Business
-
పసిడి పరుగుతో లాకర్లకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పసిడి ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో హోమ్ లాకర్లకు కూడా గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్నకు చెందిన సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగం సరికొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్ను ఆవిష్కరించింది. గృహ, వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడే 7 ఉత్పత్తులు ఉన్నాయి.వీటిలో డిజిటల్.. బయోమెట్రిక్ యాక్సెస్, ఇంటెలిజెంట్ ఐబజ్ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉన్నట్లు సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే వివరించారు. ఇళ్లలో వినియోగించే ఉత్పత్తుల ధర శ్రేణి రూ. 9,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 500 పైచిలుకు అవుట్లెట్స్ ఉండగా, సుమారు రూ. 130 కోట్ల ఆదాయం ఉంటోందని జోనల్ హెడ్ శరత్ మోహన్ పేర్కొన్నారు. -
బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
ముంబై: బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోవడం వినియోగ డిమాండ్ను దెబ్బతీయొచ్చని పరిశ్రమ వర్గాలు, రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెల 30న అక్షయ తృతీయ, తదుపరి మే చివరి వరకు వివాహాల సీజన్ నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నెల 22న బంగారం 10 గ్రాములకు ఢిల్లీలో రూ.1,01,350కు పెరిగిపోవడం తెలిసిందే. ‘‘బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం అన్నది డిమాండ్పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత డిమాండ్ స్థిరపడుతుంది. మొత్తం మీద అయితే మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు.2023లో 741 టన్నుల బంగారం దిగుమతి కాగా, ధరలు 20% మేర పెరిగినప్పటికీ 2024లో 802 టన్నులు దిగుమతి కావడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం ధర రూ.లక్షకు చేరడం కచ్చితంగా డిమాండ్పై 10–15% ప్రభావం ఉండొచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా చెప్పారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. ‘‘మార్కెట్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ధరలు పెరుగుదలతో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఉన్న సానుకూల సెంటిమెంట్ పరిశ్రమకు అనుకూలిస్తుంది’’ అని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.విక్రయాలు 9–11 శాతం తగ్గొచ్చు.. బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టాలకు చేరినందున ఈ ఏడాది (2025–26) సంస్థాగత రిటైల్ జ్యుయలర్ల అమ్మకాలు (పరిమాణం పరంగా) 9–11% వరకు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో కొనుగోళ్లకు మొగ్గు చూపించొచ్చని పేర్కొంది. కొనుగోలు వ్యయం అంతే ఉండి, క్యారట్, గ్రాముల రూపంలో తగ్గొచ్చని వివరించింది. అయినప్పటికీ అమ్మకాల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 13–15% పెరగొచ్చని తాజా నివేదికలో తెలిపింది.రూ.లక్ష దిగువకు పసిడిబంగారం ధర రూ.లక్షను దాటిన ఒక్కరోజులోనే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 నష్టపోయింది. రూ.99,200 వద్ద స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం రూ.3,400 నష్టపోయి రూ.98,700కు దిగొచ్చింది. చైనాపై విధించిన టారిఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలోనే తగ్గించనున్నట్టు ట్రంప్ ప్రకటించడం అమ్మకాలకు దారితీసింది. -
ఖరీదైనవి కొంటున్నారా? కట్టండి పన్ను..
న్యూఢిల్లీ: హ్యాండ్ బ్యాగ్లు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా వస్త్రాలు రూ.10 లక్షలు మించినవి మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిపై ఒక శాతం మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) చేయనున్నారు. ప్రస్తుతం ఒక శాతం టీసీఎస్ రూ.10 లక్షలు మించిన మోటారు వాహనాలపైనే అమలవుతోంది. ఒక శాతం టీసీఎస్ వర్తించే విలాస వస్తువుల జాబితాను ఆదాయపన్ను శాఖ తాజాగా విడుదల చేసింది.పెయింటింగ్లు, శిల్పాలు, పురాతన వస్తువులు, కాయిన్లు, స్టాంప్లు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్బ్యాగ్లు, కళ్లద్దాలు, పాదరక్షలు, క్రీడావస్త్రాలు, క్రీడా పరికరాలు, హోమ్ థియేటర్ సిస్టమ్లు, రేసింగ్ కోసం ఉద్దేశించిన గుర్రాల విక్రయ ధరపై ఒక శాతం టీసీఎస్ అమలవుతుంది. కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి ధరపై ఒక శాతం అదనంగా టీసీఎస్ను విక్రయదారులే వసూలు చేస్తారు. వారి పాన్ వివరాలు కూడా తీసుకుని, ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. కొనుగోలుదారులు ఆదాయపన్ను రిటర్నులు వేయడం ద్వారా తమ పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసుకోవచ్చు.పన్ను చెల్లించే బాధ్యత లేకపోతే రిఫండ్ కోరొచ్చు. టీసీఎస్ రూపంలో ఆదాయపన్ను శాఖకు అదనంగా ఎలాంటి పన్ను ఆదాయం రాదు. కాకపోతే అధిక కొనుగోళ్ల వివరాలను పాన్ నంబర్ల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అధిక విలువతో కూడిన విచక్షణారహిత కొనుగోళ్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులను పెంచుకోవడం దీని లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మేఘా ఇంజనీరింగ్కు భారీ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (ఎన్పీసీఐఎల్) నుంచి భారీ ఆర్డరు దక్కించుకుంది. దీని విలువ రూ. 12,800 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఎన్పీసీఐఎల్ చరిత్రలోనే ఈ అతి పెద్ద కాంట్రాక్టుని బీహెచ్ఈఎల్, ఎల్అండ్టీలాంటి దిగ్గజాలతో పోటీపడి దక్కించుకున్నట్లు తెలిపింది. దీని కింద కర్ణాటకలోని కైగా వద్ద ఒక్కోటి 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ కాంట్రాక్టుతో అణు ఇంధన రంగంలోకి ప్రవేశించినట్లయిందని కంపెనీ పేర్కొంది. అత్యున్నత ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటూ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సీహెచ్ సుబ్బయ్య ధీమా వ్యక్తం చేశారు. -
యాపిల్, మెటాకు ఈయూ షాక్
లండన్: డిజిటల్ కాంపిటీషన్ చట్టాల ఉల్లంఘనకు గాను అమెరికన్ టెక్ దిగ్గజాలు యాపిల్, మెటాకు యూరోపియన్ కమిషన్ షాకిచి్చంది. రెండు వేర్వేరు కేసుల్లో యాపిల్పై 500 మిలియన్ యూరోలు, మెటాపై 200 మిలియన్ యూరోల జరిమానా విధించింది. యాప్ స్టోర్ వెలుపల చౌక ఆప్షన్ల గురించి యూజర్లకు తెలియనివ్వకుండా యాప్ల తయారీదారులను నియంత్రించిందుకు గాను యాపిల్కి పెనాల్టీ విధించింది. వ్యక్తిగతీకరించిన యాడ్లను చూడాలని లేదా వాటిని తప్పించుకోవాలంటే కొంత రుసుములు చెల్లించాలని ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ యూజర్లపై ఆంక్షలు విధించినందుకు జరిమానా కట్టాలంటూ యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. రెండు కంపెనీలు 60 రోజుల్లోగా ఈ ఆదేశాలు పాటించకపోతే మరిన్ని పెనాల్టీ మరింత పెరుగుతుందని పేర్కొంది. గతంలో బిలియన్ డాలర్ల స్థాయిలో విధించిన జరిమానాలతో పోలిస్తే తాజా పెనాలీ్టలు గణనీయంగా తక్కువగా ఉండటం గమనార్హం. -
భారత వృద్ధి రేటుకు కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) తగ్గిస్తున్నట్టు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. 6.7 శాతం వృద్ధి నమోదు కావచ్చన్న గత అంచనాలను 6.3 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక బలహీనత, విధానపరమైన అనిశి్చతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘2024–25లో భారత వృద్ధి రేటు నిరాశపరిచింది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ఇందుకు దారితీసింది. భారత జీడీపీ వృద్ధి 2024–25లో ఉన్న (అంచనా) 6.5 శాతం స్థాయి నుంచి 2025–26లో 6.3 శాతానికి నిదానించొచ్చు. ప్రైవేటు పెట్టుబడులు, ద్రవ్యపరమైన సడలింపులు, నియంత్రణ పరమైన సానుకూలతలను.. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనత, విధానపరమైన (వాణిజ్యం) అనిశి్చ తులు తటస్థం చేయొచ్చు’’అని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో వివరించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం భారత జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో వేసిన 6.5% నుంచి 6.2 శాతానికి తగ్గించడం గమనార్హం. ‘‘పన్ను తగ్గింపులతో ప్రైవేటు వినియోగం పుంజుకోవచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా పెరుగుతాయి. కానీ, అంతర్జాతీయంగా వృద్ధి నిదానించడం, వాణిజ్య విధానాల్లో మార్పులతో ఎగుమతుల డిమాండ్ తగ్గుతుంది’’అని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి దక్షిణాసియా వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని పేర్కొంది. 2025లో దక్షిణాసియా ప్రాంతంలో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను 5.8 శాతానికి కుదించింది. -
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది. -
యాపిల్, మెటాకు వేలకోట్ల జరిమానా
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, మెటాకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.యాపిల్ సంస్థకు 570 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.48,64,61,08,500).. మెటాకు 228 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,45,92,38,025) జరిమానా విధించింది. ఈ భారీ జరిమానాలు యూరోపియన్ యూనియన్ & ట్రంప్ పరిపాలన మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికా కంపెనీలపై జరిమానా విధించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులను.. ఐఫోన్ యాప్లకు ప్రత్యామ్నాయంగా.. ఇతర యాప్లను డౌన్లోడ్ చేయడానికి వీలు లేకుండా పరిమితులు విధించినట్లు యూరోపియన్ యూనియన్ తన పరిశోధనలో తేల్చింది. ఇది డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగానే జరిమానా విధిస్తున్నట్లు ఈయూ పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ కారణంగానే ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతించలేదని యాపిల్ స్పందించింది. అంతే కాకుండా తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వాలని ఈయూ చెబుతోందని.. ఈ కారణంగానే సంస్థను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ఇక మెటా విషయానికి వస్తే.. తన సొంత ప్లాట్ఫామ్లలో వారి వ్యక్తిగత డేటాను కలపకుండానే తన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించాల్సి వచ్చింది. అయితే, DMA నిబంధనల ప్రకారం అలా చేయడంలో విఫలమైంది. ఈ కారణంగానే జరిమానా పడింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది. -
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్డాడ్ పూర్ డాడ్ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు. -
ఇండియాలో టెస్లా సైబర్ ట్రక్
టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మోడల్ వై టెస్టింగ్ దశలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు సైబర్ట్రక్ కనిపించింది. అయితే ఈ కారు దుబాయ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా దీనిని తాత్కాలికంగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.టెస్టింగ్ దశలో టెస్లా కారుటెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్ట్రక్ డిసెంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఇది ప్రత్యేకమైన స్టెయిన్లెస్-స్టీల్ బాడీ.. వెనుక భాగంలో 4x6 అడుగుల లోడింగ్ బెడ్ను కలిగి ఉంది. సైబర్ట్రక్ భారీ 35 ఇంచెస్ టైర్లపై నడుస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ గరిష్టంగా 432 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జితో 563 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.Source: Powerdrift -
ప్యూర్పవర్ గ్రిడ్ను ఆవిష్కరించిన ప్యూర్
ఢిల్లీ: విద్యుత్ స్టోరేజీ ఉత్పత్తుల విభాగంలో అగ్రగామి, టూవీలర్ ఈ-మొబిలిటీ రంగంలో దిగ్గజమైన ప్యూర్ సంస్థ, బ్యాటరీ ఆధారిత 5 MWh గ్రిడ్ స్టోరేజీ ఉత్పత్తి ప్యూర్పవర్ గ్రిడ్ను (PuREPower Grid) ఢిల్లీలో ఆవిష్కరించింది. ఈ వినూత్నమైన ఉత్పత్తి, భారతదేశ విద్యుత్ మౌలిక సదుపాయాల్లో పరివర్తన తెచ్చేందుకు, గ్రిడ్ స్థిరత్వంపరంగా సాధికారత కల్పించేందుకు, రెన్యూవబుల్ ఎనర్జీ వనరులను సమగ్రపర్చడాన్ని వేగవంతం చేసేందుకు తోడ్పడనుంది.ఇన్-బిల్ట్ సోలార్, పీసీఎస్తో 5MWh కంటైనరైజ్డ్ ఉత్పత్తిగా రూపొందిన ప్యూర్పవర్ గ్రిడ్ ఇప్పటికే పరిశ్రమలో గణనీయంగా ఆమోదయోగ్యత పొందింది. 10కి పైగా దిగ్గజ రెన్యూవబుల్ ఎనర్జీ ఈపీసీ సంస్థలు & భారీ పరిశ్రమల నుంచి ప్యూర్కి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) వచ్చాయి.బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంలకు (బీఈఎస్ఎస్) భారత్లో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2030 నాటికి దేశం నిర్దేశించుకున్న 500 GW పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని సాధించాలన్న లక్ష్యం, 200 GWh పైగా బీఈఎస్ఎస్ సామర్థ్యాల అవసరం నెలకొన్న నేపథ్యంలో ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఈ మార్కెట్ 36 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అధునాతన టెక్నాలజీతో దశాబ్దకాలంపైగా డిజైన్ సామర్థ్యాలు, మేకిన్ ఇండియా అనుభవం దన్నుతో గ్రిడ్-స్కేల్ సెగ్మెంట్లో ప్యూర్ చాలా తక్కువ ధరలో, అధునాతన ఉత్పత్తిని అందించగలుగుతోంది.ప్యూర్పవర్ గ్రిడ్ అత్యధిక విద్యుత్ సాంద్రత గల బ్యాటరీలు, 5వ తరం పవర్ ఎలక్ట్రానిక్స్తో నిర్మించబడింది. నిరాటంకమైన రిమోట్ మానిటరింగ్, 100 శాతం అప్టైమ్, తక్కువ అవాంతరాలు, గరిష్ట నిర్వహణ సామర్థ్యాల కోసం ఇందులో క్లౌడ్ & ప్రెడిక్టివ్ ఏఐ పొందుపర్చబడింది.ప్యూర్పవర్లో సెల్-స్థాయిలో నానో-పీసీఎం కూలింగ్, ప్యాక్-స్థాయి మరియు ర్యాక్-స్థాయిలో లిక్విడ్ కూలింగ్ సామర్థ్యాలతో గ్రిడ్ సమగ్రమైన మల్టీ-లెవెల్ థర్మల్ మేనేజ్మెంట్/కూలింగ్ సిస్టం కలిగి ఉంటుంది. శక్తి వృధా కాకుండా వేడిమి సక్రమంగా విస్తరించేందుకు, జీవితకాలం పెరిగేందుకు, మెరుగైన రౌండ్ ట్రిప్ సామర్ధ్యాలకు విశిష్టమైన ఈ డిజైన్ ఉపకరిస్తుంది. ప్రపంచ స్థాయి భద్రతను అందిస్తుంది. పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన ధరకు అందిస్తుండటం, స్థానికంగానే విడిభాగాలతో సర్వీసింగ్ సదుపాయం అందుబాటులో ఉండటం వల్ల భాగస్వాములకు మెరుగైన, సమర్ధవంతమైన అసెట్ మేనేజ్మెంట్ సేవలు పొందేందుకు వీలవుతుంది.“ప్యూర్పవర్ గ్రిడ్ అనేది ఒక ఉత్పత్తి మాత్రమే కాదు. భారత ఇంధన పరివర్తనకు ఇదొక ఉత్ప్రేరకంలాంటిది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్లో అపార అనుభవంతో శక్తివంతమైన, తెలివైన, తక్కువ ధరకు లభించే గ్రిడ్-స్కేల్ ఉత్పత్తిని మేము రూపొందించాం. గ్రిడ్ స్థిరత్వానికి, రెన్యువబుల్స్ను నిరాటంకంగా సమగ్రపర్చడానికి ప్యూర్పవర్ గ్రిడ్ తోడ్పడుతుంది. ట్రాన్స్ఫార్మర్ అప్గ్రేడ్, రైట్ ఆఫ్ వే, డిస్ట్రిబ్యూషన్ అప్గ్రేడేషన్ వంటి వ్యయప్రయాలతో కూడుకున్న ప్రక్రియల భారం లేకుండా ఈఎస్ఎస్ ప్రోడక్టులను సమగ్రపర్చడం ద్వారా ఈవీలకు ఫాస్ట్ చార్జర్ల వినియోగాన్ని పెంపొందించేందుకు కూడా ప్యూర్పవర్ గ్రిడ్ తోడ్పడుతుంది” అని Dr. నిశాంత్ దొంగారి తెలిపారు.ప్యూర్ ఇప్పటికే గృహాలు, వ్యాపార సంస్థలకు తమ ప్యూర్పవర్ హోమ్, ప్యూర్పవర్ కమర్షియల్ ప్రోడక్టుల ద్వారా సేవలు అందిస్తుండగా, ఢిల్లీలో ఆవిష్కృతమైన 5 MWh ప్యూర్పవర్ గ్రిడ్, సౌర & పవన విద్యుత్ ప్రాజెక్టులు, భారీ కమర్షియల్ మరియు పారిశ్రామిక సంస్థలతో పాటు జాతీయ రహదారులపై ఏర్పాటు కాబోయే వేలకొద్దీ ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లకు దన్నుగా నిలవగలదు. -
రోజుకు 121 రూపాయలతో రూ.27 లక్షలు చేతికి: ఈ పాలసీ గురించి తెలుసా?
సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు చేయాలని అందరూ అనుకుంటారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే విషయాల మీద బహుశా కొందరికి అవగాహన ఉండకపోవచ్చు. మనదేశంలో ముఖ్యంగా.. ఆడపిల్లల గురించి ఆలోచించేవారి సంఖ్య కొంత ఎక్కువే. ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ ఎంచుకోవచ్చు. ఇందులో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే.. పెళ్లి చేసే నాటికి రూ. 27 లక్షలు చేతికి వస్తాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రవేశపెట్టిన 'ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ'.. తల్లిదండ్రులు తమ కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మీరు రోజుకు 121 రూపాయలు డిపాజిట్ చేస్తే.. నిర్దిష్ట సమయం తరువాత రూ. 27 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చేతికి అందుతాయి. ఇది మీరు ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు, వచ్చే బోనస్ ఎంత అనేదానిపై ఆధారపడి ఉంటుంది.➤కనీస రోజువారీ పెట్టుబడి: రూ. 121➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 27 లక్షల వరకు (ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేస్తున్నారు & బోనస్ ఆధారంగా)➤పాలసీ కాలపరిమితి: 13 నుంచి 25 సంవత్సరాలుఇదీ చదవండి: ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?ఉదాహరణకు.. మీ కుమార్తెకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మీరు రోజుకు రూ. 121 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. అలా మీరు 25 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే.. వచ్చే ఎల్ఐసీ ద్వారా బోనస్లు, లాయల్టీ వంటి వాటితో కలిపి మీ మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 27 లక్షలు దాటవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారు తండ్రి వయస్సు కనీసం 30 సంవత్సరాలు, కుమార్తె వయస్సు కనీసం ఒక సంవత్సరం ఉండాలి.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ అనేది ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కిందికి వస్తుంది. కాబట్టి వినియోగదారులు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీదారు స్కీమ్ మెచ్యూరిటీ కాలానికి ముందే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు అందుతాయి. అంతే కాకుండా కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం గడువు ముగిసిన తరువాత మొత్తం రూ. 27 లక్షలు నామినికీ అందిస్తారు.ఎల్ఐసీ కన్యాదాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి.. ఐడెంటిటీ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ఋజువు, కుమార్తె బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి అవసమవుతాయి. ఈ పథకం గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 406.40 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 80,001.99 వద్ద, నిఫ్టీ 115.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 24,282.35 వద్ద నిలిచాయి.మైండ్టెక్ (ఇండియా), వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, సిగ్మా సాల్వ్, ఆప్టెక్, మోదీ రబ్బర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. వీడోల్ కార్పొరేషన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఉమా ఎక్స్పోర్ట్స్, రవి కుమార్ డిస్టిలరీస్, Xelpmoc డిజైన్ అండ్ టెక్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
అప్పుడు పనిగంటలు.. ఇప్పుడు సెలవులు
పనిగంటలపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న సమయంలో.. తాజాగా సెలవుల సంస్కృతికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఒక్క నెలలోనే (ఏప్రిల్ 2025) ఏకంగా 17 సెలవులు ఉన్నాయంటూ.. క్లీన్రూమ్స్ కంటైన్మెంట్స్ వ్యవస్థాపకులు & సీఈఓ 'రవికుమార్ తుమ్మలచర్ల' చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మనం ఎంతో గౌరవిస్తున్నాము. వారాంతాలతో కలిపి ప్రభుత్వ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ కారణంగా.. పనులు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 2025లో, మాకు 10 కంటే ఎక్కువ సెలవులు వచ్చాయి. సెలవులు అధికం కావడంతో ముఖ్యమైన ఫైల్స్ ఆఫీసుల్లో కదలకుండా నిలిచిపోతున్నాయి.మేము భారతీయ.. పాశ్చాత్య సంప్రదాయాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఇదే సమయంలో ఉత్పాదకతను కోల్పోకుండా చూసుకోవాలి. ఉత్పాదకత తగ్గితే.. అది దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వేగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే చైనా 60 సంవత్సరాలు ముందుంది.భారతదేశంలో మనం మాత్రం వేగవంతమైన ప్రక్రియల కోసం విదేశాలకు వలసపోతాము. కాబట్టి మన సెలవు సంస్కృతిని పునరాలోచించాలి. మెరుగైన సమతుల్యతను సాధించాలి. ఇదే సరైన సమయం అంటూ.. సెలవుల జాబితాను రవికుమార్ తుమ్మలచర్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రభుత్వ సంస్థలను ట్యాగ్ చేశారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!రవికుమార్ తుమ్మలచర్ల షేర్ చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈయన అభిప్రాయంపై ఏకీభవిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పోస్టులు ఎప్పుడు యజమాని నుంచే వస్తాయి. ఉద్యోగి ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటాడు అని చెబుతున్నారు. సెలవులు అంటే ఆర్థిక కార్యకలాపాలలో విరామం మాత్రమే కాదు, అవి ఉద్యోగులు రీఛార్జ్ అవ్వడానికి తగిన సమయం అని కూడా ఇంకొందరు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. -
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కు పెరిగిన లాభాలు
ప్రయివేట్ రంగ సంస్థ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 504 కోట్లను తాకింది. ఇందుకు ఇతర ఆదాయం దోహదపడింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 428 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 3,385 కోట్ల నుంచి రూ. 5,031 కోట్లకు జంప్చేసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 57 శాతం దూసుకెళ్లి రూ. 2,094 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం మెరుగుపడి 5.8 శాతానికి చేరాయి. పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 32 శాతం ఎగసి రూ. 2,106 కోట్లయ్యింది.2023–24లో రూ. 1,591 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కాగా.. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 1.67 శాతం నుంచి 2.28 శాతానికి, నికర ఎన్పీఏలు 0.55 శాతం నుంచి 0.74 శాతానికి పెరిగాయి. వెరసి ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 118 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు భారీగా పెరిగాయి.మహీంద్రా లాజిస్టిక్స్ లాభం జూమ్ప్రయివేట్ రంగ కంపెనీ మహీంద్రా లాజిస్టిక్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 67 శాతం జంప్చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో దాదాపు రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 1,183 కోట్ల నుంచి రూ. 1,293 కోట్లకు బలపడింది. అయితే మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 30 శాతం క్షీణించి దాదాపు రూ. 44 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 62 కోట్లు ఆర్జించింది. కాగా.. టర్నోవర్ 10 శాతం వృద్ధితో రూ. 5,013 కోట్లను తాకింది. 2023–24లో రూ. 4,530 కోట్ల ఆదాయం అందుకుంది. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్లో తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది. -
టాటా కమ్యూనికేషన్స్ లాభం డబుల్
ప్రయివేట్ రంగ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపుపైగా వృద్ధితో రూ. 761 కోట్లను అధిగమించింది. సహచర కంపెనీకి చెన్నైలోని భూమిని విక్రయించడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 346 కోట్లు ఆర్జించింది.ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో 30 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,550 కోట్లు) పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది 27 కోట్ల డాలర్లు కేటాయించినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం 6 శాతంపైగా పుంజుకుని రూ. 6,059 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 6 శాతం పెరిగి రూ. 5,723 కోట్లకు చేరాయి. చెన్నైలోని భూమి అమ్మడంతో రూ. 577 కోట్లమేర అదనపు లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది.అంతేకాకుండా టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్స్ సొల్యూషన్స్లో వాటా విక్రయం ద్వారా రూ. 311 కోట్లు అందుకున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 23,238 కోట్ల ఆదాయం సాధించింది. మార్చికల్లా రూ. 9,377 కోట్ల రుణభారం నమోదైంది.హావెల్స్ రూ. 6 డివిడెండ్ కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 517 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 447 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం ఎగసి రూ. 6,544 కోట్లకు చేరింది.అంతక్రితం క్యూ4లో రూ. 5,442 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 6 తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 16 శాతం పుంజుకుని రూ. 1,470 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,271 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 17 శాతంపైగా బలపడి రూ. 22,081 కోట్లుగా నమోదైంది. -
భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Drop: దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నేడు (ఏప్రిల్ 23) భారీగా దిగివచ్చాయి. అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను మార్క్ను దాటేసిన పసిడి ధర ఈరోజు అత్యంత భారీగా తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 23 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి. 👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,11,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తొలి ఐపీవో వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 25న షేర్లను ఆఫర్ చేయనుంది.ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో గతేడాది ఆగస్ట్లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మూన్ బెవరేజెస్ ఐపీవో యోచన గ్లోబల్ పానీయాల దిగ్గజం కోక కోలా బాట్లర్ మూన్ బెవరేజెస్ (Moon Beverages IPO) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారీగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎంఎంజీ గ్రూప్ కంపెనీ వైస్చైర్మన్ అనంత్ అగర్వాల్ తెలియజేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా ఇప్పటికే రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.వెరసి కొత్త ప్లాంట్లు, సామర్థ్య విస్తరణ, కొత్త మార్కెట్లలో ప్రవేశం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. అస్సామ్లోని గువాహటి, ఒడిషాలోని రూర్కెలాలో ఏర్పాటవుతున్న ప్లాంట్లపై మరిన్ని పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. దీంతో నిమిషానికి 7,000 బాటిళ్ల సామర్థ్యం జత కలవనున్నట్లు తెలియజేశారు.ఐపీవోకు కాంటినుమ్ గ్రీన్క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ( Continuum Green Energy IPO) పబ్లిక్ ఇష్యూకి అనుమతించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్స్ రూ. 2,400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ లిస్టింగ్ ద్వారా రూ. 3,650 కోట్లు సమీకరించనుంది. 2024 డిసెంబర్లో కంపెనీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,100 కోట్లు అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటి అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ తదితరాలను చేపడుతోంది. 2023–24లో కంపెనీ ఆదాయం 33 శాతం ఎగసి రూ. 1,294 కోట్లను తాకింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. జోరు మీద ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. చైనాపై సుంకాలు గతంలో ప్రకటించినంత కఠినంగా ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ను తొలగించకపోవచ్చని కూడా ట్రంప్ సంకేతాలిచ్చారు.సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 528.87 పాయింట్లు లేదా 0.66 శాతం పెరిగి 80,124.46 వద్ద, నిఫ్టీ 50 182.90 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 24,350.15 వద్ద ఉన్నాయి. మార్కెట్ ప్రారంభమయ్యాక ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి తయారీ, సేవల పీఎంఐ ఫ్లాష్ రీడింగ్స్తో పాటు ఎల్టీఐమైండ్ట్రీ, 360 వన్ వామ్, దాల్మియా భారత్ వంటి కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కన్నేశారు. అంతేకాకుండా, ప్రస్తుత మార్కెట్ ర్యాలీ దాదాపు అన్ని స్టాక్స్ను పైకి లేపుతోంది. 16 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా లాభాలను చూస్తున్నాయి. -
రియల్ ఎస్టేట్లోకి ఏఐఎఫ్ పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది. -
ఓఎన్డీసీపై యూటీఐ మ్యూచువల్ ఫండ్స్
ముంబై: ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) నెట్వర్క్పై యూటీఐ మ్యూచువల్ ఫండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టెక్నాలజీ భాగస్వామి ‘సైబ్రిల్లా’ సహకారంతో ఓఎన్డీసీ నెట్వర్క్తో అనుసంధానమైనట్టు యూటీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఆర్థిక సేవల విస్తృతి, పెట్టుబడుల సాధనాల అందుబాటును పెంచడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంది.ఓఎన్డీసీ నెట్వర్క్తో అనుసంధానం కావడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లకు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూటీఐ ఎఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వినయ్ లకోటియా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ, ముఖ్యంగా టైర్–2, 3 పట్టణ వాసులకు ఓఎన్డీసీ ద్వారా తన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. -
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
న్యూఢిల్లీ: ఓవర్నైట్ ఫండ్స్ (డెట్ మ్యూచువల్ ఫండ్స్)కు సంబంధించి కటాఫ్టైమ్లో సెబీ మార్పులు చేసింది. పనిదినంలో మధ్యాహ్నం 3 గంటల వరకు (కటాఫ్ టైమ్) వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏవీ (తదుపరి వ్యాపార దినం ముందు నాటి) వర్తిస్తుంది. 3 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు సాయంత్రం 7 గంటలను కటాఫ్ టైమ్గా సెబీ నిర్ణయించింది.అంటే ఆలోపు వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఈ కొత్త వేళలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్నైట్ పథకాల యూనిట్లను తనఖా నుంచి విడిపించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సబ్యులకు కొత్త మార్పులు అనుకూలించనున్నాయి. వీరు తమవద్దనున్న క్లయింట్ల నిధులను ఓవర్నైట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. తద్వారా ఇన్వెస్టర్ల నిధులకు రిస్క్ ఉండకపోగా, స్టాక్ బ్రోకర్లకు కొంత ఆదాయం కూడా లభిస్తుంటుంది. -
అదానీ నుంచి ఎయిర్టెల్కు స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్తో కలిసి అదానీ డేటా నెట్వర్క్స్(ఏడీఎన్ఎల్) నుంచి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. 2022లో నిర్వహించిన వేలం ద్వారా 26 గిగాహెట్జ్ బ్యాండ్లో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏడీఎన్ఎల్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది.కాగా.. ఈ స్పెక్ట్రమ్ను వినియోగించుకునేందుకు వీలుగా ఏడీఎన్ఎల్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దీనిలో భాగంగా గుజరాత్(100 ఎంహెచ్జెడ్), ముంబై(100 ఎంహెచ్జెడ్), ఆంధ్రప్రదేశ్(50 ఎంహెచ్జెడ్), రాజస్తాన్(50 ఎంహెచ్జెడ్), కర్ణాటక(50 ఎంహెచ్జెడ్), తమిళనాడు(100 ఎంహెచ్జెడ్)లో స్పెక్ట్రమ్ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది. -
భారత్ వృద్ధి అంచనాలు డౌన్
న్యూయార్క్: అంతర్జాతీయంగా అనిశి్చతి, వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. ప్రైవేట్ వినియోగం దన్నుతో భారత వృద్ధి అంచనాలు కాస్త స్థిరంగా ఉండగలవని వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ (డబ్ల్యూఈవో)లో పేర్కొంది. 2025లో గ్లోబల్ వృద్ధి గత అంచనాల కన్నా 0.5 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 2.8 శాతంగా ఉండనుంది.2026లో ఇది 3 శాతంగా ఉండొచ్చు. కెనడా, జపాన్, బ్రిటన్, అమెరికా అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. అమెరికా వృద్ధి గతంలో ఊహించిన దానికన్నా 2.7 శాతం కన్నా చాలా తక్కువగా 1.8% స్థాయిలో ఉంటుందని పేర్కొంది. విధానాలపరమైన అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీన డిమాండ్, ఊహించిన దానికన్నా వినియోగ వృద్ధి నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది. -
భారత్లో పెట్టుబడులు పెట్టండి
శాన్ఫ్రాన్సిస్కో: భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక సహకారం, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ట్యూరింగ్ సీఈవో జొనాథన్ సిద్ధార్్థ, డేటా రోబో సీఈవో దేబాంజన్ సాహా తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. మేకిన్ ఇండియా నినాదం కింద భారత్తో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని థామస్ కురియన్ బృందాన్ని ఆమె కోరారు.భారత ఏఐ మిషన్ను ఈ సందర్భంగా కురియన్ ప్రశంసించారు. మరోవైపు, సిద్ధార్్థతో సమావేశంలో కృత్రిమ మేథకు సంబంధించి భారత్ పాలసీలను మంత్రి వివరించారు. ఏఐ విభాగంలో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడంపై సిద్ధార్థ్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎక్స్లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. కృత్రిమ మేథలో సూపర్పవర్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో తాము కూడా భాగం కావాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్కి దేబాంజన్ సాహా తెలిపారు. అటు వివిధ పెన్షన్ ఫండ్ మేనేజర్లు, ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లతో రౌండ్టేబుల్ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఇంధన రంగం, పర్యావరణహిత ప్రాజెక్టులు, గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆమె వివరించారు. సంస్కరణల దన్ను.. వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా వృద్ధి సాధించడమనేది సాహసోపేత సంస్కరణలతో పాటు దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే విధంగా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉండటం కూడా కీలకమని హూవర్ ఇనిస్టిట్యూషన్లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు.గత దశాబ్దకాలంగా ప్రభుత్వం పలు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని, 20,000 పైగా నిబంధనలను సరళీకరించడంతో పాటు వ్యాపార చట్టాల్లో క్రిమినల్ సెక్షన్లను తగ్గించిందని, ప్రభుత్వ సర్విసులను డిజిటలీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా తయారీ రంగ ఆధారిత వృద్ధికి బాటలు వేసినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకుందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. -
కొనుడే ‘బంగార’మాయే!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వస్తువు ధరలో హెచ్చు తగ్గులు వస్తే వినియోగదారుడు లేదా వ్యాపారిలో ఎవరో ఒకరికి లాభం చేకూరుతుంది. కానీ, బంగారం ధర రూ.లక్ష దాటడం వల్ల అటు కొనుగోలు దారుడు, ఇటు అమ్మకం దారుడు కూడా ఆనందంగా లేకపోవడం గమనార్హం. మంగళవారం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.లక్షా 2 వేలకు చేరింది. గత సంవత్సరం ఇదే సమయంలో రూ.61,000 ఉంది. అంటే ఏడాది కాలంలోనే 62% పెరిగింది. మూడు నెలల క్రితం రూ.80 వేలకు చేరువలో ఉన్న 10 గ్రాముల బంగారం.. 90 రోజుల్లో 20 శాతం పెరిగి రూ.లక్షను దాటింది. దీంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చినా బంగారం దుకాణాల వద్ద పెద్దగా జనం కనిపించక వెలవెలబోతున్నాయి.50% తగ్గిన అమ్మకాలుహైదరాబాద్లో ధరలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉండేది. అయితే 10 గ్రాముల ధర రూ.80 వేలు దాటినప్పటి నుంచి కొనుగోళ్లు మందగించాయి. హైదరాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం దుకాణాల్లో గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 30 నుంచి 50 శాతం వరకు అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తగ్గుదల 35% దాటిందని జెమ్స్ అండ్ జువెల్లరీ అసోసియేషన్ ప్రకటించింది.ఆభరణాల కన్నా ‘ముద్ద’గానే..బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా ఇష్టం. కానీ, ధర భారీగా పెరగటంతో బంగారాన్ని 22 క్యారట్ల ఆభరణంగా ధరించడం కన్నా భవిష్యత్ పెట్టుబడిగా ‘నిల్వ’చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణంగా చేయిస్తే తరువాత ఎప్పుడైనా విక్రయించేటప్పుడు తరుగు, నాణ్యత, వీఏ పేర్లతో దాని విలువను వ్యాపారులు తగ్గించి కొనుగోలు చేస్తారు. అదే బిస్కట్, కడ్డీ రూపంలో ఉంటే విలువలో తేడా ఉండదు. బేగంబజార్లోని బంగారం దుకాణాల్లో గత కొద్ది రోజులుగా 24 క్యారట్ల 100 గ్రాముల బంగారం బిస్కట్లను ఎక్కువగా విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. 10, 20 గ్రాముల బంగారు బిల్లలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ధరలు అనూహ్యంగా పెరగటంతో ఇళ్లలో ఉన్న బంగారాన్ని కూడా విక్రయించి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నవారు కూడా ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారుల్లో ఆందోళనవివాహాల సీజన్లోనూ ప్రజలు పెళ్లిళ్ల బడ్జెట్లో బంగారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పెద్దపెద్ద ఆభరణాల దుకాణాలు ఈఎంఐ స్కీమ్లు, మేకింగ్ చార్జీలపై రాయితీలు, పాత బంగారం మార్పిడి మీద అదనపు బెనిఫిట్స్ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి బంగారు ఆభరణాల దుకాణాలు తెరిస్తే ధరల పెరుగుదలతో ప్రజలు తమ దుకాణాల వైపే రావడం లేదని పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యాపారి కొమురవెళ్లి వెంకటరమణా చారి ఆందోళన వ్యక్తం చేశారు.కొనడానికి ఎవరూ రావడం లేదు10 గ్రాముల బంగా రం ధర రూ.లక్షకు చేరడంతో బేగంబజార్తోపాటు రాష్ట్రమంతటా బంగారం వ్యాపారం పడిపో యింది. బంగారం కొనడానికి ఎవరూ రావడం లేదు. మూడు నెలల్లోనే దాదాపు 50 శాతం కన్నా ఎక్కువే అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు సాధా రణ స్థితికి రావడం ఇప్పట్లో కష్టమే. – కంకర్ల రాకేశ్,బంగారం వ్యాపారి, బేగంబజార్ఖాళీగా కూర్చుంటున్నాం బంగారం ధరలు పెరగడంతో గిరాకీ తగ్గింది. పెళ్లిళ్లు, శుభ కార్యాలయాలకు కూడా ఆభరణాలు చేయించుకోవడానికి జనం రావడం లేదు. కరీంనగర్లో ఎప్పుడూ కళకళలాడే ఆభరణాల దుకాణాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 22 క్యారట్ల ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం బంగారు పరిశ్రమ మీద ఆధారపడ్డ వారిని అంధకారంలోకి నెడుతోంది. – ఈశ్వరోజు వెంకటేశ్వర్లు,రాఘవేంద్ర జ్యువెల్లర్స్, కరీంనగర్ -
Stocks Market: లాభాల ‘సిక్సర్’
ముంబై: బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్ పావెల్ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.⇒ బీఎస్ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్ఎంసీజీ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.5% లాభప డ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్లు 1% రాణించాయి. ⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది. ⇒ మైక్రోఫైనాన్స్ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్ అడిట్ కోసం ఎర్నెస్ట్–యంగ్ నియమించుకుందనే వార్తలతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.⇒ దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్ దాస్ భీంజీ ఝవేరీ(టీజీజెడ్) 6%, స్కై గోల్డ్ 5%, సెన్కో గోల్డ్ 3 శాతం లాభపడ్డాయి. -
పసిడి లక్ష కాంతులు!
