్ట్మెంట్లోని వసతులకు(లోడింగ్) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1) నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ లోడింగ్ 40 శాతానికి చేరుకుంది. 2019లో ఇది 31 శాతంగా ఉంది. నివాస సముదాయాలలో అధునిక వసతులు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్ల లోడింగ్(వసతులు)పెరుగుతోంది. విలాసవంతమైన జీవనశైలి కారణంగా గృహ కొనుగోలుదారులు అధిక వసతులు, సౌకర్యాలను కోరుతున్నారు.వసతులకు ప్రాధాన్యం దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అపార్ట్మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలం కాగా మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతం. లిఫ్ట్, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్, వసతులు, ట్రెరస్ వంటి కామన్ ఏరియాలు. కరోనా కంటే ముందు వరకూ 30 శాతం కంటే తక్కువ లోడింగ్ సాధారణంగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి విలాసవంతమైన జీవనశైలి అలవాటైపోయింది. ప్రాజెక్ట్ చిన్నదైనా, పెద్దదైనా ఆధునిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లలో నివాసయోగ్యమైన స్థలం కార్పెట్ ఏరియా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు ప్రాథమిక జీవనశైలి సౌకర్యాలతో సంతృప్తి చెందడం లేదు. ఫిట్నెస్ కేంద్రాలు, క్లబ్ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్ లాబీలు ఉండాలని కోరుకుంటున్నారు.రీసేల్ విలువ పెరుగుదల.. లోడింగ్ పెరిగితే కమ్యూనిటీ నివాస యోగ్యత, రీసేల్ విలువలను కూడా పెరుగుతుంది. అయితే గృహ కొనుగోలుదారులు తమ అపార్ట్మెంట్లలో వాస్తవంగా ఉపయోగించే స్థలాన్ని కోల్పోతారు. ప్రతి ప్రాజెక్ట్లో అపార్ట్మెంట్లోని మొత్తం స్థలంలో గృహ కొనుగోలుదారులు వాస్తవంగా ఉపయోగించే స్థలం, సౌకర్యాల కోసం కస్టమర్లు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొనేలా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) నిబంధనలు రూపొందించాలి. దీంతో కస్టమర్లు చెల్లించే సొమ్ములో దేనికెంత వ్యయం అవుతుందో స్పష్టత ఉంటుంది.లోడింగ్ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే.. సూపర్ బిల్టప్ ఏరియా నుంచి కార్పెట్ ఏరియాను తీసి వేసి, కార్పెట్ ఏరియాతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని వందతో గుణిస్తే వచ్చేదే లోడింగ్ శాతం. ఉదాహరణకు.. హైదరాబాద్లో మీరు 1,500 చ.అ. అపార్ట్మెంట్ కొంటున్నారని అనుకుందాం. ఇందులో ఫ్లాట్లో కస్టమర్ వినియోగించే స్థలం 750 చ.అ.లే ఉంటుంది. మిగిలిన స్థలం లిఫ్టు, లాబీ, మెట్లు, క్లబ్ హౌస్ వంటి కామన్ ఏరియాలు ఉంటాయి. అంటే ఫ్లాట్ ఖరీదులో కస్టమర్ వాస్తవంగా వినియోగించే కార్పెట్ ఏరియాతో పాటు కామన్ ఏరియా కూడా కలిపే ఉంటుందన్నమాట. నగరంలో లోడింగ్ 38 శాతం..హైదరాబాద్లో లోడింగ్(వసతులు) శాతం 2019లో 30 శాతంగా ఉండగా.. 2022 నాటికి 33కు, ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 38 శాతానికి పెరిగింది. 2025 క్యూ1 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అత్యధికంగా 43 శాతం లోడింగ్తో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లోనూ ఈ ఆర్థిక నగరంలో అత్యధిక లోడింగ్ 33 శాతంతో టాప్లో నిలిచింది. అత్యల్పంగా 36 శాతం లోడింగ్తో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 2019లో ఇక్కడ లోడింగ్ 30 శాతంగా ఉంది. ఏటేటా బెంగళూరులో అపార్ట్మెంట్ లోడింగ్ క్రమంగా పెరుగుతోంది. 2019లో ఇక్కడ 30 శాతం లోడింగ్ ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 41 శాతానికి పెరిగింది. 2022లో ఇది 35 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో బెంగళూరులో సగటు లోడింగ్ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. ఎన్సీఆర్ లో 2019లో లోడింగ్ శాతం 31 శాతం నుంచి 2025 క్యూ1 నాటికి 41 శాతానికి చేరింది. పుణేలో 32 శాతం నుంచి 40కు, కోల్కతాలో 30 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు
కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ ఫ్యాక్టరీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళిక వేసింది. వచ్చే జూలై మధ్యలో తొలగింపుల ప్రక్రియ ప్రారంభమై నెలాకరు కల్లా పూర్తికానుంది. కొత్త సీఈవో లిప్ బు టాన్ వచ్చాక ఇది తొలి, భారీ ఉద్యోగాల కోత కానుంది.ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ఇంటెల్ నేరుగా ప్రకటించనప్పటికీ ఈమేరకు కంపెనీ ఉద్యోగులకు ఇంటర్నల్ మెమోల ద్వారా తెలియజేసినట్లు పలు అంతర్జాతీయ వార్త పత్రికల్లో కథనాలు వచ్చాయి. కంపెనీ తన అంతర్గత తయారీ విభాగమైన ఇంటెల్ ఫౌండ్రీలో కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకుని, మరింత చురుకైన సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఉద్యోగ కోతలు చేపడుతోందని పేర్కొన్నాయి.కంపెనీ చేపడుతున్న ప్రస్తుత తొలగింపుల్లో ఎంత మందిపై ప్రభావం పడుతుందనే విషయం వెల్లడికాలేదు. సీనియర్ నాయకత్వం నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే వరకు, తొలగింపులను అమలు చేయడంలో వ్యాపార యూనిట్లకు విచక్షణ ఉంటుందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమ్మకాలు క్షీణించడం, మరోవైపు ఎన్విడియా, ఏఎండీ వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ముఖ్యంగా ఏఐ ఫోకస్డ్ హార్డ్ వేర్ లో ఉద్యోగ పునర్నిర్మాణంపై ఇంటెల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. -
ఇలా చేస్తే.. ఇంటి పైకప్పు అదుర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. దీంతో పాటు సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది.మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి.తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడక గది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది.గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైంది కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని వేసుకోవచ్చు. దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు.జాగ్రత్తలివే..ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి.ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 10–12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి.ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది.ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
పాన్ కార్డు అలాగే వాడుతున్నారా? కట్టండి రూ.10వేలు!!
పాన్ కార్డు, ఆధార్ లేకుండా నేటి కాలంలో ఆర్థికపరమైన ఏ పనినీ పూర్తి చేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పటికీ చాలా మంది తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అలాంటి వారి పాన్ కార్డులు ఇనాక్టియావ్గా మారాయి. అయినప్పటికీ కొందరు ఆర్థిక లావాదేవీల్లో ఇనాక్టివ్ పాన్ కార్డులను అలాగే ఉపయోగిస్తున్నారు.ఇలాంటి వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఒక్కో లావాదేవీపై రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎవరైనా ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలలో ఇనాక్టివ్ పాన్ ఉపయోగిస్తే ప్రతి సందర్భంలో ప్రత్యేక జరిమానా విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. బ్యాంకు ఖాతా తెరవడం లేదా నిర్వహించడం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేయడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.👉 ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్రెండు పాన్ కార్డులున్నా తప్పే..ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారు రెండింటిలో ఒక పాన్ కార్డును సరెండర్ చేయాలి. అలా చేయకుండా పట్టుబడితే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొంతమందికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చు. ఉదాహరణకు పాన్ కార్డు వివరాల్లో తప్పులున్నప్పుడు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్పు కోసం కొత్త పాన్ కార్డు తీసుకొని ఉండవచ్చు. ఇలా రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేస్తారు. అదే ఉద్దేశపూర్వకంగా రెండు పాన్కార్డులు పెట్టుకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు. కాబట్టి ఎవరి దగ్గరైనా రెండు పాన్ కార్డులు ఉంటే వెంటనే సరెండర్ చేయడం మంచిది. -
ఆఫీస్ స్థలాలకు డిమాండ్.. అమెరికన్ కంపెనీల హవా..
దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సర్వీసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూప్నకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు చెందిన ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హర్షమ్ ట్రేడర్స్ అండ్ ప్రజీమ్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్లో ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా ప్రేమ్జీ ఇన్వెస్ట్ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్ ట్రేడర్స్ వీటిని విక్రయించడం గమనార్హం! -
తక్కువ ధర.. నాణ్యమైన ఇల్లే కావాలి..