న్యూఢిల్లీ: బంగారం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టం నమోదైంది. అక్షయ తృతీయకు వారం రోజుల ముందే కీలకమైన రూ.లక్ష మార్క్ను పసిడి దాటేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ మొదటిసారి 3,500 డాలర్లను అధిగమించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే కలిసొస్తుందన్నది హిందువుల విశ్వాసం. అందుకే ఏటా ఆ రోజున (ఈ నెల 30) కొనుగోళ్లు అధికంగా నమోదవుతుంటాయి.దీనికితోడు మే చివరి వరకు కొనసాగే పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని.. స్టాకిస్టులు, ఆభరణాల వర్తకులు బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం ధరలు ఎగిసేలా చేసినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. 99.9 శాతం స్వచ్ఛత బంగారం ఢిల్లీ మార్కెట్లో రూ.1,800 పెరిగి రూ.1,01,600 ఆల్టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ.2,800 ఎగసి రూ.1,02,100కు చేరుకోవడం విశేషం. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలోకి రూ.98,500వద్దే ఉంది. తాజా పరిణామాలు.. వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సైతం తాజా పసిడి ధరల ఆజ్యానికి కారణమన్నది కామా జ్యుయలరీ ఎండీ కొలిన్షా అభిప్రాయంగా ఉంది. డాలర్ బలహీనత కొనసాగితే అప్పుడు ఇతర కరెన్సీల్లో బంగారం ధరలు దిగిరావచ్చన్నారు. బంగారాన్ని డాలర్ మారకంలోనే మనం కొనుగోలు చేస్తుంటామన్నది తెలిసిందే. మరోవైపు చైనా ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకునే దేశాలపై ప్రతిచర్యలు ఉంటాయన్న చైనా హెచ్చరిక సైతం సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ను పెంచినట్టు కోటక్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీస్) కేనత్ చెయిన్వాలా తెలిపారు.స్వర్ణ యుగంబంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరగడం చూస్తున్నాం. ఇది స్వర్ణయుగం. బంగారానికి ఈ ఏడాది ఎంతో ముఖ్యమైనది. జనవరి నుంచి చూస్తే అంతర్జాతీయంగా బంగారం ధరలు 25% పెరిగి ఔన్స్కు 3,500 డాలర్లకు చేరాయి. భారత్లోనూ చారిత్రక గరిష్టం రూ.లక్ష మార్క్నకు (10 గ్రాములు) చేరడం ద్వారా పసిడిపై ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేసింది. సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సైతం ఆల్టైమ్ గరిష్టానికి చేరింది. ధరల్లో ఆటుపోట్లతో సంబంధం లేకుండా ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా భారత్లో బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం. – సచిన్ జైన్, ప్రపంచ స్వర్ణ మండలి భారత్ సీఈవో100 రోజుల్లోనే... 28 శాతం ర్యాలీ ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే బంగారం ధర 28 శాతం ర్యాలీ చేసింది. జవవరి 1న రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.22,210 లాభపడడం గమనార్హం. పసిడి గమనం విశ్లేషకుల అంచనాలకూ అంతుచిక్కడం లేదు. ఈ ఏడాది చివరికి బంగారం ఔన్స్కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ 10 రోజుల క్రితమే (11న) అంచనా వేసింది. అంత కాలం పాటు నేను ఆగుతానా? అన్నట్టు మంగళవారమే పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 3,509 డాలర్ల రికార్డు స్థాయిని నమోదు చేసింది.ఈ ఏడాది బంగారం 3,700 డాలర్లకు చేరుకోవచ్చన్నది మరో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్స్టాన్లీ అంచనా. ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఈ రికార్డు కూడా త్వరలోనే నమోదవుతుందేమో? చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం కొనసాగినంత కాలం బంగారం ధరలు శాంతించకపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేదంటే డాలర్ అయినా ప్రస్తుత స్థాయి నుంచి మరింత బలహీనడాల్సి ఉంటుంది. అలా జరిగినా పసిడి ధరలు దిగివచ్చే అవకాశాలు ఉంటాయి. -
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్ష దాటిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారంపై భారతదేశ సాంప్రదాయ విశ్వాసాన్ని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు, ఆర్థికవేత్తలు, బిట్కాయిన్లను తీసిపారేస్తూ వాఖ్యానించారు.బంగారం ధర రూ.లక్షను దాటిన క్రమంలో కోటక్ మహింద్రా బ్యాంక్ ఫౌండర్, డైరెక్టర్ ఉదయ్ కోటక్.. భారతీయ గృహిణి తెలివైన ఫండ్ మేనేజర్ అంటూ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ శ్రీధర్ వెంబు కూడా ‘ఎక్స్’లో మరో పోస్ట్ పెట్టారు."బంగారం రూ .1 లక్షను దాటడంతో ఉదయ్ కోటక్ భారతీయ గృహిణిని తెలివైన ఫండ్ మేనేజర్గా ప్రశంసించారు. ఉదయ్ కోటక్ గారితో నేను మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ, కాగితపు ఆస్తులపై ఉన్న అపనమ్మకమే మన దీర్ఘకాలిక సుస్థిరతకు, నాగరికత కొనసాగింపునకు పునాది" అని రాసుకొచ్చారు.ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, పీహెచ్డీ ఆర్థికవేత్తలకు, వారి ఫ్యాన్సీ సిద్ధాంతాలకు డబ్బు చాలా ముఖ్యమైనది. ఇక తన లాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే బిట్ కాయిన్ వైపు చూస్తున్నారని రాసుకొచ్చిన ఆయన 'బంగారమే డబ్బు' అంటూ పేర్కొన్నారు. సామాన్య భారతీయుడికి ఈ విషయం (బంగారం విలువ) తెలుసు. ఓవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నప్పటికీ భారత్ స్థిరత్వం బంగారం నుంచే వచ్చిందంటూ పోస్టును ముగించారు.బంగారం ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఎంసీఎక్స్లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.99,178 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. భౌతిక మార్కెట్లో, బంగారం 10 గ్రాములకు రూ .97,200 వద్ద ట్రేడ్ అయింది. దీనికి 3% జీఎస్టీ కలిపిన తర్వాత తుది రిటైల్ ధర రూ.1 లక్ష దాటింది. -
స్విస్ బ్యాంకుతో ‘360 వన్’ భాగస్వామ్యం
స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజర్, బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీయ వెల్త్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘360 వన్ డబ్ల్యూఏఎం’ ప్రకటించింది. ఈ ప్రత్యేక వ్యూహాత్మక సహకారం ద్వారా ఇరు సంస్థలు క్లయింట్లకు మెరుగైన ప్రయోజనాలను అందించనున్నాయి.ఈ సహకారంలో భాగంగా, రెండు సంస్థల క్లయింట్లకు ఆన్షోర్, ఆఫ్షోర్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్లకు అవకాశం లభించనుంది. అసెట్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సేవలు సైతం పొందే ఆస్కారం ఉంటుంది. అలాగే 360 వన్ తన అనుబంధ సంస్థల ద్వారా భారత్లోని యూబీఎస్ ఆన్షోర్ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తుంది. ఇక యూబీఎస్ కూడా 360 వన్లో 4.95% వాటాను కొనుగోలు చేయనుంది.వృద్ధి అవకాశాలను అన్వేషించడానికి రెండు సంస్థలకు చెందిన సీనియర్ నాయకుల నేతృత్వంలో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక శక్తివంతమైన సహకారం దిశగా మొదటి అడుగు. ఇది తమ క్లయింట్లు, వాటాదారులకు ఉద్యోగులకు విలువ ప్రతిపాదనను మరింత పెంచుతుందని 360 వన్ ఫౌండర్, సీఈవో కరణ్ భగత్ పేర్కొన్నారు. -
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
దేశంలో కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చింది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115BAC కింద దీన్ని ప్రవేశపెట్టారు. ఇది తక్కువ పన్ను రేట్లతో సరళమైన పన్ను నిర్మాణాన్ని అందిస్తుంది. కానీ పాత విధానంతో పోలిస్తే డిడక్షన్లు, మినహాయింపులు తక్కువ ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2026-27) కోసం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1.పన్ను రహిత ఆదాయ పరిమితి ఎక్కువ రూ .12 లక్షల మినహాయింపు పరిమితి, రూ .75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా వేతన జీవులకు రూ .12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మునుపటి రూ .7.5 లక్షల పన్ను రహిత పరిమితి (రూ .7 లక్షలు + రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్) కంటే గణనీయమైన పెరుగుదల. ఇది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.2.అన్ని స్లాబ్లలో తక్కువ పన్ను రేట్లుకొత్త విధానంలో రాయితీ పన్ను రేట్లతో ఏడు స్లాబ్లు ఉన్నాయి. ఇవి రూ.4 లక్షల వరకు ఆదాయానికి 0% నుండి ప్రారంభమై, రూ.24 లక్షలకు పైబడిన ఆదాయానికి 30% వరకు ఉన్నాయి. ఈ విధానం ముఖ్యంగా రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి, పెద్దగా డిడక్షన్లు క్లెయిమ్ చేయని వారికి, పన్ను బాధ్యతను తగ్గిస్తుంది. తద్వారా చేతికందే జీతం ఎక్కువౌతుంది.3.సరళమైన పన్ను ఫైలింగ్.. తక్కువ కంప్లయన్స్తక్కువ డిడక్షన్లు, మినహాయింపులతో (ఉదా., HRA, LTA, లేదా సెక్షన్ 80C ప్రయోజనాలు లేకపోవడం), కొత్త విధానం డాక్యుమెంటేషన్, కంప్లయన్స్ ఇబ్బందులను తగ్గిస్తుంది. దీంతో ఈ విధానం యువ ప్రొఫెషనల్స్ లేదా పాత విధానం డాక్యుమెంటేషన్ భారంగా భావించే వారికి అనువుగా ఉంటుంది.4.లిక్విడిటీ.. ఆర్థిక సౌలభ్యంతప్పనిసరి పన్ను ఆదా పెట్టుబడుల అవసరాన్ని (ఉదా., PPF, ELSS, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియంలు) తొలగించడం ద్వారా కొత్త విధానం ఖర్చు, ఆదా, లేదా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పెట్టడానికి డబ్బు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. ఇది కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులకు లేదా లిక్విడిటీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.5.మెరుగైన స్టాండర్డ్ డిడక్షన్.. ఇతర ప్రయోజనాలుజీతం పొందే వ్యక్తులు రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (గతంలో రూ.50,000 ఉండేది) క్లెయిమ్ చేయవచ్చు. ఫ్యామిలీ పెన్షనర్లు అయితే రూ.25,000 డిడక్షన్ (గతంలో రూ.15,000) పొందవచ్చు. అదనపు డిడక్షన్లలో యాజమాన్యం (పని చేస్తున్న కంపెనీ) ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ (సెక్షన్ 80CCD(2)), అద్దెకు ఇచ్చిన ఆస్తులపై హోమ్ లోన్ వడ్డీ, అగ్నివీర్ కార్పస్ ఫండ్కు విరాళం వంటివి ఉన్నాయి. ఇవి సంక్లిష్ట పెట్టుబడులు లేకుండా కొంత పన్ను ఉపశమనం అందిస్తాయి.ఎవరికి ఎక్కువ ప్రయోజనం?- పెద్దగా డిడక్షన్లు లేకుండా రూ.12.75 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.- పన్ను ఆదా సాధనాలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టని యువ ప్రొఫెషనల్స్ లేదా కొత్తగా సంపాదించేవారు.- దీర్ఘకాలిక, లాక్-ఇన్ పెట్టుబడులు కాకుండా సరళత, సౌలభ్యాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు.గమనించవలసినవి..కొత్త విధానం ఈ ప్రయోజనాలను అందించినప్పటికీ, ఇది అందరికీ సరిపోకపోవచ్చు. మీకు గణనీయమైన డిడక్షన్లు (ఉదా., రూ.30 లక్షలకు పైబడిన ఆదాయాలకు రూ.3.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ, HRA, సెక్షన్ 80C, లేదా హోమ్ లోన్ వడ్డీతో సహా) ఉంటే, పాత విధానం తక్కువ పన్ను బాధ్యతకు దారితీయవచ్చు. మీ ఆదాయం, డిడక్షన్లు, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రెండు విధానాలను ఆదాయ పన్ను కాలిక్యులేటర్ను ఉపయోగించి పోల్చుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. -
కొత్త కస్టమర్లు ఎయిర్టెల్కే ఎక్కువ!
దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జనవరిలో స్వల్పంగా పెరిగి 119 కోట్లకు చేరింది. వైర్లైన్, మొబైల్ సెగ్మెంట్లలో కొత్త సబ్స్క్రయిబర్స్ను దక్కించుకోవడంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో 118.99 కోట్లుగా ఉన్న టెలికాం సబ్స్క్రయిబర్స్ సంఖ్య జనవరిలో 119.20 కోట్లకు పెరిగింది. మొబైల్, వైర్లైన్ సెగ్మెంట్లో ఎయిర్టెల్ యూజర్లు వరుసగా 16.53 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగారు. 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ను వైర్లెస్ సర్వీసుగా ట్రాయ్ వర్గీకరించింది. ప్రస్తుతం ఈ విభాగంలో 48.44 లక్షల యూజర్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో, 8.72 లక్షల సబ్స్క్రయిబర్స్తో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి.మరిన్ని ముఖ్యంశాలు.. » మొబైల్ సెగ్మెంట్లో జియో 46.5 కోట్ల యూజర్లతో నంబర్వన్గా, 38.69 కోట్ల మందితో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా 13 లక్షల కనెక్షన్లను, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 3.69 లక్షలు, ఎంటీఎన్ఎల్ 2,617 మంది కస్టమర్లను కోల్పోయాయి.» వైర్లైన్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 39,953, ఎంటీఎన్ఎల్ 9,904, క్వాడ్రాంట్ 4,741, వొడాఫోన్ ఐడియా 3,447 మంది కస్టమర్లను పోగొట్టుకున్నాయి. » జియో, ఎయిర్టెల్ నిర్దేశిత ఫార్మాట్లో డిసెంబర్, జనవరి డేటాను సమర్పించకపోవడంతో ట్రాయ్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల వివరాలను అప్డేట్ చేయలేదు. -
సెన్సెక్స్ డబుల్ హ్యాట్రిక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. మంగళవారం లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్ల లాభాలతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ బెంచ్మార్క్ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు కూడా విజయ పరంపరను కొనసాగించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్ల సానుకూల తేడాతో 79,728 వద్ద రోజును ప్రారంభించింది. కానీ కొంత సేపటికే లాభాలను కోల్పోయి 79,253 వద్ద ఎరుపులోకి జారుకుంది. తర్వాత పుంజుకుని పాజిటివ్ జోన్లో కన్సాలిడేట్ కాగా, ఇంట్రాడే గరిష్ట స్థాయి 79,824ను తాకింది. చివరకు సెన్సెక్స్ 187 పాయింట్ల లాభంతో 79,596 వద్ద స్థిరపడింది. ఈ ప్రక్రియలో సెన్సెక్స్ గత ఆరు వరుస ట్రేడింగ్ సెషన్లలో 7.8 శాతం లేదా 5,749 పాయింట్లు పెరిగింది.ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,072 వద్ద కనిష్టాన్ని తాకి తిరిగి 24,243 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 0.2 శాతం లేదా 42 పాయింట్ల లాభంతో 24,167 వద్ద స్థిరపడింది. మంగళవారం 29వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ ఎన్ఎస్ఈ బెంచ్మార్క్ గత ఆరు రోజుల్లో 7.9 శాతం లేదా 1,768 పాయింట్లు పెరిగింది.సెన్సెక్స్లోని 30 షేర్లలో ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అదేసమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జొమాటో, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, మైక్రోఫైనాన్స్ పోర్ట్ఫోలియోలో రూ .600 కోట్ల వ్యత్యాసంపై దర్యాప్తు చేయడానికి మరో రౌండ్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడానికి బ్యాంక్ ఈవైని రంగంలోకి దింపడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ 5 శాతం నష్టపోయింది.పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ 1-2 శాతం మధ్య క్షీణించాయి. విస్తృత మార్కెట్ బెంచ్మార్క్ సూచీలను అధిగమించింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ రెండూ మంగళవారం 0.8 శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈలో 1,500 షేర్లు క్షీణించగా, దాదాపు 2,500 షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీ సూచీల్లో బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 2.4 శాతం, ఎఫ్ఎంసీజీ 1.9 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.4 శాతం లాభపడ్డాయి. మరోవైపు ఐటీ, పవర్ సూచీలు భారీగా నష్టపోయాయి. -
వాహనాలకూ సైబర్ రిస్కులు
కార్లు, రవాణా వాహనాలు మరింత కనెక్టెడ్గా, సాఫ్ట్వేర్ ఆధారితమైనవిగా మారిపోతున్న నేపథ్యంలో ఎయిర్బ్యాగ్లలాగా ఆటోమోటివ్ సైబర్సెక్యూరిటీ కూడా ప్రామాణిక ఫీచరుగా మారనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అంతర్గతంగా వాహన నెట్వర్క్ ట్యాంపరింగ్, జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్, స్టీరింగ్..బ్రేకింగ్ మొదలైన సిస్టమ్లను రిమోట్గా కంట్రోల్ చేయడం వంటి సైబర్సెక్యూరిటీపరమైన ముప్పులు కొత్త తరం వాహనాల్లో గణనీయంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇలాంటి రిస్కుల నుంచి వాహనాలను కాపాడేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా పలు సంస్థలు వాహన రంగం కోసం సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్లుగా ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్ల తరహాలోనే డిజిటల్ భద్రత సాధనాలూ వాహనాల్లో తప్పనిసరి ఫీచర్లుగా మారొచ్చని సైబర్సెక్యూరిటీ సంస్థ హ్యాకర్స్ఎరా వ్యవస్థాపకుడు వికాస్ చౌదరి తెలిపారు. ఐడీపీఎస్ (ఇన్ట్రూజన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్స్), వీఎస్ఓసీ (వెహికల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్స్) లాంటి సిస్టమ్లు ముప్పులను నివారించడానికే కాకుండా కొనుగోలు ప్రణాళికలనూ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. రియల్ టైమ్పర్యవేక్షణ..పెద్ద ఎత్తున వాహనాలను నిర్వహించే ఫ్లీట్ ఆపరేటర్లు, కనెక్టెడ్ ప్రజా రవాణా వ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించి ఏ ఒక్క వాహనంలోనైనా సెక్యూరిటీపరమైన సమస్యలు తలెత్తితే అవి మొత్తం నెట్వర్క్ అంతటికీ వ్యాపించే అవకాశం ఉంటుందని చౌదరి తెలిపారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు రూపొందించిన వీఎస్వోసీలు సాంప్రదాయ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లలాగానే పని చేస్తాయి. కానీ ఇవి ప్రత్యేకంగా వాహనాల కోసం రూపొందించినవై ఉంటాయి. వాహనాల నుంచి వీటికి రియల్ టైమ్లో డేటా లభిస్తుంది. తద్వారా రిస్కులకు దారి తీసే ధోరణులను, ముప్పులను ఇవి పసిగట్టగలవు.కొత్త తరం వాహనాలకు డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రాంలను రూపొందించడం కోసం వాహనాల తయారీ సంస్థలు, సరఫరాదారులు, మొబిలిటీ స్టార్టప్లతో తాము కలిసి పని చేస్తున్నట్లు చౌదరి వివరించారు. ఎథర్నెట్, ఆర్ఎఫ్, బ్లూటూత్ మొదలైన వాటన్నింటికీ దేని రిస్కు దానికి ఉంటుందని, ఒక్కో దానికి ఒక్కో రకమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు. కనెక్టెడ్ వాహనాల్లో బలహీనతలను గుర్తించేందుకు, తగిన విధంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుందని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. ఐఎస్వో/ఎస్ఏఈ 21434లాంటి పరిశ్రమ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ద్వారా ఉత్తమ విధానాలను పాటించవచ్చని పేర్కొన్నారు.కంపెనీలు ఎప్పటికప్పుడు వాహన సాఫ్ట్వేర్ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లతో అప్డేట్ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏఐఎస్ 189 ప్రమాణాలు భారత్లో కూడా అమల్లోకి రానున్నట్లు చౌదరి చెప్పారు. ఇక యూఎన్ ఆర్155, ఐఎస్వో 21434లాంటి గ్లోబల్ ప్రమాణాలు కూడా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వాహనాల సైబర్సెక్యూరిటీ కేవలం ఉత్తమ విధానంగానే కాకుండా చట్టబద్ధంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు వాహనం ‘ఎంత మైలేజీ’ ఇస్తుందనే మాట్లాడుకుంటూ ఉండగా.. ఇకపై ‘ఎంత సెక్యూర్గా ఉంటుంది’ అని మాట్లాడుకునే రోజులు వస్తాయని పేర్కొన్నారు. - సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహీంద్రా ఆటో కొత్త అధ్యక్షుడు: ఎవరీ వేలుసామి?