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం. అందుబాటు ధర.. నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు.. నగరంలో ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయని సర్వే చెబుతోంది. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం ఉన్న ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టాయి. నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి.ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ వంటి ప్రాంతాల్లో రూ.40 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడు మంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ సిటీ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టి సారిస్తున్నారు. -
స్పైస్జెట్ లాభాలు మూడింతలు
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో రూ.325 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం (2023–24) క్యూ4లో ప్రకటించిన రూ.119 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. నిర్వహణ ఆదాయం మాత్రం రూ.1,719 నుంచి రూ.1,446 కోట్లకు తగ్గింది. ‘‘మార్చి క్వార్టర్లో రికార్డు స్థాయి నికర లాభాన్ని ఆర్జించగలిగాము. ప్రమోటర్ గ్రూప్ క్యూ4లో రూ.294 కోట్లు సహా మొత్తం రూ.500 కోట్లు మూలధనాన్ని సమకూర్చింది. ఇది కంపెనీ దీర్ఘకాలిక దృష్టి, సామర్థ్యంపై నమ్మకాన్ని సూచిస్తుంది’’ అని స్పైస్జెట్ తెలిపింది. కంపెనీ పూర్తి ఆర్థిక సంవత్సరానికిగానూ గత ఏడేళ్లలో తొలిసారి రూ.59 కోట్ల లాభాన్ని ప్రటించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.409 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. తాజాగా నిర్వహణ ఆదాయం 25% క్షీణించి రూ.7,050 కోట్ల నుంచి రూ.5,284 కోట్లకు దిగివచి్చంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై స్పైస్జెట్ చైర్మన్ అజయ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వైమానిక పరిశ్రమ వారికి బాసటగా ఉంటుందన్నారు. -
సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు. -
లగ్జరీ కారు .. స్పెషల్ గేరు..
లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్ ఎడిషన్ల బాట పట్టాయి. హెచ్ఎన్ఐల జోరు .. భారత్లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్లో స్పెషల్ ఎడిషన్లు, హైపర్ కస్టమైజ్డ్ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్ ఎండ్ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్లో భాగమైన జేఎల్ఆర్ కొత్తగా డిఫెండర్ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్ డిఫెండర్కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్ మోడల్తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్క్లూజివ్ పెయింట్ షేడ్స్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్–బెంజ్ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్ పెడుతోంది. తమ టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్–పర్సనలైజేషన్ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్ ఎడిషన్లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్ను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. కలెక్టర్స్ ఎడిషన్ను బెంగళూరులోని మెర్సిడెస్–బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది. మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్ రోవర్ రణ్థంబోర్ ప్రత్యేక ఎడిషన్ రేటు రెగ్యులర్ వెర్షన్తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.ఉభయతారకంగా .. వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్తో ఈ మోడల్స్ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్ఆర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్ ఎడిషన్లు, స్పెషల్ ఎడిషన్ మోడల్స్ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. సదరు మోడల్ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ ఆదాయాలపరంగా బాగుంటోంది.కొన్ని కార్లు.. → డిఫెండర్ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు → రేంజ్రోవర్ రణ్థంబోర్ రేటు రూ. 4.98 కోట్లు → మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ ధర రూ. 4.2 కోట్లు → ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ రూ. 4.3 కోట్లు -
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని, ప్రస్తుత రెపో లింక్డ్ రుణాలు, కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.వారం రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటులో సగం శాతం తగ్గింపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపు తర్వాత ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది.రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే రెపో రేటుతో లింక్ అయిన లేదా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రుణాలుగా పిలిచే, ఫ్లోటింగ్ రేట్లలో ఉన్న రుణాలకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన వెంటనే కాకపోయినా, వచ్చే నెల మొదటి రోజు నాటికి రెపో తగ్గింపును ప్రస్తుత రుణగ్రహీతలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. -
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
న్యూఢిల్లీ: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ రేజాన్ సోలార్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది. రూ. 1,500 కోట్ల సమీకరణకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ ఇప్పటికే పలు దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కార్యకలాపాల విస్తరణకు కంపెనీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. 2017లో ఏర్పాటైన రేజాన్ సోలార్ దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. సంస్థవెబ్సైట్ ప్రకారం గుజరాత్లోని కారంజ్, సావా ప్లాంట్లలో 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. కంపెనీ ఇటీవల మార్చిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 138 కోట్లు సమీకరించింది. -
ఆధార్ అప్డేట్కు కొత్త డెడ్లైన్
ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాల అప్డేట్కు గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరోసారి పొడిగించింది. ఆధార్లో డాక్యుమెంట్లను ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు గడువు జూన్ 14న ముగియాల్సి ఉండగా యూఐడీఏఐ ఈ సదుపాయాన్ని మరో ఏడాది పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించింది. ఈ మేరకు ‘ఎక్స్’(ట్విటర్) ద్వారా యూఐడీఏఐ వెల్లడించింది.ఆధార్ను ఎవరు అప్డేట్ చేసుకోవాలంటే..ఆధార్ అప్డేట్కు గడువు పొడిగింపుతో కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు ఉపశమనం కలగనుంది. ఈ ఉచిత సేవ మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ చేయించుకుని ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు ఆధార్ అప్డేట్ చేయాలని యూఐడీఏఐ కోరింది. వివాహం, బదిలీ లేదా ఇతర కారణాల వల్ల పేరు, చిరునామా లేదా మరేదైనా సమాచారం మారితే అప్డేట్ చేసుకునేందుకు ఈ సదుపాయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో ఈ ఆన్లైన్ సర్వీసుకు రూ.50 ఫీజు వసూలు చేసేవారు. డిజిటల్ మార్గాల ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ప్రోత్సహించడానికి యూఐడీఏఐ ఈ ఛార్జీని తొలగించింది. అయితే ఫిజికల్ ఆధార్ అప్డేట్ సెంటర్లలో చేసే అప్డేట్కు మాత్రం ఇంకా రుసుం వసూలు చేస్తున్నారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..🔹యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ( https://myaadhaar.uidai.gov.in ) సందర్శించండి.🔹ఆధార్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వండి.🔹సమాచారాన్ని సరిచూసుకుని 'ఐ వెరిఫై...'పై క్లిక్ చేయండి.🔹ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (PoI) ఎంచుకుని 2MB కంటే తక్కువ పరిమాణంలో (JPEG/PNG/PDF) డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయండి.🔹డాక్యుమెంట్ ఆఫ్ అడ్రస్ (PoA) సెలెక్ట్ చేసి డాక్యుమెంట్ కాపీని అప్లోడ్ చేయాలి.🔹అగ్రీ అండ్ సబ్మిట్పై క్లిక్ చేయండి.🔹రసీదును డౌన్ లోడ్ చేసుకోండి. -
ఇల్లు కొనడానికి ఇదే సరైన కాలం..
వర్షంలో బయటకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో కారణాలెన్నో! కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షణ్ణంగా తెలుస్తుంది కాబట్టి.. సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే సౌకర్యం లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతానికి సంబందించి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలంలోనే.. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారుల మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశం అయ్యాక కామన్గా ఏర్పాటు చేసిన వసతుల్లో లీకేజ్లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా కాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్రూమ్, సీలింగ్, పంబ్లింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్ను కోరే వీలుంటుంది.👉 ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధ్రుడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా? అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్ మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
పిజ్జా కంపెనీలో రూ. 1801 కోట్ల షేర్లు అమ్మేసిన ప్రమోటర్లు
జూబిలెంట్ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ (జేఎఫ్ఎల్), జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశారు.ఎన్ఎస్ఈలోని బ్లాక్ డీల్స్ డేటా ప్రకారం జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రమోటర్ అయిన జూబిలెంట్ కన్జూమర్ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్ ఇన్గ్రేవియా ప్రమోటింగ్ సంస్థలు (జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్ సుందర్ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.అలాగే జూబిలెంట్ ఫార్మోవా ప్రమోటర్ సంస్థలు జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది. -
సన్ ఫార్మాకు కొత్త ఎండీ.. టాప్ మేనేజ్మెంట్లో మార్పులు
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా కీర్తి గనోర్కర్ కంపెనీ ఎండీగా పదోన్నతి పొందారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సంఘ్వీ కొనసాగుతారు.నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈవో అభయ్ గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ చేరతారని కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. 2019 జూన్ నుంచి సన్ ఫార్మా భారత విభాగానికి గనోర్కర్ నేతృత్వం వహిస్తున్నారు.ఆయన సారథ్యంలో వ్యాపారం, మార్కెట్ వాటా నిలకడగా పెరిగిందని సంస్థ వివరించింది. స్పెషాలిటీ విభాగాలు, జపాన్.. యూరప్ మార్కెట్లలోకి కూడా సన్ ఫార్మా విస్తరించడంలో గనోర్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. -
మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్ శిక్షణ.. నెక్స్ట్ వేవ్ & ఎన్ఎస్డిసి కృషితో కొత్త అధ్యాయం
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వేవ్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంట్రప్రైన్యూర్షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.నెక్స్ట్ వేవ్ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్ వేవ్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.NxtWave Institute of Advanced Technologiesకపిల్ కావురి హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ, 500032 -
ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్కో.. ప్లాట్కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది. -
ఇండియాలో స్టార్లింక్ సేవలకు డేట్ఫిక్స్?