మహీంద్రా ఆటో తన కొత్త అధ్యక్షుడిగా ఆర్ వేలుసామిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆటోమోటివ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ డెవెలప్మెంట్ అధ్యక్షుడిగా ఉన్న వేలుసామి, వీజయ్ నక్రా స్థానంలో తన కొత్త పదవిని చేపడతారు.1996లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరిన వేలుసామి.. వివిధ స్థాయిలలో కీలక పదవులను చేపట్టారు. ఐసీఈ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మహీంద్రా ఆటో అధ్యక్షుడిగా వేలుసామి.. లాభ, నష్టాలు, డెలివరీతో సహా కంపెనీ ఆటోమోటివ్ కార్యకలాపాలకు పూర్తి బాధ్యత ఉంటుంది. వ్యవసాయ పరికరాల రంగానికి ప్రస్తుత అధ్యక్షుడు హేమంత్ సిక్కాను దాని బోర్డు మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (MLL) మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా నియమించింది. మునుపటి సీఈఓ రామ్ స్వామినాథన్ పదవీవిరమణ చేసి కొత్త వృత్తిపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నారు. -
స్టీల్పై సేఫ్గార్డ్ డ్యూటీ: 200 రోజుల వరకూ 12 శాతం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా ఐదు విభాగాల స్టీల్ ప్రొడక్టులపై సేఫ్గార్డ్ డ్యూటీకి తెరతీసింది. 200 రోజులపాటు అమలయ్యే విధంగా 12 శాతం సుంకాన్ని విధించింది. ఈ జాబితాలో హాట్ రోల్డ్ క్వాయిల్స్, షీట్లు, ప్లేట్లు తదితరాలున్నాయి. తద్వారా పెరుగుతున్న దిగుమతుల నుంచి దేశీ సంస్థలకు రక్షణ కలి్పంచేందుకు చర్యలు చేపట్టింది.వాణిజ్య శాఖ దర్యాప్తు విభాగం డీజీటీఆర్ సలహాలమేరకు ప్రభుత్వం స్టీల్ దిగుమతులపై తాజా సుంకాలను విధించింది. వాణిజ్య పరిష్కారాల డైరెక్టర్ జనరల్ సూచనలమేరకు కేంద్ర ప్రభుత్వం 12 శాతం విలువ ఆధారిత ప్రొవిజనల్ సేఫ్గార్డ్ డ్యూటీని విధించినట్లు ఆదాయ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా సుంకాలు గడువుకంటే ముందుగా ఎత్తివేయడం లేదా మార్పులు చేపట్టడం వంటివిలేకుంటే 200 రోజులపాటు అమల్లో ఉంటాయని తెలియజేసింది.సుంకాల పరిధిలో చేర్చిన ఐదు రకాల(విభాగాల) స్టీల్ ప్రొడక్టుల దిగుమతి ధరలు టన్నుకి 675 డాలర్ల నుంచి 964 డాలర్ల మధ్య నిర్ణయించింది. ఈ ధరలకంటే దిగువన దిగుమతయ్యే ప్రొడక్టులకు సేఫ్గార్డ్ డ్యూటీ వర్తించనుంది. వీటికంటే అధిక ధరలకు దిగుమతయ్యే(జాబితాలో చేర్చిన) ప్రొడక్టులపై సుంకాలు అమలుకాబోవు. -
2025 కవాసకి నింజా 650 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి.. దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 2025 నింజా 650 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధర కంటే కూడా రూ. 11000 ఎక్కువ. కాబట్టి ఈ కొత్త బైక్ ధర రూ. 7.27 లక్షలు (ఎక్స్ షోరూమ్).2025 కవాసకి నింజా 650 బైక్ ఇప్పుడు వైట్ / ఎల్లో రంగుతో.. కొత్త ఆకుపచ్చ రంగులో లభిస్తుంది. ఇది చూడటానికి కొంత కవాసకి పోర్ట్ఫోలియోలోని నింజా ఆర్ సిరీస్ బైకు మాదిరిగా ఉంటుంది. ఇందులో 4.3 ఇంచెస్ ఫుల్ డిజిటల్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కవాసకి రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.2025 కవాసకి నింజా 650 బైకులో.. అదే 649 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 67.31 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. 196 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ కెపాసిటీ 15 లీటర్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో.. -
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..రియల్ ఎస్టేట్బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.గోల్డ్ ఈటీఎఫ్లు & సావరిన్ గోల్డ్ బాండ్లుబంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటుస్టాక్లు & మ్యూచువల్ ఫండ్లుబ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్లు & బాండ్లుకార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.డిజిటల్ గోల్డ్ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్ఫామ్లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు. -
ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 22) గరిష్టంగా రూ. 3000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 92,900 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,350 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 2750 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 3000 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 2750 , రూ. 3000 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 92,900 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,01,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 93,050 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 1,01,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 2750, రూ. 3000 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 22) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 59.34 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో.. 79,349.16 వద్ద, నిఫ్టీ 18.50 పాయింట్లు లేదా 0.077 శాతం నష్టంతో.. 24,107.05 వద్ద ముందుకు సాగుతున్నాయి.మనక్సియా స్టీల్స్, Xelpmoc డిజైన్ అండ్ టెక్, సంభావ్ మీడియా, క్షితిజ్ పాలీలైన్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, కేసోరామ్ ఇండస్ట్రీస్, రాజ్ టెలివిజన్ నెట్వర్క్, బినాని ఇండస్ట్రీస్, జెన్సోల్ ఇంజనీరింగ్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాలు
ముంబై: దేశంలో నిరుద్యోగ గణంకాలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తుండడం గమనార్హం.మే 15న ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలను విడుదల చేయనున్నట్టు, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ప్రకటించనున్నట్టు గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. మన దేశంలో నిరుద్యోగ గణాంకాల సేకరణకు సంబంధించి సరైన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు విడుదల చేస్తున్నది కూడా పట్టణ నిరుద్యోగం గురించే. గ్రామీణ నిరుద్యోగ గణాంకాలను ఏడాదికోసారి ప్రకటిస్తోంది. అసంఘటిత రంగం డేటాను సైతం మూడు నెలలకోసారి విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
గూగుల్ ఆధిపత్యానికి చెక్: ఇక అంతా యూజర్ ఇష్టం..
గూగుల్, ఆండ్రాయిడ్ టీవీ కేసు ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. భారతదేశ స్మార్ట్ టీవీ మార్కెట్లో టెక్ దిగ్గజం 'గూగుల్' అనుసరిస్తున్న విధానాలు సరికాదని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (CCI) ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను గూగుల్ ప్లే స్టోర్లో డిఫాల్ట్గా అందించడాన్ని ఇకపై కొనసాగించమని కంపెనీ స్పష్టం చేసింది. సీసి ఆదేశాల మేరకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇండియా స్మార్ట్ టీవీ రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. యాంటీ కాంపిటీటివ్ పద్ధతులు అవలంబిస్తోందని, మార్కెట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోందని సీసీఐ ఆరోపించింది. గూగుల్కు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన భారతదేశంలో.. స్మార్ట్ టీవీల కోసం గూగుల్ రూపొందించిన 'టెలివిజన్ యాప్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్' కింద, తమ ఆపరేటింగ్ సిస్టమ్, ప్లే స్టోర్ & ఇతర అప్లికేషన్లను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా గూగుల్ తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' దర్యాప్తులో గుర్తించింది.గూగుల్, ఆల్ఫాబెట్లపై ఇద్దరు భారతీయ యాంటీట్రస్ట్ న్యాయవాదులు కేసు దాఖలు చేశారు, దీని తర్వాత CCI ఈ విషయంలో దర్యాప్తుకు ఆదేశించింది. గ్లోబల్ టెక్ దిగ్గజం ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్లను లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం సవరించిన వాటిని అభివృద్ధి చేయాలనుకునే చిన్న సంస్థలకు.. గూగుల్ అడ్డంకులను సృష్టించే పద్దతులను అవలంబిస్తున్నట్లు విచారణలో తెలిసింది.సీసీఐ ఆదేశాల మేరకు.. గూగుల్ కంపెనీ ఒక సెటిల్మెంట్ అప్లికేషన్ దాఖలు చేయడానికి అంగీకరించింది. దీని ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల కోసం ప్లే స్టోర్, ప్లే సర్వీసులను ఒకే ప్యాకేజీగా కాకుండా.. విడిగా లైసెన్స్ ఇచ్చేందుకు గూగుల్ ప్రతిపాదించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ప్రీ-ఇన్స్టాలేషన్ కోసం ఉచితంగా అందించబడుతున్న గూగుల్ ప్లే స్టోర్, ప్లే సర్వీసులకు ఇకపై లైసెన్స్ ఫీజు వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.భారతదేశంలో ఆండ్రాయిడ్ టీవీలను విక్రయించే అన్ని భాగస్వాములకు ఓ లేఖ పంపించాలని గూగుల్ను సీసీఐ ఆదేశించింది. ఇకపై వారు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. కాబట్టి తమకు నచ్చిన ఏదైనా ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను వాడుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేయాలని సూచించింది.గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, ప్లే స్టోర్ను ఇష్టపడే వినియోగదారులు ఇకపై టీవీ కొనుగోలు చేసే ముందు.. తాము ఎంచుకున్న మోడల్లో ఏవి ఇన్స్టాల్ అయి ఉన్నాయో రిటైలర్లు లేదా బ్రాండ్లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇకపై ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లు, యాప్ స్టోర్లు కూడా స్మార్ట్ టీవీ తయారీదారులతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి అన్ని అప్లికేషన్ స్టోర్లలో అన్ని యాప్లు అందుబాటులో లేవు. గూగుల్ ప్లే స్టోర్, అమెజాన్ యాప్ స్టోర్ వంటివి టీవీ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి యాప్లను అందిస్తున్నాయి. అనేక ప్రధాన యాప్ డెవలపర్లు కూడా ప్రధానంగా యాపిల్, గూగుల్, అమెజాన్ స్టోర్లకు సేవలు అందిస్తున్నారు.కొత్త ఒప్పందం ప్రకారం.. భారతదేశంలోని ఆండ్రాయిడ్ టీవీ భాగస్వాములు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లను ఎంచుకోవడమే కాకుండా, తమ టీవీలలో ఏ గూగుల్ యాప్లను డిఫాల్ట్గా ఉంచాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం స్మార్ట్ టీవీలకే పరిమితమైంది. భవిష్యత్తులో దీనిని ఇతర పరికరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని సీసీఐ తెలిపింది. ఈ కేసు సెటిల్మెంట్ కింద గూగుల్ 2.38 మిలియన్ డాలర్లు లేదా రూ. 20 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఇక మైనర్లే బ్యాంక్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు: ఆర్బీఐ
ముంబై: పిల్లలు బ్యాంక్ సేవింగ్స్/డిపాజిట్ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్లకు ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది.ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంక్లకు జారీ చేసిన సర్క్యులర్లో ఆర్బీఐ పేర్కొంది.బ్యాంక్లు తమ రిస్క్ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్బుక్ సదుపాయాలను సైతం మైనర్ ఖాతాదారులకు ఆఫర్ చేయొచ్చని తెలిపింది. -
సిరి మా 'లక్ష'మి.. పసిడి పరుగే పరుగు..!
న్యూఢిల్లీ: అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78 వేలు పలికిన 10 గ్రాముల 24 క్యారట్ల ధర తాజాగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కలుపుకుని ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. సోమవారం బెంగళూరు బులియన్ మార్కెట్లో రూ. 1,02,000గా పసిడి ధర నమోదైంది. ఇక ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1,650 పెరిగి రూ. 99,800 మార్క్ను తాకగా హైదరాబాద్లో అటు ఇటుగా రూ. 1,00,100కు చేరుకుంది. మరోవైపు 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ఢిల్లీలో రూ. 1,600 పెరిగి రూ. 99,300 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలహీనపడటం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం బంగారం కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 26 శాతం ర్యాలీ చేసింది. 10 గ్రాములకు రూ. 20,850 పెరిగింది. మరోవైపు వెండి కిలో రూ. 500 పెరిగి రూ. 98,500 మార్క్ను చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ (31.1 గ్రాములు)కు 101 డాలర్ల వరకు ఎగసి 3,430 డాలర్లకు చేరుకుంది. 2006 వరకు నాలుగు అంకెల స్థాయికే పరిమితమైన బంగారం ధర.. 2007 నుంచి అయిదు అంకెల స్థాయిలోకి అడుగుపెట్టింది. ఏటా ధర వృద్ధి చెందుతూ 2012లో రూ.31 వేలకు చేరినప్పటికీ.. ఆ తరువాత పసిడి ధర ఒడిదుడుకులకు లోనై తిరోగమనం చెందింది. ఇక 2016 నుంచి ఏటా దూకుడు కొనసాగించింది.ఎంసీఎక్స్లోనూ రికార్డులు..మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్) లోనూ బంగారం రూ. 98 వేల రికార్డు స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల జూన్ నెల కాంట్రాక్టు ధర రూ. 2,111 పెరగడంతో (2.22%).. ఆల్టైమ్ గరిష్టం రూ. 97,365 నమోదైంది. ఆగస్ట్ నెల కాంట్రాక్టు సైతం రూ. 2,104 పెరిగి రూ. 98,000కు, అక్టోబర్ కాంట్రాక్టు రూ. 2,617 పెరిగి రూ. 98,000కు చేరడం గమనార్హం.బంగారం అంటే సంపద. కుటుంబానికి ఆర్థిక భరోసా. అభివృద్ధికి సూచిక.కష్టకాలంలో తోడుంటుందన్న ఓ నమ్మకం. సామాన్యుడైనా, సంపన్నుడైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం, పెట్టుబడిగా దాచుకోవడం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా.. పండగైనా, వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికీ ఒక సాధనమైంది. తరతరాలుగా కుటుంబంలో భాగమైన ఈ పుత్తడి ఇప్పుడు అందనంత దూరం పరుగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని రూ.లక్ష దాటింది.ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులూ ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగ దారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెబుతున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణేల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. - నూగూరి మహేందర్ ఎందుకీ పరిస్థితి?ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా–చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదల కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి.గరిష్టాలూ గరిష్టమే..పసిడి 2024లో 40కిపైగా సందర్భాల్లో ఆల్టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్టాలు గరిష్ట స్థాయిలో నమోదు కావడం విశేషం. ఔన్స్ ధర 2,650 డాలర్లతో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్లు బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావడం గమనార్హం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆ్రస్టేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీలలో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 2025 మార్చి 14న 3,000 డాలర్లు తాకి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఔన్స్ పసిడి రేటు 2,500 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు చేరుకోవడానికి కేవలం 210 రోజులు పట్టింది. గత రికార్డులు చూస్తే బంగారం ధర 500 డాలర్లు పెరగడానికి సగటున 1,708 రోజుల సమయం తీసుకుంది. వినియోగంలో మనం ఎక్కడంటే..⇒ 2024 నాటికి భారతీయుల వద్ద పుత్తడి నిల్వలు – 25,000 టన్నులు ⇒ ప్రపంచ మొత్తం పరిమాణంలో భారతీయుల వద్ద ఉన్న పసిడి – 11.56 శాతం ⇒ యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉంది. రూపాయి బలపడటంతో ఉపశమనమే..డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూ.87.95 తాకి ఆల్ టైమ్ గరిష్టం నమోదు చేసింది. రూపాయి అదే స్థాయిలో ఉన్నా, మరింత బలహీనపడ్డా భారత్లో ఈపాటికే గోల్డ్ రేట్ రూ.లక్ష దాటేది. కొద్ది రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి బలపడుతుండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. సోమవారం డాలర్తో రూపాయి మారకం విలువ రూ.85.38గా నమోదైంది. ఇక 2025 జనవరి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.78 వేలకు అటుఇటుగా పలికింది. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ధర రూ.18.75 మాత్రమే.ప్రత్యామ్నాయం వైపు కొనుగోలుదారుల చూపు..సంప్రదాయంగా భారతీయ కొనుగోలుదారులు పెట్టుబడికి విలువ, ఆకట్టుకునేలా ఉండేలా 22 క్యారెట్లతో తయారైన బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. అయితే పెరుగుతున్న ధరలు వారిని ప్రత్యామ్నాయాలను అన్వేషించేలా చేశాయి. ఆకర్షించే రూపు, సరసమైన ధర రెండింటినీ అందించే క్లిష్ట, తేలికైన డిజైన్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో 18, 14 క్యారట్ల ఆభరణాలు ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. తక్కువ బరువుతో సంప్రదాయ డిజైన్లను ఆభరణాల తయారీదారులు రూపొందించడానికి తయారీ సాంకేతికతలో వచి్చన పురోగతి వీలు కల్పించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 22 క్యారెట్లతో తయారు చేసిన ఆభరణాల్లో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% స్వచ్ఛమైన బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 18 క్యారెట్లతో తయారైన ఆభరణం ధర దాదాపు ఐదో వంతు తక్కువగా ఉంటుంది. తక్కువ ధర, ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ క్రమంగా ఊపందుకుంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా రెండేళ్ల క్రితం కేవలం 5–7% ఉండగా ఇప్పుడు 15% కంటే ఎక్కువగా పెరిగిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.ఆభరణాల్లో మనమే ఫస్ట్..భారత్లో ఏటా 10 లక్షలకుగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లకే ఏటా 300–400 టన్నుల పసిడి అమ్ముడవుతుందని కళ్యాణ్ జువెల్లర్స్ అంటోంది. దీపావళి, అక్షయ తృతీయ వంటి శుభదినాల్లో హిందువులు పసిడిని కొనుక్కుంటున్నారు. చైనాలోనూ అంతే. పెళ్లిళ్లు, బిడ్డ పుట్టిన నెలరోజులకు జరిపే వేడుక, ఇతర ముఖ్య సందర్భాల్లో ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. చైనాలో అత్యధికులు టియోచు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం వరుడి కుటుంబం వధువు కోసం నెక్లెస్, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాన్ని కొనుగోలు చేస్తారు. చైనాను మించి ప్రపంచంలో అత్యధికంగా 2024లో భారతీయ వినియోగదార్లు 560 టన్నుల ఆభరణాలను అందుకున్నారు. 510 టన్నులతో చైనా రెండవ స్థానంలో ఉంది. గత ఏడాది భారతీయులు 240 టన్నుల గోల్డ్ బార్స్, కాయిన్స్ను కొనుగోలు చేస్తే చైనా వాసుల విషయంలో ఇది 345 టన్నులు ఉంది.పెట్టుబడిగా బంగారం..సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను మినహాయిస్తే ప్రపంచ పసిడి డిమాండ్లో ఇండోనేసియా, వియత్నాం సహా ఆసియా వాటా ఏకంగా 64.5 శాతానికి చేరుకుంది. అయితే పెట్టుబడి స్వేచ్ఛ సూచికలో ఆసియా దేశాలు ప్రధానంగా భారత్, చైనా పేలవంగా ఉన్నాయి. భారతీయ కుటుంబాల్లో 6 శాతం కంటే తక్కువ సంపద ఈక్విటీల్లో, 15 శాతం బంగారంలో పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో చైనీయులు బంగారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏటా 1–2 శాతం వడ్డీ ఇచ్చే డిపాజిట్లకు బదులు చైనీయులు చిన్నమొత్తంలో పసిడిని దక్కించుకుంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ బాటలో పెట్టుబడిగా ముడి బంగారాన్ని కొంటున్నారు. ఎగుమతులు డీలా..భారత్ నుంచి 2024–25లో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 11.72 శాతం క్షీణించి రూ. 2,43,390 కోట్లకు చేరాయి. అలాగే దిగుమతులు 11.96 శాతం తగ్గి రూ.1,67,384 కోట్లుగా ఉన్నాయి. యూఎస్, చైనా మార్కెట్లు నిదానించడం, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో యుద్ధాలు, రష్యా తవ్విన వజ్రాలపై ఆంక్షలు, చవకగా లభించే ల్యాబ్ తయారీ వజ్రాలు వెరసి రెండేళ్లుగా దేశం నుంచి ఎగుమతులు తగ్గడానికి కారణం అయ్యాయి. విదేశాలకు సరఫరా అయిన రత్నాలు, ఆభరణాల్లో యూఎస్ వాటా ఏకంగా 30.4 శాతం ఉంది. అయితే అమెరికా భారీ సుంకాలను ప్రకటించిన తర్వాత ఎగుమతుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగంలో అతిపెద్ద మార్కెట్ను ప్రభావితం చేసే కొత్త సుంకాలు.. డైమండ్ కటింగ్, ఆభరణాల తయారీలో ప్రపంచంలో ముందంజలో ఉన్న భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అడ్డుకుంటాయని భావిస్తున్నారు.ఎస్జీబీల మాటేమిటి?భారత్లో సావరిన్ గోల్డ్ బాండ్ పథకం (ఎస్జీబీ) 2015 నవంబర్లో ప్రారంభం అయింది. పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద బకాయి ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్లను రిడీమ్ చేయాలంటే ప్రభుత్వం సుమారు రూ. 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 7 విడతల బాండ్లను పూర్తిగా తిరిగి చెల్లించింది. 8వ విడతకు ముందస్తు రిడెమ్షన్ కూడా ఆఫర్ చేసింది. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది. పెరుగుతున్న బాధ్యతను సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం గోల్డ్ రిజర్వ్ ఫండ్ (జీఆర్ఎఫ్)ను సృష్టించింది. 2023–24లో ఈ నిధిలో రూ. 3,552 కోట్లు జమ చేసింది. దీన్ని 2024–25 సవరించిన బడ్జెట్లో రూ. 28,605 కోట్లకు పెంచింది. గోల్డ్ బాండ్స్ కింద ఇన్వెస్టర్లకు 2024–25 చివరి నాటికి చెల్లించాల్సిన మొత్తం రూ. 85,000 కోట్లకు చేరుకుంటుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. పసిడి దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం లేకపోగా దూసుకుపోతున్న పుత్తడి ధరలతో ఖజానాపై ఆర్థిక భారం పడింది. దీంతో పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అందం, గుర్తింపు వ్యక్తీకరణ..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత జీడీపీకి 7% సమకూరుస్తోంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ మార్కెట్ విలువ దేశంలో సుమారు రూ.6,82,960–7,25,645 కోట్లు ఉంది. 2035 నాటికి ఇది రూ.19,20,825 కోట్లకు చేరుకుంటుందని అంచనా. సంప్రదాయికంగా ఆభరణాలు ఒక పెట్టుబడి. ఇప్పుడు ఇది అందం, గుర్తింపు వ్యక్తీకరణ. ఈ మార్పు అన్ని వయసుల వారికీ వర్తిస్తుంది. భిన్న డిజైన్లు కోరుకుంటున్నప్పటికీ యువ వినియోగదారులు ఆభరణాలపట్ల మొగ్గు చూపుతున్నారు. - సందీప్ కోహ్లీ సీఈవో, ఇంద్రియ, ఆదిత్య బిర్లా జువెలరీ బంగారం ధర పెరుగుదలకు నిపుణులు చెబుతున్న కారణాలు....: వాణిజ్య సుంకాలు :..సుంకాల కారణంగా ప్రపంచమార్కెట్లు తీవ్ర అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ ప్రకటించిన 90 రోజుల విరామం, ఆ తర్వాత ఏవైనా పరిణామాలు బంగారాన్ని సురక్షిత స్వర్గధామంగా ఆకర్షణీయంగా ఉంచుతాయి. అమెరికా–చైనాప్రతీకార చర్యలు ఇప్పటికే స్వల్పకాలంలో డిమాండ్ను పెంచుతున్నాయి...: సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోళ్లు :..కేంద్ర బ్యాంకులు దశాబ్దాలుగా స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. మూడేళ్లలో ఇవి ఏటా 1,000 టన్నులకుపైగా సమకూర్చుకున్నాయి. మార్చి 2025లో వరుసగా 5వ నెలలోనూ చైనా బలమైన బంగారం కొనుగోళ్లను నివేదించింది...: స్టాగ్ఫ్లేషన్ ఆందోళనలు :..తాజా యూఎస్ ఫెడ్ పాలసీ మినిట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్టాగ్ఫ్లేషన్ వైపు మళ్లవచ్చనే ఆందోళనలను సూచిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధి, అధిక నిరుద్యోగితను స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం మెరుగైన పనితీరు కనబరుస్తుంది...: చైనా ఈటీఎఫ్ పెట్టుబడులు :..చైనా గోల్డ్ ఈటీఎఫ్లలో రికార్డు స్థాయిలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2025లోనూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 2024 నుంచి అంతర్జాతీయంగా ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్నాయి...: ఫెడ్ రేటు కోతలు :..యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో మరో రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది బంగారం ధరల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. ..: స్థిరమైన పనితీరు :..2000 నుంచి 2025 వరకు బంగారం రెండుసార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ అనుకూల రాబడిని అందించింది...: భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు :..రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణ పతనం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ అశాంతి వరకు భౌగోళిక రాజకీయ అనిశ్చితి బంగారం డిమాండ్ను కొనసాగిస్తున్నాయి...: కరెన్సీ హెచ్చుతగ్గులు :..డాలర్ సూచిక మూడేళ్ల కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. స్విస్ ఫ్రాంక్, జపనీస్ యెన్, యూరోలతో పోలిస్తే తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ కరెన్సీలలో బంగారం చౌకగా మారింది...: పెరుగుతున్న రుణ స్థాయిలు :..2024 నవంబర్లో యూఎస్ జాతీయ రుణం రికార్డు స్థాయిలో 36 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఈ రుణాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై పెరుగుతున్న ఆందోళనలతో బంగారం సహజ హెడ్జ్గా మారింది. ప్రపంచ రుణం కూడా పెరిగింది. ..: మార్కెట్ అస్థిరత :..2025లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అస్థిరత పెరిగింది. పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలు దెబ్బతిన్నాయి.వాణిజ్య ఉద్రిక్తతలకుతోడు వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక అనిశి్చతులు, డాలర్ బలహీనపడడం బంగారం, వెండి ధరల పెరుగుదలకు మద్దతునిచ్చాయి. ఈ ఏడాది బంగారం ఇప్పటికే 25 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 2 సుంకాలపై ప్రకటన తర్వాత నుంచి చూసినా 6 శాతం పెరిగింది.- సతీష్ కోటక్ మహీంద్రా ఏఎంసీ ఫండ్ మేనేజర్ ఈటీఎఫ్ ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల డిమాండ్ పెరిగింది.భారత్లో రానున్న పండుగల సీజన్నుదృష్టిలో పెట్టుకుని చూస్తే బంగారానికి అదనపు మద్దతు లభించనుంది. సుంకాలకు సంబంధించి అనిశ్చితి, యూఎస్ డాలర్ బలహీనత, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం బంగారం ధరల ర్యాలీకి తోడ్పడుతోంది. – జేఎం ఫైనాన్షియల్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ -
హైదరాబాద్లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్లో భాగమైన క్యారకల్తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు. -
స్మార్ట్ఫోన్లు, పీసీల తయారీ కేంద్రంగా భారత్
ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాబ్లు/వ్యక్తిగత కంప్యూటర్ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు, ప్రతీకార టారిఫ్ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది. → అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్పాయింట్ అంచనా వేస్తోంది. → ల్యాప్ట్యాబ్లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్ట్యాబ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది. ‘‘ల్యాప్ట్యాబ్లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్ నేపథ్యంలో హెచ్పీ, డెల్ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్వేర్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు. అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్ నివేదిక చెబుతోంది. డెల్ సంస్థ ల్యాప్ట్యాబ్ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్ దేశాలకు 45% మార్చనుంది. -
అమెరికాతో ఒప్పందంపై చురుగ్గా చర్చలు
శాన్ఫ్రాన్సిస్కో: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో చర్చలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెప్టెంబర్–అక్టోబర్ నాటికి తొలి దశకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. భారత్ సహా పలు దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార టారిఫ్లు ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాలు బీటీఏపై కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చలను రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, సెమీకండక్టర్లు, రెన్యువబుల్ ఎనర్జీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేథ మొదలైన వాటిల్లో పురోగమిస్తున్న భారత్.. భవిష్యత్తులో ఆయా రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆమె చెప్పారు. -
ఏటా 80 లక్షల ఉద్యోగాలు
న్యూయార్క్: వచ్చే 10–12 ఏళ్లలో భారత్ ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకోసం స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా కూడా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1990లలో సంస్కరణలు అమల్లోకి వచ్చాక సుమారు ముప్ఫై ఏళ్ల పాటు దేశానికి వెలుపల పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, వచ్చే 10–20 ఏళ్ల పాటు అలా ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా ఏ విధంగానైతే తయారీ రంగంలో ఆధిపత్యం సాధించిందో, మనం కూడా జీడీపీలో తయారీ రంగ వాటాను పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొలంబియా వర్సిటీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సంపన్న దేశాలకు కృత్రిమ మేథ, టెక్నాలజీ, రోబోటిక్స్లాంటివి సవాలు కాదని, కానీ అభివృద్ధి ప్రస్థానంలో ఉన్న దేశాలకు సమస్యాత్మకంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ‘భారీ జనాభా ఉండే భారత్ ఇది పెద్ద సవాలే. దీనికి సులభతరమైన సమాధానాలేమీ లేవు. ఓవైపు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు, ఐటీ నైపుణ్యాల అవసరం తక్కువగా ఉండే సరీ్వస్ కొలువులకు కృత్రిమ మేథతో ముప్పు పొంచి ఉంది. మరోవైపు, ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది‘ అని నాగేశ్వరన్ వివరించారు.చిన్న సంస్థలకు అనుకూల పరిస్థితులు కల్పించాలి..2047 నాటికి భారతీయ సంస్థలను అంతర్జాతీయ వేల్యూ చెయిన్లలో భాగం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) అనుకూల పరిస్థితులు కల్పించాల్సి ఉంటుందని నాగేశ్వరన్ చెప్పారు. తయారీ, ఎంఎస్ఎంఈలు రెండూ కలిసి ప్రయాణిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శక్తివంతమైన తయారీ హబ్లుగా ఎదిగిన దేశాలన్నింటిలోనూ ఎంఎస్ఎంఈలకు అనువైన పరిస్థితులను కల్పించడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను మరింత రాబట్టుకోవడమో లేదా వచ్చిన పెట్టుబడులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.8 శాతం వృద్ధి రేటు కష్టమే.. ప్రస్తుత పరిస్థితుల్లో 8 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించడం కష్టమైన వ్యవహారమేనని నాగేశ్వరన్ తెలిపారు. అయితే, దేశీయంగా నియంత్రణలను సడలించడంపై దృష్టి పెట్టి, రాబోయే ఒకటి..రెండు దశాబ్దాల పాటు స్థిరంగా 6.5 శాతం వృద్ధినైనా సాధించగలిగితే.. నెమ్మదిగా 7 శాతం వైపు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. విధానాలపరంగా చూస్తే, గతంలోలాగా జీడీపీ వృద్ధిలో ఎగుమతులు ప్రాధాన్య పాత్ర పోషించే పరిస్థితి ఉండకపోవచ్చని నాగేశ్వరన్ వివరించారు. ఆర్థిక సంక్షోభానికి ముందు తొలి దశాబ్దకాలంలో ఏటా జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 40 శాతం వరకు ఉండేదని, అప్పట్లో స్థూల దేశీయోత్పత్తి సగటున 8–9 శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. రెండో దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 20 శాతానికి పడిపోయిందని, మూడో దశాబ్ద కాలంలో ఇది మరింతగా తగ్గిపోవచ్చని నాగేశ్వరన్ చెప్పారు. అలాగని ఎగుమతులను తక్కువ చేసి చూడటానికి వీల్లేదని, వాటితో పాటు దేశీయంగా నాణ్యత, పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, లాజిస్టిక్స్, లాస్ట్–మైల్ కనెక్టివిటీలాంటి అంశాలపైనా మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. -
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తన సరికొత్త ఒప్పో కే13 5G (Oppo K13 5G) స్మార్ట్ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. రూ. 20,000 సెగ్మెంట్లోనే స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, భారీ 7000mAh బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్ వచ్చింది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.ఉన్నాయి.ధర.. 8GB RAM + 128GB స్టోరేజ్: రూ.17,9998GB RAM + 256GB స్టోరేజ్: రూ.19,999లాంచ్ ఆఫర్: లాంచ్ రోజున, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఫలితంగా ధరలు రూ.16,999, రూ.18,999కి తగ్గుతాయి. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.లభ్యత: 2025 ఏప్రిల్ 25 నుండి ఫ్లిప్కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుడిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్ HD+ (2400x1080 పిక్సెల్స్) AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ప్రాసెసర్: 4nm క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా-కోర్ (2.3GHz వరకు), అడ్రినో 810 GPUతో, స్నాప్డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లుఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15, 2 సంవత్సరాల OS అప్డేట్స్. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్.కెమెరా: వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.బ్యాటరీ: 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 62%, గంటలోపే పూర్తి ఛార్జ్) -
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
భారతదేశంలో బంగారం ధర (10 గ్రాములకు) రోజుకు రోజుకు రయ్ మంటూ దూసుకెళ్లి రూ.లక్షను తాకింది. ఇక రవ్వంత బంగారమైనా కొనగలమా అని సామాన్యులను నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో భారత్ కంటే చవగ్గా బంగారం దొరికే దేశాలు ఏమైనా ఉన్నాయా అనే ఆలోచన చాలా మందిలో వచ్చే ఉంటుంది.తక్కువ దిగుమతి సుంకాలు, పన్ను మినహాయింపులు, పోటీ మార్కెట్లు, కరెన్సీ మారకం రేట్ల కారణంగా అనేక దేశాలు భారత్ కంటే తక్కువ ధరలలో బంగారాన్ని అందిస్తున్నాయి. 2025 ఆరంభంలో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా భారతదేశం కంటే చౌకగా బంగారం లభించే దేశాలేవో ఇక్కడ తెలియజేస్తున్నాం.దుబాయ్, యూఏఈ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.78,960 (2025 ఫిబ్రవరి నాటికి). ఎందుకు చౌక అంటే.. దుబాయ్ పన్ను రహిత బంగారం షాపింగ్కు ప్రసిద్ధి చెందింది. బంగారం కొనుగోళ్లపై వ్యాట్ లేదా దిగుమతి సుంకాలు ఉండవు. డీరాలోని గోల్డ్ సౌక్ అంతర్జాతీయ రేట్లకు దగ్గరగా పోటీ ధరలను అందిస్తుంది. భారతీయ ప్రయాణికులు పురుషులైతే 20 గ్రాములు, మహిళలైతే 40 గ్రాములు వరకు డ్యూటీ ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేస్తే 6% కస్టమ్స్ డ్యూటీ పడుతుంది.హాంకాంగ్ ఈ దేశంలో 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.79,400 (2025 ఫిబ్రవరి నాటికి) ఉంది. హాంకాంగ్ తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్ నుండి ప్రయోజనం పొందుతుంది. బంగారం వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం, దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ భారతదేశం కంటే బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.టర్కీ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.79,310 (2025 ఫిబ్రవరి నాటికి). ఇస్తాంబుల్లోని గ్రాండ్ బజార్లో టర్కీ శక్తివంతమైన బంగారం మార్కెట్ తక్కువ దిగుమతి సుంకాలు, బంగారం హస్తకళ సంప్రదాయం నుండి ప్రయోజనం పొందుతుంది, ధరలను పోటీగా చేస్తుంది. అయితే హస్తకళ, మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలు మారవచ్చు.👉ఇది చదవారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’ఇండోనేషియా 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.71,880 (2024 అక్టోబర్ నాటికి). ఇండోనేషియా తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్ను కలిగి ఉంది. జకార్తాలోని స్థానిక ఆభరణ వ్యాపారులు సరసమైన రేట్లకు బంగారాన్ని అందిస్తారు. 2025 ఏప్రిల్ నాటికి ధరలు కొద్దిగా పెరిగి ఉండవచ్చు. కానీ ఇండోనేషియాలో బంగారం ధర భారతదేశం కంటే గణనీయంగా చౌకగానే ఉంటుంది.మలావీ ఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.72,030 (2024 అక్టోబర్ నాటికి). పన్నులు లేదా సుంకాలు వంటి అదనపు ఖర్చులు తక్కువగా ఉండటం మలావీని ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అతి చౌకైన మార్కెట్లలో ఒకటిగా చేస్తుంది. అయితే అంతర్జాతీయ కొనుగోలుదారులకు సౌకర్యం పరిమితంగా ఉండవచ్చు.కంబోడియా ఇక్కడ 24-క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.72,060 (అక్టోబర్ 2024 నాటికి). ఈ దేశంలో బంగారం ధర ఎందుకు చౌకగా ఉంటుందంటే.. కంబోడియా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, సుంకాల నుండి ప్రయోజనం పొందుతుంది. తక్కువ ధరలలో ఉన్నతమైన బంగారాన్ని అందిస్తుంది.కెనడాఈ దేశంలో 24-క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు రూ.72,070 (2024 నవంబర్ నాటికి). ఇక్కడ ఎందుకు చౌక అంటే.. కెనడా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, బంగారం ఉత్పత్తికి సమీపంలో ఉండటం నుండి ప్రయోజనం పొందుతుంది, ధరలను పోటీగా ఉంచుతుంది. అయితే కరెన్సీ మారకం హెచ్చుతగ్గులకు ధరలు లోబడి ఉంటాయి.ఇంగ్లండ్ఇంగ్లండ్లో 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.70,370 (నవంబర్ 2024 నాటికి). ఇంగ్లండ్ బంగారం మార్కెట్ అత్యంత పోటీతత్వం కలిగి ఉంది. భారత్లో విధించే 3% జీఎస్టీ, దిగుమతి సుంకాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ పన్నులు ఉన్నాయి. అయితే రూపాయితో పోలిస్తే పౌండ్ బలం ధరలను ప్రభావితం చేస్తుంది.ఆస్ట్రేలియాఇక్కడ 24-క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.72,440 (2024 నవంబర్ నాటికి). ఈ దేశంలో బంగారం ధరలు చౌకగా ఉండటానికి కారణం ఇక్కడి దేశీయ ఉత్పత్తి, తక్కువ దిగుమతి సుంకాలు.ధరల అస్థిరత గ్లోబల్ ట్రెండ్లు, కరెన్సీ మారకం రేట్లు, భౌగోళిక రాజకీయ కారకాల కారణంగా బంగారం ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. పైన పేర్కొన్న ధరలు 2024 అక్టోబర్ నుండి 2025 ఫిబ్రవరి వరకు డేటా ఆధారంగా ఉంటాయి. 2025 ఏప్రిల్ నాటికి కొద్దిగా మారి ఉండవచ్చు. -
హైదరాబాద్లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
జపాన్కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Daifuku Intralogistics India) తెలంగాణలోని హైదరాబాద్లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇంట్రాలాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.227 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.ఈ-కామర్స్, రిటైల్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలలో ఆటోమేషన్కు పెరుగుతున్న డిమాండ్ను తీర్చేలా హైదరాబాద్లోని ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని కంపెనీ రూపొందించింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, సస్టైనబుల్ పద్ధతులను ఈ కేంద్రం సమగ్రపరుస్తుంది. ఇది 2030 నాటికి భారతదేశ లాజిస్టిక్స్ అండ్ వేర్హౌసింగ్ మార్కెట్ 650 బిలియన్ డాలర్లను దాటే అంచనాకు అనుగుణంగా ఉంటుంది.ఈ గుర్తించదగిన పెట్టుబడి భారతదేశ "మేక్ ఇన్ ఇండియా" దృష్టిని బలోపేతం చేస్తుంది. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుంది. అలాగే భారత్ను అత్యాధునిక ఇంట్రాలాజిస్టిక్స్ సొల్యూషన్స్కు కేంద్రంగా నిలుపుతుంది. భారత్ తమకు అత్యంత వ్యూహాత్మక గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుందని డైఫుకు కో., లిమిటెడ్ సీఈవో హిరోషి గెషిరో విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కేంద్రం భారత్, జపాన్ మధ్య గల బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా సీఈవో అసిమ్ బెహెరా మాట్లాడుతూ ఈ అసాధారణ ఇన్నోవేషన్ పెట్టుబడి భారతదేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సొల్యూషన్స్ను అందించే తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇంజినీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ రంగాల్లో 100 మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. -
రూ.లక్షకు చేరిన బంగారం ధర.. ఆల్ టైం హై
దేశంలో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్లో సోమవారం సాయంత్రానికి (April 21) తులం బంగారం ధర రూ. లక్షను తాకినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 10 గ్రాముల బంగారం రూ.2,350 పెరిగింది. అంతర్జాతీయంగా జౌన్స్ బంగారం 3400 డాలర్లు దాటింది.ప్రస్తుత ధరలు👉హైదరాబాద్లో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,660 వద్ద ఉంది. 👉బెంగళూరులో రూ.99,860👉విశాఖపట్నంలో రూ.99,770👉చెన్నైలో రూ.99,740👉ఢిల్లీలో రూ.99,555ఈ ధరల పెరుగుదలకు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికన్ డాలర్ బలహీనత, సురక్షిత ఆస్తుల కొనుగోలు పెరగడం కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 3,391-3,404 డాలర్ల వద్ద ఉన్నాయి.కాగా ఈరోజు ఉదయం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే..
భవన నిర్మాణం సమయంలో తడిగా ఉండే ప్రదేశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆయా ప్రాంతాల వద్ద అత్యంత నాణ్యత ఉండేలా చూసుకుంటే.. మన కలల సౌధం పది కాలాల పాటు దృఢంగా ఉంటుంది. మరుగుదొడ్లు, స్నానాల గదులు, కిచెన్ సింక్, వాషింగ్ మిషన్ ఉండే చోట నిర్మాణం సమయంలోనే నాణ్యత పాటించేలా చూసుకోవడం కూడా అవసరం. - సాక్షి, సిటీబ్యూరోముఖ్యంగా మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తలనొప్పిగా మారుతుంటాయి. ఇంటి కొనుగోలు సమయంలోనే ఈ విషయాలు గమనించాలి. పైకి ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఎంత క్వాలిటీ వస్తువులు వాడారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి.వెంటనే అప్రమత్తం.. వాటర్ ప్రూఫింగ్ సక్రమంగా లేకుంటే టైల్స్పై నిలిచిన నీటి నుంచి సన్నగా లీకేజీ ప్రారంభమవుతుంది. ఇందుకు వ్యక్తిగత గృహాలు, విల్లాలు ఏవీ మినహాయింపు కాదు. లీకేజీకి ఎక్కడైనా అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన సంవత్సరం.. ఆ తర్వాత ఈ సమస్య బయట పడుతుంది. గోడలకు చెమ్మ రావడం, వాసన వస్తుండటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే సమస్య క్రమంగా భవనమంతా వ్యాపిస్తుంది.అదే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల భవనాల్లో మన ఫ్లాట్ కింద ఉన్న వారికి సమస్యలు మొదలవుతాయి. గోడలకు చెమ్మ రావడం, రంగు మారిపోవడం, పెచ్చులుగా రంగు ఊడిపోతుండడం, దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య తమ ఫ్లాట్లోనే ఉందని తొలుత అంతా భావిస్తారు. భవన నిర్మాణదారుడు సరైన వాటర్ ప్రూఫింగ్ విధానం పాటించకపోవడంతో పైఫ్లాట్ నుంచి లీకేజీ అవుతున్నట్లు ఆలస్యంగా గ్రహిస్తారు. వీటిని ప్లంబర్లు, నిర్మాణ మేస్త్రీలు మాత్రమే కచ్చితంగా గుర్తిస్తారు.అక్కడి నుంచే మొదలు.. సాధారణంగా అత్యధిక లీకేజీలు టాయిలెట్ రూమ్ నుంచే మొదలవుతాయి. ఆ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు టైల్స్ ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోవాలి. దీనికంటే ముందు నిర్మాణ దశలోనే కాంక్రీట్ లేదంటే బ్రిక్స్తో రసాయనాలు వినియోగించి వాటర్ ప్రూఫ్ బెడ్ ఏర్పాటు చేయాలి. ఇక నీటి పైప్లైన్ల కారణంగానూ లీకేజీలు ఏర్పడతాయి. వంట గదిలో సింక్ దగ్గర, వాషింగ్ మిషన్ ప్రదేశాలలో పైపుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. -
Stock market: వరుసగా ఐదో సెషన్లోనూ లాభాలే..
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల్లో భారీ కొనుగోళ్లతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్ లోనూ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 855.30 పాయింట్లు లేదా 1.09 శాతం పెరిగి 79,408.50 వద్ద స్థిరపడింది.ఇక నిఫ్టీ కూడా 273.90 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 24,125.55 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 4.91 శాతం వరకు లాభపడటంతో సెన్సెక్స్లోని 30 షేర్లలో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి.మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 2.50 శాతం, 2.21 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 7.5 శాతం లేదా 5,562 పాయింట్లు లాభపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 7.7 శాతం లేదా 1,726 పాయింట్లు పెరిగింది. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు..!
గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు జోరు చూపడం పలువురు ఇన్వెస్టర్లకు జోష్నిచ్చింది. దీంతో స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈలో నికరంగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా జమయ్యాయి. వెరసి మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.92 కోట్లను తాకింది. ఇందుకు ప్రధానంగా మార్కెట్లు జోరందుకోవడానికితోడు డిజిటల్ బ్రోకరేజీ సంస్థలు దోహదం చేశాయి.కొత్తగా జత కలిసిన ఖాతాలలో గ్రో, ఏంజెల్ వన్ నుంచే 57 శాతం నమోదయ్యాయి. 34 లక్షల డీమ్యాట్ ఖాతాలు గ్రో నుంచి ఓపెన్కాగా.. ఏంజెల్ వన్ నుంచి 14.6 లక్షల ఖాతాలు జమయ్యాయి. అంటే 84 లక్షల కొత్త ఖాతాలలో ఈ రెండు సంస్థల నుంచే 48.6 లక్షల ఖాతాలు జత కలిశాయి. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరో బ్రోకింగ్ సంస్థ జిరోధా నుంచి 5.4 లక్షల ఖాతాలు తెరిచినట్లు ఎన్ఎస్ఈ గణాంకాలు వెల్లడించాయి.మొబైల్ ఆధారిత సరళీకృత లావాదేవీల కారణంగా ఇన్వెస్టర్లు డిజిటల్ బ్రోకరేజీలను ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఇన్వెస్టర్లు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా లావాదేవీలకు ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు. -
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు: హోం శాఖ హెచ్చరిక
నకిలీ 500 రూపాయల నోట్లు చలామణిలోకి రావడంతో.. హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఈ నకిలీ నోట్లు చూడటానికి నిజమైనవి మాదిరిగా అనిపించడం వల్ల చాలా మంది మోసపోయే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది.నకిలీ రూ. 500 నోట్లను గుర్తించడం కొంత కష్టతరంగా ఉండటంతో.. చాలామంది మోసపోతున్నారు. అయితే నిజమైన రూ. 500 నోటుకు, నకిలీ నోటుకు ఓ చిన్న తేడా ఉంది. దీనిని గమనిస్తే.. ఏది నకిలీ నోటు అనేది సులభంగా తెలుసుకోవచ్చు.ఒరిజినల్ రూ. 500 నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) అని అక్షరాలు ఉండటం గమనించే ఉంటారు. అయితే నకిలీ నోటు మీద కూడా RESERVE BANK OF INDIA అని ఉంటుంది. కానీ RESERVE అనే పదంలోని.. చివరి E స్థానంలో A ఉంటుందని అధికారులు వెల్లడించారు.నకిలీ నోట్లు మార్కెట్లోకి రావడంతో.. ప్రజలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. నకిలీ నోట్లను గురించికపోతే నష్టపోతారని హెచ్చరించారు. నకిలీ నోట్లను చలామణీ చేసే ముఠాలను పట్టుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
వెహికల్పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను తప్పకుండా అంటించాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వాహనాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ వెల్లడించింది.నిబంధనలు పాటించకపోతే మోటారు వాహన చట్టం కింద రూ. 5000 జరిమానా విధిస్తారు. ఈ స్టిక్కర్లు 2012-13లో ప్రవేశపెట్టబడిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP)లో భాగంగా తీసుకొచ్చారు. ఆ తరువాత 2019 నాటికి అన్ని వాహనాలను ఈ స్టిక్కర్లు తప్పనిసరి అంటూ ఢిల్లీ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.వాహనాలకు కలర్ కోడెడ్ స్టిక్కర్లను అతికించని వాహనదారులు జరిమానా చెల్లించడం మాత్రమే కాకుండా.. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUCC) కూడా పొందలేరు. నిబంధనల ప్రకారం, డీజిల్ వాహనాలకు నారింజ రంగు స్టిక్కర్లు, పెట్రోల్ & సీఎన్జీ వాహనాలకు లేత నీలం రంగు స్టిక్కర్లు.. మిగిలిన అన్ని వాహనాలకు బూడిద రంగు స్టిక్కర్లు తప్పనిసరిగా అతికించాలి. -
టెలీనిటీకి కీలక మార్కెట్గా భారత్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్యకలాపాల విస్తరణకు కోసం భారత్ తమకు కీలక మార్కెట్గా నిలుస్తోందని టెలికం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ టెలీనిటీ సీఈవో ఇల్హాన్ బెగోరెన్ తెలిపారు. తమ టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఒకటని, ఆదాయాల్లో 15–20 శాతం వాటా ఇక్కడి నుంచే ఉంటోందని పేర్కొన్నారు.దేశీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి రెట్టింపు స్థాయిలో 100–120కి పెంచుకోనున్నట్లు బెగోరెన్ చెప్పారు. సేల్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు వివరించారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లాంటి టెలికం దిగ్గజాలకు సేవలందిస్తన్న టెలీనిటీ.. భారత్లో కార్యకలాపాల ప్రారంభించి ఇరవై ఏళ్లయిన సందర్భంగా బెగోరెన్ ఈ విషయాలు వివరించారు. -
కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలువీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG— Learn Something (@cooltechtipz) April 20, 2025 -
ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 21) గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,350 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి రేటు ఈ రోజు కూడా రూ. 700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 770 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 90,150 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 98,350 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 9030 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 98,500 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 21) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,01,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం: మారిన ఏటీఎం ఛార్జీలు
దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల అనుగుణంగానే ఈ ఛార్జీలను పెంచడం జరిగిందని స్పష్టం చేసింది. కొత్త ఛార్జీలు 2025 మే 1నుంచి అమలులోకి వస్తాయి.మే 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ.23 వసూలు చేయనున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఈ ఛార్జ్ రూ. 21గా ఉండేది. ఈ ఛార్జీలు నెలవారీ ఫ్రీ విత్డ్రా లిమిట్ పూర్తయిన తరువాత మాత్రమే వర్తిస్తుంది. ఛార్జీల పెరుగుదల విషయాన్ని బ్యాంక్ ఇప్పటికే.. కస్టమర్లకు మెయిల్స్ ద్వారా పంపింది.ఏటీఎంలలో నిర్వహించే ఆర్ధిక లావాదేవీలకు, ఆర్థికేతర లావాదేవీళ్లకులకు & కోటక్ మహీంద్రా బ్యాంక్ మెషీన్లలో అయినా లేదా ఇతర బ్యాంకులకు సంబంధించిన మెషీన్లలో అయినా.. ఫ్రీ ఏటీఎం లావాదేవీల లిమిట్ దాటితే.. ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ వంటి వాటికోసం వరుసగా రూ. 8.50, రూ. 10 ఛార్జీలు వసూలు చేయనున్నారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం నుంచి కస్టమర్ రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం కోటక్ ఎడ్జ్, ప్రో, ఏస్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈజీ పే ఖాతాదారుడు రూ. 25,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. మరికొన్ని డెబిట్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు రూ. 50వేలు వరకు విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 575.09 పాయింట్లు లేదా 0.73 శాతం లాభంతో 79,128.30 వద్ద, నిఫ్టీ 143.15 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో 23,994.80 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో సంభవ్ మీడియా, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, జెనిత్ ఎక్స్పోర్ట్స్, ఇండో-నేషనల్ వంటి కంపెనీలు చేరాయి. ఆక్మె ఫిన్ట్రేడ్ ఇండియా, ఆర్వీ లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, జైప్రకాష్ అసోసియేట్స్, బినాని ఇండస్ట్రీస్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఏదీ వదలిపెట్టరు: తుది గడువు మే 31
ఆర్థిక సంవత్సరం 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకున్న అన్నీ బ్యాంకు అకౌంట్లలో వ్యవహారాలు జమలు/ఖర్చులు.. అంటే క్రెడిట్లు/డెబిట్లు.. అన్నీ విశ్లేషించిన తర్వాత మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.➤ఏఏ ఆదాయం వచ్చింది? ➤జమ ఆదాయమా కాదా? ➤ఆదాయం అయితే దాని స్వభావం ఏమిటి? ➤జీతమా.. అద్దె? వ్యాపారం మీద వచ్చిందా., వృత్తి వలన వచ్చిందా? క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చిందా? ఇతర ఆదాయమా? ➤ఆదాయం కాకపోతే దేని నిమిత్తం వచ్చింది? ➤ఎవరు ఇచ్చారు? లేదా మీరే చెల్లించారా? ➤వారి వివరాలు.. ఎవరు.. ఎందుకు, ఎలా కావాలి..? ఇక విషయానికొద్దాం..చట్ట ప్రకారం ప్రతి బ్యాంకు దగ్గర ఉన్న కస్టమర్ పొదుపు ఖాతా(సేవింగ్ బ్యాంకు)లో జమలు.., నగదు ఖాతాలు, నగదు డిపాజిట్లు ఒక ఆర్థిక సంవత్సర కాలంలో రూ.10,00,000 దాటితే ఈ వ్యవహారాలన్నీ ఇన్కం టాక్స్ వారికి ఒక రిటర్ను ద్వారా తెలియజేయాలి. డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం ప్రతి జమ పంపాల్సిన అవసరం లేదు. కానీ సంవత్సర కాలం నగదు, జమ వెరసి మొత్తం ఎంతో తెలియజేయమన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి ఈ సమాచారం పంపుతారు. దానికి తుది గడువు తేదీ 31.5.2025.ఇవన్నీ డిపార్ట్మెంట్కి చేరిన తర్వాత వారు ఒక పట్టిక తయారుచేస్తారు. ఇది మామూలు పట్టిక కాదు. మిమ్మల్ని పూర్తిగా పట్టించే పట్టిక. దీనినే ఏఐఎస్(యాన్యువల్ ఇన్కం స్టేట్మెంట్) అంటారు. ఇందులో ఏమి ఉంటాయంటే జీతం, ఇంటి అద్దె, నగదు జమలు, రూ.50వేలు బ్యాలెన్స్ దాటిన ప్రతి బ్యాంకు అకౌంట్ నిల్వలు, నగదు చెల్లింపులు, క్రిడెట్ కార్డు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు, డివిడెండ్లు, బ్యాంకు ద్వారా వచ్చిన వడ్డీ, మీరు చేసిన డిపాజిట్లు, డిపాజిట్ల మీద వడ్డీ, షేర్ల క్రయవిక్రయాలు, మ్యూచువల్ ఫండ్ల కొనుగోలు, అమ్మకాల వడ్డీ, చెక్కులతో ఏం కొన్నారో వివరాలు, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చింది, ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చింది, ఇన్కం టాక్స్ రిఫండ్ మీద వచ్చిన వడ్డీ, అద్దె చెల్లింపులు, విదేశీ ప్రయాణ చెల్లింపులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు, విదేశాల నుంచి వచ్చిన డబ్బులు, ఇతర ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, లాటరీలు, గవర్నమెంట్ బాండ్లు, నాన్ రెసిడెంట్ల మీద వచ్చిన ఆదాయం, ల్యాండ్ అమ్మకాలు, ఆఫ్లైన్ డెబిట్లు, క్రెడిట్లు వ్యాపార ఆదాయం, వృత్తి మీద ఆదాయం, వ్యాపార ఖర్చులు, చిల్లర చెల్లింపులు, వాహన కొనుగోలు, ట్రస్ట్ మీద ఆదాయం..ఇలా ఇదో పెద్ద జాబితా.. మీ ఖాతా.., ఏదీ వదలిపెట్టరు. ‘పన్ను ఎగవేత’ ప్లానింగ్కు తిలోదకాలు ఇవ్వాలి. సుందరకాండలో హనుమంతుల వారు సీతాదేవీ అన్వేషణలో నాలుగు అంగుళాల జాగా కూడా వదిలిపెట్టలేదు అలా ఉంటుంది డిపార్ట్మెంట్ వైఖరి. వారి వద్ద ఉన్న సమాచారం కాగితాల ప్రకారం కొన్ని వేల కోట్ల కాగితాలు.బైనరీ కోడ్ యూనిట్లలో చెప్పాలంటే కిలో బైట్లు, మెగా బైట్లు, గిగా బైట్లు.., ఇన్ని బైట్లుంటే మన పాట్లు ఏమని చెప్పాలి? అరకొర సిబ్బందే కానీ కోరలు తీయించే సాధనాలు. వేగం, ఖచ్చితత్వం, భద్రత, నిజం, ఋజువుల సహితం సంకట పరిస్థితి. మళ్లీ అందులోనే ఆటవిడుపు. జాలి గడువు. హెచ్చరిక, బోధన, శోధన, మనకు రోదన. దీనికి తగ్గట్లుగా మనం కూడా అన్ని వ్యవహారాలూ ఆన్లైన్ చేస్తున్నాం. గురుత్వాకర్షణ శక్తి రాయి కిందకు పడినట్లు సమాచారం పడవలిసిన వారి చేతుల్లోనే పడింది. మనం బయట పడాలంటే ‘విషయానికి’ మన నిజాయితీ జతకట్టాలి.ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
బాగా చదువుకుని ఉద్యోగం చేయాలి, జీవితం సెటిల్ అవ్వాలని చాలామంది చిన్నప్పటి నుంచే చెబుతూ ఉంటారు. ఆ మాటలనే వింటూ.. డిగ్రీలు పూర్తి చేసుకుని ఏదో ఒక కంపెనీలో చేరి.. నెలనెలా జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న ఉద్యోగులు కోకొల్లలు. ఇలాంటి ఉద్యోగులంతా.. ప్రమాదంలో ఉన్నారని, అలాంటి ఉద్యోగాలు కనుమరుగవుతాయని.. పోర్ట్ఫోలియో - మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, మార్కెట్ ఎనలిస్ట్ 'సౌరభ్ ముఖర్జియా' అన్నారు.'బియాండ్ ది పేచెక్: ఇండియాస్ ఎంటర్ప్రెన్యూర్ రీబర్త్' అనే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారతదేశం కొత్త ఆర్థిక దశలోకి ప్రవేశించింది. జీతాలపైన జీవించే మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుంది అన్నారు. మంచి చదువులు చదివి, కష్టపడి పనిచేసేవారికి జీతాలిచ్చే కంపెనీలు తగ్గిపోతాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్డాడ్ పూర్ డాడ్ రచయితఇప్పుడు దాదాపు చాలా కంపెనీలలో ఆటోమిషన్, ఏఐ ద్వారానే పనులు పూర్తిచేస్తున్నారు. దిగ్గజ టెక్ కంపెనీ గూగులే సైతం తన కోడింగ్లో మూడోవంతును ఇప్పటికే 'ఏఐ'కు అప్పగించింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్సింగ్ రంగాలు కూడా ఇదే విధానం పాటిస్తాయి. కాబట్టి ఉద్యోగాలు చాలావరకు కనుమరుగవుతాయని ముఖర్జియా పేర్కొన్నారు.టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం కూడా.. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అవుతోంది. కాబట్టి జీతం మీదనే బతకాలనే విధానం మార్చుకోవాలి. మనది డబ్బు మీద ఆధారపడిన సమాజం. సక్సెస్ అంటే డబ్బు అనే చాలామంది చెబుతారు. ఇది మారాలి. తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలను ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యం అన్నట్టు పెంచకూడదని సౌరభ్ ముఖర్జియా స్పష్టం చేశారు. -
బంగారం ఇంకా ఎంత పెరుగుతుంది?