ఎలాన్మస్క్కు చెందిన స్టార్లింక్ మరో రెండు నెలల్లో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ల మాదిరిగా కాకుండా స్టార్లింక్లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. విప్రో క్యాంపస్లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వివరాలు షేర్ చేశారు.ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Antara Mandal (@_antara.mandal)ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచనఅయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు. -
డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచన
‘స్మార్ట్’ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.స్మార్ట్ లక్ష్యాలుSMARTSpecificMeasurableAchievableRealisticTime-boundనిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది. -
పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.93,200 (22 క్యారెట్స్), రూ.1,01,680 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.250, రూ.280 పెరిగింది.చెన్నైలో శుక్రవారంతో పోలిస్తే శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.280 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.93,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,680 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 పెరిగి రూ.93,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.280 పెరిగి రూ.1,01,830 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.1,20,000గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సోనీ కెమెరాతో వివో కొత్తఫోన్.. రూ.3000 డిస్కౌంట్
వివో సంస్థ టీ4 అల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇందులో సోనీ ఐఎంఎక్స్ 921 50 మెగాపిక్సల్స్ రియర్ కెమెరా సెన్సార్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 100 ఎక్స్ హైపర్జూమ్ ఫీచర్ కూడా ఉంది. ఫోనిక్స్ గోల్డ్, మెటీరియర్ గ్రే రంగుల్లో ఇది లభించనుందని వివో పేర్కొంది.మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్తో ఉండే ఈ ఫోన్ 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.37,999.12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.39,999.12జీబీ, 512జీ వేరియంట్ ధర రూ.41,999గా కంపెనీ ప్రకటించింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలాఫ్లిప్కార్ట్తోపాటు వివో ఇండియా ఈ స్టోర్లో ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ఫ్లాట్ రూ.3,000 డిస్కౌంట్ను ప్రకటించింది. రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్తోపాటు, 9 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయలను కూడా ఆఫర్ చేస్తోంది. -
ఎస్బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం
భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకున్నట్టు ప్రకటించింది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో పరిశ్రమలోనే ఇదొక పెద్ద నియామకంగా పేర్కొంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాలు, అగ్రి బిజినెస్, వెల్త్ మేనేజ్మెంట్, ట్రెజరీ కార్యకలపాలు, నియంత్రణలు, నిబంధనల అమలు తదితర విభాగాల్లో వీరు సేవలు అందించనున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: మోతీలాల్ ఓస్వాల్పై సెబీ జరిమానాబ్యాంకులో అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు ఎదిగే అవకాశాలను ఎస్బీఐ వీరికి అందిస్తుందని తెలిపింది. 13,455 జూనియర్ అసోసియేట్లను సైతం నియమించుకున్నట్టు ఎస్బీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మంది నియామకం చేపట్టినట్టు.. ఇందులో 13,500 మంది వరకు క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి సైతం తెలిపారు. -
మోతీలాల్ ఓస్వాల్పై సెబీ జరిమానా
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రూ.3 లక్షల జరిమానా విధించింది. స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా13 ఎన్ఎస్ఈ ట్రేడింగ్ టెర్మినళ్లు అదీకృత ప్రదేశాల్లో లేనట్లు ఈ సందర్భంగా గుర్తించింది. 13 టెర్మినళ్లకుగాను 5 టెర్మినళ్ల నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. 9 బీఎస్ఈ టెర్మినళ్లు సంబంధిత ప్రాంతాల్లో లేవని తెలియజేసింది. లావాదేవీలు 1 టెర్మినల్ నుంచే జరిగినట్లు వెల్లడించింది. నాలుగు ఎన్ఎస్ఈ, 4 బీఎస్ఈ టెర్మినళ్లలో అనుమతించిన వ్యక్తులుకాకుండా ఇతరులు నిర్వహిస్తున్నట్లు సెబీ దర్యాప్తులో గుర్తించింది. -
ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబులు.. ప్రపంచ మార్కెట్లు కుదేలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడితో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ శుక్రవారం 573 పాయింట్లు పతనమై 81,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 24,719 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లోనే 1,337 పాయింట్లు క్షీణించి 80,355 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు కుప్పకూలి 24,473 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. అయితే దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. ఆసియా యూరప్ దేశాల స్టాక్ సూచీలు 1%–1.5% నష్టపోయాయి. అమెరికా మార్కెట్లు 1.5% నష్టాలతో ట్రేడవుతున్నాయి.ఫార్మా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2.06%, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ, మెటల్, విద్యుత్ 1.01 శాతం పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం నష్టపోయాయి.భారత్కు ఎక్కువగా దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ ధరల అనూహ్య ర్యాలీతో దేశీయంగా చమురు ఆధారిత రంగాలైన ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్, పెయింట్స్, అడెటివ్స్, టైర్స్ కంపెనీల షేర్లు డీలా పడ్డాయి. బీపీసీఎల్ 2%, ఐఓసీ 1.78%, హెచ్పీసీఎల్ 1.41% షేర్లు నష్టపోయాయి. ఇండిగో ఎయిర్లైన్స్ 4%, స్పైస్జెట్ 2% పతనమయ్యాయి. ట్రేడింగ్లో 6% కుప్పకూలాయి. ఇండిగో పెయింట్స్ 3%, బెర్జర్ పెయింట్స్ 0.59%, ఏషియన్ పెయింట్స్ 0.14% నష్టపోయాయి. సియట్ 1.35%, అపోలో టైర్స్ 1.13 శాతం పతనమయ్యాయి.ఆటోమోటివ్ టెక్నాలజీ సంస్థ సోనా కమ్స్టర్ కంపెనీ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ జే కపూర్(53) అకాల మరణంతో కంపెనీ షేరు షేరు 2% నష్టపోయి రూ.502 వద్ద స్థిరపడింది. లండన్లో జూన్ 12న సంజయ్ గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలారూ.8.35 లక్షల కోట్లు ఆవిరి...స్టాక్ మార్కెట్ వరుస పతనంతో రెండురోజుల్లో రూ.8.35 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం విలువ రూ.447 లక్షల కోట్లు (5.19 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. గడిచిన 2 రోజుల్లో సెన్సెక్స్ 1,396 పాయింట్లు నష్టపోయింది. -
చమురు సలసల.. రూపాయి విలవిల
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర నిన్నటి మార్కెట్లో ఒక దశలో 13 శాతం పెరిగి 78 డాలర్లకు చేరింది. 2022 మార్చి తర్వాత ఒకే రోజు చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. నాడు ఉక్రెయిన్పై రష్యా దాడులు చమురు ధరలకు ఆజ్యం పోశాయి.తాజాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ చేసిన ప్రకటన ఆందోళనలను మరింత పెంచింది. ఆ తర్వాత కొంత తగ్గి 74.32 డాలర్ల స్థాయికి బ్రెంట్ క్రూడ్ ధరలు దిగొచ్చాయి. బెంచ్మార్క్ యూఎస్ క్రూడ్ సైతం 7%కి పైగా పెరిగి 73 డాలర్లకు చేరింది. ధరలు మరింత పెరగొచ్చు.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు విస్తృతమైతే ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. మోర్గాన్ స్టాన్లీ అయితే 130 డాలర్ల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. చమురు ఉత్పత్తిలో ఇరాన్ ప్రపంచంలో 9వ స్థానంలో ఉంటే, మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండడం గమనార్హం. ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’పెరిగిన క్రూడ్ ధరలతో కరిగిన రూపాయి క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 59 పైసలు బలహీనపడి 86.11 వద్ద స్థిరపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడితో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం కూడా మన కరెన్సీ ఒత్తిడికి లోనైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో గురువారం ముగింపు(85.52)తో పోలిస్తే ఏకంగా 73 పైసల బలహీనతతో 86.25 వద్ద మొదలైంది. దేశీయ మే ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్టానికి దిగిరావడం.., ఆర్బీఐ జోక్యంతో రూపాయి కాస్త రికవరీ అయ్యింది. -
మళ్లీ కొలువుల కళకళ!
ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్లు) జాబ్సైట్ ఇండీడ్ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. భారత్లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది. ఈ విభాగాల్లో అధిక నియామకాలు.. చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 3.6 శాతం, సైంటిఫిక్ రీసెర్చ్లో 3.1 శాతం మేర జెనరేటివ్ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి. -
ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు. సీఎఫ్వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు. -
జేఏఎల్ దివాలా పరిష్కార ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్ తెలిపింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో 2024 జూన్ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది. -
ఏఐ చిప్ మార్కెట్ జోరు..
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) కృత్రిమ మేథ (ఏఐ) ప్రాసెసర్ మార్కెట్ 500 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) సీఈవో ’లీసా సూ’ తెలిపారు. 2023లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం ఏటా 60 శాతం మేర వృద్ధి చెందుతోందని వివరించారు. అడ్వాన్సింగ్ ఏఐ 2025 కాన్ఫరెన్స్లో ’ఎంఐ350 సిరీస్’ జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు), ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా లీసా ఈ విషయాలు వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన చిప్లు నలభై శాతం అధిక సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొన్నారు. డెవలపర్ కమ్యూనిటీ కొత్త ఉత్పత్తులను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు డెవలపర్ క్లౌడ్ యాక్సెస్ ప్రోగ్రాంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ’హీలియోస్ ఏఐ ర్యాక్ స్కేల్’ సొల్యూషన్ని కూడా ఏఎండీ ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏఐని వినియోగించే 10 అతి పెద్ద కంపెనీల్లో ఏడు సంస్థలు తమ ఏఎండీ ఇన్స్టింక్ట్ యాక్సిలరేటర్లను ఉపయోగిస్తున్నాయని, ఈ లిస్టులో భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కూడా ఉందని లీసా చెప్పారు. కాన్ఫరెన్స్ సందర్భంగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్తో పాటు మెటా, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ తదితర దిగ్గజాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. -
ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగం @ రూ. 3,600 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్ వ్యూహాల్లో ఇన్ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది. దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు.. నివేదిక ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్ నియంత్రణ, బ్రాండ్ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్లాంటి విభాగాల్లో డిమాండ్ ఉంటోంది. సవాళ్లు ఉన్నాయి... → సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్మెంట్ రేట్ (39 శాతం), కంటెంట్ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు. → వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు. → ఇన్ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్ఎస్ఐలో ఇది 77 శాతంగా ఎఫ్ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది. → నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్పై ఫోకస్ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది. -
బంగారం భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు. -
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
తక్కువ బడ్డెట్లో స్మార్ట్ఫోన్లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్సెట్, ఎల్పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా స్టోర్మ్ ప్లే 5జీ ధరఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఫీచర్లు..స్పెసిఫికేషన్లులావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. -
నేహా చెప్తే వింటారు! మనీ డీలింగ్.. మాస్ ఫాలోయింగ్
నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్స్టాగ్రామ్లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.దేశ పర్సనల్ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?వివిధ ప్లాట్ఫామ్లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్ కంటెంట్ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్బీసీ, ఎన్డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు. -
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్పీ పవర్ని, 134 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. -
ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు.. ఇదిగో కొత్త డేటా
ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతోద్యోగులు రూ.కోట్లలో సైతం పరిహారాలు అందుకుంటారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో రూ.కోట్లు సంపాదిస్తున్నవారి సంఖ్య ఈసారి పెరిగింది. అంతక్రితం ఏడాది క్షీణత తరువాత, వార్షికంగా రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.స్టాక్ ఇన్సెంటివ్స్ పర్క్విసైట్ విలువలో మార్పులు, అధిక వేరియబుల్ పే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అదీకాకుండా 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్లో ఏడాది మధ్యలో చేరారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. వీరు ఒక్కొక్కరు సగటున నెలకు రూ .8.5 లక్షలకు పైగా జీతం పొందుతున్నారు. కంపెనీలో రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పూర్తీగా రివర్స్ అయింది. అప్పుడు వీరి సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం తగ్గింది.చారిత్రాత్మకంగా 2023 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 124 మంది ఉద్యోగులను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరం గత ఆరేళ్లలో అత్యల్పంగా 74 మందిని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.203 కోట్లుగా ఉంది. సీఎఫ్వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్ల పరిహారంతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.👉 ఇదీ చదవండి: అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అధిక సంపాదనలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరానికి ముందు నుండి ఇన్ఫోసిస్లో ఉన్నారు. కొందరు 1990 నాటివారూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఇన్ఫోసిస్ మొత్తం వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో 4% పెరిగి రూ .85,950 కోట్లకు చేరుకుంది. ఇది దాని మొత్తం ఆదాయం రూ .1.63 లక్షల కోట్లలో 53 శాతం. 2025 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.24 లక్షలుగా ఉంది. -
స్టాక్ మార్కెట్లు.. వరుస నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు పతనమయ్యాయి.ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.జియో రూ.799 ప్లాన్జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో పొందవచ్చు.జియో రూ.859 ప్లాన్ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో ఆనందించవచ్చు.👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీజియో రూ.889 ప్లాన్జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో చేర్చారు. అలాగే జియో సావన్కు కూడా ఉచిత యాక్సెస్ను కూడా వినియోగదారులు పొందుతారు. -
మెర్సిడెస్ బెంజ్ కలెక్టర్స్ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే..
లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్ ఇండియా ఎక్స్–షోరూం). ప్రస్తుత టాప్ ఎండ్ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ) భాగస్వామ్యంతో భారత్లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్–పర్సనలైజేషన్ ట్రెండ్ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.స్పేర్ వీల్ కవర్పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ను సూచిస్తుంది.బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్తో ఇంటీరియర్ ఉంటుంది. -
ప్రపంచ టాప్ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్లో టాప్లో టెస్లా సీఈఓ ఎలాన్మస్క్, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ నిలిచారు.బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీ(17వ స్థానం), గౌతమ్ అదానీ(20వ స్థానం), శివ్నాడార్(41వ స్థానం), షాపూర్ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్(59వ స్థానం), అజిమ్ప్రేమ్జీ(69వ స్థానం), సునిల్మిట్టల్(73 స్థానం), దిలీప్ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా.. -
అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’
విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్పిట్(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్డీఆర్)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్బాక్స్లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్బాక్స్ను ఇంకా గుర్తించాల్సి ఉంది.బ్లాక్బ్లాక్స్లోని వివరాల విశ్లేషణలో కీలక దశలుబ్లాక్బాక్స్ రికవరీప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్బాక్స్ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్, ఎఫ్డీఆర్ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.ఆడియో విశ్లేషణకాక్ పిట్ ఆడియోను ట్రాన్స్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్లేషన్లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.ఎఫ్డీఆర్ నివేదికఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్ ఎఫ్డీఆర్ రిపోర్ట్లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్ ఇన్పుట్స్ వంటి పారామీటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.హెచ్చరికలు గుర్తించడంహెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.సమన్వయాన్ని అంచనా వేయడంఅత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.ఇదీ చదవండి: సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతిసిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడంఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్బాక్స్ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్బోర్డ్ సెన్సార్లు, మెయింటెనెన్స్ రికార్డ్లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు. -
సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్లైన్ సిస్టమ్స్లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు. -
ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.92,950 (22 క్యారెట్స్), రూ.1,01,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.1,950, రూ.2,120 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,950, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,120 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.92,950 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.1,01,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,950 పెరిగి రూ.93,100కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,120 పెరిగి రూ.1,01,550 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,20,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పీఎల్ఐ స్కీములతో పెట్టుబడులకు దన్ను..
ఎలక్ట్రిక్, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పని చేసే హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) తయారీ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెడితే మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలవుతుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా ఇలాంటి వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఈ విభాగంపై తయారీ సంస్థలు, సరఫరాదారులు పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేయకపోవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్‘పీఎల్ఐ స్కీమును ప్రకటిస్తే కొత్త పెట్టుబడులు వస్తాయి. తయారీ, ఇంజినీరింగ్, ఆర్అండ్డీ విభాగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎలక్ట్రిక్, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే హెచ్ఈఎంఎంలను దేశీయంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి‘ అని భారతీయ ఖనిజ పరిశ్రమ సమాఖ్య (ఎఫ్ఐఎంఐ) రూపొందించిన నివేదిక తెలిపింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్తో కలిసి ఎఫ్ఐఎంఐ దీన్ని రూపొందించింది. మైనింగ్ కార్యకలాపాల్లో కీలకమైన హెచ్ఈఎంఎంలు.. కర్బన ఉద్గారాలకు కారకంగా ఉంటున్నందున పర్యావరణహితమైన మెషినరీపై ఆసక్తి ఏర్పడుతోంది. -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.21 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.91 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.38 శాతం లాభపడింది. నాస్డాక్ 0.24 శాతం పుంజుకుంది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ సూచీలు నిన్నటి సెషన్లో ఒకశాతం నష్టపోయాయి. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడికి సన్నాహాలు చేస్తోందన్న వార్తలతో క్రూడాయిల్ ధరలు పెరుగుదల, అధిక వాల్యుయేషన్ల ఆందోళనలు, వారాంతపు ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సూచీల ఒక శాతం పతనంతో రూ.5.98 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.449 లక్షల కోట్లు (5.26 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆన్లైన్ మోసాలకు ఎయిర్టెల్ చెక్