నేను పదవీ విరమణ తీసుకున్నాను. ఉద్యో గ విరమణ తర్వాత వచ్చిన ప్రయోజనాలన్నింటినీ స్థిరమైన ఆదాయం కోసం.. ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్ లేదంటే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా అచ్చమైన ఈక్విటీ ఫండ్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి? - అజయ్ ప్రకాష్ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో మీకు ఎంత మేరకు అవగాహన ఉన్నదన్న అంశం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈక్విటీల్లో గతంలో ఇన్వెస్ట్ చేసిన అనుభవం మీకు ఉండి.. మార్కెట్లలో ఆటుపోట్లను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయగలరు? ప్రతి నెలా మీకు ఎంత ఆదాయం కావాలి? అన్నవి కూడా ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశాలు.పెట్టుబడి నుంచి స్థిరమైన ఆదాయం కోరుకుంటున్నట్టు అయితే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఈక్విటీ పెట్టుబడుల్లో ఎలాంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఎంత ఆదాయం కోరుకుంటున్నారు? రిస్క్ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగానే ఎంపిక ఉండాలి.బంగారం ధర ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా? - కృతి వాసన్బంగారం బలంగా ర్యాలీ చేస్తున్నప్పుడు పెట్టుబడులు పెట్టాలని అనిపించడం సాధారణమే. ఈ ఏడాది ఇప్పటికే 23 శాతం ర్యాలీ చేసింది. కానీ, అది ఇంకా ఎంత వరకు పెరుగుతుందన్నది ప్రశ్నార్థకమే. ఇందుకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఏ అస్సెట్ క్లాస్ (పెట్టుబడి సాధనం) విషయంలో అయినా ఇదే వర్తిస్తుంది.మీ పెట్టుబడుల ప్రణాళికకు బంగారం ఎంత మేర ప్రయోజనం కలిగిస్తుందో విశ్లేషించుకోండి. అనిశి్చత పరిస్థితు ల్లో బంగారం మంచి పనితీరు చూపిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఈక్విటీ మార్కెట్లలో కల్లోల పరిస్థితులు నెలకొన్నప్పుడు బంగారం ర్యాలీ చేస్తుంటుంది. ఒక్కసారి ఈ పరిస్థితులు అన్నీ కుదుటపడితే అక్కడి నుంచి బంగారం పెరుగుదల పరిమితంగానే ఉంటుంది.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?గత పదిహేనేళ్ల కాలంలో చూసుకుంటే బంగారం ఏటా 10 శాతం రాబడిని అందించింది. అదే ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏటా 12 శాతం రాబడులను అందించాయి. రాబడుల్లో వ్యత్యాసం చూడ్డానికి ఎక్కువగా లేదు. కానీ, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనంతో ఫండ్స్లో పెట్టుబడి వృద్ధి ఎక్కువగా ఉంటుంది. విలువను సృష్టించే వ్యాపారాల్లో వాటాను సొంతం చేసుకునేందుకు ఈక్విటీ పెట్టుబడులు వీలు కల్పిస్తాయి. బంగారం కేవలం నిల్వకే పరిమితం అవుతుంది. బంగారం దీర్ఘకాలంలో సంపద సృష్టించే సాధనం కాదు. హెడ్జ్ సాధనంగా పరిగణించి తమ పెట్టుబడుల్లో 10 శాతం వరకు బంగారానికి కేటాయించుకోవచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో - వ్యాల్యూ రీసెర్చ్. -
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం
ముంబై: ప్రజా ప్రయోజనాలను వాణిజ్య ప్రాధాన్యతలు అధిగమించేందుకు అనుమతించబోమని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలపై పాండే తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని నియంత్రణ సంస్థలు బలపరచవలసి ఉన్నట్లు సీఐఐ నిర్వహించిన కార్పొరేట్ పాలన సదస్సులో తెలియజేశారు. వాణిజ్య లేదా లాభార్జన సంస్థలు ఎక్సే్ఛంజీలుగా ఆవిర్భవించేందుకు భారత్ అనుమతిస్తుందని, అయితే నియంత్రణ సంస్థలు మాత్రం సాధారణ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తాయని వివరించారు. ఈ అంశంలో సర్దుబాట్లకు అవకాశంలేదని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా స్టాక్ ఎక్సే్ఛంజీల మధ్య ఘర్షణలు తలెత్తితే పరిష్కరించడం సెబీ బాధ్యతగా పేర్కొన్నారు. కాగా.. ఎనిమిదేళ్లుగా ఎన్ఎస్ఈ ఐపీవో ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదట్లో సెబీ అనుమతిని కోరింది. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీ ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అన్నిరకాల సమస్యలనూ పరిష్కరించుకోవలసిందిగా ఎన్ఎస్ఈని ఆదేశించింది. -
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. తవ్వేకొద్దీ... సెబీ తరఫున ఎస్ఎస్ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్ వద్దనున్న జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో జెన్సోల్ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్ ఇంజినీరింగ్ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది. -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలే ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. వీటికితోడు యూఎస్ టారిఫ్ వార్తలు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన వెలువడిన వర్షపాత అంచనాలు సెంటిమెంటుకు జోష్నివ్వనున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ దిగ్గజాల క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల ఆధారంగా కదలనున్నాయి. క్యూ4తోపాటు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది పనితీరును సైతం వెల్లడించనున్నాయి. కొన్ని రంగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభావిత అంశాలు, పనితీరుపై అంచనాలు సైతం వెలువరించనున్నాయి. ఈ జాబితాలో కార్ల దిగ్గజం మారుతీసహా.. ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ హిందుస్తాన్ యూనిలీవర్, ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐటీ బ్లూచిప్ ఇన్ఫోసిస్తోపాటు వారాంతాన(19న) ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐసహా యస్ బ్యాంక్ ఫలితాలు విడుదల చేశాయి. దీంతో నేడు(21న) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇతర అంశాలు ప్రపంచ ప్రధాన(ఆరు) కరెన్సీలతో మారంకలో ఇటీవల డాలరు బలహీనపడుతుండటంతో దేశీ కరెన్సీ బలపడుతోంది. డాలరు ఇండెక్స్ కొద్ది రోజులుగా 104 స్థాయి నుంచి 99కు నీరసించడం రూపాయికి జోష్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశీ స్టాక్స్లో తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీగా పెట్టుబడులు చేపడుతుండటం మరింత మద్దతిస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ముడిచమురు ధరలు బ్యారల్ 65–60 డాలర్ల స్థాయికి దిగిరావడం దేశీయంగా సానుకూల అంశమని, ఇది ద్రవ్యోల్బణం తగ్గేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. గత వారమిలా కేవలం మూడు రోజులు జరిగిన గత వారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 4 శాతంపైగా జంప్చేయడం విశేషం! ఇందుకు ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం తోడ్పాటునిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత వారం సెన్సెక్స్ నికరంగా 3,396 పాయింట్లు(4.5 శాతం)దూసుకెళ్లగా, నిఫ్టీ సైతం 1,023 పాయింట్లు(4.5 శాతం) ఎగసింది. వెరసి సెన్సెక్స్ 78,553 వద్ద, నిఫ్టీ 23,852 వద్ద ముగిశాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ ఇదేస్థాయిలో ర్యాలీ చేయడం గమనార్హం! సాంకేతికంగా గత వారం సెలవుల నేపథ్యంలో సాంకేతికంగా మార్కెట్లు మూడు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా బలపడ్డాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,600 పాయింట్ల స్థాయిలో బలమైన మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి నిఫ్టీకి ఈ స్థాయి సపోర్ట్గా నిలిచే వీలున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా 24,550 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని పేర్కొన్నారు. వెరసి సమీప భవిష్యత్లో సపోర్ట్ లేదా రెసిస్టెన్స్లను అధిగమిస్తే మార్కెట్ల తీరు వెల్లడికావచ్చని అభిప్రాయపడ్డారు.రుతుపవనాల ఎఫెక్ట్ ఈ ఏడాది సాధారణానికంటే అధిక వర్షపాతానికి వీలున్నట్లు దేశీ వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసిన అంచనాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇది ధరల(ద్రవ్యోల్బణ) క్షీణతకు దారి చూపవచ్చని పేర్కొన్నారు. అయితే యూఎస్ టారిఫ్ వార్తలు మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణంకావచ్చని విశ్లేషించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగల యూఎస్, చైనా సుంకాల విధింపులో పోటాపోటీగా వ్యవహరిస్తుండటం ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇకపై టారిఫ్ల యుద్ధం మరింత వేడెక్కడం లేదా చల్లబడటం అనే అంశాలపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు.ఎఫ్పీఐల దన్ను 3 రోజుల్లో రూ. 8,500 కోట్లు గత వారం మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 8,472 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. నిజానికి ఈ నెల మొదట్లో సైతం ఎఫ్పీఐలు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఈ బాటలో గత వారం తొలి రోజు రూ. 2,352 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తదుపరి రెండు సెషన్లలో ఏకంగా రూ. 10,824 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్ నుంచి రూ. 23,103 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అంటే 2025 జనవరి నుంచి రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. -
కొత్త పన్ను విధానం 'మార్పు' మంచిదే !
మధ్యతరగతి వారికి గుడ్న్యూస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి చాలా మందికి ఆదాయపన్ను పన్ను భారం తొలగిపోయింది. 2025 బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులతో వేతన జీవులు, పెన్షనర్లకు రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల వరకు ఆదాయం మించనప్పుడు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఆదాయం ఈ పరిమితి దాటినప్పుడే వారు తమ మొత్తం ఆదాయంపై నిర్ణీత శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.7–7.75 లక్షలుగా ఉన్న పరిమితులను ప్రభుత్వం గణనీయంగా పెంచేసింది. పాత విధానంలో పన్ను ఆదా కోసం ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వచ్చేది. వీటికితోడు బీమా ప్రీమియం, ఇంటి రుణం చెల్లింపులు ఇలా ఎన్నో క్లెయిమ్ చేసుకుంటే గానీ పన్ను భారం గణనీయంగా తగ్గేది కాదు. ఇప్పుడు కొత్త పన్ను విధానంలో ఈ తలనొప్పులేవీ లేకుండానే గణనీయమైన ప్రయోజనం కల్పించారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త పన్ను విధానంలోకి మారడం, లేదంటే పాత విధానాన్ని కొనసాగించడం వల్ల కలిగే లాభనష్టాలపై అవగాహన కల్పించే కథనమిది... ‘‘మన దేశంలో పన్ను రిటర్నులు వేస్తున్న వారిలో 90 శాతం మంది ఆదాయం రూ.13 లక్షల కంటే తక్కువే ఉంది. అంటే 140 కోట్ల మంది ప్రజల్లో కేవలం కోటి మందే 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించనున్నారు. భారత్ను ఆదాయపన్ను రహితంగా మార్చడమే ఇది’’ అంటూ షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన విమర్శనాత్మక పోస్ట్ తాజా పరిస్థితులకు అద్దం పడుతోంది. 2023–24 సంవత్సరం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం మన దేశంలో వేతన జీవుల సగటు ఆదాయం రూ.20,039గా ఉంది. కనుక మెజారిటీ వేతన జీవులే కాదు, స్వయం ఉపాధిలో ఉన్న వారిలోనూ అధిక శాతం మంది ఆదాయం రూ.12 లక్షల్లోపే ఉంటుంది. కనుక వారికి కొత్త పన్ను విధానమే లాభదాయకం. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుబడులు అన్నవి ఎప్పుడూ తమ లక్ష్యాలు, ఆశించే రాబడి, రిస్క్ సామర్థ్యం వీటన్నింటికీ సరిపోయే సాధనాలతో ఉండాలి. అంతే కానీ పన్ను ఆదా కోసమని చెప్పి మెరుగైన రాబడుల్లేని చోట ఇన్వెస్ట్ చేస్తే లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకోవడం కఠినతరం అవుతుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదా కోసం పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలు కొని జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్, ఎన్సీఎస్, ఐదేళ్ల బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎన్నో సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా పన్ను ఆదా పెట్టుబడులకు మూడు నుంచి ఐదేళ్ల లాకిన్ పీరియడ్ (అప్పటి వరకు ఉపసంహరణ కుదరదు) కూడా ఉంటుందని మర్చిపోవద్దు. పీపీఎఫ్ అయితే 15 ఏళ్లు. కొత్త పన్ను విధానంలో ఇలాంటి షరతులేవి లేకుండా రూ.12 లక్షలకు మించని ఆదాయం ఉన్న అందరికీ సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కల్పించారు. కనుక తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెట్టుకునే స్వేచ్ఛ కొత్త విధానం కల్పిస్తోంది. దీర్ఘకాల లక్ష్యాలకు ఇతర సాధనాల కంటే ఈక్విటీలే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి మెరుగైన రాబడిని అందిస్తాయని చరిత్ర చెబుతోంది. కనుక మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. పాత పన్ను విధానంలో పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానంలో అయితే పన్ను ఆదా కోసం చూడకుండా ప్యాసివ్ ఫండ్స్, ఫ్లెక్సీక్యాప్, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, బంగారంలోనూ పెట్టుబడులకు వీలు కల్పించే మల్టీ అస్సెట్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఇలా ఎన్నో విభాగాల నుంచి తమకు అనుకూలమైన వాటిని నిపుణుల సూచనల మేరకు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరికి కొత్త.. కొందరికి పాత పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను పెట్టుబడులు, మినహాయింపుల రూపంలో రూ.5,75,000.. వేతనంలో 30 శాతాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి (వేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు) నూతన పన్ను విధనామే మెరుగైనది. ఈ కింది టేబుల్లో దీన్ని గుర్తించొచ్చు. ఒకవేళ ఆదాయం రూ.12 లక్షలు మించితే (వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయం దాటితే).. పాత పన్ను విధానంలో అన్ని మినహాయింపులు, రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. కొత్త విధానం కంటే పాత విధానంలోనే కొంత అదనంగా ఆదా అవుతుంది. ఉదాహరణబ్యాంక్ ఉద్యోగి మోనాలీ దేవ్ ఆదాయం రూ.20.5 లక్షలు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు ఆమె కారు లేదా ట్యాక్సీ వినియోగించడం లేదు. దీంతో రూ.1.2 లక్షల ట్రాన్స్పోర్ట్ అలవెన్స్పై పూర్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. నెలల శిశువు కారణంగా ఎలాంటి పర్యటనలకూ వెళ్లే వీలు లేకపోవడంతో రూ.30,000 ఎల్టీఏ ప్రయోజనాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. కేవలం ఎన్పీఎస్, సెక్షన్ 80సీ, గృహ రుణం చెల్లింపులు రూ.1.6 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.11,500 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో తన ఆదాయంపై ఈ మినహాయింపులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత పాత విధానంలో ఆమె 2023–24 సంవత్సరానికి రూ.3.15 లక్షల ఆదాయం చెల్లించాల్సి వచి్చంది. నిపుణుల సూచనలతో కొత్త విధానంలో మదింపు చేయగా చెల్లించాల్సిన పన్ను రూ.2.86 లక్షలుగా తేలింది. ఒకవేళ సెక్షన్ 80సీసీడీ (2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్లో.. మూలవేతనంలో 14 శాతం చొప్పున ప్రతి నెలా రూ.15,156ను పనిచేసే సంస్థ నుంచి జమ చేయించుకుంటే అప్పుడు మోనాలీ దేవ్కు పన్ను భారం మరో రూ.57,000 తగ్గిపోతుంది. 2025–26 సంవత్సరం నుంచి అమల్లోకి వచి్చన కొత్త పన్ను విధానం శ్లాబుల ప్రకారం అయితే మోనాలీదేవ్ చెల్లించాల్సిన పన్ను (ఎన్పీఎస్ లేకుండా) కేవలం రూ.1.98 లక్షలే. ముందటి ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే రూ.88 వేలు ఆదా అవుతోంది. పనిచేసే సంస్థ నుంచి ఎన్పీఎస్ (కార్పొరేట్ ఎన్పీఎస్) జమ కూడా చేయించుకుంటే ఈ పన్ను ఇంకా తగ్గిపోనుంది. కనుక అధిక ఆదాయం పరిధిలోని వారు పాత–కొత్త విధానంలో మదింపు చేసుకుని తుదిగా తమకు ఏ విధానం లాభదాయకమో నిర్ణయించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది గృహ రుణం తీసుకుని ఉండపోవచ్చు. అలాంటి వారు కేవలం హెచ్ఆర్ఏ మినహాయింపునకే పరిమితం కావాల్సి ఉంటుంది.ఆదాయాన్ని బట్టి మార్పు.. ‘‘కొత్త విధానం ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, అన్ని ప్రయోజనాలను వినియోగించుకుంటే పాత విధానంలో పన్ను తక్కువ. రూ.60 లక్షలు ఆర్జించే వారు రూ.8.5 లక్షల మినహాయింపు/రాయితీలను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే పాత విధానంలోనే రిటర్నులు వేసుకోవచ్చు’’ అని ట్యాక్స్స్పానర్ డాట్ కామ్ సీఈవో సు«దీర్ కౌశిక్ సూచించారు. → రూ.13.75 లక్షల ఆదాయం కలిగి కేవలం రూ.5.25 లక్షల పన్ను మినహాయింపుల వరకే క్లెయిమ్ చేసుకున్నా సరే పాత విధానంలో రూ.57,500 చెల్లించాల్సి వస్తే, కొత్త విధానంలో రూ.75,000 పన్ను పడుతోంది. → రూ.15.75 లక్షల ఆదాయం ఉంటే హెచ్ఆర్ఏ ప్రయోజనం లేకుండా మిగిలిన మినహాయింపులను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలోనే పన్ను తక్కువ. → రూ.20 లక్షల ఆదాయం ఉన్న వారి విషయంలో (వేతన జీవులు అయితే రూ.20.75 లక్షలు) మళ్లీ ఇది మార్పునకు గురవుతుంది. హెచ్ఆర్ఏను పక్కన పెట్టి చూస్తే పాత విధానంలో రూ.5.25 లక్షల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు చెల్లించాల్సిన పన్ను రూ.2,40,000 కాగా, కొత్త విధానంలో రూ.2 లక్షలే కావడం గమనించొచ్చు. అలాగే రూ.24 లక్షల ఆదాయంపై కొత్త విధానంలో రూ.60 వేలు ఆదా చేసుకోవచ్చు. → రూ.24.75 లక్షలపైన ఆదాయం కలిగిన వారు, మొత్తం మినహాయింపులు/తగ్గింపులు/రాయితీలు అన్నీ రూ.7.75 లక్షలకు మించితే అప్పుడు పాత విధానాన్ని పరిశీలించొచ్చు. → గ్రాంట్ థార్న్టన్ అంచనా ప్రకారం రూ.1.5 కోట్ల ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ ప్రయోజనాలను వినియోగించుకుంటే చెల్లించాల్సిన పన్ను రూ.40.09 లక్షలు కాగా, కొత్త విధానంలో రూ.48.52 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → పన్నుకు అదనంగా సెస్సు చెల్లించాలి. రూ.50లక్షల ఆదాయం మించిన వారు సర్చార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ విషయంలో షరతులు గృహ రుణం ఈఎంఐలో అసలు మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు సెక్షన్ 24బీ కింద పాత విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్ఆర్ఏ రాయితీని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే అందరికీ అని చెప్పలేం. ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. → వేతనంలో హెచ్ఆర్ఏ ప్రయోజనం తప్పకుండా ఉండాలి. పనిచేసే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ అద్దె చెల్లించాలి. → తన పేరు లేదా తన జీవిత భాగస్వామితో కలసి ఉమ్మడిగా రుణం తీసుకుని పనిచేసే చోట కాకుండా వేరే ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుని చెల్లింపులు చేస్తుండాలి. → రుణంపై ఇల్లు సమకూర్చుకుని అందులోనే నివసిస్తూ.. వేతనంలో భాగంగా హెచ్ఆర్ఏ ప్రయోజనం తీసుకుంటున్న వారు.. గృహ రుణానికి చెల్లిస్తున్న అసలు, వడ్డీపైనే మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. అద్దె చెల్లించడం లేదు కనుక హెచ్ఆర్ఏ క్లెయిమ్కు అవకాశం లేదు. → ఒకవేళ మీరు పనిచేసే పట్టణంలోనే ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నారు. కానీ, ఆ ఇంటిలో కాకుండా, అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటప్పుడు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ కార్యాలయానికి, రుణంపై సమకూర్చుకున్న ఇల్లు మరీ దూరంగా ఉంటే తప్పించి హెచ్ఆర్ఏ క్లెయిమ్కు అర్హులు కారు. కనుక హెచ్ఆర్ఏతోపాటు గృహ రుణంపై గరిష్ట ప్రయోజనం పొందాలంటే పనిచేసే ప్రాంతంలో కాకుండా దూరంగా సొంతిల్లును సమకూర్చుకోవడం ఒక మార్గం. హెచ్ఆర్ఏ సూత్రం → యాజమాన్యం నుంచి స్వీకరించిన వాస్తవ హెచ్ఆర్ఏ → ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం ఇంటి అద్దె నుంచి.. ఏడాదిలో స్వీకరించిన మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలినది. → మూలవేతనం, డీఏలో 40 శాతం (నాన్ మెట్రోలు)/50 శాతం (మెట్రోల్లో నివసించే వారు) → ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకుని పన్ను చెల్లించక్కర్లేదు. కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు పాత విధానంతో పోల్చి చూస్తే నూతన పన్ను విధానంలో చాలా వరకు మినహాయింపులు, రాయితీల్లేవు. హెచ్ఆర్ఏ, ఎల్టీసీ, టెలిఫోన్, ఇంటర్నెట్ వ్యయాలను క్లెయిమ్ చేసుకోలేరు. పన్ను ఆదా పెట్టుబడులూ లేవు. గృహ, విద్యా రుణాలపై అసలు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన ప్రయోజనాలు, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకూ ఎలాంటి పన్ను మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తించాలి. అదే సమయంలో వేతన జీవులకు కొన్ని ప్రయోజనాలు కల్పించారు. కార్పొరేట్ ఎన్పీఎస్: సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం ఉంది. ఉద్యోగి తరఫున ఎన్పీఎస్ ఖాతాకు యాజమాన్యం జమ చేయాల్సి ఉంటుంది. మూల వేతనం, డీఏ మొత్తంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ట జమ రూ.7.5 లక్షలకే ఇది వర్తిస్తుంది. సర్చార్జ్: రూ.5 కోట్లకు పైన ఆదాయం కలిగిన వారికి పాత విధానంలో చెల్లించాల్సిన పన్ను మొత్తంపై 37 శాతం సర్చార్జ్ చెల్లించాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇది 25 శాతమే. అలవెన్స్లు: దివ్యాంగులకు రవాణా భత్యం, ఉద్యోగులకు అధికారిక ప్రయాణాలు లేదా బదిలీ కోసం చెల్లించే అలవెన్స్, ఆఫీస్కు దూరంగా వేరే ప్రాంతంలో డ్యూటీ చేయాల్సి వస్తే చెల్లించే అలవెన్స్లకు పన్ను మినహాయింపులున్నాయి. సెక్షన్ 80సీసీహెచ్: అగ్నివీర్ కార్పస్ ఫండ్కు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది.ఏటా మారిపోవచ్చు..!రెండు పన్ను విధానాల్లోనూ తమకు అనుకూలమైన దాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వేతన జీవులకు ఉంది. ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మారిపోవచ్చు కూడా. వేతనం/పింఛనుతోపాటు వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఈ సదుపాయం లేదు. వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం కలిగిన వారు ఒక్కసారి నూతన విధానంలోకి మారితే.. తిరిగి పాత విధానంలోకి మళ్లేందుకు ఒక్కసారే అవకాశం ఉంటుంది. ఇక వేతన జీవులు, పెన్షనర్లు సైతం గడువులోపు (జూలై 31) ఐటీఆర్లు దాఖలు చేసినట్టయితేనే పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చింది ఎంపిక చేసుకోగలరు. గడువు దాటిన తర్వాత సమర్పించే బీలేటెడ్ రిటర్నులు కొత్త విధానంలోనే సమర్పించడానికి అనుమతి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు సమయంలో ‘వెదర్ ఆప్టింగ్ అవుట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆఫ్ సెక్షన్ 115బీఏసీ?’’ అని అడుగుతుంది. యస్ అని క్లిక్ చేస్తే పాత విధానంలో పన్ను రిటర్నులు దాఖలవుతాయి. నో అని క్లిక్ చేస్తే ఐటీఆర్ నూతన విధానం కింద సమరి్పంచినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మూడ్కు తగ్గట్టు మ్యూజిక్ వినిపించే స్మార్ట్ లైట్
ఈ ఫొటోలో కనిపిస్తున్న సీలింగ్ లైట్ కేవలం ప్రకాశవంతమైన వెలుగు కోసం మాత్రమే పరిమితమైన లైట్ కాదు. ఎప్పటికప్పుడు మీ మూడ్కు తగ్గట్టు సంగీతంతోపాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని పార్టీ థీమ్లోకి తీసుకొని వెళ్లగలిగే స్మార్ట్ లైట్.రీచార్జబుల్ బ్యాటరీతోనూ పనిచేస్తుంది. కాబట్టి, మధ్యలో కరెంట్ పోయినా కూడా పార్టీకి అంతరాయం ఏర్పడదు. మొబైల్ యాప్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సాతో అనుసంధానం చేసుకొని వాడుకోవచ్చు. ధర 139 డాలర్లు (రూ. 11,995). -
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్కు గోల్డెన్ ఛాన్స్!
చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు. -
కొత్తరకం ఫ్యాన్లు: ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్, కేబుల్ ఫ్యాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..షాండ్లియర్ అందించే చల్లగాలిఇంటి సీలింగ్కు షాండ్లియర్తో అలంకరిస్తే చూడటానికి భలే బాగుంటుంది. కాని, షాండ్లియర్ను తగిలిస్తే, ఆ చుట్టు పక్కల ఫ్యాన్ అమర్చుకోలేం. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తోంది ఈ ‘ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్’. ఇది ఒకవైపు వెలుగులు వెదజల్లుతూనే, మరోవైపు నిశ్శబ్దంగా చల్లని గాలిని కూడా వీస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్, ఫ్యాన్ స్పీడ్ను కంట్రోల్ చేయొచ్చు. ధర 299 డాలర్లు (రూ. 25,664).ఇదీ చదవండి: ఒక ఫ్యాన్స్ మూడు లాభాలుకేబుల్ ఫ్యాన్ఇది అచ్చం డేటా కేబుల్లాంటి ఫ్యాన్. ఎక్కడికైనా సరే తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ సాయంతో మొబైల్, అడాప్టర్, కంప్యూటర్ కేస్, ల్యాప్టాప్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యాన్ తిరిగేటప్పుడు చల్లటి గాలితో పాటు, సమయం, ఉష్ణోగ్రతలను తెలిపే డిజిటల్ క్లాక్ను కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ధర కంపెనీ, క్వాలిటీ లపై ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీల పేర్లతో ఆన్లైన్లో లభిస్తోంది. -
ఒకేసారి మూడు లాభాలు
సీలింగ్ ఫ్యాన్ను కూడా ఇప్పుడు బయటకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ పోర్టబుల్ ఫ్యాన్. పేరు ‘క్రోబాట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’. దీనికున్న ఈజీ డిటాచబుల్ రెక్కల సాయంతో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు ఇట్టే తీసుకెళ్లవచ్చు.ఏదైనా ఎత్తైన హుక్కు తగిలించి.. సీలింగ్ ఫ్యాన్లా స్టాండ్కు బిగించి టేబుల్ ఫ్యాన్లా వాడుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైటింగ్ సిస్టమ్ ఉండటంతో ఇది ల్యాంప్గానూ పనిచేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ధర రూ. 1,649 మాత్రమే! -
విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు. -
అది గ్రేట్ మూవీ.. ఎలాన్ మస్క్ ట్వీట్
టామ్ క్రూజ్ నటించిన 'ఎడ్జ్ ఆఫ్ టుమారో' చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. సినిమా ట్వీట్స్ అనే ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్పై టెస్లా సీఈఓ స్పందిస్తూ 'గ్రేట్ మూవీ' అని అన్నారు.''ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది మరోమారు చూడాల్సిన సినిమా అనేదానికి సరైన నిర్వచనం. ఈ మూవీ ఫిల్మోగ్రఫీలో ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు. కానీ క్రూజ్ ఇప్పటివరకు తీసిన ఒరిజినల్ చిత్రాలలో ఇది ఖచ్చితంగా ఒకటి. ఎమిలీ బ్లంట్తో క్రూజ్ కెమిస్ట్రీ కూడా చాలా ప్రత్యేకమైనది. నాకు ఈ సినిమా చాలా ఇష్టం'' అని సినిమా ట్వీట్స్ యూజర్ అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. గ్రేట్ మూవీ అని అన్నారు.డగ్ లిమాన్ దర్శకత్వం వహించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది 2014లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం. భవిష్యత్తులో భూమిని మిమిక్స్ అనే గ్రహాంతర జాతి దాడి చేస్తుంది. టామ్ క్రూజ్ మేజర్ విలియం కేజ్ పాత్రను పోషిస్తాడు. దీనిని హిరోషి సకురాజాకా రాసిన జపనీస్ నవల "ఆల్ యు నీడ్ ఈజ్ కిల్" ఆధారంగా తెరకెక్కించారు.Great movie— Elon Musk (@elonmusk) April 19, 2025ఇండియాకు ఎలాన్ మస్క్ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్డాడ్ పూర్ డాడ్ రచయితసాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. -
ఫుడ్ ఆర్డర్తో పాటు ఓ స్లిప్ పంచుతున్న డెలివరీ బాయ్.. అందులో ఏముందంటే?
బెంగళూరులోని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు.. ఫుడ్ ఆర్డర్లో చేతితో రాసిన నోట్ను వేసి, సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం తనను తాను ప్రపోజ్ చేసుకున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇతడు చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు.డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేతితో రాసిన నోట్లో.. తాను మార్కెటింగ్ ఇంటర్న్షిప్ కోసం వెతుకుతున్న కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నాడు. నోట్ అందుకున్న వారు తగిన అవకాశం ఉంటే తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా అందులో రాశాడు. ఈ నోట్కు సంబంధించిన ఫోటోను.. బెంగళూరులో సొల్యూషన్స్ ఇంజనీర్ నిఖిల్ లింక్డ్ఇన్లో షేర్ చేశారు.జొమాటో డెలివరీ ఏజెంట్ ధైర్యం చూసి నిఖిల్ ఆశ్చర్యపోయాడు. డెలివరీలు చేసే హడావిడిలో కూడా తాను.. చేతితో రాసిన నోట్ ద్వారా ఉద్యొగావకాశం కోసం సెర్చ్ చేయడం గొప్ప విషయం అని అన్నారు. డెలివరీ ఏజెంట్ మీద చాలా గౌరవం ఏర్పడిందని మరొకరు కామెంట్ చేయగా. తాను ఆశించినట్లే.. ఇంటర్న్షిప్ లభిస్తుందని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్డాడ్ పూర్ డాడ్ రచయిత -
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తాజాగా శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్లో 100 శాతం వాటా సొంతం చేసుకోనుంది. 24మంత్ర ఆర్గానిక్ బ్రాండు కంపెనీతో వాటా కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ వెల్లడించింది. ఇందుకు నగదు రూపేణా దాదాపు రూ. 473 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.24మంత్ర బ్రాండుతో 100 రకాలకుపైగా ఫుడ్ ప్రొడక్టులను శ్రేష్ఠ విక్రయిస్తోంది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్టుల విభాగంలో ఐటీసీ మరింత విస్తరించనుంది. కాగా.. మరోపక్క సహచర సంస్థ మదర్ స్పార్‡్ష బేబీ కేర్లో మిగిలిన 73.5 శాతం వాటా సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది. 2022లో ఈ డీ2సీ కంపెనీలో 26.5 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కేఫిన్టెక్ చేతికి ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ సొల్యూషన్స్ సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తాజాగా ఎసెంట్ ఫండ్ సర్వీసెస్లో (Ascent Fund Services) 51 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 34.7 మిలియన్ డాలర్లు. వచ్చే అయిదేళ్లలో ఎసెంట్లో కేఫిన్టెక్ 100 శాతానికి వాటాలు పెంచుకోనుంది. ఇందుకోసం మిగతా 49 శాతం వాటాలను 2028, 2029, 2030లో ఏడాదికి 16.33 శాతం చొప్పున దక్కించుకోనుంది.సింగపూర్ హెడ్క్వార్టర్స్గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎసెంట్ అంతర్జాతీయంగా 260 పైచిలుకు గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్లకు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కేఫిన్టెక్ విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. ఇరు సంస్థలు సమిష్టిగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని, పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాయని ఎసెంట్ సహ–వ్యవస్థాపకుడు కౌషల్ మండలియా తెలిపారు. -
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
ట్రంప్ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లోనూ అనిశ్చితి ఆవహించింది. ఈ క్రమంలో స్వీడన్కు చెందిన భారీ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కులకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అమెరికాలోని మూడు కర్మాగారాలలో 550 నుంచి 800 మంది కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఈ తొలగింపులు పెన్సిల్వేనియాలోని మకుంగీలో ఉన్న మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియాలోని డబ్లిన్, మేరీల్యాండ్లోని హేగర్స్టౌన్లో ఉన్న రెండు వోల్వో సైట్లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఆటోమోటివ్, భారీ పరికరాల రంగాలను అస్తవ్యస్తం చేసి, తయారీ ఖర్చులను పెంచడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇది చదివారా? ట్రంప్ టారిఫ్ల దెబ్బ.. కార్ల కంపెనీ మూతసుంకాలే కారణం..ఉత్తర అమెరికాలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్న వోల్వో సంస్థ భారీ-డ్యూటీ ట్రక్కులకు మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వివరించింది. సరుకు రవాణా రేట్లలో అస్థిరత, సంభావ్య నియంత్రణ మార్పులు, సుంకాల వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రభావం వంటి అనేక కారణాలు ఈ తొలగింపులకు దోహదపడ్డాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిర్ధారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము” ఆ ప్రతినిధి తెలిపారు.ఇటీవలి నెలల్లో అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడీ సుంకాలు.. ముడి పదార్థాలు, విడి భాగాల ఖర్చులను మరింత పెంచాయి. ఫ్రైట్ డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి వోల్వో వంటి స్థిరమైన వాణిజ్య పరిస్థితులపై ఆధారపడే సంస్థలను మరింత ఒత్తిడికి గురిచేశాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలగింపునకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ప్రభావితమైన కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర సాయాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. -
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే.. ఇది కనీసం 15–30 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపుపైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని సూచిస్తున్నారు. అయితే ఇంటి రుణం ముందుగా చెల్లించాలా? లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. - సాక్షి, సిటీబ్యూరోవీరికి ప్రయోజనకరంఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం తగ్గకముందే బాధ్యతలను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్గో తగ్గడం, వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.ఈఎంఐల భారం తగ్గుతుంది..ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణ గ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే.. మిగిలిన రుణ బ్యాలెన్స్ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తు ఈఎంఐల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్ పాలసీని బట్టి రుణ గ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి దాదాపు 15 ఏళ్లకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులతో సుమారు రూ.16.30 లక్షలు ఆదా అవుతుంది. -
యస్ బ్యాంక్ అదుర్స్.. 63% పెరిగిన లాభం
ముంబై: ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) గణనీయంగా తగ్గడంతో మార్చి క్వార్టర్లో నికర లాభం 63% వృద్ధితో రూ.738 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.9,355 కోట్లకు చేరింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ. 9,016 కోట్లుగా ఉంది.తాజా క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 5.7% పెరిగి రూ.2,276 కోట్లకు చేరింది. బ్యాంక్ డిపాజిట్ వృద్ధి 6.8%గా ఉంది. వడ్డీయేతర ఆదాయం 10.9% పెరిగి రూ.1,739 కోట్లకు చేరింది. మొత్తం ప్రొవిజన్లు 32.5% తగ్గి రూ.318 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండి బకాయిల నిష్పత్తి 1.6% తగ్గి రూ.3,935 కోట్లకు పరిమితమైంది. నికర మొండిబకాయిలు 0.3 శాతం క్షీణించాయి. రుణ డిపాజిట్ నిష్పత్తి 88% నుంచి 86.5 శాతానికి దిగివ చ్చింది. క్యాపిటల్ అడెక్వసీ 15.6 శాతానికి చేరింది.‘‘స్థూల ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల దృష్ట్యా రుణ వృద్ధి 12–15 శాతం లక్ష్యంగా పెట్టుకున్నాము. రుణ వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి అధికంగా ఉంటుంది. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేటు 2% తగ్గించడంతో మూడు శాతానికి పరిమితమైంది. దీని ప్రభావం కాసా(కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్)పై ఉండదు. క్రిడెట్ కార్డుల పోర్ట్ఫోలియోలో ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. రాబోయే 2–3 త్రైమాసికాల్లో క్రెడిట్ వ్యయం దిగివస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 37 బ్రాంచులు ఏర్పాటు చేశాము. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి కొత్తగా 80 శాఖలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాము’’ అని యస్ బ్యాంకు ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. -
ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 20) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది. ఈ విధానం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ వంటి అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది.ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలుదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల్లో నిన్నటి పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. గత ఐదు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 20న పెట్రోల్ ధర లీటరుకు ఏయే నగరంలో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ.107.46విజయవాడ: రూ.109.74న్యూ ఢిల్లీ: రూ.94.77ముంబై: రూ.103.50కోల్కతా: రూ.105.01చెన్నై: రూ.101.03బెంగళూరు: రూ.102.98అహ్మదాబాద్: రూ.94.58లక్నో: రూ.94.58పాట్నా: రూ.106.11డీజిల్ ధరలుడీజిల్ ధరలు కూడా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య విభిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 20న డీజిల్ ధరలు లీటర్కు ఇలా ఉన్నాయి.హైదరాబాద్: రూ.95.70విజయవాడ: రూ.97.57న్యూ ఢిల్లీ: రూ.87.67ముంబై: రూ.90.03కోల్కతా: రూ.91.82చెన్నై: రూ.92.39బెంగళూరు: రూ.90.99అహ్మదాబాద్: రూ.90.17 -
సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్ ఎన్ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. ఓఎన్డీసీ నెట్వర్క్లోకి యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ఫండ్స్లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరినట్లు యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్కుమార్ తెలిపారు. తమ ప్లాట్ఫాంలో యాక్సిస్ ఎంఎఫ్ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్డీసీ ఎండీ టి. కోషి చెప్పారు. -
అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అంచనాలను మించిన పనితీరు కనపర్చింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 17,616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో నమోదైన రూ. 16,512 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 6.6 శాతం అధికం. తాజా క్యూ4లో నికర లాభం రూ. 17,072 కోట్లుగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం 5.3 శాతం పెరిగింది. ఆదాయం రూ. 89,488 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 22 డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూన్ 27 రికార్డు తేదీగా ఉంటుంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం సుమారు 6.8 శాతం పెరిగి రూ. 17,622 కోట్ల నుంచి రూ. 18,835 కోట్లకు చేరింది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 36.17 లక్షల కోట్ల నుంచి రూ. 39.10 లక్షల కోట్లకు చేరింది. పెరిగిన ఎన్పీఏలు.. 2024–25 క్యూ4లో స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 1.33 శాతానికి చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన 1.24 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. అటు నికర ఎన్పీఏల నిష్పత్తి 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది. సీక్వెన్షియల్గా డిసెంబర్ క్వార్టర్లో నమోదైన 0.46 శాతం పోలిస్తే స్వల్పంగా తగ్గింది. పరిమాణంపరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 31,173 కోట్ల నుంచి రూ. 35,223 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్గా రూ. 36,019 కోట్ల నుంచి తగ్గాయి.వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధి.. » నికర వడ్డీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో రూ. 29,080 కోట్ల నుంచి సుమారు 10 శాతం పెరిగి రూ. 32,070 కోట్లకు పెరిగింది. డిసెంబర్ క్వార్టర్లో నికర వడ్డీ ఆదాయం రూ. 30,650 కోట్లుగా నమోదైంది. » ఇక నికర వడ్డీ మార్జిన్ 3.54%గా నిల్చింది. ఆదాయ పన్ను రీఫండ్కి సంబంధించిన రూ. 700 కోట్ల వడ్డీని మినహాయిస్తే, నికర వడ్డీ మార్జిన్ 3.46%గా ఉంది. » సమీక్షాకాలంలో ఫీజుల రూపంలో రూ. 8,530 కోట్లు, విదేశీ మారకం .. డెరివేటివ్స్ ఆదా యం కింద రూ. 1,440 కోట్లు, నికర ట్రేడింగ్.. మార్క్టు మార్కెట్ ఆదాయం కింద రూ. 390 కోట్లు, ఇతరత్రా రికవరీల రూపంలో రూ. 1,670 కోట్లు వచ్చాయి. డిపాజిట్లు 16 శాతం అప్ .. » నాలుగో త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్లు సగటున సుమారు 16 శాతం పెరిగి రూ. 25.28 కోట్లకు చేరాయి. క్రితం క్యూ4లో ఇది రూ. 21.84 లక్షల కోట్లుగాను, అంతక్రితం క్వార్టర్లో రూ. 24.53 లక్షల కోట్లుగాను నమోదైంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన బ్యాంక్ డిపాజిట్లు సగటున 3.1 శాతం పెరిగాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు రూ. 7.85 లక్షల కోట్ల నుంచి సుమారు 6 శాతం వృద్ధితో రూ. 8.3 లక్షల కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా 34.8 శాతంగా ఉంది. » రుణాలు 5.4 శాతం వృద్ధితో రూ. 26.44 లక్షల కోట్లకు చేరాయి. రిటైల్ రుణాలు 9 శాతం, కమర్షియల్ .. గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 12.8 శాతం పెరగ్గా, కార్పొరేట్.. ఇతరత్రా హోల్సేల్ రుణాలు 3.6 శాతం తగ్గాయి. -
మూడేళ్లలో జర్మనీ, జపాన్ను అధిగమిస్తాం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లలో జర్మనీ, జపాన్లను అధిగమిస్తుందనని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి విద్యా కేంద్రంగా భారత్ ఎదుగుతుందన్నారు. మిగతావన్నీ పక్కన పెడితే, భారత్కు ఉన్న అతిపెద్ద సానుకూలత ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది చివరికి నాలుగో స్థానానికి చేరుకుంటాం. ఆ తర్వాతి సంవత్సరంలో మూడో స్థానాన్ని సాధిస్తాం’’అని సుబ్రమణ్యం చెప్పారు. ఐఎంఎఫ్ తాజా డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత కంపెనీలు, న్యాయ సేవల సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే ఆకాంక్షలతో పనిచేయాలని సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. తక్కువ ఆదాయ దేశాల్లోని సమస్యలతో పోల్చితే మధ్యాదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచానికి పనిచేసే కారి్మక శక్తిని భారత్ అందిస్తున్నట్టు చెప్పారు. జపాన్ 15వేల మంది భారత నర్సులను తీసుకుంటే, జర్మనీ 20వేల మంది హెల్త్కేర్ సిబ్బందిని నియమించుకున్నట్టు గుర్తు చేశారు. వారిదగ్గర కుటుంబ వ్యవస్థ ముక్కలైనట్టు వ్యాఖ్యానించారు. -
మార్చిలో జోరుగా పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా 192 శాతం అధికంగా 4.47 బిలియన్ డాలర్ల (రూ.38వేల కోట్లు సుమారు) విలువైన పసిడి దిగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మార్చి నెలలో దిగుమతులు 1.53 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే బంగారం దిగుమతుల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. విలువ పరంగా వృద్ధి కనిపించగా, పరిమాణం పరంగా పసిడి దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతులు 2023–24తో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 27 శాతం ఎగసి 58 బిలియన్ డాలర్లకు (రూ.4.99 లక్షల కోట్లు సుమారు) చేరాయి. 2023–24 సంవత్సరంలో పసిడి దిగుమతులు 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిమాణం పరంగా 757.15 టన్నుల బంగారం గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతి అయింది.2023–24లో ఇది 795.32 టన్నులుగా ఉండడం గమనించొచ్చు. దిగుమతి పరిమాణం తగ్గినప్పటికీ ధరల పెరుగుదలతో విలువ పరంగా వృద్ధి నమోదైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 62 శాతం తగ్గగా (విలువ పరంగా), జనవరిలో 41 శాతం, 2024 డిసెంబర్లో 55 శాతం చొప్పున పెరిగాయి. సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తూ పెట్టుబడులు పెట్టే ధోరణి పెరగడం దిగుమతులకు మద్దతుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు పెరిగిపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. వాణిజ్య లోటుకు ఆజ్యం బంగారం దిగుమతుల విలువ పెరగడం దేశ వాణిజ్య లోటు పెరిగేందుకు దారితీసింది. మార్చి నెలలో వాణిజ్య లోటు 21.54 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 283 బిలియన్ డాలర్ల లోటుతో ఆల్టైమ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం జూమ్..
ముంబై: ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 12,630 కోట్ల నికర లాభం (స్టాండెలోన్ ప్రాతిపదికన) నమోదు చేసింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 10,708 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 18 శాతం అధికం. తాజా క్యూ4లో లాభం రూ. 12,050 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్గా డిసెబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 7 శాతం పెరిగింది. రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరుపై రూ. 11 చొప్పున బ్యాంకు డివిడెండ్ ప్రకటించింది. తగ్గిన మొండిబాకీలు.. సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 2.16 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచ్చింది. అలాగే నికర ఎన్పీఏల నిష్పత్తి 0.42 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గింది. పరిమాణంపరంగా చూస్తే రూ. 27,962 కోట్ల నుంచి రూ. 24,166 కోట్లకు స్థూల ఎన్పీఏలు దిగి వచ్చాయి. సీక్వెన్షియల్గా చూస్తే డిసెంబర్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏల నిష్పత్తి 1.96 శాతంగా, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.42 శాతంగా ఉంది. మొండి బాకీలకు ప్రొవిజనింగ్ (పన్నులకు ప్రొవిజన్ మినహాయించి) రూ. 718 కోట్ల నుంచి రూ. 891 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం సుమారు 16 శాతం పెరిగి రూ. 13,502 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 శాఖలు ప్రారంభించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. డిపాజిట్లు 14 శాతం అప్.. → ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు వార్షికంగా క్రితం క్యూ4తో పోలిస్తే తాజా క్యూ4లో 14 శాతం, క్వార్టర్లవారీగా చూస్తే సుమారు 6 శాతం పెరిగాయి. మార్చి 31 నాటికి మొత్తం డిపాజిట్లు రూ. 16.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. → దేశీయంగా నికర రుణాలు వార్షికంగా 13.9 శాతం, సీక్వెన్షియల్గా 2.2 శాతం పెరిగాయి. రిటైల్ రుణాల పోర్ట్ఫోలియో వార్షికంగా 8.9 శాతం, సీక్వెన్షియల్గా 2 శాతం పెరిగింది. మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో రిటైల్ రుణాల వాటా 52.4 శాతంగా ఉంది. చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల పోర్ట్ఫోలియో 33.7 శాతం, రూరల్ రుణాల పోర్ట్ఫోలియో 5.1 శాతం, కార్పొరేట్ రుణాల పోర్ట్ఫోలియో 11.9% పెరిగింది. వార్షికంగా మొత్తం రుణాలు 13.3 శాతం, సీక్వెన్షియల్గా 2.1 శాతం పెరిగి రూ. 13.42 లక్షల కోట్లకు చేరాయి. → నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 11 శాతం పెరిగి రూ. 19,093 కోట్ల నుంచి రూ. 21,193 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.40 శాతం నుంచి 4.41 శాతానికి చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎన్ఐఎం 4.32 శాతంగా ఉంది. → క్యూ4లో బ్యాంకు కొత్తగా 241 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల నెట్వర్క్ 6,983కి చేరింది. 2025 మార్చి 31 నాటికి మొత్తం ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 16,285గా ఉంది. -
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై తాము విధించిన సుంకాలు దేశ భద్రతా కోణంలోనే తప్పించి రక్షణాత్మక చర్యల కింద చూడరాదని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు స్టీల్, అల్యూమినియం దిగుమతులు ముప్పుగా పరిణమించడంతో, దీన్ని సర్దుబాటు చేయడానికి సెక్షన్ 232 కింద అధ్యక్షుడు టారిఫ్లను ప్రకటించినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు బదులిచ్చింది. డబ్ల్యూటీవో సేఫ్గార్డ్ అగ్రిమెంట్లోని ఆర్టికల్ 12.3 కింద అమెరికాతో సంప్రదింపులకు ఏప్రిల్ 11న భారత్ ప్రతిపాదన చేయడంతో ఈ సమాధానం వచ్చింది. ‘‘ఇవి ఎంత మాత్రం రక్షణాత్మక చర్యలు కావు. కనుక రక్షణాత్మక చర్యల కింద సంప్రదింపులకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినప్పటికీ ఈ అంశమే కాదు, ఏ అంశంపై అయినా భారత్తో చర్చలకు సుముఖంగా ఉన్నాం. కాకపోతే, చర్చలు ఏవైనా కానీ రక్షణాత్మక చర్యల ఒప్పందం కింద ఉండకూడదు’’అని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా వాదనను భారత్ అంగీకరించలేదు. భద్రతా కోణంలోనే అని అమెరికా చెప్పినప్పటికీ.. అవి రక్షణాత్మక చర్యలేనని వాదించింది. ఈ ఒప్పందం కింద చర్యలను డబ్ల్యూటీవో కమిటీకి తెలియజేయడంలో అమెరికా విఫలమైనట్టు పేర్కొంది. -
భారత్లో 29 లక్షల యాడ్ అకౌంట్స్ సస్పెన్షన్: గూగుల్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ గతేడాది (2024) భారత్లో 29 లక్షల అడ్వర్టైజర్ల ఖాతాలను సస్పెండ్ చేసింది. అడ్వర్టైజింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 24.74 కోట్ల ప్రకటనలను తొలగించింది. అంతర్జాతీయంగా 3.92 కోట్ల అడ్వర్టైజర్ అకౌంట్లను సస్పెండ్ చేయగా 510 కోట్ల ప్రకటనలను తొలగించింది. 910 కోట్ల ప్రకటనలపై ఆంక్షలు విధించింది. వార్షిక యాడ్స్ సేఫ్టీ నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. సంక్లిష్టమైన విచారణలను వేగవంతం చేసేందుకు, అకౌంట్ సెటప్ సమయంలో పేమెంట్లకు సంబంధించి తప్పుడు వివరాలను సత్వరం పసిగట్టేలా తమ వ్యవస్థలను పటిష్టం చేసుకున్నట్లు గూగుల్ పేర్కొంది. మోసాలను నివారించే దిశగా స్కామ్లను ప్రమోట్ చేసే అడ్వర్టైజర్లను సస్పెండ్ చేయడంలాంటి చర్యలు తీసుకునేందుకు 100కు పైగా నిపుణులతో ఏర్పాటు చేసిన బృందం తమ నిబంధనల్లో పలు కీలక మార్పులు చేసినట్లు వివరించింది. దీంతో స్కామ్ యాడ్లపై ఫిర్యాదులు గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. -
భారత్లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
జర్మన్ కంపెనీ అయిన 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2,00,000 ప్యాసింజర్ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేసిన మొట్టమొదటి లగ్జరీ కార్ బ్రాండ్గా అవతరించింది. మహారాష్ట్రలోని పూణేలోని చకన్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ కారు EQSను విడుదల చేయడంతో కంపెనీ ఈ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.మెర్సిడెస్ బెంజ్ పూణేలోని చకన్ ప్లాంట్లో 50000 యూనిట్లను అసెంబుల్ చేయడానికి 19 సంవత్సరాలు (1995 నుంచి 2014 వరకు) పట్టింది. ఆ తరువాత 1.50 లక్షల యూనిట్లను కేవలం పదేళ్లలో (2015 నుంచి 2025 వరకు) ఉత్పత్తి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఉత్పత్తి సుమారు 470 శాతం పెరిగింది. -
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్జీపీటీ సమాధానం
చాట్జీపీటీ.. అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.. యూజర్లను అబ్బురపరుస్తున్న ఏఐ చాట్బాట్, ఇప్పుడు భకంపం వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో.. ఈ కథనంలో చూసేద్దాం.ఇంట్లో ఉన్నప్పుడు భూకంపం వస్తే..➤భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే.. మోకాళ్లపై వంగి కూర్చున్న విధంగా ఉండండి. ఈ భంగిమలో ఉంటే.. మీరు కిందకు పడిపోకుండా ఉంటారు.➤తల, మెడ మాత్రమే కాకుండా.. వీలైనంత వరకు మీ శరీరాన్ని మొత్తం ఒక దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఉండేలా చూసుకోండి. భూమి కంపించడం ఆగేవరకు అలాగే ఉండండి.➤కిటికీలు, గోడలకు దూరంగా ఉండండి. భయంతో పరుగులు పెట్టడం మంచిది కాదు.➤లిఫ్ట్ వంటి వాటిని ఉపయోగించవద్దు.బయట ఉన్నపుడు భూకంపం వస్తే..➤మీరు బయట ఉన్నప్పుడు భూకంపం వస్తే.. భవనాలు, యుటిలిటీ వైర్లు, సింక్ హోల్స్, ఫ్యూయెల్ స్టేషన్స్, గ్యాస్ లైన్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.➤చెట్లు, టెలిఫోన్ స్తంభాలకు దగ్గరగా ఉండటం మంచిది కాదు.➤ఒకవేళా కారులో ప్రయాణిస్తుంటే.. వెంటనే ఒక సేఫ్ పార్కింగ్ ప్రదేశంలో కారును పార్క్ చేయండి.➤బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, సొంరంగాలు వంటి వాటికి దూరంగా ఉండండి.➤భూమి కంపించడం ఆగే వరకు.. పరుగులు పెట్టడం వంటివి చేయడం మంచిది కాదు.ఇదీ చదవండి: ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్.. -
మార్కెట్ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు
రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్కాయిన్లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.2035 నాటికి.. ఒక బిట్కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.MAKES ME SAD: In 2025 credit card debt is at all time highs. US debt is at all time highs. Unemployment is rising. 401 k’s are losing. Pensions are being stolen. USA may be heading for a GREATER DEPRESSION.I get sad because as I stated in an earlier X….Tweet….I warned…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 18, 2025 Note: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. -
పిన్నాపురం గ్రీన్కో ప్రాజెక్ట్ను సందర్శించిన కేంద్రమంత్రి
కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' శుక్రవారం పిన్నాపురంలోని.. గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను సందర్శించి, దాని వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు.గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు.. ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద జీడబ్ల్యు-స్కేల్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇది 4000 మెగావాట్స్ సౌర విద్యుత్, 1000 మెగావాట్స్ పవన విద్యుత్, 1680 మెగావాట్స్ జలవిద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తం మీద ఇది ఒక సైకిల్లో రోజుకు 10080 మెగావాట్స్ నిల్వ చేసే సామర్థ్యం చేసే కెపాసిటీ కలిగి ఉంది.తన పర్యటన గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్దదైన పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ను ఆచరణలో చూడటం గర్వకారణం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం అని అన్నారు.ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ సీఈఓ & ఎండీ అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. అంతే కాకూండా.. ఈ ప్రాజెక్ట్ ఏటా 3.3 మిలియన్ టన్నుల CO₂ ఉద్గారాలను నివారించడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు. -
మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో
టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది.. దాదాపు అన్ని రంగాల్లోనూ రోబోల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మనుషులతో పోటీగా మారథాన్లో పరుగులు పెట్టే రోబోట్లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింలో వైరల్ అవుతోంది.శనివారం (ఏప్రిల్ 19) చైనాలో నిర్వహించిన మారథాన్లో.. మనుషులతో పాటు రోబోలు పరుగులు పెట్టాయి. మనుషులతో.. మరమనుషులు పరుగులు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మారథాన్లో పాల్గొన్న రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.ఏప్రిల్లో జరగనున్న మారథాన్ బీజింగ్లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు, 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వార్త వెల్లడైంది. ఆ విధంగానే మారథాన్ నిర్వహించారు.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను ఇన్స్టాల్ చేసారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలో ఉన్న మొత్తం రోబోట్లలో చైనాలో ఉన్న రోబోట్లు 51 శాతం అని సమాచారం.The #Humanoid #Robot half-marathon in #Beijing kicked off an hour ago. #China is accelerating its dominance in the robotics and #AI race with unmatched strategic investments. While the world watches in awe, it’s clear that others including India have significant ground to cover.… pic.twitter.com/sgp42JEtGA— Rana. (@bladeit) April 19, 2025 -
ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?
ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.ఇండియాకు టెస్లాటెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.It was an honor to speak with PM Modi. I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys— Elon Musk (@elonmusk) April 19, 2025 -
సన్రైజర్స్ టీమ్ ఓనర్ వద్ద ప్రీమియం కార్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యజమానిగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కావ్య మారన్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్తోపాటు ఆమెకు కార్లంటే మక్కువ ఎక్కువే. ఆమె గ్యారేజీని ప్రీమియం కార్లతో నింపేయడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం తన వద్ద ఉన్న హై-ఎండ్ కార్ల వివరాలు కింద తెలుసుకుందాం.రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8 ఈడబ్ల్యూబీదీని ధర భారతదేశంలో సుమారు రూ.12.2 కోట్లు.బెంట్లీ బెంటాయ్గా ఈడబ్ల్యూబీఈ బ్రాండ్ తయారు చేసిన మొదటి ఎస్యూవీ ఇది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఇది 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్తో వస్తుంది.బీఎమ్డబ్ల్యూ ఐ7ఆమె వద్ద బ్లాక్ సఫైర్ మెటాలిక్ పెయింట్తో కూడిన బీఎమ్డబ్ల్యూ ఐ7 కారు ఉంది. దీని ధర రూ.2.5 కోట్లుగా ఉంది.ఫెరారీ రోమాఇటాలియన్ ఫెరారీ గ్రాండ్ టూరింగ్ కారు ధర సుమారు రూ.3.76 కోట్లు.కావ్య మారన్ 1999 నవంబర్ 3న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎంబీఏ చేశారు. ఎస్ఆర్హెచ్, సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ సహా సన్ గ్రూప్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నిర్వహణలో కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండిఆమె సారథ్యంలో 2016లో ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ 2018, 2024లో రన్నరప్గా నిలిచింది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ 2023, 2024లో ఎస్ఏ20 లీగ్ టైటిల్ గెలుచుకుంది. 2024లో దేవి అవార్డ్స్లో ‘ఫేస్ అండ్ ఫోర్స్ బిహైండ్ సన్రైజర్స్ హైదరాబాద్’ అవార్డు అందుకున్నారు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) ఉంటుందని అంచనా. -
ఇంకెంత కాలం జాబ్ చేస్తారు.. ఇకనైనా మారండి
రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోత కొనసాగుతుందని ప్రముఖ రచయిత, ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. సాంప్రదాయంగా ఉద్యోగంపై ఆధారపడటాన్ని పున:పరిశీలించాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కొన్ని వివరాలు పంచుకున్నారు. ఇటీవలి కాలంలో ఇప్పటికే చెలరేగుతున్న ఆర్థిక అస్థిరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, లక్షల మందిని ఇది ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు.‘గత రెండేళ్లుగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. రాబోయే కొన్నేళ్లలో మరిన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. కొలువు పోతుందని భావిస్తే అందుకు అనుగుణంగా మరింత ఉత్తమంగా సిద్ధం అవ్వాలి. ఉద్యోగ భద్రత కోసం ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆంత్రప్రెన్యూర్షిప్ ద్వారా ఆర్థిక స్వేచ్ఛ దిశగా అడుగులు వేయాలి. దాంతో ఆర్థికంగా ఎదురయ్యే ఎదురుదెబ్బలను అవకాశాలుగా మలుచుకోవాలి’ అని సూచించారు.BEFORE YOU LOSE YOUR JOBIn the last two years…. Millions have lost their jobs.In the next few years…. Millions more will lose their jobs.If you are feeling you may lose your job….best prepare now.Turn a bad event to a great opportunity to stop being an employee,…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 16, 2025ఇదీ చదవండి: జాబ్ ఆఫర్ లేకుండానే యూఎస్లో పని‘ఉపాధి కంటే ఆంత్రప్రెన్యూర్షిప్ మరింత స్థిరమైంది. వ్యక్తులు యజమానులపై ఆధారపడటం అనే ధోరణి నుంచి బయటకు రావాలి. ఇంకెతకాలం ఉద్యోగులుగా ఉంటారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. ఉద్యోగ భద్రత అనే భావం నుంచి బయటకు రండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఆచరణాత్మక మార్గం. ఇటువంటి వేదికలు ప్రజలు స్వతంత్రంగా విజయం సాధించడంలో సహాయపడటానికి అవసరమైన శిక్షణ ఇస్తాయి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీతో పార్ట్టైమ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అధ్యక్షుడు ట్రంప్, నేను సిఫార్సు చేస్తున్నాం. ప్రస్తుతం అనేక గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలు ఉన్నాయి’ అని కియోసాకి చెప్పారు. -
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది. -
ఫోన్ రీచార్జ్లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్లో టెలికాం టారిఫ్లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు. -
జాబ్ ఆఫర్ లేకుండానే యూఎస్లో పని
అమెరికా వెళ్లడం చాలామంది కల. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని నిపుణులకు యూఎస్ తమ కెరియర్ పురోగతికి అంతిమ గమ్యంగా తోస్తుంది. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు, మెరుగైన వేతనాలు, శాశ్వత నివాసానికి అవకాశాలు ఉండటంతో అమెరికాలో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే యూఎస్ వెళ్లేందుకు వర్కింగ్ వీసా పొందడం కష్టమే. దీనికి సాధారణంగా యూఎస్ కంపెనీ యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం అవుతుంది. కానీ జాబ్ ఆఫర్ లేకుండానే అమెరికాలో పని చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇందుకోసం కింది రెండు వీసాలు ఎంతో ఉపయోగపడుతాయి.ఈబీ-2ఈబీ-2 నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ (ఎన్ఐడబ్ల్యూ) అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది శాశ్వత నివాసానికి (గ్రీన్ కార్డ్) కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ వీసా అధునాతన డిగ్రీలు (మాస్టర్స్ లేదా పీహెచ్డీ వంటివి) లేదా యునైటెడ్ స్టేట్స్ జాతీయ ప్రయోజనాలకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే రంగాల్లో అసాధారణ సామర్థ్యాలు ఉన్న వ్యక్తుల కోసం రూపొందించారు.ఈబీ-2కు ఎవరు అర్హులు?సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) నిపుణులు, కళలు, వ్యాపారంలో అద్భుతమైన సహకారంతో నిపుణులు, జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు దీనికి అర్హులు. యజమానిపై ఆధారపడే హెచ్ -1బీ మాదిరిగా కాకుండా ఈబీ-2 కోసం ప్రాయోజిత సంస్థ అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదం లభిస్తే అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉంటూ పనిచేయవచ్చు.ఓ-1 వీసాఓ-1 వీసా అనేది ఒకే యజమాని నుంచి స్పాన్సర్షిప్ అవసరం లేని వీసా. ఇది అసాధారణ సామర్థ్యాలు ఉన్నవారికి ఇస్తారు. ఇది నిపుణులు విభిన్న సంస్థల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అనుమతిస్తుంది. ఆయా రంగాల్లో అసాధారణ సామర్థ్యాలున్న వ్యక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: బెంగళూరు, హైదరాబాద్లోని ఉద్యోగులు ఔట్..?సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ లేదా అథ్లెటిక్స్లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వీరి పేరుపై ఆయా రంగాల్లో రికార్టులుండాలి. ఆ విజయాలకు జాతీయ లేదా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఓ-1 నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా లభిస్తుంది. -
బెంగళూరు, హైదరాబాద్లోని ఉద్యోగులు ఔట్..?
గూగుల్ భారత్లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోందని వార్తలొస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. ప్రకటనలు, సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ లేఆఫ్స్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది.గూగుల్ ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో ఇటీవల జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు. తాజాగా మళ్లీ ఇలా లేఆఫ్స్ వార్తలు వస్తుండడం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఈ విభాగం ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్ వంటి కీలక ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటానికి సంస్థ ప్రయత్నిస్తున్నందున నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: కోత కోసి.. పూత పూసి..అయితే భారత్లో మాత్రం ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి గూగుల్ కాస్త మెరుగ్గా వ్యవహరిస్తుందని కూడా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్ల్లో టెక్నికల్ పొజిషన్లలో ఉన్న ఉద్యోగులను నేరుగా తొలగించడానికి బదులుగా ఆదాయం సమకూరే ఇతర ప్రాజెక్టుల్లో కేటాయించే అవకాశం ఉందని తెలిపింది. కంపెనీ ఇటీవల అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పులు చేసింది. గత సంవత్సరం తన ప్లాట్ఫామ్స్, డివైజెస్ బృందాలను విలీనం చేసింది. దాంతో భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గింపు కోసం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాలను ప్రవేశపెట్టింది. విలీనం తర్వాత ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని తొలగింపులు జరిగాయని ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో తమ ఉద్యోగులకు కొన్ని ఆఫర్లు ఇచ్చినట్లు గూగుల్ ధ్రువీకరించింది. -
హమ్మయ్య.. బంగారం ఆగింది!
దేశంలో బంగారం ధరలు (Gold Prices) గత కొన్ని వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,730- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే ఇక్కడ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ట్రాయ్ ఔన్స్కు 3,340 డాలర్ల వద్ద ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.బంగారం ధరలు రాబోయే రోజుల్లో రూ.1,00,000 (10 గ్రాముల 24 క్యారెట్) మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయనుంది.40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్లో చ.అ. ధర రూ.11 వేలుగా ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్నెస్, లైఫ్స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. -
కోత కోసి.. పూత పూసి..
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలో ఫెయిలైన 240 మంది ట్రెయినీలను తొలగించింది. తాజాగా కొలువుల నుంచి తొలగించిన వారితోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి ఉచితంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్లతో మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పింది. లేఆఫ్స్తో గాయం చేసి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో దానికి పూత పూసినట్లయింది. ఏప్రిల్ 18న ఇన్ఫోసిస్ లేఆఫ్స్కు సంబంధించి ట్రెయినీలకు ఈమెయిల్ పంపించింది. ‘జెనెరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’లో అర్హత సాధించని వారిని తొలగిస్తున్నట్లు అందులో పేర్కొంది. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహాల నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్లు ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రామ్లో అర్హత ప్రమాణాలను చేరుకోలేదనే సాకుతో ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది.తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా..ఎన్ఐఐటీ, అప్గ్రాడ్ సంస్థల భాగస్వామ్యం ద్వారా కొలువు కోల్పోయిన ట్రయినీలకు ఉచితంగా నైపుణ్యాలు పెంచుకునేలా అవకాశాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. శిక్షణార్థులకు బీపీఎం పరిశ్రమలో ఉద్యోగాల సాధన కోసం లేదా ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రోగ్రామ్లు ఎంతో తోడ్పడుతాయని ఈమెయిల్లో తెలిపింది.‘మీరు ఇన్ఫోసిస్లో కాకుండా బయట ఉద్యోగ అవకాశాలను చూస్తుంటే మీకు సాయం చేసేందుకు ప్రొఫెషనల్ అవుట్ ప్లేస్మెంట్ సేవలను ప్లాన్ చేశాం. బీపీఎం పరిశ్రమలో మీరు ఉద్యోగాలు సాధించేలా తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్లో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే అందుకు మద్దతుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్పై ఇన్ఫోసిస్ స్పాన్సర్డ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది’ అని ఈమెయిల్తో తెలిపింది. టెక్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇది తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడానికి ఒక కారణంగా నిలుస్తుంది. కంపెనీల ఆదాయాలు తగ్గుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.బలహీనమైన ఆదాయ అంచనాలుప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.ఇదీ చదవండి: పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?భౌగోళిక, వాణిజ్య సవాళ్లుముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి. -
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి. -
పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?
శాటిలైట్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శాటిలైట్ ఆధారిత టోలింగ్ సిస్టమ్ ఫాస్టాగ్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను భర్తీ చేస్తుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేస్తూ, 2025 మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసుల అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.టోల్ ప్లాజాలగుండా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సులువైన ప్రయాణం కోసం భవిష్యత్తులో టోల్ ప్లాజాల వద్ద ‘ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్)-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇది వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను ఉపయోగించే ప్రస్తుత ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుందని పేర్కొంది. ఇది అమలులోకి వస్తే టోల్ ప్లాజాల అధిక సమయం ఆగాల్సిన అవసరం లేకుండా హై పెర్ఫార్మెన్స్ ఏఎన్పీఆర్ కెమెరాలు, ఫాస్టాగ్ రీడర్ల ద్వారా వెంటనే టోల్ ఛార్జీలు కట్ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-నోటీసులు జారీ చేస్తామని, వాటిని చెల్లించకపోతే ఫాస్టాగ్, ఇతర వాహన సంబంధిత సదుపాయాలను నిలిపివేయాల్సి వస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ‘ఏఎన్పీఆర్-ఫాస్టాగ్ టోలింగ్ సిస్టమ్’ అమలుకు ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం, వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా దీని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భారతదేశ జాతీయ రహదారి నెట్వర్క్లో సుమారు 855 ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 675 ప్రభుత్వ నిధులతో, మిగతావి ప్రైవేట్ ఆపరేటర్లతో నిర్వహిస్తున్నారు.శాటిలైట్ ఆధారిత టోలింగ్గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమలులోకి వచ్చిన తరువాత టోల్ ఫీజు చెల్లించడానికి ప్రత్యేకంగా.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు. వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ పరిగణించి వాహనదారుల ఈ-వ్యాలెట్ నుంచి టోల్ ఛార్జీ కట్ అవుతుంది. అయితే దీనికోసం వాహనదారులు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కలిగిన ఫాస్టాగ్ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. లేదా ఇతర ఆన్ బోర్డ్ యూనిట్ (OBU) లేదా ట్రాకింగ్ పరికరాలను అమర్చి.. టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్ల కోత..
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసిన నేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. లాభాలను దృష్టిలో ఉంచుకుని హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్తో సహా ప్రధాన భారతీయ బ్యాంకులు ఇటీవల సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. కాసా (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) ఖాతాలు క్షీణించడం, డిపాజిట్ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిధుల వ్యయాన్ని నియంత్రించడానికి, నికర వడ్డీ మార్జిన్లను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ప్రధాన బ్యాంకుల్లో రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.50 లక్షల లోపు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్పై వడ్డీ రేటును 2.75 శాతానికి, దానికంటే అధిక బ్యాలెన్స్పై 3.25 శాతానికి చేర్చింది.రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా డిపాజిట్లపై 2.7% వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తుంది. ఇందులో అక్టోబర్ 2022 నుంచి ఎలాంటి మార్పులేదు.ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50 లక్షల లోపు పొదుపు ఖాతాలోని బ్యాలెన్స్పై 2.75 శాతం, దాని కంటే అధిక మొత్తాలకు 3.25 శాతం వడ్డీ రేట్లను సవరించింది.డిపాజిట్ వ్యయాలను తగ్గించడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ మాదిరిగానే వడ్డీ రేట్లను సర్దుబాటు చేసింది.రేట్ల కోతకు కారణంమారుతున్న ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ చర్యలు తీసుకున్నాయి. బ్యాంకుల్లో కాసా(కరెంట్ ఖాతా సేవింగ్స్ ఖాతా) నిష్పత్తులు తగ్గుతున్నాయి. ఉన్న పొదుపు ఖాతాల్లో నగదు జమ భారీగా క్షీణిస్తోంది. ఇది బ్యాంకులకు తక్కువ ఖర్చుతో కూడిన నిధులను నిర్వహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాతాదారులు అధిక వడ్డీ రేట్లతో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను ఎక్కువగా ఎంచుకోవడంతో సేవింగ్స్ ఖాతాల వృద్ధి తగ్గిపోయింది. వీటికితోడు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుడిపాజిటర్లకు మార్గాలు..బ్యాంకుల వడ్డీ తగ్గింపు నిర్ణయాలతో పొదుపు ఖాతాదారులు తమ డిపాజిట్లపై తక్కువ రాబడిని పొందుతారు. అయితే అధిక రాబడినిచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు మళ్లించడం మంచి రాబడిని ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. డిపాజిటర్లు తమ నగదును దీర్ఘకాలంలో అధిక రాబడినిచ్చే ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, రియల్ ఎస్టేట్, బంగారం.. వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చని చెబుతున్నారు. మంచి ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. -
బ్యాంకులకు నేడు సెలవు ఉందా?
దేశంలోని వివిధ బ్యాంకులను నిత్యం కోట్ల మంది కస్టమర్లు వివిధ పనుల నిమిత్తం సందర్శిస్తూ ఉంటారు. అయితే బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయన్న సమాచారం తెలియక చాలా మంది తికమక పడుతుంటారు. ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆదివారం ఈస్టర్ అనే రెండు సెలవుల మధ్య వచ్చే శనివారం వచ్చేసింది కాబట్టి ఈరోజు అంటే ఏప్రిల్ 19న బ్యాంకులు తెరిచిఉంటాయా లేదా అనే అయోమయం నెలకొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. దీంతో బ్యాంకులు తెరిచిఉండవు. ఏప్రిల్ 19న నెలలో మూడో శనివారం కావడంతో పాటు ఎలాంటి పండుగ లేనందున బ్యాంకర్లకు లాంగ్ వీకెండ్ ఉండదు. కాబట్టి ఈరోజు ఎలాంటి సెలవు లేదు. యథాప్రకారం తెరిచే ఉంటాయి.తదుపరి సెలవు ఏప్రిల్ 26నఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం, తదుపరి నిర్దేశిత బ్యాంకు సెలవు ఏప్రిల్ 26న ఉంది. ఇది నెలలో నాలుగో శనివారం. ఆరోజు గౌరీ పూజ సెలవు కూడా ఉంటుంది. ప్రస్తుత నెలలో శనివారం సెలవులతో సహా మొత్తం 13 నిర్దేశిత బ్యాంకు సెలవులు ఉన్నాయి.ఏప్రిల్ లో బ్యాంకు సెలవుల జాబితాఏప్రిల్ 1: బ్యాంకులకు తమ వార్షిక ఖాతాల క్లోజింగ్ సెలవు/ సర్హుల్.ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (హైదరాబాద్ లో మాత్రమే)ఏప్రిల్ 7: షాద్ సుక్ మైన్సీమ్ (షిల్లాంగ్ లో మాత్రమే)ఏప్రిల్ 10: మహావీర్ జయంతిఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి, విషు, బిహు, తమిళ నూతన సంవత్సరాది వంటి వివిధ ప్రాంతీయ నూతన సంవత్సర వేడుకలకు సెలవు.ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరాది / హిమాచల్ డే / బోహాగ్ బిహు (అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్)ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 26: గౌరీ పూజ, నాల్గవ శనివారంఏప్రిల్ 29: పరశురామ్ జయంతి. (హిమాచల్ ప్రదేశ్)ఏప్రిల్ 30: బసవ జయంతి, అక్షయ తృతీయ -
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 19) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది. ఈ విధానం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ వంటి అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది.ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలుదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల్లో నిన్నటి పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. గత ఐదు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 19న పెట్రోల్ ధర లీటరుకు ఏయే నగరంలో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ.107.46విజయవాడ: రూ.109.74న్యూ ఢిల్లీ: రూ.94.77ముంబై: రూ.103.50కోల్కతా: రూ.105.01చెన్నై: రూ.101.03బెంగళూరు: రూ.102.98అహ్మదాబాద్: రూ.94.58లక్నో: రూ.94.58పాట్నా: రూ.106.11డీజిల్ ధరలుడీజిల్ ధరలు కూడా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య విభిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 19న డీజిల్ ధరలు లీటర్కు ఇలా ఉన్నాయి.హైదరాబాద్: రూ.95.70విజయవాడ: రూ.97.57న్యూ ఢిల్లీ: రూ.87.67ముంబై: రూ.90.03కోల్కతా: రూ.91.82చెన్నై: రూ.92.39బెంగళూరు: రూ.90.99అహ్మదాబాద్: రూ.90.17 -
రియల్ఎస్టేట్లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ వెల్లడించింది.2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి. -
టాటా ఎలెక్సీ లాభం డౌన్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ సేవల ఇంజనీరింగ్ కంపెనీ టాటా ఎలెక్సీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 13 శాతం క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. నికర లాభ మార్జిన్లు 18.1 శాతంగా నమోదయ్యాయి. నిర్వహణ ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 908 కోట్లను తాకింది. వాటాదారులకు గతేడాదికిగాను కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా షేరుకి రూ. 75 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆదాయం రూ. 3,729 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 208 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు 22.9 శాతానికి చేరాయి. -
క్రాష్ టు జోష్..!
ట్రంప్ టారిఫ్ల సునామీ ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. అనేక దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు వడ్డించడం, చైనా దీటుగా టారిఫ్లతో తిప్పికొట్టడంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అమెరికా టు ఆసియా స్టాక్ మార్కెట్లు ’బేర్’మన్నాయి. అక్టోబర్ నుంచి రివర్స్గేర్లో కొనసాగుతున్న మన సూచీలు.. ట్రంప్ టారిఫ్ దెబ్బకు తాజా 17 శాతం దిగజారాయి. సెన్సెక్స్ సెప్టెంబర్లో 85,978 పాయింట్ల ఆల్టైమ్ గరిష్టం నుంచి తాజాగా 71,425 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడం, పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ బుల్స్ ఫేస్ టరి్నంగ్ ఇచ్చుకున్నాయి. తాజా కనిష్టం నుంచి 10 శాతం మేర ‘రిలీఫ్’ ర్యాలీ చేశాయి. ఈ వారంలోనే 4 శాతం జంప్ చేశాయి. కాగా, దేశీ మార్కెట్లు గతంలో కూడా సంక్షోభాలు, స్కామ్ల దెబ్బకు భారీగా పడి, బేర్ గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ... మళ్లీ అంతే వేగంగా రికవరీ అయ్యాయి. అమెరికా–చైనాల మధ్య టారిఫ్ వార్ ముదురుతుండటం, ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తారోనన్న అనిశి్చతితో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, టారిఫ్ల దుమారం పూర్తిగా సద్దుమణిగితే బుల్స్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మన మార్కెట్లో అతిపెద్ద పతనాలు, కోలుకున్న తీరు చూస్తే...కోవిడ్ క్రాష్.. 2020లో కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతే.. స్టాక్ మార్కెట్లో బేర్ విలయతాండవం చేసింది. ఇటీవలి చరిత్రలో మార్కెట్లు ఇలా కుప్పకూలడం ఇదే తొలిసారి. లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో మార్చి 2020లో సెన్సెక్స్ 41,000 స్థాయి నుంచి 25,981 పాయింట్ల కనిష్టానికి క్రాష్ అయ్యింది. అయితే, సెంట్రల్ బ్యాంకుల సహాయ ప్యాకేజీలు, వడ్డీ రేట్ల భారీ కోతలతో మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా దూసుకుపోయాయి. నవంబర్ 2020 నాటికి కనిష్టం నుంచి 58 శాతం ఎగబాకి మళ్లీ క్రాష్ ముందస్తు స్థాయిని దాటేశాయి. వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కుమ్మరింపుతో నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. 2021 సెప్టెంబర్ నాటికి 60,,000 స్థాయి పైకి చేరగా.. 2024 సెప్టెంబర్లో 85,978 పాయింట్లతో సరికొత్త చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం... 2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరొందిన ఆర్థిక సంస్థలతో పాటు పలు కంపెనీలు కూడా దివాలా తీశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. సెన్సెక్స్ మెగా పతనంతో 21,000 స్థాయి నుంచి 2009 మార్చి నాటికి 8,000 పాయింట్లకు కుప్పకూలింది. అంటే ఏకంగా 62 శాతం కరిగిపోయింది. అయితే, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఉద్దీపన ప్యాకేజీల అమలు, వడ్డీరేట్ల కోతలతో మార్కెట్ల రికవరీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడటం, విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 2010 నవంబర్ నాటికి సెన్సెక్స్ మళ్లీ 21,000 మార్కును తాకింది. రెండేళ్ల రికవరీలో 162% ర్యాలీ చేసింది. కేతన్ పరేఖ్ స్కామ్/డాట్ కామ్ బబుల్ భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన కేతన్ పరేఖ్ షేర్ల కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్–కామ్ బబుల్ బద్దలవ్వడంతో దేశీ సూచీలు కకావికలం అయ్యాయి. 2001 ఆరంభంలో 4,200 పాయింట్ల స్థాయిలో ఉన్న సెన్సెక్స్ సెప్టెంబర్ నాటికి 2,594 పాయింట్లకు కుప్పకూలింది. అయితే, మళ్లీ 2003 నుంచి నెమ్మదిగా మార్కెట్లో జోరు మొదలైంది. 2004 మధ్య నాటికి, అంటే మూడేళ్లలో 62 శాతం ర్యాలీతో 4,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా దేశ జీడీపీ వృద్ధి పుంజుకోవడం, ఐటీ రంగం పరుగులతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులకు వరుస కట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి.హర్షద్ మెహతా కుంభకోణం దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన హర్షద్ మెహతా స్కామ్.. ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. 1992లో స్కామ్ బట్టబయలు కాగా, సెన్సెక్స్ 4,467 పాయింట్ల నుంచి 1993 మే నెలకల్లా 2,529 పాయింట్లకు (43 శాతం) పడిపోయింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, సరళీకరణ దన్నుతో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కొత్తపుంతలు తొక్కి, మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్లాయి. 1996 నాటికి సెన్సెక్స్ మళ్లీ 4,600 పాయింట్ల స్థాయికి (82 శాతం) అధిగమించి దుమ్మురేపింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
యూపీఐ లావాదేవాల మీద ప్రభుత్వం జీఎస్టీ విధించనుందని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కేద్రం క్లారిటీ ఇచ్చింది. రూ. 2వేలు కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే 18 శాతం జీఎస్టీ విధిస్తారని ప్రచారమవుతున్న వార్తా అబద్దమని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు చేస్తే జీఎస్టీ విధిస్తారని కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..యూపీఐ అందుబాటులోకి వచ్చిన తరువాత.. చాలామంది జేబులో డబ్బులు పెట్టుచుకోవడమే మరచిపోయారు. ప్రతి చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా.. ఆన్లైన్లో పే చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లావాదేవీలమీద జీఎస్టీ విధిస్తారని వస్తున్న వార్తలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. -
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రారంభించనుంది. ఈ కొత్త వెర్షన్ 2025 మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్స్, డిజిటల్ కరెక్షన్స్, ఏటీఎం ద్వారా విత్డ్రా వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి ప్రధాన కారణం.. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన అన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అమలులోకి వచ్చిన తరువాత.. ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు, క్లెయిమ్ల కోసం లేదా కరెక్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఓటీపీ ద్వారానే ఏపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం వల్ల, నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలో త్వరగా జమ అవుతాయని మన్సుఖ్ అన్నారు.ఏఈఎఫ్ఓ మొత్తం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది. దీనికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్లు పొందేందుకు వీలు కల్పిస్తూ 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు.పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు.ఇదీ చదవండి: కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!కార్మికులకు ఆరోగ్య సంరక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్స పొందగలరని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన ఛారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. -
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'కోపైలట్' (Copilot) తీసుకొచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలను అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తోంది. మొత్తం మీద ప్రశ్న మీది.. సమాధానం నాది అన్నట్టుగా ఈ కోపైలట్ యూజర్లకు ఉపయోగపడుతోంది.ప్రతి ప్రశ్నకు సమాధానం అందించే.. కోపైలట్ ఈ వేసవిలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.➢బడికి సెలవులు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులకు ఓ టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే.. పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. వారిని అదుపులో పెట్టడం కొంత కష్టమైన పనే. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే.. వారు బుద్ధిమంతుల్లా చెప్పినమాట వింటారు. మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రత్యమ్నాయం ఉండాలి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన, సులభమైన బొమ్మలు తయారు చేయడానికి, మంచి స్టోరీస్ కోసం 'కోపైలట్'ను ఉపయోగించుకోవచ్చు.➢పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతే.. వారి షెడ్యూల్ అక్కడ వేరుగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలో వారికి పాలుపోదు. తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంత సేపు ఆదుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టు ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు.➢వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి.. పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. వచ్చే విద్యాసంవత్సరానికి వెళ్లే విద్యార్థులను కూడా ఎలా సిద్ధం చేయాలనే బేసిక్స్ కూడా ముందుగానే కోపైలట్ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వొచ్చు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?➢సమ్మర్ అంటేనే.. చాలామంది అకేషన్స్ లేదా వెకేషన్లకు వెళ్లిపోతుంటారు. దాదాపు చాలామంది లాంగ్ ట్రిప్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా పిల్లలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడంలో, ప్యాకింగ్ చెక్లిస్ట్లు, విహారయాత్రకు ప్లాన్ చేయడానికి కోపైలట్ ఓ సలహాదారుడిగా ఉపయోగపడుతుంది. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానాలు ఉంటాయి.కోపైలట్ అనేది టెక్నాలజీలో ఒక అద్భుతం. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అది ఇచ్చే సూచనలలో ఉపయోగకరమైన ఎంచుకోవాలి. ఇది మొత్తం యూజర్ మీదనే ఆధారపడి ఉంటుంది. -
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ & పంజాబ్ నేషనల్ బ్యాంకులకు జరిమానా విధించింది. వినియోగదారులకు అందించే సేవలలో లోపం, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.కోటక్ మహీంద్రా బ్యాంక్: లోన్ సిస్టమ్కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, ఇతర చట్టబద్ధమైన పరిమితులకు సంబంధించిన ఉల్లంఘనల కారణంగా ఆర్బీఐ.. కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ. 61.4 లక్షల జరిమానా విధించింది.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్: కేవైసీ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకుకు.. ఆర్బీఐ రూ. 38.6 లక్షల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్: కస్టమర్ సర్వీస్ నిబంధనలను పాటించడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా విఫలమైంది. ఈ కారణంగా ఆర్బీఐ రూ. 29.6 లక్షల జరిమానా విధించింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులకు జరిమానాలు విధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా బ్యాంకులకు భారీ మొత్తంలో జరిమానాలు విధించింది. నియమాలను అనుసరించడంలో.. బ్యాంకులు విఫలమైతే ఆర్బీఐ జరిమానా విధించడానికి సిద్ధంగా ఉంటుంది.ఇదీ చదవండి: 'ఇన్ఫోసిస్లో 20వేల ఉద్యోగాలు': క్లారిటీ ఇచ్చిన సీఎఫ్ఓ -
2025 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ కంపెనీ.. 2025 అపాచీ ఆర్ఆర్ 310 బైకును మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.2025 అపాచీ ఆర్ఆర్ 310.. టర్న్ సిగ్నల్ లాంప్స్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ అనే రెండు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను పొందుతుంది. లాంచ్ కంట్రోల్, కొత్త 8 స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఈ బైకులో ఉన్నాయి. టీవీఎస్ ఆసియా ఓఎంసీ రేస్ బైక్ నుంచి ప్రేరణ పొందటం చేత.. ఈ బైక్ సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ స్కీమ్ పొందుతుంది.ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ అదే 312 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 9,800 rpm వద్ద 37 bhp & 7,900 rpm వద్ద 29 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ బైక్ కోసం కంపెనీ ప్రత్యేకంగా కిట్ కూడా అందిస్తోంది. దీనికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్
స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.వాట్సాప్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్స్ సాయంతో.. మీ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల.. మీ వాట్సాప్ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో.. వారు చూడలేరు.ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..➤వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.➤సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత.. ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.➤ప్రైవసీ మీద క్లిక్ చేసిన తరువాత.. మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి.➤ఆలా చేసిన తరువాత.. నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి.➤ఆ తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెలక్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు -
'ఇన్ఫోసిస్లో 20వేల ఉద్యోగాలు'
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే! -
భవిష్యత్తులో సివిలియన్ హెలికాప్టర్లకు గిరాకీ
భారత్లో వచ్చే ఐదేళ్లలో సివిలియన్ హెలికాప్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎయిర్బస్ హెలికాప్టర్స్ అంచనా వేసింది. మెడికల్ ఎమర్జెన్సీలు, డిజాస్టర్ రిలీఫ్, లా ఎన్ఫోర్స్మెంట్, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఇందుకు కారణమని తెలిపింది. ఇది కీలకమైన సేవల కోసం హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని సూచిస్తుంది.ప్రస్తుత పరిస్థితులు ఇలా..దేశంలో ప్రస్తుతం 250 సివిల్ హెలికాప్టర్లున్నాయి. ఇది ప్రపంచ సివిలియన్ ఫ్లీట్లో సుమారు ఒకశాతంగా ఉంది. ఈ వాటా ప్రస్తుతానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్బస్ హెలికాప్టర్లకు అపారమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తుంది. కొండ రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధంభారత ప్రభుత్వం కూడా ఈ సర్వీసులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రాంతీయ హెలికాప్టర్ సేవలతో సహా సరసమైన విమాన కనెక్టివిటీని అందించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెలిపోర్టులను ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఎయిమ్స్ రిషికేశ్లో హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బందిని, రోగులను తరలిస్తున్నారు. -
అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్మస్క్తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుమస్క్కు చెందిన శాటిలైట్ కమ్యునికేషన్ సిస్టమ్ స్టార్లింక్ కూడా భారత్లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకో కొత్త ధరకు చేరుతూ సామాన్యులకు అందనంత దూరంగా జరిగిపోతోంది పసిడి. ఇన్వెస్టర్లు సైతం స్వర్ణంపై సంపూర్ణ విశ్వాసం పెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘భవిష్యత్ బంగారం’గా మరో లోహం ఆశలు పూయిస్తోంది. అదే ‘రాగి’ (Copper). ఎందుకు.. ఏమిటి అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..మల్టీ నేషనల్ మైనింగ్ సంస్థ వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కాపర్ను 'తదుపరి బంగారం'గా అభివర్ణించారు. ఇది క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మౌలిక సదుపాయాలు, ఏఐ, రక్షణ పరికరాలలో కాపర్కు పెరుగుతున్న డిమాండ్ను ఆయన ప్రస్తావించారు. కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్ పదాన్ని తొలగించి కేవలం 'బారిక్'గా మార్చడం గ్లోబల్ స్థాయిలో కాపర్ గనులపై దృష్టి మారే సంకేతంగా ఆయన పేర్కొన్నారు.భారత్కు మంచి అవకాశాలుభారతదేశం ఈ ధోరణిలో పెద్ద అవకాశాలను కలిగి ఉందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వర్ధమాన పారిశ్రామికవేత్తలు, యువ పెట్టుబడిదారులు ఆశాజనకమైన, భవిష్యత్తు ఉన్న లోహాలపై దృష్టి సారించి ఈ అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాపర్, ఇతర ముఖ్యమైన ఖనిజాలను ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్ను ప్రారంభించాలని కూడా ఆయన సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కాపర్ గనులను పునరుద్ధరించడం ఆ లోహానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారతదేశంలో బంగారం ధరలు గురువారం (ఏప్రిల్ 17) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.98,170 పలికింది. ప్రపంచవ్యాప్త డిమాండ్తో బంగారం ధరలు పెరిగిపోయి పెట్టుబడులకు ఆస్కారం తగ్గిపోతున్న క్రమంలో అగర్వాల్ భవిష్యత్లో కాపర్ను పెట్టుబడి ఎంపికగా గుర్తించారు. ఇది ఆర్థిక వృద్ధికి, ఆరోగ్యకరమైన పరిశ్రమలకు మద్దతు ఇస్తుందని అన్నారు.కాపర్కు గల ఈ పునరుద్ధరణ భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప లాభాలను తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు పర్యావరణ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అగర్వాల్ ఈ విషయంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ద్వారా భారతదేశం కాపర్ రంగంలో స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రస్థానం భారత యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.The world's second largest gold producer, Barrick Gold is rebranding to just Barrick. That is because it sees its future in copper.Copper is the new super metal which is being heavily used in every advanced technology, whether EVs, renewable energy infrastructure, AI or defence… pic.twitter.com/YUDC5Rid4r— Anil Agarwal (@AnilAgarwal_Ved) April 17, 2025 -
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరినొకరు కమ్యునికేట్ అవ్వడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్మార్ట్ఫోన్లు చాలా అవసరం. అయితే ఈ రంగంలో నిత్యం కొత్త కంపెనీలు విభిన్న మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన ఫోన్ను ఎంచుకోవడం కష్టంగా మారింది. కొన్ని సంస్థలు అందించిన వివరాల ప్రకారం రూ.10,000లోపు ధర ఉన్న టాప్ 10 మొబైళ్ల వివరాలు కింది తెలియజేశాం.ఇదీ చదవండి: ఫెడ్ ఛైర్మన్ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరికఐటెల్ కలర్ ప్రో 5జీ: 6.6 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్(ఎంపీ కెమెరా).ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (ఆక్టాకోర్, 2.4గిగాహెర్ట్జ్) ప్రాసెసర్.పోకో సీ 71: 6.88 అంగుళాల డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.పోకో ఎం7 5జీ: స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.మోటో జీ35 5జీ: 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, యూనిసోక్ టీ760 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.రెడ్ మీ ఏ4 5జీ: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.వివో వై18టీ: యూనిసోక్ టీ612 చిప్సెట్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఒప్పో ఏ3ఎక్స్ 4జీ: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.టెక్నో స్పార్క్ 30సీ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
లేఆఫ్లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. -
ఫెడ్ ఛైర్మన్ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరిక
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పనితీరుపట్ల ట్రంప్ మండిపడ్డారు. ఇతర సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నా తాను అనుకున్న విధంగా అమెరికా వేగంగా వాటిని తగ్గించడంలేదని అభిప్రాయపడ్డారు.తీవ్ర అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి అడుగుపెట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. వినియోగదారుల వ్యయంలో మందగమనం సంభవించే అవకాశముందని, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోందని వ్యాపార వర్గాల్లో అంచనాలు నెలకొన్న సమయంలో ఫెడ్ ఛైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో ఏ మాత్రం తొందరపడబోమని పావెల్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ త్వరగా వడ్డీరేట్ల కోతను కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్ఇమిగ్రేషన్, టాక్సేషన్, నియంత్రణలు, టారిఫ్ వంటి విధానపరమైన మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రభావంపట్ల ఫెడరల్ రిజర్వ్ స్పష్టత కోరుతోందని పావెల్ పేర్కొన్న మరుసటి రోజే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఎప్పుడో రేట్లు తగ్గించిందని ట్రంప్ అన్నారు. ఇకనైనా పావెల్ రేట్ల కోతకు పూనుకోవాలని సూచించారు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్గా జెరోమ్ పావెల్ తొలగింపు త్వరగా జరగకూడదని భావిస్తున్నట్లు ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. పావెల్ పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఆయనను 2017లో ట్రంప్ ప్రతిపాదించారు. తర్వాత 2022లో బైడెన్ మరో నాలుగేళ్ల పాటు ఫెడ్ ఛైర్మన్గా కొనసాగించారు. -
భారత జాబ్ మార్కెట్ భేష్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఉద్యోగ మార్కెట్ బలంగా నిలబడిందని.. పలు రంగాల్లో నియామకాలు మెరుగ్గా సాగాయని మైఖేల్ పేజ్ ఇండియా (అంతర్జాతీయ నియామకాల సంస్థ) ఎండీ నిలయ్ ఖండేల్వాల్ తెలిపారు. సాంకేతిక నైపుణ్యాల్లో లోతైన అనుభవం, వ్యయ నియంత్రణలు, సిబ్బంది కొత్త నైపుణ్యాలను వేగంగా అలవరుచుకోవడాన్ని భారత్ బలాలుగా పేర్కొన్నారు.ఆర్థిక వృద్ధి మందగమనంతో అంతర్జాతీయంగా కొన్ని ప్రాంతాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణి నెలకొనగా.. భారత్లో మాత్రం నిపుణులకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. స్టెమ్ విభాగంలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఆధిపత్యంతో భారత్ నైపుణ్య కేంద్రంగా కొనసాగుతోందని.. పోటీతో కూడిన వేతనాలు, ప్రభుత్వ మద్దతుతో నైపుణ్యాల కల్పన, అంతర్జాతీయ క్యాపబులిటీ కేంద్రాల (జీసీసీలు) విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.జీసీసీలు ఏఐ, ఆటోమేషన్, ఆర్అండ్డీపై దృష్టి సారించడం వల్ల ఆవిష్కరణలకు భారత్ కీలక కేంద్రంగా మారినట్టు చెప్పారు. స్కిల్ ఇండియా, ఏఐ ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నారు. భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే, నైపుణ్యాల అభివృద్ధిని వేగవంతం చేయాలంటూ.. ఏఐ, సెమీకండక్టర్ పరిశ్రమల్లో అధిక నైపుణ్య మానవ వనరుల అవసరం ఉంటుందని సూచించారు.ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం పెరుగుతున్నందున ఉత్పాదకత ఆధారిత పని నమూనాలపై కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఈవై జీసీసీ సర్వే, 2024ను ఉదహరిస్తూ.. అంతర్జాతీయ సంస్థల్లో 50 శాతం భారత్లో తమ జీసీసీ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్టు తెలిపారు. -
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
దేశంలో బంగారం ధరలు (Gold Prices) గత కొన్ని వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 18 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,730- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,600ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున పెరిగాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే ఇక్కడ ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున ఎగిశాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,580- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,450బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.270 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ట్రాయ్ ఔన్స్కు 3,340 డాలర్ల వద్ద ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది.నిపుణులు ఏం చెబుతున్నారంటే..బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం యొక్క స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు మరియు మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.బంగారం ధరలు రాబోయే రోజుల్లో రూ.1,00,000 (10 గ్రాముల 24 క్యారెట్) మార్కును తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.👉ఇది చదివారా? మహిళలకు ప్రత్యేక బీమా పాలసీలువెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే కేజీకి రూ.100 మేర వెండి ధర క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,09,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.ప్రయోజనాలుబీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపందక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు. -
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
దేశంలో అగ్రగామి ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ను ప్రకటించింది. ఈ డివిడెండ్ల నుంచి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మనవడు 17 నెలల ఎకాగ్రహ్ రోహన్ మూర్తి రూ. 3.3 కోట్లు అందుకోనున్నాడు. ఈ బుడ్డోడికి ఇన్ఫోసిస్లో 15 లక్షల షేర్లు (0.04% వాటా) ఉన్నాయి. ఎకాగ్రహ్ నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణ మూర్తి బహుమతిగా ఇచ్చారు. ఆ సమయంలో ఈ షేర్ల విలువ రూ. 240 కోట్లకు పైగా ఉండేది.ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో షేరుకు రూ. 22 డివిడెండ్ను ప్రకటించింది. దీని ద్వారా ఎకాగ్రహ్కు రూ. 3.3 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఈ చిన్నారి ఇప్పటివరకు మొత్తం రూ. 10.65 కోట్ల డివిడెండ్ను సంపాదించాడు. చిన్న వయసులోనే ఎకాగ్రహ్కు రూ.కోట్లలో ఆదాయం లభించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఇన్ఫోసిస్, భారత ఐటీ రంగంలో అగ్రగామిగా ఉంటూ, తన వాటాదారులకు స్థిరమైన డివిడెండ్లను అందిస్తోంది. నారాయణ మూర్తి తన మనవడికి ఇచ్చిన ఈ బహుమతి, ఎకాగ్రహ్ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, కుటుంబ ఆస్తుల పంపిణీలో ఒక ఉదాహరణగా నిలుస్తోంది. రాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణా కృష్ణన్ల ముద్దుల కొడుకే ఈ ఎకాగ్రహ్.ఇక నారాయణ మూర్తి కుమార్తె, యూకే మాజీ ప్రధాని సతీమణి అక్షతా మూర్తికి ఇన్ఫోసస్లో 3.89 లక్షల షేర్లు (1.04% వాటా) ఉన్నాయి. దీంతో ఆమె రూ.85.71 కోట్లు అందుకోబోతున్నారు. అలాగే నారాయణ మూర్తి రూ.93.33 కోట్లు, ఆయన భార్య సుధా మూర్తి రూ.76 కోట్లు ఈ డివిడెండ్ల ద్వారా ఆర్జించనున్నారు. ఈ డివిడెండ్లకు మే 30వ తేదీని రికార్డ్ డేట్గా ప్రకటించగా జూన్ 30న ఆయా మొత్తాలు వాటాదారుల చేతికి అందనున్నాయి. -
రైతన్నపై ప్రకృతి ప్రకోపం
ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ రంగానికి చాలాకాలంగా సవాలుగా మారుతున్నాయి. ఉత్పత్తి, సరఫరా గొలుసులు, మార్కెట్ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. వరదలు, తుపానులు, ఈదురుగాలులు, కరువులు, హారికేన్లు, కార్చిచ్చులు.. వంటి సంఘటనలు అన్నదాతలపాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల తీవ్ర ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడోచోట ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దేశ జీడీపీలో సింహభాగాన్ని ఆక్రమించిన వ్యవసాయంలో అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు ఆర్థికంగా వ్యవసాయాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఉత్పాదకత తగ్గుదలవ్యవసాయం స్థిరమైన వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా అంతరాయం కలిగినప్పుడు గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. పంట వైఫల్యాలు, పశువుల మరణాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడం.. వంటివి ఉత్పాదకతను తగ్గిస్తాయి. ఇది రైతులు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాల ఆదాయ మార్గాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.సరఫరా గొలుసు అంతరాయాలుప్రకృతి వైపరీత్యాలు రవాణా నెట్వర్క్లను నిర్వీర్యం చేస్తాయి. ఈదురుగాలులు, తుపానులు.. వంటివి సంభవించినప్పుడు వ్యవసాయ రవాణా కష్టతరమవుతుంది. దాంతో పంట ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్లకు తరలించడం సాధ్యం కాదు. నీట మునిగిన రోడ్లు, దెబ్బతిన్న ఓడరేవులు, లాజిస్టిక్స్ నష్టపోవడం వల్ల జాప్యం జరుగుతుంది. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడే అవకాశం ఉంది.మార్కెట్ అస్థిరత.. ధరల హెచ్చుతగ్గులువ్యవసాయ ఉత్పత్తుల్లో సరఫరా అంతరాయాలు తరచుగా ధరల హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. నిత్యావసర పంటల ఆకస్మిక కొరత ధరలను పెంచుతుంది. ఇది వినియోగదారులు, వ్యవసాయ ముడి పదార్థాలపై ఆధారపడిన వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది.దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాలుతక్షణ నష్టాలకు మించి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. నేల క్షీణత, వ్యవసాయ యోగ్యమైన భూమి కోల్పోవడం, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గడం ప్రధాన సమస్యలుగా మారుతాయి. తిరిగి ఈ వ్యవస్థ రికవరీకి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..ఏం చేయాలంటే..ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించడానికి క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్(వాతావరణ అనుకూల వ్యవసాయం), సుస్థిర పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలి. ఎలివేటెడ్ షెడ్ల నిర్మాణం వల్ల ఇలాంటి వైపరీత్యాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు. కానీ ఇది పరిమితమైన కమతాలకే ఉపయోగపడుతుంది. దీనిపై మరింత పరిశోధనలు జరిగాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా సప్లై-చెయిన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. విపత్తును ముందుగానే గుర్తించేందుకు, తగిన ప్రతిస్పందన చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. -
అమెరికా టారిఫ్లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్లు షాక్కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
‘ఐటీ’ ఫలితాలు నేలచూపులు.. అందుకు కారణాలు..
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు వరుసగా 2024-25 చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజాలుగా ఉన్న విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు వాటి పనితీరు నివేదికలను ప్రకటించాయి. అయితే ఇవి ఇన్వెస్టర్లు ఆశించిన రీతిలో లేకపోవడంతో నిరాసక్తత నెలకొంటుంది. ఒకప్పుడు స్థిరత్వానికి, వృద్ధికి దిక్సూచిగా నిలిచిన ఐటీ రంగం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. టెక్ కంపెనీల లాభాలు నేలచూపులు చూస్తుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.బలహీనమైన ఆదాయ అంచనాలుప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.స్టాక్ మార్కెట్ అస్థిరతవివిధ రేటింగ్ ఏజెన్సీలు భవిష్యత్తు వృద్ధి అంచనాలను తగ్గిస్తుండడంతో ఇన్వెస్టర్ల ఆందోళనల కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పతనమవుతుంది. గత కొన్ని నెలలుగా ఇండెక్స్ భారీగా పడిపోయింది. ఇది గ్లోబల్ టెక్ సెంటిమెంట్ను అద్దం పడుతుంది. ఇది ఐటీ రంగంపై మరింత విశ్వాసాన్ని దెబ్బతీసింది.ఇదీ చదవండి: త్వరలో ఆర్థిక మాంద్యం!భౌగోళిక, వాణిజ్య సవాళ్లుముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి. -
హోటల్స్ బిజినెస్.. చిన్న నగరాల్లోనే సగం లావాదేవీలు
ముంబై: దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్–2, 3) ఆతిథ్య రంగం జోరుమీదున్నది. ఇందుకు నిదర్శనంగా 2024లో ఆతిథ్య రంగంలో జరిగిన హోటల్ లావాదేవీల్లో సగం ఇక్కడే నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది మొత్తం 25 లావాదేవీలు జరిగినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాపార, విహార ప్రదేశాల్లో హోటల్స్ లావాదేవీలు (కొనుగోలు, విక్రయాలు) ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.దీంతో అమృత్సర్, మధుర, బికనేర్ తదితర నగరాల్లో నాణ్యమైన వసతి సదుపాయాలు పెరిగేందుకు దోహదపడినట్టు తెలిపింది. మొత్తం లావాదేవీల్లో 51 శాతం అధిక ధనవంతులు (హెచ్ఎన్ఐలు), ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేటు హోటల్ యజమానులు నుంచి ఉన్నట్టు వెల్లడించింది. లిస్టెడ్ హోటల్ కంపెనీల నుంచి 34 శాతం లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నైలో 250 అంతంటే ఎక్కువ గదులున్న హోటల్ లావాదేవీలు చోటు చేసుకున్నాయి.ఈ నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం, బలమైన డిమాండ్ మద్దతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘2025 మొదటి త్రైమాసికంలో చెన్నై, గోవాలో ఇప్పటికే రెండు డీల్స్కు జేఎల్ఎల్ సేవలు అందించింది. కార్యకలాపాలు నిర్వహించే వాటితోపాటు భూముల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని ఇవి సూచిస్తున్నాయి’’అని జేఎల్ఎల్ ఇండియా ఎండీ జైదీప్ దంగ్ తెలిపారు. -
భారీ కార్పొరేట్ డీల్స్.. మూడేళ్లలో ఇవే అత్యధికం
ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2025) తొలి త్రైమాసికంలో డీల్స్ జోరు పెరిగింది. జనవరి–మార్చి(క్యూ1)లో 29 బిలియన్ డాలర్ల విలువైన 669 లావాదేవీలు జరిగాయి. గత మూడేళ్లలో ఇవి అత్యధికం కాగా.. 2022 క్యూ1 పరిమాణాన్ని మించాయి. విలువలో 2022 క్యూ3ను అధిగమించాయి. కన్సల్టింగ్ దిగ్గజం గ్రాంట్ థోర్న్టన్ భారత్ డీల్ ట్రాకర్ వివరాల ప్రకారం విలీనాలు, కొనుగోళ్లు(ఎంఅడ్ఏ), పీఈ లావాదేవీలు ప్రధాన పాత్ర పోషించాయి.ఐపీవోలు, క్విప్ లావాదేవీలను మినహాయిస్తే 24.4 బిలియన్ డాలర్ల విలువైన 636 డీల్స్ నమోదయ్యాయి. త్రైమాసికవారీగా అంటే 2024 క్యూ4తో పోలిస్తే పరిమాణంరీత్యా 28 శాతం, విలువరీత్యా 34 శాతం వృద్ధి సాధించాయి. వార్షికంగా చూస్తే డీల్ పరిమాణం 43 శాతం జంప్చేయగా.. విలువ 17 శాతం ఎగసింది. ఇందుకు ఇన్వెస్టర్ల విశ్వాసం, వ్యూహాత్మక పెట్టు బడులు పుంజుకోవడం సహకరించింది. ప్రధానంగా ఎంఅండ్ఏ విభాగంలో కొత్త చరిత్రను సృష్టిస్తూ 15.8 బిలియన్ డాలర్ల విలువైన 228 డీల్స్ నమోదుకావడం తోడ్పాటునిచ్చినట్లు గ్రాంట్ థోర్న్టన్ భారత్ పార్ట్నర్ శాంతి విజేత పేర్కొన్నారు.భారీ లావాదేవీలు ఈ ఏడాది క్యూ1లో ఆరు బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. మొత్తం డీల్ విలువలో వీటి వాటా 41 శాతానికి చేరింది. తద్వారా భారీ డీల్స్ హవాకు తెరలేచింది. పూర్తి ఏడాది(2025) ఇవే పరిస్థితులు కొనసాగే వీలున్నట్లు శాంతి అంచనా వేశారు. రిటైల్, బ్యాంకింగ్, పునరుత్పాదక ఇంధనం, ఈమొబిలిటీ తదితర అత్యధిక వృద్ధి రంగాలలో ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కాగా.. కన్సాలిడేషన్ లావాదేవీలు సైతం జోరందుకున్నట్లు నివేదిక పేర్కొంది.అదానీ గ్రూప్, కోఫోర్జ్ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్, నిట్కో లిమిటెడ్ తదితరాలు పలు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా విస్తరిస్తున్నట్లు తెలియజేసింది. బజాజ్ అలియెంజ్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో బజాజ్ గ్రూప్ 26 శాతం వాటా కొనుగోలు చేయడాన్ని ఈ జాబితాలో ప్రధానంగా ప్రస్తావించింది. ఇందుకు బజాజ్ గ్రూప్ 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించిన విషయం విదితమే. పీఈ విభాగంలో 408 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ 8.6 బిలియన్ డాలర్లు. 2022 క్యూ3 తదుపరి ఇవి గరిష్టంకాగా.. డీల్ పరిమాణంలో 36 శాతం, పెట్టుబడుల్లో 66 శాతం పురోగతి నమోదైంది. -
ఇన్ఫోసిస్ డీలా
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే! అంచనాలు వీక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఆదాయం 0–3 శాతం మధ్య బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల క్యాష్ ఫ్లో సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్వో జయేష్ ఎస్. వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇతర విశేషాలు... → 2025 మార్చికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,000 మంది పెరిగి 3,23,578కు చేరింది. → గతంలోప్రకటించినట్లు ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి → ఉద్యోగ వలసల రేటు 14 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 0.5% లాభంతో రూ. 1,420 వద్ద ముగిసింది. కొనుగోళ్ల బాటలో... మిస్సింగ్ లింక్: ఆ్రస్టేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ మిస్సింగ్ లింక్ను తాజాగా ఇన్ఫోసిస్ సొంతం చేసుకోనుంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ సింగపూర్ పీటీఈ ద్వారా తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. నగదు రూపేణా 9.8 కోట్ల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 532 కోట్లు) చెల్లించనుంది. ఎంఆర్ఈ: సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ఎల్ఎల్సీ ద్వారా టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్ సంస్థ ఎంఆర్ఈ కన్సల్టింగ్(టెక్సాస్)ను కొనుగోలు చేయనుంది. పూర్తి నగదు రూపేణా కుదుర్చుకున్న డీల్లో భాగంగా 3.6 కోట్ల డాలర్లు(రూ. 307 కోట్లు) వెచ్చించనుంది. మిత్సుబిషీ హెవీ: ఇన్ఫోసిస్ జేవీ సంస్థ హైపస్లో మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ 2 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు 15 కోట్ల జపనీస్ యెన్లు(రూ.9 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.పటిష్ట ఫలితాలు సాధించాం మార్కెట్కు అనుగుణంగా, క్లయింట్ కేంద్రంగా ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా నిలకడైన సంస్థను నిర్మించాం. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు, చరిత్రాత్మక స్థాయిలో ఫ్రీ క్యాష్ సాధనరీత్యా పటిష్ట ఫలితాలు సాధించాం. క్లౌడ్, డిజిటల్, ఏఐలో లోతైన నైపుణ్యం, వ్యయ నియంత్రణ, ఆటోమేషన్.. క్లయింట్ల అవసరాలలో కంపెనీకి పటిష్ట స్థానాన్ని కల్పిస్తున్నాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ -
ఇకపై ప్రతి నెలా 28న ఐఐపీ డేటా
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను వెల్లడించే వ్యవధిని రెండు వారాల పాటు తగ్గిస్తూ కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (ఎంవోఎస్పీఐ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఇకపై 42 రోజుల తర్వాత కాకుండా ప్రతి నెలా 28న ఈ డేటాను ప్రకటించనున్నట్లు తెలిపింది. ఒకవేళ 28వ తారీఖు గానీ సెలవు రోజు అయితే, మరుసటి పనిదినం నాడు డేటాను ప్రకటిస్తారు. ఇది ఈ నెల (ఏప్రిల్) నుంచే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఎంవోఎస్పీఐ ఐఐపీ డేటాను రిఫరెన్స్ నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెలా 12న విడుదల చేస్తోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ రికమండేషన్స్ ఫర్ ఐఐపీ (ఐఆర్ఐఐపీ)–2010 ప్రకారం పారిశ్రామికోత్పత్తి తీరుతెన్నులను తెలియజేసే నెలవారీ ఐఐపీ గణాంకాలను రిఫరెన్స్ నెల ముగిసిన 45 రోజుల్లోగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం ఆరు వారాల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగానే ఎంవోఎస్పీఐ 42 రోజుల్లోగా వెల్లడిస్తోంది. -
ఫార్మా జీసీసీలకు భారత్ హబ్!
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు భారత్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. చాలా మటుకు ఎకానమీలు నెమ్మదిస్తున్న తరుణంలో దేశీయంగా రాజకీయ స్థిరత్వం, వినియోగం పటిష్టంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవలి ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2,500 పైచిలుకు సెంటర్లు, 45 లక్షలకు పైగా నిపుణులతో భారత్లో జీసీసీ మార్కెట్ పరిమాణం త్వరలో 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించనుంది. ఇక లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ (ఎల్ఎస్హెచ్సీ) సెగ్మెంట్లో 2024లో 100 సెంటర్లు ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 160కి చేరనుంది. వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుంది. భారత్లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా, ఇక్కడి వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. నియామకాల జోరు.. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్లోని తమ హబ్లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి సనోఫీ తమ సిబ్బంది సంఖ్యను 1,700 నుంచి 2,600కి పెంచుకునే యోచనలో ఉంది. అలాగే నోవో నార్డిస్క్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను వార్షికంగా సుమారు 20 శాతం పెంచుకోవాలనే ప్రణాళికల్లో ఉంది. మరోవైపు, టకెడా సంస్థ.. ఆసియాలోనే తమ తొలి ఇన్నోవేషన్ కేపబిలిటీ సెంటర్ను (ఐసీసీ) బెంగళూరులో ఏర్పాటు చేసింది. తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఉద్యోగుల సంఖ్యను 770కి పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది సంఖ్య 340గా ఉంది. కొన్నాళ్లుగా భారత్లోని జీసీసీలు కేవలం ఖర్చులను ఆదా చేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా అదనపు విలువను కూడా జోడించగలిగే సామర్థ్యాలున్న సెంటర్లుగా ఎదుగుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన, అంతర్జాతీయ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నిర్వహణపరమైన మద్దతుతో పాటు ఆర్అండ్డీ, డేటా సైన్స్ వంటి అంశాల్లో అత్యుత్తమ హబ్లుగా మారుతున్నాయి. పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నప్పటికీ, నిపుణులైన సిబ్బందిని అట్టే పెట్టుకోవడం సవాలుగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.పెద్ద సంఖ్యలో ఉద్యోగులు.. దిగ్గజ కంపెనీల జీసీసీల్లో నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. బెంగళూరులోని నోవో నార్డిస్క్ గ్లోబల్ బిజినెస్ సరీ్వసెస్ (జీబీఎస్) సెంటర్లో 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ టీమ్కి ఇది తోడ్పాటు అందిస్తోంది. ఇక సనోఫీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు కీలక జీసీసీల్లో హైదరాబాద్ సెంటర్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ నుంచి ఏఐ, డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీస్ వరకు వివిధ కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఎలై లిల్లీ సంస్థకు హైదరాబాద్తో పాటు బెంగళూరులో కూడా జీసీసీలు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో కలిపి 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత కంపెనీకి భారత్ అతి పెద్ద కేంద్రంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారతదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు టెస్లా కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు త్వరలోనే అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది.టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.టెస్లా మోడల్ వైప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న టెస్లా మోడల్ వై కారు.. సింగిల్ ఛార్జిపై 526 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందింది. 4.6 సెకన్లలో 0 నుంచి 96 కిమీ వేగాన్ని అందుకునే ఈ ఎలక్ట్రిక్ వెహికల్.. టాప్ స్పీడ్ 200 కిమీ. చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!భారతదేశంలో టెస్లా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉంటుందనే చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు భారతీయ రోడ్లకు తగిన విధంగా ఉండేలా కంపెనీ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
ప్రతి ఏటా వేసవిలో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఏసీ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2021-22లో 84 లక్షలు.. 2023-24 నాటికి 1.1 కోట్ల ఏసీలు అమ్ముడైనట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏసీల విక్రయాలు పెరుగుతున్న సమయంలో.. విద్యుత్ వినియోగం ఎక్కువవుతోంది. ఈ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ప్రభుత్వం 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన 2025 అమలు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పీఎం మోదీ ఏసీ యోజన పథకాన్ని.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మిర్వహించనుంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. విద్యుత్ ఆదా చేయడమే. కొత్త ఏసీ.. పాత ఏసీ కంటే కొంత తక్కువ కరెంట్ వినియోగిస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్ తగ్గుతుంది.బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, పాత ఏసీని ఫైవ్ స్టార్-రేటెడ్ మోడల్తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి సంవత్సరానికి రూ. 6,300 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతాయి. కుటుంబాలకు ఖర్చులను తగ్గించడంతో పాటు, ఇది పవర్ గ్రిడ్పై కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.పీఎం మోదీ ఏసీ యోజన అమలులోకి వచ్చిన తరువాత, ఈ స్కీమ్ కింద.. ఎక్కువ విద్యుత్ వినియోగించే లేదా పాత ఏసీని స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది, తద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. అంతే కాకుండా ఈ స్కీమ్ కింద ఏసీ కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ కూడా పొందవచ్చు.ఈ స్కీమ్ కింద కొత్త 5 స్టార్ ఏసీ పొందటం ఎలా?➤ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీని గుర్తింపు కలిగిన రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వండి. వారు మీకు ఒక సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఉపయోగించి.. కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు పొందవచ్చు.➤బ్లూ స్టార్, ఎల్జీ, వోల్టాస్ వంటి పెద్ద ఏసీ బ్రాండ్స్ కూడా పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ అందిస్తాయి.➤పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ వినియోగించేవారి.. విద్యుత్ బిల్లులో కూడా కొంత తగ్గింపు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం విద్యుత్ పంపిణీ సంస్థలతో చర్చించనుంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు! -
హిమాలయాల్లో భారత్ ఘనత: ప్రపంచంలోనే ఎత్తైన 3D ప్రింటెడ్ నిర్మాణం
భారత రక్షణ, నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ (Simpliforge Creations), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా లేహ్లో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో దేశ తొలి 3డీ ప్రింటెడ్ రక్షణాత్మక సైనిక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.భారత సైన్యం తరపున ప్రాజెక్ట్ ప్రబల్లో(Project PRABAL) భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఐఐటీ పీహెచ్డీ విద్యార్థి అరుణ్ కృష్ణన్ దీనికి సహకారం అందించారు. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, తక్కువ ఆక్సిజన్ (HALO) ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3డీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.ఐఐటీ హైదరాబాద్లోని ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం మార్గదర్శకంలో.. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, ఐఐటీ హైదరాబాద్ బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక 3డీ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా స్థానికంగా లభించే పరికరాలను ఉపయోగించి అనుకూలమైన రక్షణాత్మక బంకర్ను నిర్మించారు. ఈ నిర్మాణానికి 14 గంటల సమయం పట్టింది. ప్రబల్ కార్యక్రమం స్వదేశీ సాంకేతికత, విద్యా-పరిశ్రమ సహకారం ద్వారా నిర్మాణ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లింది.ఈ 3డీ బంకర్ భారతదేశంలో తొలిసారి కాగా, సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో వేగవంతమైన నిర్మాణాలకు మార్గం సుగమం చేసి, రక్షణ సన్నద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ అద్భుత ప్రాజెక్ట్.. ఇంజినీరింగ్ నూతనత్వం, సైనిక ఉపయోగం, మేక్-ఇన్-ఇండియా సంకల్పాన్ని కలగలిపి భవిష్యత్ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది.ఈ సందర్భంగా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ 'ధ్రువ్ గాంధీ' మాట్లాడుతూ.. "లడఖ్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ విజయవంతం కావడం మా బృందానికి, యంత్రాలకు పెద్ద సవాలనే చెప్పలి. అయినా.. రోబోటిక్ ప్రింటర్ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి, 5 రోజుల రికార్డు సమయంలో అందించి విజయం సాధించాం" అని పేర్కొన్నారు.ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల్లో పనిచేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల అభివృద్ధి. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్, తక్కువ ఆర్ద్రత, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం నిర్మాణాత్మక వినూత్నత మాత్రమే కాకుండా, అత్యుత్తమ విజ్ఞానం అవసరమైంది. ఐఐటీ హైదరాబాద్ బృందం, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ కలిసి, మెరుగైన యంత్రాలను, మన్నిక కలిగిన కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసింది. అలా ఆ ప్రదేశంలోనే 3డీ ప్రింటింగ్ ద్వారా నిర్మించగలిగారు” అని వెల్లడించారు.ఐఐటీ పీహెచ్డీ స్టూడెంట్ అరుణ్ కృష్ణన్ మాట్లాడుతూ.. "ఐఐటీ హైదరాబాద్లో నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ప్రబల్ ప్రాజెక్ట్ను ప్రారంభించాం. లేహ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్ నిర్మాణాన్ని తీసుకురావడానికి అనేక బృందాలు, కంపెనీలు ప్రయత్నించాయి. అయితే లడాఖ్లోని తీవ్ర వాతావరణ పరిస్థితులు వారికి పెను సవాలును విసిరాయి" అని తెలిపారు.సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ.. “2022 నుంచి మేము అడిటివ్ కన్స్ట్రక్షన్లో సవాళ్లను అధిగమించుకుంటూ వస్తున్నాం. భారతదేశపు తొలి 3డీ ముద్రిత వంతెనను, ప్రపంచంలోనే మొదటి 3డీ ముద్రిత ప్రార్థనా మందిరాన్ని మేమే నిర్మించాం. భారత సైన్యం కోసం, స్థానికంగా దొరికే పరికరాలను ఉపయోగించి, తొలిసారిగా ఒక 3డీ ముద్రిత వైద్య సదుపాయాన్ని, ఇన్-సిటు(in-situ) పద్ధతిలో నిర్మించాం" అని వివరించారు. -
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ.. తమ తాజా ప్రాజెక్ట్ 'సింక్ బై రాఘవ'ను ప్రకటించారు. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. హైదరాబాద్లో అత్యధిక డిమాండ్ కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 7.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాఘవ ‘సింక్’ ఐదు 61 అంతస్తుల టవర్లు కలిగి ఉంది.సింక్లోని ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ‘ది ఒయాసిస్’ పార్టీ ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో ప్రతి టవర్లో పికిల్బాల్ కోర్టులు, పార్టీ డెక్, యోగా డెక్తో కూడిన స్కై లాంజ్ కూడా ఉంది. అంతే కాకుండా వ్యాపార కేంద్రాలు, ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఆసుపత్రులు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి.సింక్ బై రాఘవ కేవలం నివాస ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక హై-ఎండ్ ఆర్కిటెక్చరల్ అద్భుతం. చిన్న చిన్న అంశాల మీద కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ.. నాణ్యమైన మెటీరియల్స్ ఉపయోగించినట్లు.. రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష రెడ్డి పొంగులేటి అన్నారు. డిజైన్, ఫినిష్ , ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుత జీవన విధానాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. -
'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'
రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటామని సుబ్రహ్మణ్యం అన్నారు. అయితే దీనికోసం న్యాయ సంస్థలు, అకౌంటింగ్ కంపెనీలతో పాటు.. దేశీయ కంపెనీలు ప్రపంచ అగ్రగాములుగా ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెట్టుబడి రంగంలో మార్పులు: భారీగా పెరిగిన కొత్త డీమ్యాట్ అకౌంట్స్మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు.. తక్కువ-ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారు. జపాన్ 15,000 మంది నర్సులను, జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను భారతదేశం నుంచి తీసుకుంది. అంటే.. ఆ దేశాల్లో అవసరమైన స్థాయిలో పనిచేసేవారు లేదు. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైంది. భారతదేశం మాత్రం ప్రపంచానికి పనిచేసేవారిని అందిస్తోంది. ఇది మనదేశానికి ఉన్న అతిపెద్ద బలం అని ఆయన అన్నారు.