ఆన్లైన్ మోసాల కట్టడి చేసే దిశగా తమ ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంను దేశవ్యాప్తంగా మరింతగా అందుబాటులోకి తెస్తున్నట్లు టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలో దీన్ని ప్రవేశపెట్టిన 25 రోజుల వ్యవధిలోనే 1,80,000 పైచిలుకు హానికారక లింకులను బ్లాక్ చేసినట్లు పేర్కొంది.ఈ వ్యవస్థతో 54 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు వివరించింది. ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసినట్లు భారతి ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్ చెప్పారు. ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలిగ్రాం, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఈ–మెయిల్స్ మొదలైన వాటిల్లో వచ్చే లింకులను ఈ అధునాతన వ్యవస్థ ఫిల్టర్ చేస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంస్కాములను నివారించేందుకు తమ విభాగం నిరంతరం కృషి చేస్తోందని, ఎయిర్టెల్ కూడా సమర్ధవంతమైన ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైన విషయమని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ, డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. -
నిధులు సమీకరణకు ప్రభుత్వ సంస్థ రెడీ
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్) ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్యూ.. ఇరెడా రూ. 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5–10 మధ్య చేపట్టిన క్విప్నకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) ఆసక్తి చూపినట్లు వెల్లడించింది. ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ. 1,500 కోట్లుకాగా.. 1.3 రెట్లు అధికంగా రూ. 2,006 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపును చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 165.14 ధరలో 12.15 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ. 10 ముఖ విలువగల వీటిని రూ. 155.14 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు వివరించింది. ఫ్లోర్ ధర రూ. 173.83తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో రూ. 165.14 చొప్పున షేర్లను జారీ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదంక్విప్ నిధుల సమీకరణతో కంపెనీ టైర్–1 మూలధనంసహా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) మరింత పటిష్టమైనట్లు పేర్కొంది. దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణకు నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 2023 నవంబర్లో ఐపీవో చేపట్టిన కంపెనీ తక్కువ సమయంలోనే క్విప్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరెడా చైర్మన్, ఎండీ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. -
ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదం
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) క్లెయిమ్ల పరిష్కారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత వేగాన్ని సంతరించుకుంది. క్లెయిమ్ దరఖాస్తుల్లో 50 శాతాన్ని (ప్రధానంగా ఉపసంహరణ) మూడు రోజుల్లోనే పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇలా మూడు రోజుల్లోనే పరిష్కరించిన క్లెయిమ్లు 39 శాతంగా ఉన్నట్టు చెప్పారు.2025 ఏప్రిల్ నుంచి జూన్ 5 మధ్య 68.96 లక్షల క్లెయిమ్లకు మూడు రోజుల్లో పరిష్కారం లభించింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు క్లెయిమ్లకు ఆటోమేటెడ్ పరిష్కారం అమల్లో ఉండగా, ఈపీఎఫ్వో త్వరలోనే రూ.5 లక్షల వరకు క్లెయిమ్లకు ఈ పరిమితిని పెంచనుంది. దీంతో మరిన్ని క్లెయిమ్లకు వేగంగా పరిష్కారం లభించనుందని ఆ అధికారి తెలిపారు. ఈ పరిమితి పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం అవసరం లేదన్నారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఇందుకు అనుమతించొచ్చని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!అనారోగ్యం, విద్య, ఇంటి నిర్మాణం/కొనుగోలు, వివాహ అవసరాలకు సంబంధించిన క్లెయిమ్లు రూ.లక్ష వరకు ఉండి, దరఖాస్తుదారులకు అర్హతలు ఉంటే వాటికి మూడు రోజుల్లోనే క్లెయిమ్ మొత్తం మంజూరవుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా 2012కు ముందు చేరిన సభ్యుల క్లెయిమ్ల ధ్రువీకరణకు సమయం తీసుకుంటున్నట్టు తెలిపారు. పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ ఉపసంహరణలు అన్నింటినీ 72 గంటల్లోనే పరిష్కరించాలన్నది ఈపీఎఫ్వో లక్ష్యమని.. ఈ దిశగా ఈపీఎఫ్వో కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
సూక్ష్మ రుణాలు 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో పంపిణీ చేసిన రుణాల మొత్తం రూ.1,12,459 కోట్లుగా ఉంది. మొత్తం 2.2 కోట్ల ఖాతాదారులకు ఈ మొత్తం రుణాల రూపంలో అందింది. 2023–24లో ఈ రంగం పంపిణీ చేసిన రుణాల మొత్తంతో పోల్చితే 25 శాతం తగ్గినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) తెలిపింది. 2023–24తో పోల్చితే 2024–25లో ఒక్కో ఖాతావారీ సగటు రుణ పంపిణీ 12.3 శాతం అధికంగా రూ.50,131గా ఉంది. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్ఐ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,307 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువ. ఎన్బీఎఫ్సీ–ఎఎంఫ్ఐ సమీకరించిన రుణ నిధుల్లో 78.4 శాతం బ్యాంకుల నుంచి లభించింది. 11.9 శాతం నాన్ బ్యాంకుల నుంచి, 5.1 శాతం ఈసీబీల రూపంలో వచి్చంది. 2025 మార్చితో ముగిసిన చివరి మూడు నెలల కాలంలో ఎంఎఫ్ఐ నిర్వహణ ఆస్తులు (రుణాలు) 2024 మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే 11.9 శాతం తగ్గి రూ.1,47,279 కోట్లుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఎంఎఫ్ఐ పోర్ట్ఫోలియోని గమనిస్తే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వాటా 33 శాతంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు 28 శాతం, ఉత్తరాది 17 శాతం, పశ్చిమ భారత్ వాటా 14 శాతం చొప్పున ఉంది. -
భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు
బెర్న్: భారత ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు స్విప్ కంపెనీల ఉత్పత్తులను కాపీ కొడతాయన్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఇది ఎంతో కాలంగా నెలకొన్న అపోహ అని స్పష్టం చేశారు. మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) భారత్ గౌరవిస్తుందే కానీ.. ఇతరుల నుంచి టెక్నాలజీని ఎప్పుడూ చోరీ చేయదన్నారు. తమ ట్రేడ్మార్క్లు లేదా పేటెంటెడ్ లేదా కాపీ రైట్ టెక్నాలజీని భారత కంపెనీలు చట్టవిరుద్ధంగా కాపీ చేశాయన్న దానికి స్విప్ కంపెనీలు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో ఒక్క కంపెనీ కూడా ఏ ఒక్క ఘటనను తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పేటెంట్లలో స్వల్ప మార్పులను భారత్ అనుమతించబోదన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు కొన్ని సవరణలతో అదనపు మేథో హక్కును సొంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3(డీ) కింద అప్పటికే ఉన్న పెటెంటెడ్ ఔషధాల కంటే మరింత ప్రభావవంతమైనవని నిరూపితమైనే కొత్త వాటికి అనుమతులకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. ఈ నిబంధనలను సవరించాలని కొన్ని బహుళజాతి కంపెనీలు లోగడ కోరినప్పటికీ భారత్ తోసిపుచి్చంది. ఐపీఆర్ ప్రక్రియలను భారత్ మరింత మెరుగుపరుస్తోందని, దీంతో నిబంధనల అమలు భారం తగ్గి, వేగంగా అనుమతులు లభిస్తాయని మంత్రి చెప్పారు. -
ఏఐ మార్కెట్ @ 17 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ 2027 కల్లా ప్రస్తుత స్థాయి నుంచి మూడు రెట్లు వృద్ధి చెందనుంది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ ఎకానమీల్లో ఒకటిగా భారత్ను నిలబెడుతూ 17 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరుగుతుండటం, డిజిటల్ వ్యవస్థ వృద్ధి చెందుతుండటం, నిపుణులైన ప్రొఫెషనల్స్ లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. బోస్టన్ కన్సలి్టంగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రపంచ ఏఐ టాలెంట్లో 16 శాతం మంది భారత్లో ఉన్నారు. దేశీ ఏఐ వ్యవస్థలో 6,00,000 మంది పైగా ఏఐ ప్రొఫెషనల్స్, 70 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. గత మూడేళ్లలో 2,000 పైగా ఏఐ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. డిజిటల్ ఇన్ఫ్రా దన్ను.. ఆధార్, యూపీఐ, డిజిలాకర్, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు దేశీయంగా వివిధ రంగాలను ఏఐతో అనుసంధానించేందుకు సహాయకరంగా ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఇంటర్నెట్ యూజర్లు, విస్తృతంగా స్మార్ట్ఫోన్ వినియోగం కారణంగా భారత్లో భారీ స్థాయిలో డేటా జనరేట్ కావడం ఏఐ మోడల్స్ శిక్షణకు ఉపయోగకరంగా ఉంటోంది. ఇక ప్రస్తుతమున్న 152 డేటా సెంటర్ల నెట్వర్క్కు అదనంగా 2025లో భారత్లో కొత్తగా 45 సెంటర్లు రానున్నాయి. రూ. 10,000 కోట్లతో ప్రభుత్వం ప్రకటించిన ఇండియాఏఐ మిషన్ జాతీయ స్థాయిలో ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. దీనితో ఏఐ మోడల్ శిక్షణ, పరిశోధన కోసం 10,000 పైగా జీపీయూలు (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) అందుబాటులోకి వస్తాయి. ‘ఏఐ అనేది వ్యాపార సంస్థలకు ఒక ఆప్షన్గా కాకుండా అవసరంగా మారింది. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా కూడా మరింత ధీమాగా పోటీపడగలుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం మాత్రమే కాకుండా మార్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడం, అంతర్గత వ్యవస్థలో ఏఐని వినియోగించుకోవడం వంటి అంశాలే అగ్రగామి కంపెనీలకు మిగతా సంస్థలకు మధ్య వ్యత్యాసాన్ని నిర్దేశిస్తాయని బీసీజీ ఇండియా ఎండీ మన్దీప్ కోహ్లి తెలిపారు. -
ఆహార ధరలు మరింత తగ్గాయ్..!
న్యూఢిల్లీ: ధరలు మరింత దిగొచ్చాయి. మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.82 శాతానికి తగ్గింది. 2019 ఫిబ్రవరిలో 2.57 శాతం తర్వాత తిరిగి కనిష్టానికి దిగి రావడం ఇదే మొదటిసారి. వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ/రిటైల్) ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.16 శాతంగా ఉంటే, 2024 మే నెలలో 4.8 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం 0.99 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.69 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ఈ స్థాయికి దిగువనే ఉండడం సానుకూలించే అంశం. ఈ అంచనాల నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో రెపో రేటును ఏకంగా అర శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ‘‘పప్పులు, వాటి సంబంధిత ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, ధాన్యం ఉత్పత్తులు, గృహ వినియోగ వస్తువులు, సేవల ద్రవ్యోల్బణం తగ్గడం మే నెలలో ఆహార, రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడింది’’అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం 2021 అక్టోబర్ తర్వాత కనిష్ట స్థాయిలో నమోదైనట్టు తెలిపింది. పట్టణాల్లో కాస్త ఎక్కువ..: మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2.59 శాతానికి పరిమితం అయితే.. పట్టణ ప్రాంతాల్లో ఇది 3.07 శాతంగా ఉంది. ముఖ్యంగా దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. 0.55 శాతంగా ఉంది. కాగా, అత్యధికంగా కేరళలో 6.46 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. -
ట్రూజెట్ మళ్లీ వస్తోంది..
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిలిపివేసిన ట్రూజెట్ (గతంలో టర్బో మేఘా ఎయిర్వేస్) మళ్లీ సర్వీసులను ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల దన్నుతో బ్రాండ్ను పునరుద్ధరించేందుకు అనుమతుల కోసం పౌర విమానయాన శాఖను సంప్రదించినట్లు కంపెనీ ఎండీ ఉమేశ్ వంకాయలపాటి తెలిపినట్లు వార్తా కథనం వెలువడింది. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం తమకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇక పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)లో ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ను (ఏవోపీ) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఉమేశ్ తెలిపారు. ఇందుకోసం సుమారు 180 రోజుల వరకుసమయం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2015–2022 మధ్య కాలంలో ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలందించే సంస్థగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ట్రూజెట్ కార్యకలాపాలు సాగించింది. అయితే, కోవిడ్ అనంతర ప్రతికూల ప్రభావాలతో, ఆర్థిక సంక్షోభం తలెత్తి 2022 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. హబ్గా వైజాగ్.. ఏవోపీ వచ్చాక ఎయిర్బస్ ఏ320 విమానంతో నవంబర్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఉమేశ్ చెప్పారు. వైజాగ్ తమకు హబ్గా ఉంటుందన్నారు. తొలి ఫ్లయిట్ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్కి నడిపే అవకాశం ఉందని ఉమేశ్ వివరించారు. ఏ320 విమానాలతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ఉడాన్ స్కీము కింద సర్వీసులు నడిపేందుకు ఏటీఆర్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా తీసుకునే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఆర్లకు లక్నో విమానాశ్రయం బేస్గా ఉంటుందన్నారు. -
కేవైసీ అప్డేషన్ ఇక ఈజీ!
ముంబై: కాలానుగుణంగా కేవైసీ అప్డేషన్ను మరింత సులభతరం చేసే దిశగా ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ అప్డేషన్ సేవలను బిజినెస్ కరస్పాడెంట్ల ద్వారా (బీసీలు) చేపట్టేందుకు అనుమతించింది. కస్టమర్లకు నిర్ణిత గడువుతో ముందస్తు నోటీసులు/సమాచారం ఇవ్వాలంటూ బ్యాంక్లతోపాటు తన నియంత్రణల పరిధిలోని ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తదితర) ఆర్బీఐ కోరింది. ‘‘ఖాతాల కేవైసీ అప్డేషన్ విషయంలో పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నట్టు గమనించాం. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం, స్కాలర్ షిప్ ప్రయోజనాల కోసం తెరిచిన ఖాతాలు, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల విషయంలో ఈ పరిస్థితి నెలకొంది’’అని ఆర్బీఐ ఆదేశాల్లో పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా బిజినెస్ కరస్పాడెంట్ల (బీసీలు)ను కేవైసీ అప్డేషన్ పనుల నిర్వహణకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు, బ్యాంక్ శాఖలు అంతగా అందుబాటులో లేని ప్రాంతాల కస్టమర్లకు సైతం కేవైసీ అప్డేషన్ సులభతరం కానుంది. ఇందుకు వీలుగా సవరించిన కేవైసీ ఆదేశాలను జారీ చేసింది. 3 పర్యాయాలు సమాచారం ఇవ్వాల్సిందే.. కాలానుగుణ కేవైసీ అప్డేషన్ విషయంలో కస్టమర్లకు బ్యాంక్లు ముందస్తు నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. కనీసం మూడు పర్యాయాలు కస్టమర్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఒక్కసారి లేఖ ద్వారా తెలియజేయాలని ఆర్బీఐ పేర్కొంది. ప్రతి ఇంటిమేషన్/రిమైండర్ను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పు లేకపోతే కస్టమర్ నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ రిస్క్ లో ఉన్న కస్టమర్లు గడువులోపు కేవైసీ అప్డేట్ చేయకపోయినప్పటికీ.. అప్పటి నుంచి ఏడాది పాటు లేదా 2026 జూన్ 30 వరకు వారి ఖాతాల్లో అన్ని లావాదేవీలను అనుమతించాలని ఆర్బీఐ కోరింది. కేవైసీ అప్డేషన్ విషయంలో క్యాంపులు నిర్వహించి కస్టమర్లలో అవగాహన కల్పించాలని సూచించింది. -
అమ్మో ఏఐతో జాబ్ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!
ఆర్టిఫీషియల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇది లేదనకుండా ఏఐ అన్ని పనులూ చేసేస్తోంది. నోయిడాకు చెందిన అనుభవజ్ఞురాలైన ప్రొడక్ట్ మేనేజర్ రాధికా శర్మకు ఇటీవల ఒక ప్రత్యేకమైన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ఎదురైంది. అక్కడ ఆమెను హ్యూమన్ ప్యానెల్కు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ ఇంటర్వ్యూయర్ అంచనా వేశారు.టెక్ లో దాదాపు దశాబ్ద అనుభవం ఉన్న శర్మ బిజినెస్ ఇన్ సైడర్ తో తన అనుభవాన్ని పంచుకున్నారు. వర్చువల్ స్క్రీనింగ్ సిస్టమ్ ఆమె నైపుణ్యాలను అంచనా వేయడమే కాకుండా ఆమె వస్త్రధారణపైనా ఫీడ్ బ్యాక్ అందించిందని వెల్లడించారు. ఈ అనుభవాన్ని "అద్భుతమైన అదేసమయంలో కలవరపరిచేది"గా ఆమె అభివర్ణించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటర్వ్యూ ప్రక్రియ నుండి లాభనష్టాలు, ఇతర కీలక అంశాలను చర్చించారు.చిన్నదైన కుమార్తె సంరక్షణ కోసం రాధికా శర్మ తన ప్రొడక్ట్ ఓనర్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ పొజిషన్ ను వెతుక్కుంటూ మళ్లీ జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఒక సాస్ కంపెనీ ఆమెను ఏఐ(AI) ఆధారిత స్క్రీనింగ్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభానికి ముందు నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోవాలని, కంప్యూటర్లోని ట్యాబ్ లను మార్చవద్దని, పర్యవేక్షణ కోసం స్క్రీన్ షేరింగ్ చేయాలని అవతల నుంచి సూచనలు వచ్చాయి.‘ఇంటర్వ్యూ ప్రారంభమైన వెంటనే, సుమారు 20 నిమిషాల టైమర్ ప్రారంభమైంది. అటు పక్క నుంచి మహిళా వాయిస్ తో కూడిన ఖాళీ స్క్రీన్ నన్ను పలకరించింది. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా నిర్దిష్టమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది" అని రాధికా శర్మ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతుందని కంపెనీ ముందుగానే స్పష్టంగా పేర్కొంది. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే శర్మ ఏఐ టూల్ నుంచి సవివరమైన పనితీరు మదింపును అందుకున్నారు.తాను నిమగ్నమయ్యే విధానం, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, భంగిమలు, వస్త్రధారణ వంటి అన్ని కొలమానాలతో పాటు ఆమె సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏఐ అంచనా వేసింది. ఆమె సాంకేతిక నైపుణ్యాలు బాగా సాధించినప్పటికీ, ఆమె దుస్తులు ప్రొఫెషనల్గా ధరించలేదని, ఐ కాంటాక్ట్ సక్రమంగా లేదని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశానని, అమ్మో ఏఐ అన్నింటినీ క్షణ్ణంగా గమనిస్తుందని రాధికా శర్మ చెప్పుకొచ్చారు. -
పాలసీ బజార్లో సీనియర్ సిటెజెన్స్కు ప్రత్యేక సర్వీస్
సీనియర్ సిటిజన్లకు వారి ఆరోగ్య సంరక్షణ, బీమా ప్రయాణంలో ప్రతి దశలో సహకారం అందించేందుకు ఉద్దేశించిన 'సారథి' అనే ప్రత్యేక వృద్ధుల సంరక్షణ సేవలను పాలసీబజార్ ప్రవేశపెట్టింది. పాలసీబజార్ బీమా భాగస్వాముల ద్వారా ఈ సారథి సర్వీస్ లభిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు సరైన బీమా ప్రణాళికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. క్లెయిమ్ సహాయాన్ని అందిస్తుంది. కొనసాగుతున్న, వ్యక్తిగతీకరించిన ఫాలో-అప్లను అందిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు నివసిస్తుంటారు. అలాంటి వినియోగదారులు కూడా మరో నగరంలో నివసిస్తున్న వృద్ధులైన తమ తల్లిదండ్రుల కోసం పాలసీ బజార్ ‘సారథి’ ద్వారా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. ఆన్-గ్రౌండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ను వారికి అందించవచ్చు.2050 నాటికి భారత్ లో వృద్ధుల సంఖ్య 31.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పెరుగుతున్న విభాగానికి ప్రతిస్పందనగా, సారథి ఈ కింది సేవలు అందిస్తుంది.పాలసీలను సరళంగా వివరించడానికి శిక్షణ పొందిన సలహాదారులువృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన ఎగ్జిక్యూటివ్ లతో సీనియర్ల కోసం హెల్ప్ లైన్ఆసుపత్రులతో సమన్వయం, అంబులెన్స్ మద్దతుతో సహా సహాయాన్ని క్లెయిమ్ చేస్తుంది.హోమ్ హెల్త్ కేర్, డయాగ్నస్టిక్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో సేవలుకాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పునరుద్ధరణలు, ప్రీమియం రిమైండర్లు, చెక్-ఇన్లలో సహాయం కోసం ప్రతి సారథి వినియోగదారుడికి 24/7 రిలేషన్షిప్ మేనేజర్ను కేటాయింపుడాక్యుమెంట్ల డోర్ డెలివరీ, డిజిటల్ క్లెయిమ్ సబ్మిషన్లకు సహకారం. -
డిజిటల్ సాధికారత కలకు ఎస్టీపీఐ రెక్కలు
సాక్షి, హైదరాబాద్: భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాతావరణాన్ని బలోపేతం చేయడంతో ద్వారా దేశ ‘డిజిటల్ సాధికారత’కలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మూలస్తంభంగా నిలుస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం (1991లో) ఏర్పాటైన ఎస్టీపీఐ దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో వృద్ధి, సాంకేతిక స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. ఎస్టీపీఐ ఇటీవలే 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కోవలోనే ఏర్పాటైన ఎస్టీపీఐ హైదరాబాద్ విభాగం తెలంగాణ, ఏపీలో ఐటీ, స్టార్టప్ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1.35 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్తో భారత ఐటీ పరిశ్రమను ఎస్టీపీఐ హైదరాబాద్ బలోపేతం చేస్తోంది.రూ. 4.76 కోట్ల ఎగుమతులతో.. దేశవ్యాప్తంగా ఎస్టీపీఐకి 14 చోట్ల డైరెక్టరేట్లు ఉండగా హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోని కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో కలుపుకొని మొత్తం ఐదు కేంద్రాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యంగా ఎగుమతుల యూనిట్లు (ఈఓయూ), తయారీ జోన్లు (ఈపీజెడ్)లను ఎస్టీపీఐ ఏర్పాటు చేసింది. 2023–24లో రూ. 1.23 లక్షల కోట్లు, 2024–25లో రూ. 1.42 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ భారత ఆర్థిక వృద్ధిలో కీలకంగా మారింది. 1992–93లో రూ. 4.76 కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.ఇక్కడ ‘ఇమేజ్ ’.. అక్కడ ‘కల్పతరు’ ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎస్టీపీఐ హైదరాబాద్ కొత్తగా ‘ఇమేజ్’, ‘కల్పతరు’ను ఏర్పాటు చేసింది. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ విజన్, ఏఐ స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం, సాంకేతిక మద్దతు, నిధుల సమీకరణ తదితరాల కోసం 2020లో హైదరాబాద్ ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇందులో సీవీ ల్యాబ్, గేమ్ ల్యాబ్తోపాటు స్టార్టప్లకు అవసరమైన పలు సమీకృత కార్యక్రమాలు చేపట్టింది. అలాగే విశాఖపట్నంలో ‘కల్పతరు’పేరిట సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ను స్థాపించారు. ఆవిష్కర్తలకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, మార్కెటింగ్ తదితరాలను కల్పతరు ద్వారా అందుబాటులోకి తెచ్చారు.ఐటీ ఊతానికి ఎస్టీపీఐలు దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)కు శ్రీకారం చుట్టారు. ఐటీ సంస్థలకు అవసరమైన డేటా కమ్యూనికేషన్ సౌకర్యాలు, కంప్యూటర్లు, కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ఎస్టీపీఐకి అప్పగించారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడం, మార్కెటింగ్లో మద్దతు, ప్రాజెక్టులకు అనుమతులు, ఎగుమతులకు అవసరమయ్యే సర్టిఫికేషన్ తదితరాలన్నీ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారు. తొలుత బెంగళూరు, పుణే, భువనేశ్వర్లో ఎస్టీపీయూ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయగా ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, నోయిడా, గాందీనగర్, త్రివేండ్రం తదితర చోట్లకు విస్తరించారు.ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల వైపు దేశంలో ఐటీ రంగం శైశవ దశలో ఉన్న కాలంలో మూడు కేంద్రాలతో ప్రారంభమైన ఎస్టీపీఐ ప్రస్తుతం 67 కేంద్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. అందులో 59 కేంద్రాలు ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ఎస్టీపీఐలో నమోదైన ఐటీ పరిశ్రమల ద్వారా గతేడాది ఐటీ ఎగుమతులు రూ. 10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని 24 ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ (సీఓఈ)ల ద్వారా 1,400 స్టార్టప్లకు మద్దతు లభించింది. వాటికోసం ఇప్పటివరకు రూ. 574 కోట్ల నిధులను సేకరించింది. దేశ డిజిటల్, ఆవిష్కరణల వాతావరణానికి ఎస్టీపీఐ మూల స్తంభంగా నిలుస్తోంది. హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలోనూ ‘ఇమేజ్’, ‘కల్పతరు’ద్వారా 134 స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని అందించింది. – అర్వింద్ కుమార్, డైరెక్టర్ జనరల్, ఎస్టీపీఐ -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్
ఎయిరిండియా విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లు కూడా కుప్పకూలాయి. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో గురువారం ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతానికి పైగా పతనమయ్యాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.ఏఐ-171 అనే విమానం లండన్ గాట్విక్కు బయలుదేరింది. ఇందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ముగ్గురు చిన్న పిల్లలు సహా 242 మంది ఉన్నారు. రన్ వే 23 నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎయిర్ పోర్టు వెలుపల కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. కాగా విమానంలోని ప్రయాణికులందరూ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.బోయింగ్ 737 మ్యాక్స్, 787 మోడళ్లకు సంబంధించిన ఇటీవలి భద్రతా సమస్యల కారణంగా కంపెనీ ఇప్పటికే రెగ్యులేటరీ, పెట్టుబడిదారుల ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ సంఘటన బోయింగ్ పై కొత్త పరిశీలనను పెంచింది. గురువారం బోయింగ్ షేరు ధర భారీగా పడిపోవడం మరో హైప్రొఫైల్ క్రాష్ వల్ల కలిగే నష్టాలపై ఇన్వెస్టర్ల ఆందోళనను ప్రతిబింబిస్తోంది.ఇదీ చదవండి: ఊహించని ఘోరం.. విమాన ప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి -
ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్ ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.👉ఇదీ చదవండి: విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.Deeply shocked and saddened by the tragic #planecrash of the #AirIndia Ahmedabad-London flight during take off in Ahmedabad having 242 passengers on board. My thoughts and prayers are with all those on board and the residents in the affected area. Wishing for everyone's safety… pic.twitter.com/KjTlFfo1Bn— Parimal Nathwani (@mpparimal) June 12, 2025We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽— Gautam Adani (@gautam_adani) June 12, 2025 -
స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పతనమయ్యాయి. నిఫ్టీ 50 ఎఫ్ అండ్ ఓ వారాంతపు గడువు ముగియడం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు పెరగడం, ట్రంప్ వాణిజ్య ఒప్పందం గడువు సమీపించడం వంటి అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి.ఇంట్రాడేలో 81,523.16 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 823.16 పాయింట్లు లేదా 1 శాతం క్షీణించి 81,691.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 253.2 పాయింట్లు లేదా 1.01 శాతం క్షీణించి 24,888.2 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.73 శాతం, 1.90 శాతం నష్టపోయాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే స్థిరపడ్డాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2.02 శాతం క్షీణించగా, ఫీనిక్స్, గోర్డెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, శోభా, బ్రిగేడ్, మాక్రోటెక్ డెవలపర్స్ 3 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 27 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.54 శాతం పెరిగి 14.01 పాయింట్ల వద్ద స్థిరపడింది.ㅤ ㅤ ㅤ -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ అప్డేట్ విడుదల
గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారులకు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఇటీవల ఐఓఎస్ 26ను ప్రకటించిన నేపథ్యంలో గూగుల్ కూడా పోటీగా ఆండ్రాయిడ్ 16ను లాంచ్ చేసింది. అయితే ఈ అప్డేట్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన గూగుల్ పిక్సెల్ డివైజ్ల్లో మాత్రమే దీన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్ ద్వారా యూజర్లకు మరింత భద్రత, డిజైన్, పనితీరులో అనేక అప్గ్రేడ్లను తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.ఆండ్రాయిడ్ 16ను సపోర్ట్ చేసే ఫోన్ల జాబితాగూగుల్ పిక్సెల్ ఫోన్లకు ముందుగా కొత్త సాఫ్ట్వేర్ కోసం యాక్సెస్ ఇస్తోంది. శామ్సంగ్, వన్ప్లస్, షియోమీ వంటి ఇతర బ్రాండ్లు తమ కస్టమ్ ఆప్షన్లకు అనుగుణంగా ఆండ్రాయిడ్ 16ను రాబోయే కొన్ని నెలల్లో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికైతే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ కింది మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్ పేర్కొంది.పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6ఎపిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 7ఎపిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఎపిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 9ఎపిక్సెల్ ఫోల్డ్పిక్సెల్ టాబ్లెట్పైన తెలిపిన డివైజ్ల్లో దేనినైనా ఉపయోగిస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్గా కొత్త ఓఎస్ను అందిస్తారు.ఎలా ఇన్స్టాల్ చేయాలంటే..ముందుగా ఫోన్లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి.కిందకు స్క్రోల్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ను ట్యాప్ చేయాలి.అప్డేట్ల కోసం చెక్ ఆప్షన్ ఎంచుకోవాలి.ఒకవేళ ఆండ్రాయిడ్ 16 అందుబాటులో ఉంటే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆప్షన్ ట్యాప్ చేయాలి.పూర్తయిన తర్వాత కొత్త వెర్షన్ను ఉపయోగించేముందు ఒకసారి ఫోన్ను రిస్టార్ట్ అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!కొన్ని ప్రధాన ఫీచర్లు ఇవే..లాక్ స్క్రీన్పై లైవ్ అప్డేట్స్అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్మెరుగైన యాప్ కంపాటబిలిటీఅడాప్టివ్ యాప్స్ ఫీచర్తో ఆండ్రాయిడ్ 16 యాప్స్ ఆటోమేటిక్గా స్క్రీన్ సైజులకు అడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది ఫోల్డబుల్ ఫోన్లు, టాబ్లెట్లకు అనుకూలంగా ఉంటుంది.సెట్టింగ్స్లో కొత్త కలర్ హైలైట్స్, అప్డేటెడ్ ఫాంట్స్, స్లీకర్ మీడియా కంట్రోల్స్ అందిస్తుంది.బ్యాటరీ హెల్త్ ఇండికేటర్ సూచిస్తుంది. -
కొత్త వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, జీఎస్కే భాగస్వామ్యం
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీజనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్..యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు. -
అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు. -
‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్గా మారుతున్నాయి.ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్పీఏ రూ.25 ఎల్పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు. -
పసిడి మళ్లీ పైపైకి.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,000 (22 క్యారెట్స్), రూ.99,280 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.800, రూ.880 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.880 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,280 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.800 పెరిగి రూ.91,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.880 పెరిగి రూ.99,430 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా గురువారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే రూ.100 క్షీణించింది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,18,900గా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇటీవల తాను పోస్ట్ చేసిన వివరాలు వైరల్గా మారాయి. దాంతో భారత్ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.భాటియా తన ఎక్స్లో ఖాతాలో ‘భారత్లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్ చేశారు. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు.భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్లోని వివరాలు అవుట్డేటెడ్గా కొందరు కామెంట్ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Instead of hanging your head in shame that 415 million people in India survive on $3.10/day, you brag about being the world’s 4th largest economy. Shame on you.— Sabeer Bhatia (@sabeer) June 10, 2025ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం‘1997 డిసెంబర్లో హాట్మెయిల్ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు లాభపడి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 132 ప్లాయింట్లు పెరిగి 82,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.36 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం లాభపడింది. నాస్డాక్ 0.5 శాతం పుంజుకుంది.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక మే నెలలో గణనీయంగా తగ్గింది. 13 నెలల కనిష్ట స్థాయిలో రూ.19,013 కోట్లకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాల్లో పెట్టుబడుల రాక తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.24,269 కోట్ల పెట్టుబడలతో పోల్చి చూస్తే మే నెలలో పెట్టుబడుల రాక 22 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్కు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా బ్యాంక్ శాఖల స్థాయిలో 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టినట్టు తెలిపింది. పరిశ్రమలోనే దీన్నొక పెద్ద నియామక ప్రక్రియగా పేర్కొంది.ఇదీ చదవండి: జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతిఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాథమిక స్థాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ నెలలో ప్రధాన పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. పారదర్శక విధానంలో చివరికి 13,455 అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మందిని బ్యాంక్ నియమించుకోనుండగా.. ఇందులో 13,500 మంది క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు కాగా, మిగిలిన వారు స్థానిక అధికారులుగా పేర్కొన్నారు. -
జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అమెరికాకు చెందిన బ్లాక్రాక్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధిమార్క్ పిల్గ్రెమ్ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్ వెంచర్ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్ఎస్ఎల్ ఎండీ, సీఈవో హితేష్ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. -
జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి
జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది. ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచనఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్ఐసీ గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది. -
825 బిలియన్ డాలర్ల ఎగుమతులు
బెర్న్: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్ 2025–26లో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ పోరు, రెడ్సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్ 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హన్ తెలిపారు. ఎఫ్ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్ఐఈవో అంచనా. ఎఫ్టీఏలతో సానుకూలత యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పాలనలో కుదిరిన ఎఫ్టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్ మార్కెట్ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. -
ఎలక్ట్రిసిటీ ఎఫ్అండ్వోకు గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త యూపీఐ విధానం ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు. -
గోల్డ్ ఈటీఎఫ్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్ఫోలియో హెడ్జింగ్కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. -
క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి. -
హింద్ జింక్ డివిడెండ్ ఎంతంటే..
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖవిలువగల షేరుకి 500 శాతం డివిడెండ్ను ఆమోదించినట్లు హిందుస్తాన్ జింక్ పేర్కొంది. దీంతో ప్రతీ షేరుకి రూ. 10 చొప్పున వాటాదారులకు చెల్లించనుంది. ఇందుకు వేదాంతా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 4,225 కోట్లు వెచి్చంచనుంది. గతేడాది(2024–25) సైతం డివిడెండ్ల రూపేణా వాటాదారులకు మొత్తం రూ. 12,250 కోట్లు చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది షేరుకి రూ. 19, రూ. 10 చొప్పున రెండుసార్లు డివిడెండ్ ప్రకటించింది. అత్యధిక డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్న మెటల్ రంగ దిగ్గజాలలో కంపెనీ ఒకటికాగా.. తాజా డివిడెండ్ ప్రకటనతో ప్రభుత్వానికి రూ. 1,180 కోట్లు చెల్లించనుంది. కాగా.. వెండి ఉత్పత్తిని రెట్టింపునకు(రూ. 1,500–2,000 మెట్రిక్ టన్నులు) పెంచుకోవడంతోపాటు.. రాజస్తాన్లో ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇటీవల రాజస్తాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్లలో కీలకమైన మినరల్ బ్లాకులను సాధించిన విషయం విదితమే. హిందుస్తాన్ జింక్ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ. 520 వద్ద ముగిసింది. -
రుణ రేట్లు తగ్గించిన యూనియన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ తన రుణ రేట్లను అరశాతం తగ్గించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈఈఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు యూనియన్ బ్యాంక్ ప్రకటించింది. కొత్తగా రుణాలు తీసుకొనేవారితోపా టు, ప్రస్తుత రిటైల్ (గృహ, వాహన, వ్యక్తిగత), ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది. మరోవైపు కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.75% నుంచి 8.25 శాతానికి తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఐవోబీ సైతం ఆర్ఎల్ఎల్ఆర్ రేటును 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. -
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్వాచీలు, వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025 -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.👉ఇదీ చదవండి: తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరితుది చార్ట్ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది. -
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor) -
విజయ్ మాల్యా 4 గంటల ఇంటర్వ్యూ.. 'సోషల్' హల్చల్
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ లైమ్ లైటులోకి వచ్చారు. మాల్యాపై సోషల్ మీడియా మీడియాలో తాజాగా చర్చోప చర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్ రాజ్ షమానీ (Raj Shamani)కి ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలు మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్టుగా మాల్యా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తిచూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపించినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు.బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించానని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యానని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీయిస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా దీటుగానే స్పందించాయి. మాల్యా తీసుకున్న రుణాలు, వడ్డీల లెక్కలతో ఆయనకు బదులిచ్చాయి.కాగా, విజయ్ మాల్యా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్లో మాల్యా స్పందిస్తూ.. తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. 'ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పడం, నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @rajshamani తో నా 4 గంటల పాడ్కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క YouTubeలోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికే తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక' అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను మాత్రం కాదువిజయ్ మాల్యా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాల్యాకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన అబద్దాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మంది మీమ్స్, వీడియోలతో సైటర్లు పేలుస్తూ హాస్యచతురత ప్రదర్శిస్తున్నారు.Indians after watching Vijay Mallya's podcast#VijayMallya विजय माल्या 🙂 pic.twitter.com/NVyDWLPC5N— Sourabh (@vellasrv) June 7, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Well. #VijayMallya pic.twitter.com/ilWmPEJcRB— Kritant Mishra (@YourGandhiBro) June 8, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025Mandatory tweet from the Banks management whenever they see news relating to #VijayMallya😿 pic.twitter.com/577rD4HmTB— Tadkamarkey 3.0 🇮🇳 (@AnilPil63050188) June 10, 2025 -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలలో ముగిశాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాల మధ్య ఇతర ఆసియా మార్కెట్ల సంకేతాలతో భారత ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 82,783.5 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 123 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 82,515.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కేవలం 37.15 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 25,141.4 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.49 శాతం, 0.53 శాతం క్షీణించాయి. రంగాలవారీ సూచీలు మిశ్రమ ధోరణులను కనబరిచాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.47 శాతం, ఐటీ 1.26 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ షేర్లలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.48 శాతం క్షీణించి 13.66 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
ఉద్యోగులు ఆఫీస్కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది.