Tollywood
-
ఆ హీరోయిన్ను సీక్రెట్గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు.
సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎమ్ (Niharika NM) టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. మిత్రమండలి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యాడ్ ఫేమ్ విష్ణు, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురువారం (జూన్ 12న) మిత్రమండలి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వించేలా ఉంది.నేను వయసులో చిన్నవాడినే..అయితే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా అంతే సరదాగా సాగింది. తనను హీరోయిన్గా సెలక్ట్ చేసిన అల్లు అరవింద్ (Allu Aravind)కు హృదయంలో చోటిచ్చానంది నిహారిక. అనంతరం అల్లు అరవింద్ స్టేజీ ఎక్కి మాట్లాడాడు. వీళ్లందరూ కలిసి నన్ను పెద్దవాడిని చేస్తున్నారు. నేనేమో ఇంకా యంగ్గానే ఫీలవుతున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా మనసులో చోటిచ్చానంది. నేనెక్కువగా యంగ్ జెనరేషన్తో తిరుగుతూ ఉంటాను. వాళ్లతో ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి స్క్రిప్టులు సెలక్ట్ చేయాలన్నదానిపై కాస్త పట్టు లభించింది.కథ తెలీకుండా సినిమా చూడబోతున్నాఈ సినిమా డైరెక్టర్ విజయేందర్ గురించి చెప్పాలి. ఈయన కథ చెప్తాడట.. వినమని వాసు అడిగాడు. సరేనన్నాను. విజయేందర్ వచ్చి నా గదిలో కూర్చుని పావుగంట కథ చెప్పాడు. సడన్గా నావల్ల కావడం లేదు సర్, నేనెళ్లిపోతాను అన్నాడు. ఏమైందని అడిగితే.. మీ రేంజ్ వేరు, నా వల్ల కావట్లేదు.. మళ్లీ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వస్తాను సర్ అని చెప్పి వెళ్లిపోయాడు. కథ తెలియకుండానే బన్నీ వాసు సినిమా చూడబోతున్నాను.ఫేక్ ఐడీతో ఫాలో కొట్టా..అయితే వాసు.. ఈ సినిమా కోసం ఐదారుగురు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు బాగుంటారు? చెప్పమన్నాడు. నేను నిహారిక ఫోటో చూడగానే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్లో తెగ చూశాం అని చెప్పాను. ఇన్స్టాలో ఆమె చాలా స్పీడు. ఓ ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నాను. అందులో తప్పేముంది. మా ఒరిజినల్ ఐడీతో సోషల్ మీడియాకి వస్తే జనాలు పెట్టే కామెంట్లు చూడలేం, చదవలేం. ఆ దరిద్రమంతా ఎందుకని ఫేక్ ఐడీతో అందర్నీ ఫాలో అవుతా.. అందర్నీ చూస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. కాగా నిహారిక.. పెరుసు, ఇదయం మురళి వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా -
కామెడీ ఎంటర్టైనర్గా 'మిత్ర మండలి' టీజర్
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ఎమ్ (Niharika NM) జోడీగా నటిస్తున్న కొత్త చిత్రం 'మిత్ర మండలి'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు. ఈ మూవీని విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పిస్తుండగా కల్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అందర్నీ నవ్వించేలా టీజర్ ఉంది.సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక ఎన్ఎమ్ .. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. -
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్బాబు, రామ్చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్గా బంగారు వర్ణం బ్లౌజ్ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్ -
ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది సింగర్ సునీత (Sunitha Upadrashta). మృదువైన స్వరంతో ఆమె పాట పాడితే అమృతం కురిసినట్లే ఉంటుంది. ఈమె మాట్లాడితే కూడా తీయని పాట పాడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాటలెన్నో పాడిన సునీత మనసు నేడు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అందుకు కారణమేంటో చూసేద్దాం..సునీత భావోద్వేగంఏ తల్లికైనా తను సాధించిన విజయాల కంటే పిల్లలు సాధించిన విజయాలే గొప్పగా కనిపిస్తాయి. చేతుల్లో ఆడించిన చంటిపిల్లలు కళ్లముందు ఎదుగుతుంటే ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. సునీత కూతురు శ్రేయ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.ఎంత గర్వంగా ఉందో..మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్బుక్లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా కూతురు ఇప్పుడు ప్రాట్ ఇన్స్టిట్యూట్లో ఇల్లుస్ట్రేటర్గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఫోటో.. ఎన్నాళ్లకెన్నాళ్లకునీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. శ్రేయ గ్రాడ్యుయేషన్ డేకు సునీత భర్త రామ్, కుమారుడు ఆకాశ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.మొదటి భర్త సంతానమే శ్రేయకాగా సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి కూతురు శ్రేయ, కుమారుడు ఆకాశ్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సునీత- కిరణ్ విడిపోయారు. 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి: దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా? -
ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్ సినిమాలపై ప్రకటన
రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్తో అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ ఫైనల్ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని నాగవంశీ తెలిపారు.(ఇదీ చదవండి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్.. బన్నీ కథలో మార్పులు!)నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో త్రివిక్రమ్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ లేనట్టేనని తేలిపోయింది. ఆపై అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా ప్రచారం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లు మాత్రమే త్రివిక్రమ్ ప్రస్తుతానికి లాక్ చేశారంటూ నాగవంశీ చెప్పారు. అయితే, మొదట వెంకటేశ్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్తో భారీ ప్రాజెక్ట్ మొదలౌతుందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. పురాణాలతో ముడిపడిన కథలో ఎన్టీఆర్ నటించనున్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో తారక్ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్ నటిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర్2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్లకు నాగవంశీ ట్విస్ట్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.— Naga Vamsi (@vamsi84) June 12, 2025 -
ప్రమాదంపై స్పందించిన నిఖిల్
హీరో నిఖిల్ (Nikhil) సినిమా షూటింగ్లో ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన ఒక పోస్ట్ చేశారు. రామ్చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ‘ది ఇండియా హౌస్’ (The India House) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, సినిమాలో అత్యంత కీలకమైన సీన్ చిత్రీకరణ కోసం శంషాబాద్ సమీపంలో ఒక భారీ సెట్ వేశారు. సముద్రం సీన్స్ తీసేందుకు అతిపెద్ద వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా ప్రమాదవశాత్తు అది పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా సెట్లోకి నీళ్లు ముంచెత్తాయి. ఈ ఘటన వల్ల చాలామంది గాయపడ్డారని తెలిసింది. అయితే, తాజాగా ఈ చిత్ర హీరో నిఖిల్ వివరణ ఇచ్చారు.ప్రమాదంపై నిఖిల్ ఇలా స్పందించారు. 'మేము అందరం చాలా క్షేమంగానే ఉన్నాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నాలు చేసే క్రమంలో కొన్నిసార్లు ఇలాంటి రిస్క్లు తీసుకోవాల్సిందే. అలాంటి సమయంలో ఒక్కోసారి ఇలాంటి ఘటనలు జరగొచ్చు. కానీ, మా చిత్ర యూనిట్ ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్ల మేము పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాం. అయితే, మేము అత్యంత ఖరీదైన సినిమా పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.' అని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్, సయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్నారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.We r all Safe 🙏🏽 Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken. We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025 -
దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా?
ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్(Allu Arjun)తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే మొన్నటివరకు ఇది రూమర్గానే ఉండే..కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్తో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. మైథలాజికల్ బ్యాగ్రౌండ్తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ‘‘మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’’ అని నాగవంశీ ట్వీట్ చేశాడు.దాంతో ఎన్టీఆర్ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. తొలిసారి ఆయన పూర్తిస్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూశాం. అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడు పాత్ర చేయబోతున్నాడు. అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. కచ్చితంగా ఎన్టీఆర్ అదరగొడతాడు. అందులో నో డౌట్. తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా డబ్బింగ్ వర్క్లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్లు హీరోలుగా నటించగా, కియారా అద్వానీ కీలక పాత్ర పోషించింది. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
ఓటీటీలో 'నవీన్ చంద్ర' క్రైమ్ థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్గానే ఉన్నప్పటికీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.కథ ఏంటి..?హైదరాబాద్కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే. -
బన్నీ సినిమా.. ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించబోతున్న అట్లీ!
అల్లు అర్జున్(Allu Arjun) కొత్త సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైంది. ఇక ఆల్ సెట్ గో... అంటూ అల్లు అర్జున్ చిత్రీకరణలో పాల్గొననున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ(Atlee ) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే ప్రారంభం కానుందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల పాటు ముంబైలో జరగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణలో అల్లు అర్జున్, మృణాల్ ఠాగూర్ పాల్గొంటారని, వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను దర్శకుడు అట్లీ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను సైతం షూట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట అట్లీ. అయితే ఈ తొలి షెడ్యూల్ షూటింగ్లో దీపికా పదుకోన్ పాల్గొనరట. ఇక ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక ప్రపంచాన్ని అట్లీ సృష్టిస్తున్నారని, ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
నటి కల్పికపై కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పికా గణేశ్పై 324(4),352,351(2) బిఎన్ఎస్ ఆక్ట్ ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్లో బిల్ చెల్లించకుండా తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు. బర్త్ డే కేక్ విషయమై ప్రిజం పబ్ నిర్వాహకులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కల్పికపై వారు కేసు నమోదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే.గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన చెందింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్లు ఆమె పేర్కొంది. గొడవ విషయమై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించాలని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్గా నటించిన కల్పిక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత తెలుగులో జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాలు చేసింది. -
గోపిచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త సినిమా గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ హీరో గోపిచంద్- దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొత్త సినిమా గ్లింప్స్ వచ్చేసింది. నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. #Gopichand33 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ను ఇంకా ప్రకటించలేదు. చిట్టూరి శ్రీనివాస ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. భారతీయ చరిత్రలో అనేక కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సంకల్ప్రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. చాలాగ్యాప్ తర్వాత ఆయన నుంచి ఈ సినిమా వస్తుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. -
సింగర్గా పోటీలో దేవయాని కూతురు.. అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ
నటి దేవయాని (50) చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే వెండితెరపై కనిపిస్తున్నారు. 90లలో కథానాయికగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత. ఆమె రాజకుమారన్ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్దమ్మాయి ఇనియా సింగర్గా రాణించేందుకు తొలి అడుగుపడింది. సౌత్ ఇండియాలో పాపులర్ పాటల పోటీలో ఆమె బరిలో ఉన్నారు. దీంతో తొలిరోజు తన కూతురిని ఆశీర్వదించి ఆ షోలో దేవయాని కూడా కొంత సమయం పాటు పాల్గొన్నారు.ముంబైకి చెందిన దేవయాని పెళ్లి తర్వాత చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం చెన్నైలోని అన్నా సలైలోని చర్చి పార్క్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, తాజాగా తన కూతురు ఇనియా (21) 'సరిగమప సీనియర్ సీజన్-5' రియాలిటీ సింగింగ్ షోలో ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళంలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం అక్కడ బాగా పాపులర్ అయింది. ప్రతి శనివారం, ఆదివారం సాయింత్రం 7:00 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. ఇందులో న్యాయనిర్ణేతలుగా శ్వేత మోహన్, టీ రాజేందర్, కార్తీక్ ఉన్నారు. వేదిక మీద ఇనియా పాడిన పాటకు వారందరూ ఫిదా అయ్యారు. ఆ సమయంలో తన కుమార్తెను చూసుకుని దేవయాని కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. వాస్తవంగా ఇనియా వాయిస్ చాలా బాగుంది. భవిష్యత్లో మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు మెండుగు ఉన్నాయని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలుపుతున్నారు.టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించారు. ఆమె తెలుగుతో బాటు తమిళ, మలయాళ భాషలలో 75 చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్లో ఆమె నటించనున్నారు. View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh) -
టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె. మహేంద్ర (75) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి గుంటూరులో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మహేంద్ర మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో గుంటూరులో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.మొదట దర్శకత్వంలో శిక్షణ తీసుకున్న మహేంద్ర తర్వాత నిర్మాతగా మారి 50కు పైగా సినిమాలు తెరకెక్కించారు. చెన్నై నుంచి హైదరబాద్కు సినీ పరిశ్రమ వచ్చాక ఆయన ఏఏ ఆర్ట్స్ బ్యానర్ను నిర్మించారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కూడా మహేంద్రనే కావడం విశేషం. ఆపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని కూడా ఆయనే ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ప్రేమించి పెళ్ళి చేసుకో, ఆరని మంటలు, ఎదురులేని మొనగాడు, ప్రచండ భైరవి, ఢాకూరాణి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. -
బర్త్డే పార్టీపై స్పందించిన సింగర్ మంగ్లీ.. డీసీపీ కామెంట్స్
గాయని మంగ్లీ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు ఇచ్చిన పార్టీ రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి ఇచ్చిన పార్టీలో డ్రగ్స్, గంజాయి ఉపయోగించారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని సోషల్మీడియాలో ఆ వార్తలు వైరల్ అయ్యాయి. తను ఏర్పాటు చేసిన విందులో తన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారని అక్కడ ఎలాంటి డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా చేయలేదని ఆమె ఒక వీడియోతో వివరణ ఇచ్చారు. పోలీసులు కూడా దానిని ధ్రువీకరించారు.మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదని చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ఇలా చెప్పారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దీంతో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు 10 మంది మహిళలతో పాటు 12మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహించాము. అయితే, జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్రెడ్డికి గంజాయి పాజిటివ్గా వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ రిపోర్ట్లో పాజిటివ్ రాలేదు. కానీ, అతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయ్ తీసుకోలేదని, అంతకుముందే మరోచోట తీసుకున్నట్లు తెలిసింది.' అని డీసీపీ తెలిపారు. పోలీసులు చేసిన సోదాల్లో విదేశీ మద్యం కానీ, ఇతర మత్తు పదార్థాలు కానీ లభించలేదని చేవెళ్ల ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ కూడా పేర్కొన్నారు.వివరణ ఇచ్చిన మంగ్లీతన పుట్టినరోజు నాడు జరిగిన అంశంపై సింగర్ మంగ్లీ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ' పుట్టినరోజు వేడుకలు నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి చేసుకున్నాను. అయితే, మద్యం బాటిల్స్, డిజే సౌండ్స్కి అనుమతి తీసుకోవాలి అనే అవగాహన నాకు లేదు. తెలియక తప్పు జరిగింది. అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు వాడలేదు, తీసుకోలేదు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు.' అని ఆమె చెప్పారు. -
రిస్క్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. పొరపాటు జరిగితే అంతే
పాన్ ఇండియన్ కథానాయకిగా పేరుగాంచిన నటి కాజల్ అగర్వాల్( Kajal Aggarwal). అయితే ఈ ఉత్తరాది భామ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో నటించే పాపులర్ అయ్యారన్నది గమనార్హం. మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించినా, ఆ తరువాత మగధీర, చందమామ వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక తమిళంలోనూ అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అయ్యారు. ఈ అమ్మడు ఉమెన్స్ సెంట్రిక్ పాత్రలను ఒకటి రెండు చిత్రాల్లో చేసినా, అవి క్లిక్ కాలేదు. కాగా ఈమె 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా పుట్టాడు. ఇకపోతే వివాహానంతరం కాజల్ అగ్వరాల్కు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాగే ఇటీవల కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలేవీ విజయం సాధించలేదు. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్–3 చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అలాగే నటుడు విష్ణు మంచు ప్రధానపాత్రను పోషించి, నిర్మించిన భారీ మైథిలాజికల్ కథా చిత్రం కన్నప్పలో పార్వతీదేవిగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. కాగా ఇప్పుడు ఈమెకు కొత్త అవకాశాలేమీ లేవు. అయితే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ, సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తూ బిజీగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె మళ్లీ ఫ్రైమ్ టైమ్లోకి రావడానికి స్వీయ దర్శకత్వంలో కథానాయకిగా నటించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీన్ని హిందీలో కమర్శియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది సీనియర్ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను ఎంజాయ్ చేస్తూ, ఇతర వ్యాపారాలు చూసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయకుండా రిస్క్తో కూడిన దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్లతారు? అని కొందరు స్నేహితులు కాజల్కు హితవు పలుకుతున్నట్లు సమాచారం. మరి వారి సూచనలను ఈ బ్యూటీ పాటిస్తారా? లేక దర్శకురాలవ్వాలనే తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? అన్న వేచి చూడాలి. -
హైదరాబాద్ టు ముస్సోరీ
ముస్సోరీలో ల్యాండ్ అయ్యారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. వీటీవీ గణేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వెంకటేశ్, కేథరిన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటరై్టన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరిగింది. మలి షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందని, పది రోజుల పాటు ఈ షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని బుధవారం మేకర్స్ అధికారికంగా తెలిపి, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, వీటీవీ గణేశ్ పాల్గొనగా కొన్ని కీలక, వినోదాత్మక సన్నివేశాలను చిత్రీకరించడానికి ΄్లాన్ చేశారు. ‘‘1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్ను ఈ సినిమాలో మళ్లీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది . శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాక మరికొంత మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం కలిగిందని తెలుస్తోంది. -
డ్రగ్స్ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్ సంకల్ప్ ప్రారంభం
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) మరో ముందడుగు వేసింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కలిసి 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, ఎస్పీ శ్రీ పి. సీతారామ, డిపార్ట్మెంట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని అందరూ ఆకాంక్షించారు. -
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తమ్ముడు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. -
వారం రోజులుగా షూట్లో ఉన్నా.. ఆ పార్టీ గురించే తెల్వదు: రచ్చ రవి
టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్ డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు.బర్త్ డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు.. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని.. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు.. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయం చెప్పాలనుకున్నా.. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి.. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను... తాగబోను... నాకు తెలవదు దయచేసి అర్ధం చేసుకోండి.. అంటూ రాసుకొచ్చారు. కాగా.. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. ఇవాళ ఉదయం టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi) -
నితిన్ సినిమా వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా: డైరెక్టర్
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో నితిన్కు అక్క పాత్రలో లయ కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.ఈ ఈవెంట్లో డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హీరో నితిన్పై ప్రశంసలు కురిపించారు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన హీరో నితిన్ మాత్రమేనని అన్నారు. ఆర్టిస్టులు చాలామంది ఇన్సెక్యూర్గా ఉంటారని.. కానీ అతనిలో ఏమాత్రం అభద్రతాభావం ఉండదని తెలిపారు. నితిన్ సినిమాకు రైటర్గా వెళ్లి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని శ్రీరామ్ వేణు వెల్లడించారు. ఇంతకుముందే నితిన్తో నేను సినిమా చేయాల్సిందని..కానీ నా వల్లే కాస్తా ఆలస్యమైందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
యూట్యూబ్లో డబ్బులు పెట్టి వ్యూస్ కొనొద్దని చెప్పా: దిల్ రాజు
టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) కెరీర్లోనే అధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu Movie). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ లయ టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో నితిన్కు అక్కగా నటించింది. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాష్, శిరీష్ నిర్మించారు. తమ్ముడు ట్రైలర్ను బుధవారం (జూన్ 11న) రిలీజ్ చేశారు.ఈరోజు చెప్పేస్తా..ఈ సందర్భంగా దిల్ రాజు (Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలారోజుల నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ విషయం చెప్పి తీరతాను. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆ వీడియో కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూసిన నెంబర్లే అక్కడ కనిపించాలని మా ఆఫీసులో నా పీఆర్ టీమ్తో సహా అందరికీ చెప్పాను. డబ్బులు ఖర్చు చేసి మరీ మిలియన్ల వ్యూస్ కొనొద్దని సూచించాను. ఎలా తెలుస్తుంది?ఎందుకంటే ఒరిజినల్గా మన పాట, ట్రైలర్.. ఏదైనా సరే, జనాల్లోకి ఎంతగా రీచ్ అవుతుందనేది మనకు అర్థం కావాలి. అప్పుడే మన మూవీ ప్రజలకు ఏమేరకు రీచ్ అవుతుందని ఓ అంచనాకు రాగలం. మనం కొనుక్కుంటే వ్యూస్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి. కానీ, అది ప్రేక్షకుడికి చేరిందా? లేదా? అనేది తెలియడం లేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నారు.చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్బస్టర్ వార్ మూవీకి సీక్వెల్గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
బిగ్బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో సెన్సేషన్ సృష్టించిన అవికా గోర్ (Avika Gor) పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సంతోషంతో అరిచేశా..ఈ సందర్భంగా అవికా.. 'ఆయన నోరు తెరిచి అడగ్గానే.. సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అంటూ గట్టిగా అరిచాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతగా ఉన్నాడు, తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.కన్నీళ్లు..ఎప్పుడైతే అతడు నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడు నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలియాడిపోయా.. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని అవికా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. అవికాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కెరీర్ముంబైలో పుట్టిన అవికా గోర్.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ‘బాలికా వధు’ సీరియల్తో ఆమె జీవితమే మారిపోయింది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, 'బ్రో', 'షణ్ముఖ' ఇలా అనేక సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) చదవండి: మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి -
'మాట పోయి మనిషి బతికినా.. పోయినట్టే లెక్క'.. ఆసక్తిగా తమ్ముడు ట్రైలర్
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజు, శిరీష్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే అక్క కోసం తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో వచ్చే 'మాట పోయి మనిషి బతికినా.. మనిషి పోయినట్టే లెక్క.. మాట బతికి మనిషి పోతే.. మనిషి బతికున్నట్లే లెక్క' అనే డైలాగ్ ఆడియన్స్లో అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. A powerful promise sparks a fierce battle for survival...! 👪Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄▶️ https://t.co/QX2opY8tyDIn theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025 -
సంధ్య థియేటర్లో పాముల కలకలం.. వీడియో వైరల్
సంధ్య థియేటర్.. హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఈ సినిమా హాల్ చాలా ఫేమస్. స్టార్ హీరోల అభిమానులంతా ఈ థియేటర్లోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. అలా అని ఇది లగ్జరీ థియేటర్ ఏం కాదు. చాలా కాలం నుంచి ఉండడం.. స్టార్ హీరోలు ఇక్కడకు వచ్చి సినిమా చూస్తుండడంతో ‘సంధ్య థియేటర్’ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సమయంలో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది కూడా ఈ థియేటర్లోనే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది. తాజాగా మరోసారి ఈ థియేటర్ వార్తల్లో నిలిచింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ సినిమా థియేటర్స్లో పాములు కలకలం రేపాయి. రూ. 50 టికెట్ ఇచ్చే ఎంట్రీ వద్ద ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంట పడింది. చాలా పొడవుగా ఉన్న ఆ పాముని చూసి బయపడి పోయిన సిబ్బంది..వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్కి కాల్ చేసి రప్పించారు. వారు చాకచక్యంతో పాముని పట్టుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం తొలిసారి కాదు. తరచు థియేటర్స్లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెబుతోంది. వందల సంఖ్యలో జనాలు వచ్చే థియేటర్లో ఇలా పాములు రావడం ఏంటి? ఇప్పుడంటే లక్కీగా ప్రేక్షకులు లేరు కాబట్టి.. ప్రమాదం తప్పింది. ఒకవేళ థియేటర్లో ప్రేక్షకులు ఉన్నప్పుడే పాము వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అసలే సినిమా థియేటర్స్ చీకటిగా ఉంటాయి.. అలాంటి ప్రదేశాల్లోకి ఇలాంటి విష సర్పాలు రావడం ప్రమాదకరమే... యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పాముల కలకలంఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్లో రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన pic.twitter.com/l8Q6wDFH0N— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025 -
మంగ్లీ బర్త్డే పార్టీ.. తప్పు నామీదకు తోస్తారేంటి?: దివి
ఫోక్ సాంగ్స్తో ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరు తాజాగా వార్తల్లో మార్మోగుతోంది. జూన్ 10న తన బర్త్డేను పురస్కరించుకుని చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపగా 9 మందికి గంజాయి పాజిటివ్గా తేలింది.తప్పు చేసుంటే..ఈ బర్త్డే పార్టీకి బిగ్బాస్ బ్యూటీ, నటి దివి వైద్య (Divi Vadthya) హాజరైంది. దీంతో ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై దివి స్పందించింది. ఫ్రెండ్ బర్త్డే అని పిలిస్తే వెళ్లాను. కానీ, అక్కడ జరిగిన పొరపాట్లను నాపైన తోయడం సరికాదు. నేను నిజంగా తప్పు చేసుంటే, ఆ మేరకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నా ఫోటో వేయండి. కానీ ఏ సాక్ష్యం లేకుండా నా ఫోటో వాడి నన్ను నెగెటివ్ చేస్తుంటే కెరీర్కు ఎంత ఇబ్బంది అవుతుంది?ఫ్రెండ్ అని వెళ్లా..ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఫ్రెండ్ బర్త్డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది అని ఓ ఆడియో రిలీజ్ చేసింది. అటు ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనూ హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది? అని ఆవేదన వ్యక్తం చేసింది. మంగ్లీ బర్త్డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి స్పష్టం చేసింది.చదవండి: ఆడవారి వాష్రూమ్కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్జెండర్ నటి -
అక్కడ ‘డా డా’.. ఇక్కడ ‘పా పా’
తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అందుకే అక్కడ హిట్టయిన చిత్రాలన్నీ తెలుగులోనూ రలీజ్ అవుతుంటాయి. అలా తెలుగులో రిలీజ్ కాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ చిత్రమే డాడా. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో పాపా పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. "పా పా" చిత్రాన్ని జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నీరజ కోట తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ -బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు. -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
పౌడర్ వేసుకున్నానని.. తిట్టారు: లావణ్య త్రిపాఠి
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’. హను రాఘవపూడి దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా నటించారు. వారిద్దరికి కూడా హీరోలుగా ఇదే తొలి సినిమా. 2012లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. సినిమాలోని డైలాగ్స్, పాటలు బాగా వైరల్ అయ్యాయి. అప్పట్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ క్లాసిక్ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్స్లోకి రాబోతుంది. జూన్ 13న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా లావణ్యతో పాటు చిత్రబృందం అంతా మరోసారి సినిమా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూల్లో సినిమా షూటింగ్ నాటి అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా లావణ్య ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. హీరోలతో పాటు తను కూడా మేకప్ లేకుండానే నటించానని చెప్పింది. ఓ సారి అనుకోకుండా ముఖానికి మేకప్ వేసుకొని వస్తే.. దర్శకుడు హను రాఘవపూడి తిట్టాడని చెప్పింది. ‘ఈ సినిమా కోసం నేను ఎలాంటి మేకప్ వేసుకోలేదు. రియల్ హెయిర్తోనే నటించాను. కనీసం పౌడర్ కూడా వేసుకోలేదు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్లోనే నేను పౌడర్ వేసుకొని సెట్కి వచ్చాను. దర్శకుడు హను ఫోటో తీసి నా దగ్గరకు వచ్చి జూమ్ చేసి చూపించాడు. నీ ముఖంపై పౌడర్ పటికలు ఎలా కనిపిస్తున్నాయో చూడు’ అన్నారు. వెంటనే నేను ముఖం కడుక్కొని వచ్చాను’ అంటూ నాటి షూటింగ్ అనుభవాలను లావణ్య పంచుకున్నారు. ఇక రాహుల్ మాట్లాడుతూ.. జీరో మేకప్తో సినిమా చేశాం. కనీసం సన్స్క్రీన్ కూడా వాడలేదని చెప్పారు. -
మంత్రి ప్రసంగిస్తుండగా శ్రీలీల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు (Duddilla Sridhar Babu)కు వింత అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్ ది హీరో ఆల్వేస్ - SITHA) యాప్ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో హీరోయిన్ శ్రీలీల అక్కడికి వచ్చేసింది. అది గమనించిన యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) మంత్రి ప్రసంగాన్ని కొద్ది క్షణాలపాటు ఆపింది.మంత్రి ప్రసంగానికి ఆటంకంమంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్ ది హీరో ఆల్వేస్' అనే యాప్ లాంఛ్ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు. తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాడు.సభామర్యాద పాటించరా?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల హీరోయిన్ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. స్పందించిన ఝాన్సీఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై యాంకర్ ఝాన్సీ స్పందించింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో శ్రీలీల కార్యక్రమానికి వచ్చిందని పేర్కొంది. మంత్రి అనుమతితోనే శ్రీలీలను స్టేజీపైకి తీసుకొచ్చామంది. అంతేతప్ప ఆయన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకోలేదని వివరణ ఇచ్చింది. హిరోయిన్ శ్రీ లీల కోసం తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగాన్ని ఆపిన యాంకర్ ఝాన్సీశ్రీధర్ బాబు మెత్తని వాడు కాబట్టి ఒప్పుకున్నాడు అదే ఇగో వున్న ఏ ఇతర మంత్రి అయిన వుంటే పరిస్థితి వేరుగా వుండేది pic.twitter.com/cjpGi2Rd46— Kumar Reddy.Avula (@Kumar991957) June 10, 2025 చదవండి: సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు -
సుహాసిని ఫోన్ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు
మల్టీ టాస్కింగ్ అన్న పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పార్తీబన్ (R. Parthiban). అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్గా తన ప్రతిభ చాటుకున్నారు. యుగానికి ఒక్కడూ, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. తాజాగా ఆయన హీరోయిన్ సుహాసినిపై ప్రశంసలు కురిపించాడు. వర్డిక్ట్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పార్తీబన్ మాట్లాడుతూ.. అందరూ సుహాసిని యాక్టింగ్ గురించే మాట్లాడుకుంటారు. ఓరోజు ఫోన్ చేసి..కానీ తన ఆత్మవిశ్వాసం గురించి మీకు చెప్పాలి. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి పార్తీబన్.. ఈరోజు నాకు 50 ఏళ్లు నిండాయి అని చెప్పింది. అసలు ఏ మహిళ కూడా 28 ఏళ్లు దాటాక తన వయసు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అలాంటిది తనకు 50 ఏళ్లు అని నిర్మొహమాటంగా చెప్పిందంటే అది తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. 50 ఏళ్లు వచ్చినా తనెంత అందంగా ఉందో మీరే చూడండి అనడంతో అక్కడే స్టేజీపై ఉన్న సుహాసిని (Suhasini) సరదాగా నవ్వేసింది.సినిమావర్డిక్ట్ సినిమా విషయానికి వస్తే.. పార్తీబన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు. కృష్ణ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాసిని కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్, విద్యుల్లేఖ, ప్రకాశ్ మోహన్దాస్ తదితరులు నటిస్తున్నారు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
Kuberaa: ‘పిపీ డుమ్ డుమ్... ’ అంటున్న రష్మిక
ధనుష్-రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమ్ముల గిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘పిపీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు చైతన్య పింగలి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి చౌహాన్ అద్భుతంగా ఆలపించారు. -
మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి కలకలం
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ(Singer Mangli) బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్ డే సందర్భంగా మంగ్లీ నిన్న(జూన్ 10)హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. అలాగే పార్టీకి హాజరైన 48 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్గా తేలిందని పోలీసులు తెలిపారు. సింగర్తో పాటు రిసార్ట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫోక్ సాంగ్స్తో ఫేమస్ అయిన మంగ్లీ. ఆ ఫేంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన స్టైల్లో పాటలు ఆలపిస్తూ..తక్కువ సమయంలోనే స్టార్ సింగర్గా ఎదిగింది. బన్నీ, ఎన్టీఆర్, మహేశ్ బాబుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడింది. -
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి చెందారు. గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతేడాది చివరగా రాజ్ తరుణ్తో 'తిరగబడరా సామీ' అనే మూవీ చేశారు. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది.గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి.. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్తో 'పిల్లా నువ్వు లేని జీవితం'తో పాటు ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు. అయితే 'తిరగబడరా సామీ' పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు. -
బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్తో?
'గుంటూరు కారం' తర్వాత ఏడాదిన్నర నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ కోసం భారీ మైథలాజికల్ స్టోరీ ఒకటి సిద్ధం చేశారు. త్వరలో అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అనుకునే టైంలో బన్నీ లైనప్ మారింది. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ని కాదని అట్లీతో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో మాటల మాంత్రికుడు ఎదురు చూడక తప్పని పరిస్థితి. అలానే ఎవరితో సినిమా చేయాలా అని త్రివిక్రమ్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయారు. అయితే ఇప్పుడు ఈయన గురించి కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.త్రివిక్రమ్, అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథని ఇప్పుడు ఎన్టీఆర్తో తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. అలా అని ఇది ఇప్పుడు మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. రామ్ చరణ్, వెంకటేశ్తో వరసగా మూవీస్ చేస్తారని, ఇవి పూర్తయిన తర్వాత తారక్తో మూవీ ఉండొచ్చని తెలుస్తోంది. అంతలో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని వస్తాడని టాక్.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)'అరవింద సమేత' తర్వాతే త్రివిక్రమ్-ఎన్టీఆర్తో మరోసారి పనిచేస్తారని కొన్నేళ్ల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ అలానే ఉండిపోయింది. అదే కథతో త్రివిక్రమ్.. 'గుంటూరు కారం' తీశారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ఇది నిజమో కాదో సంగతి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఒకరు చేయాల్సిన స్టోరీతో మరో స్టార్ హీరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బన్నీ కూడా ప్రస్తుతం అట్లీతో చేస్తున్నాడు. ఒకవేళ కుదిరితే త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ఉంటుంది. లేదంటే మాత్రం సందీప్ రెడ్డి వంగా, పుష్ప 3 మూవీస్ ఉండనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్ సినిమా మిస్ అంటున్న వార్తలు నిజమేనా? లేదంటే పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో త్రివిక్రమ్-రామ్ చరణ్ మూవీ గురించి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
పోలీస్ స్టేషన్లో ఫైట్
పోలీస్ స్టేషన్లో ఫైట్ చేస్తున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారం) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్లో పాల్గొంటున్నారని టాక్.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఓ హైలైట్గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. -
అడవిలో అన్వేషణ!
అడవుల్లో మహేశ్బాబు కళ్లు దేని కోసమో వెతుకుతున్నాయి. కొందరు నిధి కోసం అంటున్నారు. మరికొందరు ప్రాణం పోసే సంజీవిని తరహా లాంటి మొక్క కోసం అంటున్నారు. ఈ మాటలు మహేశ్బాబు కొత్త సినిమా గురించే. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో మహేశ్బాబు క్యారెక్టరైజేషన్, సినిమా కథ గురించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వస్తుండటం, సినీ ప్రేమికులు వీటిని ఆసక్తికరంగా గమనిస్తుండటం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాకు భారతీయ ఇతిహాసం రామాయణ నేపథ్యం ఉంటుందట.రామాయణంలో సంజీవని మొక్క కోసం వెతికే హనుమంతుడిని పోలిన లక్షణాలు మహేశ్బాబు పాత్రలో ఉంటాయని ఫిల్మ్నగర్ భోగట్టా. మరి... మహేశ్బాబు అడవిలో దేని కోసం అన్వేషిస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరిగింది. తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఈ వారంలో మళ్లీ చిత్రీకరణ మొదలవుతుందని, కాశీ నగరాన్ని తలపించే సెట్ని రెడీ చేయించారని, ఈ సెట్లోనే షెడ్యూల్ ప్రారంభం అవుతుందని తెలిసింది. రెండు వారాలకు పైగా ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఇక ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
రామ్ చరణ్తో త్రివిక్రమ్ ప్లాన్.. బన్నీనే కారణమా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అభిమానులు ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నారు.గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, వెంకటేశ్తో ఆయన సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. అయితే ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో జతకట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కాంబోలో ఓ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్తో సోషయో ఫాంటసీని చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్లో అర్జున్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇప్పుడు బన్నీ అట్లీతో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించడంతో త్రివిక్రమ్ సినిమా గురించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు. దీంతో బన్నీతో సినిమా ఇప్పట్లో పట్టలెక్కేలా కనిపించడం లేదు. ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్.. రామ్ చరణ్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
పెళ్లి చీరలో కేతిక శర్మ.. అదితీ మరీ ఇంత క్యూట్నెస్సా
క్యూట్నెస్తో మాయ చేస్తున్న అదితీ శంకర్'సింగిల్' షూటింగ్ జ్ఞాపకాలతో కేతిక శర్మకత్తితో రాణిలా రౌద్రం చూపిస్తున్న నందిని రాయ్బాలిలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్పాస్తా చేసేస్తున్న హీరోయిన్ నివేదా థామస్మే నెల జ్ఞాపకాలతో బన్నీ భార్య స్నేహారెడ్డిబికినీలో అందాలన్నీ చూపించేస్తున్న రమ్య పసుపులేటి View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) -
కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు. చివరగా 2023లో వచ్చిన 'సువర్ణ సుందరి' మూవీలో కనిపించారు. తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి ఈయన్న ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు.(ఇదీ చదవండి: హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు)'కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫొటోలోని కోటా శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే సదరు ఫొటోలో కోటా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'తోనే కోటా శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, దక్కనీ భాషల్లోనూ పలు చిత్రాల్లో ఈయన నటించడం విశేషం. ఇప్పటికీ పాత సినిమాల సీన్లనీ యూట్యూబ్లో చూస్తుంటే అరె ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనని దూరం పెట్టాల్సి వచ్చింది.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్) -
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్లోకి పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎన్నికల ముందే ప్రారంభం అయింది. కొన్నాళ్లకే ఎన్నికలు రావడం..పవన్ బిజీ అయిపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ చిత్రం సెట్పైకి వెళ్లింది. ఇటీవల ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కల్యాణ్ అఫీషియల్ గా షూటింగ్లో జాయిన్ అయ్యారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్లో పాల్గొంటోంది. పవన్ ఎంట్రీతో సెట్స్లో జోష్ నెలకొంది అని చిత్రబృందం పేర్కొంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
'ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్'.. రష్మికపై నాగార్జున ప్రశంసలు!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్కు హీరో నాగార్జున కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్మికపై ప్రశంసలు కురిపించారు.ఈ అమ్మాయి ఒక పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అని నాగార్జున కొనియాడారు. రష్మిక గత మూడేళ్లుగా సినిమాల్లో అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. మేము ఎవరూ చేయలేని.. రెండు వేల కోట్లు, మూడు వేల కోట్ల సినిమాలు రష్మిక మాత్రమే చేయగలదని అన్నారు. మా అందరికంటే రష్మికనే పెద్ద చిత్రాలు చేసిందని నాగార్జున ప్రశంసలు కురిపించారు. (ఇది చదవండి: మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత)కాగా.. ఇటీవలే ఈ మూవీ నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. -
తెలుగు సినిమా.. నిమిషానికి రూ.4.35 కోట్లు తీసుకున్న హీరో!
చిత్ర పరిశ్రమలో చాన్స్ దొరకడమే కష్టం కానీ..ఒక్కసారి చాన్స్ వచ్చి, మంచి హిట్ పడితే..ఇక ఆ నటీనటులకు తిరుగుండదు. వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి. పారితోషికం సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది ఆ ‘ఒకే ఒక చాన్స్ ’కోసం ఎదురు చూస్తుంటారు. అలా వచ్చిన అవకాశం అందిపుచ్చుకొని నిరూపించుకుంటే.. కొన్ని ఏళ్ల వరకు ఢోకా ఉండదు. ముఖ్యంగా హీరోలకైతే వయసు మీద పడినా.. సినిమా చాన్స్లు తగ్గవు. ఒకవేళ తగ్గినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో.. క్యామియో రోల్గానో మెరిసి సొమ్ము చేసుకుంటారు. మరికొంతమంది హీరోలు అయితే సోలోగా సినిమాలు చేస్తూనే..అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్ ప్లే చేస్తుంటారు. అలాంటి వారిలో అజయ్ దేవగణ్ ఒకరు. ఒకవైపు సోలో హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిధి పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరో క్యామియో రోల్ చేసినా..రెమ్యునరేషన్ మాత్రం హీరో స్థాయిలోనే తీసుకుంటున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ. 4.35 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రానికిగానే అజయ్ భారీగానే పారితోషికంగా పుచ్చుకున్నాడట. ఈ ఒక్క చిత్రానికి రూ. 35 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అజయ్ కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఈ లెక్కన నిమిషానికి రూ.4.35 కోట్ల చొప్పున ఆయన తీసుకున్నాడు. క్యామియో రోల్కి ఈ స్థాయి రెమ్యునరేషన్(నిమిషాలతో పోల్చి చూస్తే) తీసుకుంటున్న నటుల్లో అజయ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే హీరోగా చేస్తున్న సినిమాలకు మాత్రం ప్రాజెక్ట్ని బట్టి పారితోషికం తీసుకుంటాడట. బడా ప్రాజెక్టు అయితే రూ. 40 కోట్లు తీసుకునే అజయ్.. రైడ్ 2 వంటి చిన్న చిత్రాలకు సగం తగ్గించి రూ. 20 కోట్ల వరకే తీసుకుంన్నాడట. అజయ్ ప్రస్తుతం దేదే ప్యార్ దే 2, సన్నాఫ్ సర్ధార్ 2, దృశ్యం 3 వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. -
'కన్నప్ప' ట్రైలర్ అప్డేట్.. కాస్త త్వరగానే
రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే 'కుబేర'.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.(ఇదీ చదవండి: డిజాస్టర్ 'థగ్ లైఫ్'.. ఓటీటీ లెక్క మారుతోంది!)ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో 'కూలీ'తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర'.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి 'కుబేర'.. బిగ్ స్క్రీన్పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?) -
కూతురుతో హైదరాబాద్కు సూర్య.. యంగ్ లుక్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది 50 ఏళ్ల వయసులోకి అడుగుపెడుతున్నప్పటికీ, చూడటానికి 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ మరింత ఫిట్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా, సూర్య తన కూతురు దియాతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఈ వీడియోలో సూర్య, దియా తండ్రి-కూతుళ్లలా కాకుండా అన్నా-చెల్లెల్లా కనిపించారు. సూర్య యంగ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ, ‘మా హీరో రోజురోజుకూ మరింత యంగ్గా మారుతున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు.సూర్య ప్రస్తుతం దర్శకుడు వెంకీ అట్లూరి ఆధ్వర్యంలో కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కూతురు దియాని కూడా వెంటబెట్టుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో టీషర్ట్లో సింపుల్గా కనిపించిన సూర్య, తన ఫిట్నెస్తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.సూర్య కూతురు దియా సాధారణంగా పబ్లిక్లో ఎక్కువగా కనిపించదు. ఆమెకు సంబంధించిన వివరాలు కూడా పెద్దగా బయటకు రాలేదు. ఇటీవల దియా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, ఆ ఫోటోలను సూర్య భార్య జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. చదువు పూర్తి చేసిన దియా ఇప్పటి వరకు సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. అయితే, తండ్రితో కలిసి షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. ఎయిర్పోర్ట్లో సూర్య, దియా కలిసి నడుచుకుంటూ వెళ్లిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సూర్య ఫిట్నెస్, యంగ్ లుక్కు అభిమానులు మరోసారి ఆకర్షితులవుతూ, అతడి స్టైల్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025 -
డ్యూయల్ రోల్లో కార్తీ.. ‘సర్దార్ 2’ సమాప్తం!
‘సర్దార్’ సీక్వెల్ ‘సర్దార్ 2’ షూటింగ్ సమాప్తం అయింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన స్పై యాక్షన్ డ్రామా ‘సర్దార్’. 2022 అక్టోబరులో విడుదలైన ఈ సినిమా సూపర్హిట్గా నిలిచింది. తాజాగా కార్తీ, పీఎస్ మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’ సినిమాకు సీక్వెల్గా ‘సర్దార్ 2’ రానుంది. ఈ సీక్వెల్ చిత్రీకరణ పూర్తయినట్లుగా మేకర్స్ వెల్లడించారు. కార్తీ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘సర్దార్’ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. సీక్వెల్లోనూ ద్విపాత్రాభినయం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
'ది ఢిల్లీ ఫైల్స్' టైటిల్ను మార్చేసిన దర్శకుడు
‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు పోస్టర్స్తో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా టైటిల్ను మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, చాలామంది కోరికమేరకే టైటిల్ను మార్పు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మిస్తున్న 'ది ఢిల్లీ ఫైల్స్'(The Delhi Files) చిత్రాన్ని 'ది బెంగాల్ ఫైల్స్'(The Bengal Files)గా మార్పు చేస్తున్నట్లు దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో మిథున్ చక్రవర్తితో పాటు పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్– ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్పై అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు.BIG ANNOUNCEMENT: The Delhi Files is now The Bengal Files. Teaser coming this Thursday, 12 June 2025 at 12 PM. In cinemas on 05 September 2025.দ্য দিল্লি ফাইলস এখন দ্য বেঙ্গল ফাইলস। টিজার আসছে আগামী বৃহস্পতিবার, ১২ই জুন ২০২৫, দুপুর ১২টায়।ছবিটি প্রেক্ষাগৃহে মুক্তি… pic.twitter.com/tzXEEYdS28— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 10, 2025 -
అటు బాలయ్య.. ఇటు పవన్.. తగ్గేదెవరు?
టాలీవుడ్కి సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పలు బడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ వేళ సెలవులు ఉండడం.. అంతా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి. అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కొన్ని సార్లు అవన్నీ హిట్ అయితే..మరికొన్ని సార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది. ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోతున్నాయి. అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్దాలేవి జరగట్లేదు. స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు. పోటీ ఉన్నా తమకు సినిమాకు ఢోకా లేదు అనుకుంటే తప్ప.. రిలీజ్ చేయట్లేదు. కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్దం జరగబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ(Nandamuri Balakrishna) అయితే మరో స్టార్ హీరో పవన్ కల్యాణ్( Pawan Kalyan). వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు.మరోసారి బాక్సాఫీస్పై ‘తాండవం’?బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ: తాండవం’(Akhanda 2). వీరిద్దరి కాంబినేషన్లో 2021లో వచ్చిన ‘అఖండ’సినిమాకు సీక్వెల్ ఇది. తాజాగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్. దాంతో పాటు రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. దసర కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది.‘ఓజీ’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అదే రోజు బాలయ్య కూడా అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు. కాస్త గ్యాప్ తీసుకొని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని, ఒకోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా? లేదా ‘తగ్గేదే లే’ అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా? కొద్ది రోజుల్లో తెలుస్తుంది. -
ఎ.ఆర్. రెహమాన్ కచేరీ.. బాధితుడికి రూ. 55వేలు పరిహారం
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన సంగీత కచేరీ కోసం రూ. 10వేలు చెల్లించి ఒక అభిమాని టికెట్ కొన్నాడు. అయితే భారీ వర్షం కారణంగా ఆ షో రద్దు కావడంతో అతను కలత చెందాడు. దీంతో తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ బాధితుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అయితే, రెండేళ్ల విచారణ తర్వాత బాధితుడికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది2023 ఆగస్టు 12న చెన్నైలో మ్యూజికల్ కన్సర్ట్కు హాజరు కానున్నానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు. దానిని చూసిన అభిమానులు భారీగా టికెట్లు కొన్నారు. అయితే, ఆ రోజు భారీ వర్షం పడటంతో షో రద్దు అయింది. తరువాత, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10న జరిగింది. ఆగస్టులో కొనుగోలు చేసిన టిక్కెట్లతో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే, చెన్నైలోని అన్నా నగర్కు చెందిన అర్జున్, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రూ. 10 వేల టికెట్ కొనుగోలు చేశాడు. సెప్టెంబర్లో ఈ కార్యక్రమం జరిగినప్పుడు నిర్వాహకులు సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా జరిపించడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు అర్జున్ పేర్కొన్నారు. దీంతో చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు.అందులో, అతను ఇలా పేర్కొన్నాడు, "సంగీత దర్శకులు A.R. రెహమాన్ మ్యూజికల్ కార్యక్రమం కోసం రూ.10 వేల టికెట్ కొన్నప్పటికీ, కచేరీని చూడలేకపోయిను. అందుకు నేను చాలా బాధపడ్డాను. కాబట్టి నేను అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలి. టికెట్ రుసుమును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. అర్జున్ చేసిన ఫిర్యాదును విచారించిన చెన్నై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. త ఎ.ఆర్. రెహమాన్ సంగీత కచేరీని నిర్వహించిన ACTCని పరిహారంగా రూ. 50,000 చెల్లించాలని ఆదేశించింది. పిటిషనర్ అర్జున్కు రెండు నెలల్లోగా మొత్తం రూ.55,000 చెల్లించాలని, అందులో రూ.5,000 వ్యాజ్య ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది. -
దిల్ రాజు చేతికి 'వార్ 2'.. కూలీ ఎఫెక్ట్తో పక్కా ప్లాన్
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.వార్2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజ్ ఫిలింస్ కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వార్2కు పోటీ తప్పదు. అందుకే వార్2 చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ, ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్ పక్కన పెట్టేసింది. -
కమల్ సంస్థలో రోలెక్స్.. భారీ బడ్జెట్తో ప్లాన్
కథానాయకుడిగా, నిర్మాతగా చిత్రాలు చేస్తున్న నటుడు కమలహాసన్. ఈయన ఇటీవల తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శివకార్తికేయన్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం అమరన్. నటి సాయిపల్లవి నాయకిగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో మెడ్రాస్ టాకీస్తో కలిసి రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన థగ్లైఫ్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. తదుపరి కమలహాసన్ ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నాయి. కాగా తాజాగా కమలహాసన్ మరో చిత్రం నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈయన ఇంతకు ముందు సిద్ధార్థ్ హీరోగా చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా వీర ధీర శూరన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే హీరో ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరికి నటుడు సూర్య ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూర్యతో నిర్మించనున్న ఈ సినిమా కోసం కమల్ భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.సూర్య ఇంతకు ముందు కమలహాసన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే పాత్రలో అతిథిగా మెరిసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్య హీరోగా అరుణ్కుమార్ దర్శకత్వంలో నటించనున్న చిత్రం గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. కాగా ప్రస్తుతం సూర్య తన 45వ చిత్రం షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉంటూనే తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. -
ఓటీటీలో మలయాళ ఫాంటసీ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మలయాళంలో తెరకెక్కిన ఒక ఫాంటసీ కామెడీ చిత్రం 'పడక్కలం'.. మే 9న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నూతన దర్శకుడు మను స్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్ నటించారు. ప్రేక్షకులకు క్లీన్ క్యాంపస్ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీని దర్శకుడు అందించాడు. కానీ, పేలవమైన కథ ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాను నిరాశపరిచింది.జూన్ 10న పడక్కలం జియోహాట్స్టార్ వేదికగా విడుదలైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లు రాబట్టింది. కామెడీ పరంగా సినిమా పర్వాలేదనిపించినా... కథ ఎంపిక విషయంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. అయితే, ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉంది.నలుగురు కాలేజీ అబ్బాయిల ప్రయాణమే పడక్కలం చిత్రం. వారికి కామిక్ పుస్తకాలు అంటే చాలా ఇష్టం. వారు ఊహించని సాహసయాత్రలో పాల్గొంటారు, వారి పాఠశాలలోని ఒక ప్రొఫెసర్కు ఉన్న అతీంద్రియ శక్తులతో వారి విద్యా ప్రపంచం తలకిందులు అవుతుంది. అనేక మలుపులతో వారి ప్రయాణం ఎలా ముగుస్తుంది అనేది ఈ చిత్రం. -
'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత యంగ్ హీరోయిన్తో మూవీ ప్లాన్ చేసిన శశికుమార్
వైవిధ్య కథాచిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న 'శశికుమార్' వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన 'అయోద్ధి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్' చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన శశికుమార్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల నటి సిమ్రాన్తో కలిసి నటించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం శశికుమార్ హీరోగా నటించిన ఫ్రీడమ్ చిత్రం జూలై 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఈయన తొలిసారిగా వెబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇంతకు ముందు రూపొందిన వదంతి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వదంతి–2 రూపొందుతోంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇతి వృత్తంతో సాగే ఈ వెబ్ సిరీస్లో నటుడు శశికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మదురై, తిరునల్వేల్లి ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ వెబ్ సిరీస్లో తాను శశికుమార్కు జంటగా నటిస్తున్నట్లు నటి 'అపర్ణదాస్'(Aparna Das) ఇటీవల ఒక భేటీలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల బ్యూటీ 50 ఏళ్లకు పైగానే ఉన్న శశికుమార్కు జంటగా నటించనుంది. ఆమె ఇప్పటికే మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించారన్నది గమనార్హం. ముఖ్యంగా తమిళంలో నటుడు విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించి గుర్తింపు పొందారు. తెలుగులోనూ నాలుగైదు చిత్రాల్లో నటించారు. తమిళంలో ఆమె నటించి 'దాదా' (పాపా) సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడా చిత్రం తెలుగులో జూన్ 12న విడుదల కానుంది.కాగా దీని తరువాత శశికుమార్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన మెగాఫోన్ పట్టి శ్రీకుట్రపరంపరైశ్రీ అనే వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని శశికుమార్నే ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. -
లక్ష్యం కోసం...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ‘వార్ 2’ సినిమా టీజర్ను విడుదల చేశారు.ఈ టీజర్లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్ 2’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన అనైతా ష్రాఫ్ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్ అందరిలోకి వచ్చేస్తుంటుంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్ని డిజైన్ చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ని డిజైన్ చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్ అడజానియా చెప్పారు. -
క్రేజీ కాంబినేషన్?
హీరో రామ్చరణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకునేందుకు సన్నాహాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేసి, రామ్ చరణ్కు వినిపించారట. ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మించనున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. కాగా ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు రామ్చరణ్. అలాగే దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి..‘పెద్ది’ తర్వాత రామ్చరణ్ సినిమా సుకుమార్తో ఉంటుందా? లేక త్రివిక్రమ్తోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇంతకుమించి కోరుకోవడానికి ఏముంది: నయనతార
తమిళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ కపుల్ అనగానే హీరోయిన్ నయనతార– డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ల జోడీ గుర్తొస్తుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’(2015) చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించారు. ఆ సమయంలో నయన్–విఘ్నేశ్ల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. వారికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. సోమవారం మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు నయనతార.‘‘ఒకరిపై ఒకరు అంతలా ఎలా ప్రేమ చూపుతారన్నది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది. నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది.స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేశారు నయనతార. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. నయనతార తెలుగులో ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. -
షారుక్ఖాన్ తో సుకుమార్?
బాలీవుడ్ హీరో షారుక్ఖాన్ , దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. షారుక్తో ఓ సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోందని, ఈ దిశగా చర్చలుప్రారంభమయ్యాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాకు షారుక్ ఓకే చెబితే, దర్శకుడిగా సుకుమార్తో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మైత్రీమూవీ మేకర్స్ అనుకుంటున్నారని టాక్. మరి.. సుకుమార్, షారుక్ఖాన్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే.. ఇటీవల షారుక్ఖాన్ ను కలిశారట తమిళ దర్శకుడు వెట్రిమారన్ . ఈ నేపథ్యంలో షారుక్ఖాన్ సినిమా ఏ దర్శకుడితో ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ప్రస్తుతం హిందీ చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నారు షారుక్ఖాన్ . ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. -
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.అసలేంటి వివాదం..?ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు. -
మా సినిమాల రిలీజ్ డేట్స్ను వాళ్లే నిర్ణయిస్తున్నారు: కుబేర నిర్మాత
కుబేర మూవీ నిర్మాత సునీల్ నారంగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా విడుదలపై ఓటీటీల ఆధిపత్యం కొనసాగుతోందని అన్నారు. తాము నిర్మించిన మూవీ రిలీజ్ డేట్ను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. మా సినిమాను జూలైలో విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని అన్నారు. సినిమా విడుదల ఆలస్యమైతే అంగీకరించిన మొత్తంలో రూ. 10 కోట్ల రూపాయలు కోత విధిస్తామని హెచ్చరించందని నిర్మాత సునీల్ వెల్లడించారు. ఓటీటీలే సినిమాల విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోతోందని తెలిపారు.'కుబేరా' నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ' ఓటీటీ ప్లాట్ఫామ్స్ సినిమాల విడుదల తేదీని నిర్ణయిస్తున్నాయి. ఒకటి, రెండు వారాలు ఆలస్యమైతే వాళ్లు ఒప్పుకోవడం లేదు. నేను జూలైలో కుబేరా మూవీ రిలీజ్కు ఓటీటీ సంస్థను అభ్యర్థించా. కానీ మొదట అంగీకరించిన తేదీ జూన్ 20న విడుదల చేయాలని నన్ను కోరారు. ఆ డేట్లో రిలీజ్ చేయకపోతే అంగీకరించిన మొత్తంలో 10 కోట్లు తగ్గిస్తామని చెప్పారు.' అని వెల్లడించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'కొన్ని సంఘటనల కారణంగా పరిశ్రమ దెబ్బతింది. మేము సినిమా సర్వీస్ ప్రొవైడర్ అయిన క్యూబ్పై పూర్తిగా ఆధారపడి ఉన్నాం. శాటిలైట్ లేకుండా సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదు. ఇక బుక్మైషో ఒక గంట పాటు ఇంటర్నెట్ ఆపేస్తే కలెక్షన్లు సున్నాకి పడిపోతాయి. అలా మేము వాటన్నిటిపైనే కాకుండా ఇప్పుడు ఓటీటీలపై ఆధారపడాల్సి వస్తోంది' అన్నారు.గతంలో శాటిలైట్, థియేటర్లను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసేవాళ్లమని సునీల్ నారంగ్ తెలిపారు. అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లను బట్టి మేము సినిమాలు తీస్తున్నామని వెల్లడించారు. మెల్లమెల్లగా వాళ్లే ఇప్పుడు పరిశ్రమకు కింగ్గా మారుతున్నారని.. సినిమా ఆడినా.. ఆడకపోయినా ఈ ముగ్గురూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. కుబేర మూవీలో కోలీవుడ్ హీరో ధనుశ్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంజూన్ 20న విడుదల కానుంది. -
అఖిల్ పెళ్లిలో చరణ్-ఉపాసన.. మార్వెలస్ మీనాక్షి
అఖిల్ పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన ఉపాసనగ్లామరస్ లుక్తో మహేశ్ బాబు భార్య నమ్రతలుంగీతో ఊరమాస్గా మారిన వరలక్ష్మీ శరత్ కుమార్చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న సుప్రీతఒళ్లంతా తడిపేసి పోజులిచ్చిన షాలినీ పాండేబీచ్ ఒడ్డున ప్రియా వారియర్ స్వీట్ స్టిల్స్చీరలో కొంటెదనంతో చూస్తూ నభా నటేశ్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సూపర్ హిట్. 2021 డిసెంబరులో రిలీజైన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీస్తున్నారు. షూటింగ్ చాలావరకు పూర్తి చేశారు. జూన్ 10న అంటే రేపటి రోజున బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్నపాటి మార్పులు చేశారు. పొడవాటి జుత్తుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?' అంటూ విలన్కి వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ కూడా ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా అనిపించాయి. అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఎప్పటిలానే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు. సెప్టెంబరు 25న సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి అది తేదీకి పవన్ 'ఓజీ' కూడా రిలీజ్ కానుంది. ఇద్దరూ వస్తారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు కాగా.. 14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 'అఖండ' నుంచి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన బాలయ్య.. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్నారు. తాజాగా రిలీజైన 'అఖండ 2' టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?) -
'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
'విరూపాక్ష' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు.. పెద్దగా హడావుడి లేకుండానే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే తోటి దర్శకులు కార్తీక్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఎంగేజ్మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు కార్తీక్ వర్మ దండు. 'కార్తికేయ' సినిమాకు రైటర్గా పనిచేసిన అనుభవం ఉంది. అలా 2015లో 'భమ్ భోలేనాథ్' మూవీతో డైరెక్టర్గా పరిచమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరో ప్రయత్నం చేయలేదు. చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.'విరూపాక్ష' హిట్ కావడంతో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఓవైపు దర్శకుడిగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ పర్సన్ అయ్యేందుకు కార్తీక్ వర్మ సిద్ధమైపోయాడు. ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్) -
జయం రవితో రిలేషన్ రూమర్స్.. ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్!
గత కొద్ది నెలలుగా కోలీవుడ్ హీరో విడాకుల జయం రవి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు జయం రవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆయన భార్య అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీంతో ఒకరిపై ఒకరు వరుస లేఖలతో విమర్శలు చేసుకున్నారు. వీరి విడాకుల వ్యవహారంలో ప్రముఖ సింగర్ కెన్నీషా పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కూడా జయం రవి, కెన్నీషా ఓ వివాహా వేడుకలో కనిపించడంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి.జయం రవి భార్య ఆర్తి సైతం తాము విడిపోవడానికి ముడో వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేసింది. పరోక్షంగా విడాకులకు కారణం సింగర్ కెన్నీషా అంటూ ఆరోపించింది. అయితే ఇటీవల జయం రవి, కెన్నీషా దండలు వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఏకంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రాసుకొచ్చారు. కానీ వీరిద్దరు తమిళనాడులోని కుంద్రకుడి మురుగన్ ఆలయాన్ని సందర్శించినప్పుడు పూజారులతో కలిసి తీసుకున్న ఫోటో అని తెలిసింది.అయితే కొద్దికాలంగా సింగర్ కెన్నీషాపై సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుత కెన్నీషా గర్భంతో ఉన్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కెన్నీషా తన గర్భధారణపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. ఓ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది.. నేను గర్భవతిని కాదు.. ఎవరు ఏమి చెప్పినా వారి కర్మ వాళ్లే అనుభవిస్తారంటూ మాట్లాడింది. నిజం, అబద్ధాలు ఏంటనేది అతి త్వరలోనే తెలుస్తాయి.. అప్పటి వరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని ప్రశాంతంగా తినండి.. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ కెన్నీషా చెప్పుకొచ్చింది. తాజాగా సింగర్ మాటలతో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టేసింది. -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్తో అఖిల్కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
ఆస్పత్రి బెడ్పై టాలీవుడ్ బ్యూటీ.. అదే కారణమా?
బిగ్బాస్ విన్నర్, టాలీవుడ్ నటి సనా మక్బుల్ (Sana Makbul) ఆస్పత్రిపాలైంది. ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ ఆశ్నా కంచ్వాలా.. సనా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మై స్ట్రాంగ్ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను అని రాసుకొచ్చింది.సినిమాసనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగా నిలిచింది. ఇటీవల ఆమె తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. 2020 నుంచి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయి. దీని కారణంగా తను ఆస్పత్రిపాలైనట్లు కనిపిస్తోంది. చదవండి: రెండుసార్లు విడాకులు.. ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం?: హీరో -
ఏంటి మీ గోల?.. డౌట్స్ ఉంటే ట్రైలర్ చూడండి..!
ఇటీవల టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అందరికంటే కాస్తా భిన్నంగా చేస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తమ్ముడు' మేకర్స్ అదే అలానే ట్రై చేశారు. గతంలో మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేందుకు కొత్తగా ట్రై చేశారు. తాజాగా ట్రైలర్ అపేడేట్ ఇచ్చేందుకు మరోసారి అదే స్టైల్నే ఫాలో అయ్యారు. హీరోయిన్లు హడావుడి చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో 'నేను అడగడం వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ అంతే' అంటూ వర్ష బొల్లమ్మ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే మేము చెప్తాం అంటూ అక్కడే ఉన్న హీరోయిన్ సప్తమీ గౌడ, స్వాసిక చెబుతారు. ఈ మాట విన్న లయ అసలు మీరిద్దరు ఎవరు? అని ప్రశ్నిస్తుంది. వేరే సినిమాలో నటించి.. తమ్ముడు అనుకున్నారా? అంటూ వర్ష బొల్లమ్మ నవ్వులు పూయిస్తుంది. చివర్లో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి.. ఏంటి మీ గోల? మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ట్రైలర్ చూడండి అని అనడంతో వీడియో ముగుస్తుంది.టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు ట్రైలర్ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాలో సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సౌరభ్ సచ్దేవా, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. -
మహేశ్-రాజమౌళి సినిమా.. నో చెప్పిన స్టార్ హీరో?
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ భాషల్లోనూ హీరోలు తెలుగు సినిమాల్లో, మన దర్శకులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్స్ చాలామంది తమిళ, మలయాళ హీరోలని కీలక పాత్రల కోసం తీసుకుంటున్నారు. అయితే రాజమౌళి, మహేశ్ బాబుతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ఓ స్టార్ హీరోని అడగ్గా నో చెప్పాడట. ఇంతకీ ఎవరతడు? ఏంటి సంగతి?'ఆర్ఆర్ఆర్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాజమౌళి మహేశ్తో సినిమా చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవగా రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా మూవీ మొదలుపెట్టగానే ప్రెస్ మీట్ పెట్టే రాజమౌళి.. ఈసారి మాత్రం ఒక్క మాట చెప్పకుండా సైలెన్స్ మెంటైన్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తున్నారనే విషయం లీకైంది. కానీ రాజమౌళి అస్సలు రెస్పాండ్ కాలేదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)ఇప్పుడు కూడా సడన్గా తమిళ హీరో విక్రమ్.. రాజమౌళి ఇచ్చిన ఆఫర్ చేశాడంటూ కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో విలన్ పాత్ర కోసం విక్రమ్ని సంప్రదించగా, తనకు ప్రతినాయకుడి రోల్స్ చేయడం ఇష్టం లేదని జక్కన్నతో ఇతడు చెప్పాడట. దీంతో మరో ఆప్షన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ని ఎంపిక చేశాడని అంటున్నారు. గతంలో ప్రభాస్ 'సలార్'లో పృథ్వీరాజ్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు. ఇప్పుడు మహేశ్ బాబుకి విలనీగా చేస్తున్నాడనమాట.ఇదే సినిమాలో మాధవన్ కూడా కీలక పాత్ర చేయనున్నాడనే టాక్ రెండు మూడు రోజుల క్రితం వినిపించింది. త్వరలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో ఇతడు జాయిన్ అవుతాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజ్ టార్గెట్గా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. అటవీ నేపథ్యంతో ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఇది సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?) -
అమ్మవారి సినిమా.. క్లాప్ కొట్టిన కమెడియన్ అలీ
నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్.బి.జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా 'చండీ దుర్గమా'. జయశ్రీ వెల్ది నిర్మాతగా, ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో సోమవారం (జూన్ 9న) హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చిట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, రఘు కారుమంచి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. కమెడియన్ అలీ మాట్లాడుతూ.. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ.. ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అలీ గారికి థాంక్స్. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్య అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్కు అనుగుణంగా, ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్లో సరికొత్త కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్కు ఆడియన్స్ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్ను డిజైన్ చేస్తున్నాం అన్నారు. నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం అన్నారు. -
దుబాయ్ ట్రిప్లో సమంత.. ఆమెతో పాటే అతను కూడా!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం దుబాయ్లో చిల్ అవుతోంది. ఓ ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన నెటిజన్స్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఫోటోల్లో మరో వ్యక్తి కనిపించడంతో మరోసారి చర్చకు దారితీసింది. షూటింగ్ చేస్తూ సమంత కనిపించగా.. అందులో ఉన్నది కచ్చితంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కామెంట్స్ పెడుతున్నారు. సామ్ ఫోటోలను కూడా అతనే తీశాడని రాసుకొస్తున్నారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో అబుదాబి సెలవులకు బాయ్ఫ్రెండ్తో కలిసి సమంత చిల్ అవుతున్నారని పలువురు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొన్ని నెలలుగా సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించడంతో ఆ వార్తలు తెగ వైరలయ్యాయి. ఇటీవల రాజ్ భార్య భార్య శ్యామలి దే సైతం సమంతతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని ఉద్దేశించి పోస్ట్ రాశారు. అయితే తమ రిలేషన్పై ఇప్పటి వరకు సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు.ఇటీవల విడుదలైన సమంత నిర్మించిన శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. అంతకుముందు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2','సిటాడెల్: హనీ బన్నీ'వెబ్ సిరీస్ల్లో రాజ్ నిడిమోరుతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం వీరిద్దరు నెట్ఫ్లిక్స్ రానున్నా 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్డమ్' కోసం జతకట్టారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?
తెలుగులో టాప్ డైరెక్టర్స్ అనగానే గుర్తొచ్చే పేరు త్రివిక్రమ్. రైటర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈయన.. టాలీవుడ్లో స్టార్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో తీశారు. అలాంటి ఈయన పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాగోలేదు. పేరుకే స్టార్ డైరెక్టర్ గానీ సరైన కాంబో సెట్ చేసుకోలేక పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో ఎలా ఉండే త్రివిక్రమ్ ఎలా అయిపోయారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది?త్రివిక్రమ్ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు, పంచ్లు, ప్రాస డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈయన.. దర్శకుడిగా పూర్తిగా గాడి తప్పారా అనిపిస్తుంది. ఎందుకంటే 'అల వైకుంఠపురములో' తర్వాత ఎన్టీఆర్తో ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. తొలుత ఓ సబ్జెక్ట్తో సినిమా మొదలుపెట్టారు గానీ కొన్నిరోజులకే దాన్ని పక్కనబెట్టి మరో కథతో సినిమా తీసి రిలీజ్ చేశారు. అదే 'గుంటూరు కారం'. మహేశ్ అభిమానులకు ఈ మూవీ నచ్చింది గానీ మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాలేదు.(ఇదీ చదవండి: ఓటీటీలో లేటెస్ట్ హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)'గుంటూరు కారం' గతేడాది సంక్రాంతికి వచ్చింది. అప్పటి నుంచి త్రివిక్రమ్ ఖాళీగానే ఉంటున్నారు. మధ్యలో అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ సెట్ అయింది. భారీ బడ్జెట్తో మైథలాజికల్ కథతో దీన్ని తీస్తున్నామని నిర్మాత నాగవంశీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో గానీ అల్లు అర్జున్.. దీన్ని పక్కనబెట్టి అట్లీతో సినిమా మొదలుపెట్టారు. ఫలితంగా త్రివిక్రమ్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. రామ్ చరణ్, వెంకటేశ్తో సినిమాలు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి చేసినా సరే టాలీవుడ్కే పరిమితమయ్యే మూవీస్ అవుతాయేమో?త్రివిక్రమ్తో పాటు దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి, సుకుమార్ లాంటి చాలామంది డైరెక్టర్స్.. ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో టాప్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం ఇంకా ఏ హీరోతో మూవీ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అటు దర్శకుడిగా ఎవరితో సినిమా చేయాలా అనే దగ్గర నుంచి బన్నీతో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అనేది తెలియని పరిస్థితి. మరి ప్రస్తుత అడ్డంకులన్నీ దాటుకుని త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
కూతురికి రూ. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చిన స్టార్ హీరో దంపతులు
తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు. ఇందుకు సెలబ్రిటీలు ఏమీ అతీతులు కాదని చెప్పవచ్చు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల (Ranbir Kapoor, Alia Bhatt) ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాశారు. ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు. అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేపించుకోకుండా కూతురు, అమ్మకు గిఫ్ట్గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు.ఆ ఇంటితో రణబీర్ అనుబంధంవాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్కు వారసత్వంగా వచ్చింది. రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. అలా వారసత్వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే, దానిని రీమోడలింగ్ చేయించారు. పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. మరో రెండు నెలల్లో గృహప్రవేశం చేయనున్నారు.రణబీర్కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు.. దానిని చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాడు. అయితే, తనకు కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసొచ్చింది. దీంతో దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయింది. భవిష్యత్లో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట. వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
మోస్ట్ అడోరబుల్ సెలబ్రిటీ కపుల్ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.సూఫీ రాత్రిలో అఖిల్- జైనాబ్ అద్భుతంగాసెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్ నెక్పీస్తో తన లుక్ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.అఖిల్ - జైనబ్ వెడ్డింగ్ 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్రిసెప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
అఖిల్ రిసెప్షన్లో సింపుల్గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!
అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేకైపోతుంది.సింపుల్గా టీ షర్ట్లో మహేశ్తాజాగా మహేశ్.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని- జైనబ్ రవ్జీలు జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్.. సింపుల్గా టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు. లక్ష పైచిలుకు..చూడటానికి సింపుల్గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ టీషర్ట్.. హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
సంస్కృతి, సమైక్యత మేళవింపుగా.. 'ప్రేమతో.. జీ తెలుగు'!
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంఘమంలో నిలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి.. సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్ ఫిల్మ్లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో.. జరిగే పెళ్లి తంతును కళ్లకి కట్టినట్లు చూపించారు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను హత్తుకుంటోంది.ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. 'ప్రేమతో.. జీ తెలుగు' క్యాంపెయిన్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జీ తెలుగు ఎప్పుడు ముందుంటుంది. మన వివాహ పద్ధతిలోని సౌందర్యాన్ని కళ్లకి కట్టినట్లు చూపించే ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు సంస్కృతి, విలువలు, ఆచారాలను ఆవిష్కరిస్తుంది. ఇది కేవలం రీబ్రాండింగ్ మాత్రమే కాదు, ప్రేక్షకులతో జీ తెలుగు అనుబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. ఎప్పటిలాగే తెలుగు ప్రేక్షకులు జీ తెలుగు నూతన ప్రయాణాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. -
అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా?
అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. గతేడాది చివర్లో నాగార్జున (Nagarjuna Akkineni) పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది. ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి.. జైనబ్తో జరిపించాడు. ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిళ్లు కావడం విశేషం. జూన్ 6న పెద్ద హడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ఏర్పాటు చేశాడు. రెండు రోజుల గ్యాప్తో రిసెప్షన్జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరిగింది. మహేశ్బాబు, రామ్ చరణ్, నిఖిల్, సూర్య, యశ్, నాని, కిచ్చా సుదీప్, దిల్ రాజు, సుకుమార్, బుచ్చిబాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో మీరో విషయం గమనించారా? అఖిల్ (Akhil Akkineni) దాదాపు అన్ని ఫోటోల్లోనూ జైనబ్ చేయి పట్టుకునే కనిపించాడు. అఖిల్-జైనబ్ ఫ్యామిలీ ఫోటోఅన్ని ఫోటోల్లోనూ..ఆమె చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. సినీతారలే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా భార్య చేతిని వదల్లేదు. అటు జైనబ్ కూడా అంతే..! ఇది చూసిన అభిమానులు ఈ కొత్త జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ చేయి వదలకూడదని చెప్తున్నారు. ఒక ఫోటోలో అయితే అఖిల్ అటు అత్త చేతిని, ఇటు భార్య చేతిని పట్టుకుని ఆనందంగా కనిపించాడు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల జోలికి వెళ్లకుండా పెళ్లికి తెలుపు, రిసెప్షన్కు గోధుమ రంగు దుస్తులు ధరించారు. ఎవరీ జైనబ్?ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమె సోదరుడు జైన్ రవ్జీ.. జెడ్ఆర్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. జైనబ్.. పెయింటింగ్ ఆర్టిస్ట్. అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా ఈమె వయసు 39 ఏళ్లని తెలుస్తోంది. The Akkineni Family extends a heartfelt welcome to the beloved Victory @VenkyMama GaruYour presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/QDgglYEOSG— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025The Akkineni Family extends a heartfelt welcome to the beloved Natural Star @NameisNani & @actor_Nikhil.Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/O2ZzJuf9SJ— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025 చదవండి: ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్ -
శివకార్తికేయన్తో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan).. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న శివకార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మదరాశి, అదే విధంగా సుధాకొంగర దర్శకత్వంలో పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాలే. వీటిలో పరాశక్తి చిత్రం సెప్టెంబర్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని సమాచారం. రవిమోహన్ ప్రతి నాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయక కోలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. శివకార్తికేయన్ తాజాగా మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారు. ఈయన వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని గురించి ఇంతకుముందే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. లేకపోతే ఇందులో శివకార్తికేయన్కు జంటగా ఇద్దరు బ్యూటీలు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు క్రేజీ నటి కాయాదు లోహర్ కాగా, మరొకరు కల్యాణి ప్రియదర్శన్ అని సమాచారం. కాగా కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ఇంతకుముందే శివకార్తికేయన్కు జంటగా హీరో (శక్తి) చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఆమె తెలుగులో 'చిత్రలహరి, హలో' వంటి సినిమాలతో మెప్పించారు. మరోవైపు కాయాదు లోహర్(Kayadu Lohar) పేరు డ్రాగన్ సినిమాతో తెలుగు, తమిళ్లో బాగా పాపులర్ అయిపోయిన విషయం తెలిసిందే. కాగా శివకార్తికేయన్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కనున్న చిత్రం అత్యంత భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సర్దార్ 2 సినిమా పూర్తి..
కోలీవుడ్ నటుడు కార్తీ కథానాయకుడుగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణన్ తన ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఇంతకుముందు నిర్మించిన చిత్రం సర్దార్. కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్లో తాజాగా రూపొందుతున్న చిత్రం సర్దార్–2. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తుండగా నటుడు ఎస్జే సూర్య, మాళవికమోహన్, ఆషికా రంగనాథ్, రాజిషా విజయన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, జార్జ్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్రం టీజర్ను ఇటీవల విడుదల చేశారు.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉన్న ఆ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది సర్దార్ చిత్రానికి మించి ఉంటుందని నిర్మాత లక్ష్మణన్ పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలోనూ ఎక్కడ రాజీపడకుండా ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది బ్రహ్మాండమైన యాక్షన్ అడ్వెంచర్ కథాచిత్రంగా ఉంటుందని కార్తీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం సర్దార్–2 చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
సాయం చేయాలంటూ 'మంచు మనోజ్' ట్వీట్
భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్ ఒక పోస్ట్ చేశారు. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.సాయం చేయాలంటూ మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేశారు. ' రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను. ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.' అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాను షేర్ చేశారు. అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్ వర్క్ చేయడం లేదని కొందరు స్క్రీన్ షాట్స్ పంపడంతో.. మంచు మనోజ్ మరోక బ్యాంక్ ఖాతా నంబర్ను షేర్ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్ సోషల్మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.Thank you all for the immediate response.As most of you are facing problem while transferring, Here are the new bank details.Please do extend your help for this little one suffering with this acute heart problem she doesn't deserve 🙏CURRENT ACCOUNT YELLA NAVYA SRIACCOUNT… https://t.co/nwV0PthPLm— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 8, 2025 -
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ 'లెవన్' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్లో మే 16న థియేటర్స్లోకి వచ్చేసింది. ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీని లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.'ఆహా' (Aha) వేదికగా ఈ నెల 13 నుంచి 'లెవన్' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఐఎమ్డిబి రేటింగ్లో కూడా ఈ చిత్రం 7.9 సాధించింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి లెవన్ తప్పకుండా నచ్చుతుందని నెటిజన్లు చెబుతున్నారు. కథలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్ వేశారు అనేది మూవీలో చక్కగా చూపారు.'లెవన్' కథేంటంటే.. అరవింద్(నవీన్ చంద్ర) ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఏసీపీ హోదాలో వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్ కుమార్ (శశాంక్) డీల్ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్ కిల్లర్కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
కొత్త పయనం
సుప్రజ్, సంగీర్తనా విపిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పయనం’. చందు రామ్ దర్శకత్వంలో ఛాయా చిత్రాలు పతాకంపై స్వర్ణ కమల నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు–నటుడు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్ చేయగా, కొరియోగ్రాఫర్ రఘు క్లాప్ ఇచ్చారు.ఈ సందర్భంగా చందు రామ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉన్నాయి’’ అన్నారు. ‘‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే వైవిధ్యమైన చిత్రమిది’’ అన్నారు స్వర్ణ కమల. రఘు కుంచె ఆమని, మైమ్ మధు, మెహబూబ్ భాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: షోయబ్. -
ఆలోచన రేకెత్తించే హనీ
‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతోపాటు నేటి సమాజపు తీరు తెన్నులపై ఆలోచనలు రేకెత్తిస్తుంది’’ అని తన తాజా చిత్రం ‘హనీ’ గురించి దర్శకుడు కరుణ కుమార్ పేర్కొన్నారు. ‘పలాసా’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘మట్కా’ తర్వాత కరుణ కుమార్ దర్శకత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సినిమా ‘హనీ’.‘‘చిల్లింగ్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దాదాపు ఎనభై శాతం టాకీ పూర్తయ్యింది. నటీనటుల ప్రతిభకు ఈ సబ్జెక్ట్ ఓ సవాల్’’ అని చిత్రబృందం పేర్కొంది. శేఖర్ మాస్టర్, రవి పీట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద ప్రధాన తారాగణం. -
రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన
ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల ఆధిపత్యం నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది సదరు సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని గురించి నిర్మాతలు పెద్దగా ఓపెన్ అయింది లేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న 'కుబేర' నిర్మాత సునీల్ నారంగ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకుడు. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ కాస్త హైప్ తీసుకొచ్చాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీల ఆధిపత్యం గురించి చెప్పుకొచ్చారు. 'మేం 'కుబేర' చిత్రానికి జూలైలో రిలీజ్ చేస్తామని అడిగాం. కానీ ప్రైమ్ వాడు మాత్రం జూన్ 20న విడుదల చేయండి లేదంటే ఓటీటీ డీల్ నుంచి రూ.10 కోట్లు కట్ చేస్తామని అన్నాడు' అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యూబ్ సిస్టమ్, బుక్ మై షో, ఓటీటీల ఆధిపత్యం నడుస్తోందని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. అలానే 140 కోట్ల మంది జనాభాలో 40-50 మంది హీరోలు మాత్రమే ఉన్నారని.. దీంతో వాళ్లు దేవుళ్లతో సమానం అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఈయన శనివారం సాయంత్రం ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రానికల్లా రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్గా కొనసాగడం కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ) -
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
అక్కినేని అఖిల్.. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహ నాగ్ ఇంట్లో జరగ్గా.. రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.నాగ్ చిన్న కొడుకు అఖిల్కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబరులో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి 'కన్నప్ప' సినిమా లేదంటే వాళ్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు.. తను హీరోగా నటించి భారీ బడ్జెట్తో నిర్మించిన 'కన్నప్ప'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవల్లో ఎక్కడా కనిపించని మంచు లక్ష్మీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు(సరదాగా). ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానమిచ్చింది. గత కొన్ని నెలల నుంచి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా మాట్లాడని మంచు లక్ష్మీ.. మంచు మనోజ్కి మాత్రం అండగా ఉంది.కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన మంచు లక్ష్మీ.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్లో కనిపించిన ఈమె.. మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది. ఈ ఈవెంట్లోనే స్పందిస్తూ 'కన్నప్ప'లో నటించకపోవడానికి కారణం కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
ప్రెసిడెంట్ అయిన 24 గంటల్లోనే పదవికి రాజీనామా
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆ పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అందుకు గల కారణాల్ని కూడా వెల్లడించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)అసలేం జరిగిందంటే?టాలీవుడ్లో గత కొన్నిరోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్నిరోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొన్నిరోజులకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకొచ్చింది. దీని తర్వాత పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేశారు. తన సినిమా 'హరిహర వీరమల్లు' వస్తుందనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన తర్వాత ఆ నలుగురు అనే మాట తెగ వైరల్ అయింది.ఆ నలుగురే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం.. తెలంగాణ ఫిలిం చాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
వైట్ షర్ట్లో జవాల్కర్ హొయలు.. దేవకన్యలా జాక్వెలిన్
షర్ట్ సైడ్ చేసి రెచ్చగొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్దేవకన్యలా మారిపోయి అందాల చందమామల జాక్వెలిన్పట్టుచీరలో బుట్టబొమ్మలా మీనాక్షి చౌదరిబ్లర్రీ పోజుల్లో 'డ్రాగన్' ఫేమ్ కాయదు లోహర్చీరలో కేక పుట్టిస్తున్న కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్మెడలో హారంతో మాయ చేసేలా చూస్తున్న రుహానీ శర్మఎల్లో డ్రస్సులో మంట పుట్టించేస్తున్న నందిని రాయ్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, విశాఖపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్బుక్లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు -
పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..)ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు) -
ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు
సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్కు వెళ్లేందుకు స్టంట్ చేయాల్సి వచ్చింది. అనుపమ్ ఖేర్.. ప్రభాస్ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్లోకి వెళ్లేందుకు అనుపమ్ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇదే తొలిసారినా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్ లొకేషన్కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్లో ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్కు బయలుదేరాం. మా డ్రైవర్ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్ ఎండ్కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడ దూకి సెట్లోకి..కారు రివర్స్ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జంటగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher) చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ.. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న రీతూ వర్మ తొలి వెబ్ సిరీస్
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డాని. ‘శ్రీకారం’ ఫేమ్ బి. కిశోర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరోలుగా నటించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కామెడీ, హారర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది.రీతు వర్మ ఓటీటీ లో డెబ్యూ , పల్లెటూరి అమ్మాయి గా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అందంగా ఉంది , టీచర్ గా ప్రాబ్లం వస్తే ఎదిరించే అమ్మాయి లాగా బాగా చేసింది. సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయి గా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు నీ పల్లెటూరి క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు. చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిచించారు... సిరీస్ కి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. -
థియేటర్ల సంఖ్య తగ్గుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ ఎదుగుతోంది: రానా
టాలీవుడ్ హీరో రానా ప్రస్తుతం రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో వచ్చిన సీజన్కు అద్భుతమైన స్పందన రావడంతో సీజన్-2 తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హీరో రానా ఆసక్తికర కామెంట్స్ చేశారు. థియేటర్లు తగ్గుతున్న కాలంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన బాహుబలి, పుష్ప , ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చాయన్నారు.రానా మాట్లాడుతూ..'ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక విధంగా థియేటర్లు తగ్గుతున్నాయి. ఏడేమినిదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య ఇప్పుడు మూడు రెట్లు తగ్గిపోయాయి. దీనికి కారణం వినోదం అందించేందుకు చాలా ఎక్కువ మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో ఓటీటీ, యూట్యూబ్, మీ మొబైల్ ఫోన్ కూడా భాగమైంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ సినిమా ఎల్లప్పుడూ కొత్తదనాన్ని కనిపెడుతూనే ఉంది. ఇటీవల రిలీజైన కోర్ట్ మూవీ చిన్న సినిమా అయినా థియేటర్ల వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి రోజుల్లో కూడా కోర్ట్ మూవీ కథ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమం ఇతర వాటితో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో సినిమా షూటింగ్లకు అయ్యే ఖర్చు ముంబయి, ఢిల్లీతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. అది కూడా ఒక అడ్వాంటేజ్.' అని అన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలలో బంధుప్రీతి గురించి మాట్లాడుతూ.. ఏదేమైనా చివరికి మీరు కెమెరా ముందు నిలబడాలి, నటించాలి కదా' అని తెలిపారు. -
ఓటీటీలో 'సమంత' సినిమా.. ట్రైలర్ విడుదల
టాలీవుడ్ నటి సమంత నిర్మాతగా తెరకెక్కించిన మొదటి సినిమా 'శుభం' ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణంలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. తన తొలి ప్రయత్నంలోనే కొత్తతరం నటులతో తెరకెక్కించడమే కాకుండా ఆమె ఇందులో మాయ అనే అతిథి పాత్రలోనూ మెప్పించారు. మే 9న విడుదలైన శుభం మూవీని ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, వంశీధర్ గౌడ్, శ్రియ కొంతం, శర్వాణి లక్ష్మీ, షాలిని కొండెపూడి తదితరులు నటించారు. జియో హాట్స్టార్ వేదికగా జూన్ 13 నుంచి శుభం చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీకి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. వైజాగ్లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్నే రాబట్టింది. -
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
మలయాళ సీనియర్ హీరోయిన్ శోభన (Shobana) 'కల్కి 2898 ఏడీ' సినిమా (Kalki 2898 AD Movie)తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యే వచ్చిన తుడరుమ్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంది.అమితాబ్తో పాట షూటింగ్బచ్చన్ సర్ అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. నాతో కలిసి పనిచేసినవారిలో ఎంతో వినయ విధేయతలతో నడుచుకునే ఆర్టిస్ట్ ఆయన. గొప్ప ఆర్టిస్టుల్లో సాధారణంగా కనిపించే అంశం విధేయత. బచ్చన్ (Amitabh Bachchan) సర్ గురించి మీకో విషయం చెప్తాను. కొన్నేళ్ల క్రితం అహ్మదాబాద్లో ఆయనతో కలిసి ఓ పాట షూటింగ్లో పాల్గొన్నాను. నేను ఎన్నో దుస్తులు ఒకదానిపై ఒకటి వేసుకుని ఉన్నాను. బచ్చన్ సర్ దగ్గర కారవాన్ ఉంది. కానీ చాలామంది షూట్ చూసేందుకు రావడంతో ఆ ప్రాంతమంతా స్థంభించిపోయింది.చెట్టు వెనకాల..నా దుస్తులు మార్చుకునేందుకు నా కారవాన్ ఎక్కడుందని అడిగాను. ఇంతలో ఒకరు.. తను మలయాళ సినిమా నుంచే కదా వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతారు. చెట్టు వెనకాల దుస్తులు మార్చుకుంటుందిలే అని కామెంట్ చేశారు. బచ్చన్ సర్ దగ్గరున్న వాకీటాకీలో ఆ మాటలు వినిపించాయి. వెంటనే ఆయన నేనున్న చోటుకు వచ్చి ఎవరా మాట అంది? అని ఆగ్రహించాడు. నన్ను ఆయన కారవాన్లోకి తీసుకెళ్లాడు. నన్ను దుస్తులు మార్చుకోమని చెప్పి బయటకు వెళ్లిపోయాడు.కల్కి 2898 ఏడీలో..కల్కి సినిమాలో కూడా ఆయన ఎక్కువ బరువున్న దుస్తులు వేసుకున్నాడు. భారీ ప్రోస్తటిక్స్ (హెవీ మేకప్) వాడాడు. అంత బరువు మోస్తున్నా కూడా ఎవరైనా వస్తే లేచి నిల్చుని పలకరించేవాడు అని చెప్పుకొచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, శోభన మరియంగా, దీపికా పదుకొణె సుమతిగా, కమల్ హాసన్ యాస్కిన్గా నటించారు. ఈ చిత్రం గతేడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం వెయ్యికోట్లపైనే వసూళ్లు రాబట్టింది. కల్కి సీక్వెల్ ఈ ఏడాది డిసెంబర్లో పట్టాలెక్కనుంది. చదవండి: ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్ -
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
శ్రీను వైట్ల..ఒకప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఆ చిత్రం తర్వాత తెరకెక్కించిన బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో కొన్నాళ్ల పాటు ఆయన మెగాఫోన్ పట్టలేదు. చాలా కాలం తర్వాత ‘విశ్వం’తో మళ్లీ తిరిగి వచ్చాడు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ శ్రీను వైట్ల రీఎంట్రీకి పనికొచ్చింది.త్వరలో ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీను వైట్ల పర్సనల్ విషయం ఒకటి నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఆయన బాగా రిచ్ అట. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 2000 కోట్ల వరకు ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా దీనిపై శ్రీనువైట్ల స్పందించారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రూ. 2000 కోట్ల అధిపతి అన్న మాట అవాస్తవం. అంత రిచ్చెస్ట్ డైరెక్టర్ని నేను కాను. కానీ ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలపై వచ్చిన డబ్బుతో నేను భూములు కొన్నాను. వాటి రేట్ ఇప్పుడు బాగానే పెరిగింది. నాకు ఇతర అలవాట్లేవి లేదు. సినిమాలు తీయడం తప్ప వేరే ఏ పని రాదు. స్థలాల మీద తప్ప నాకు వేరే నాలెడ్జ్ లేదు. అందుకే వాటిమీదనే ఇన్వెస్ట్ చేశాను. పొలాలు కొన్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది’ అని అన్నారు. ఇక డబ్బుల విషయంలో చాలా పొదుపరి అట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నిజమే డబ్బుల విషయంలో నేను కాస్త జాగ్రత్తగానే ఉంటాను. అలా అని పిసినారిని కాదు. అవసరం మేరకు ఖర్చు చేస్తాను. డబ్బు కన్నా ఎక్కువ సినిమాకే ఇంపార్టన్స్ ఇస్తాను. నా వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాత నష్టపోలేదు. డిజాస్టర్గా నిలిచిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలోనూ నిర్మాతలు నష్టపోలేదు. నా డబ్బుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో.. నిర్మాత విషయంలోనూ అలానే ఉంటాను. చెప్పిన దానికంటే తక్కువ బడ్జెట్లోనే సినిమాను ముగిస్తాను’ అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు. -
ఈ జర్నీ అంత ఈజీ కాదు.. కలిసి ముందుకెళ్దాం.. నటి పెళ్లి ప్రపోజల్
బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్ (Shivakumar) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత గాఢంగా ప్రేమలో మునిగారు. కొంతకాలంగా కలిసే ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. శనివారం (జూన్ 8న) శివకుమార్ బర్త్డే. ఈ సందర్భంగా అండమాన్- నికోబార్లో అతడి పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని మోకాలిపై కూర్చుని ప్రపోజల్ చేసింది.బీచ్లో ప్రపోజల్..నెచ్చెలి ఎదురుగా వచ్చి చేయందుకోమన్నాక ఎవరైనా ఎలా ఆగుతారు. శివ్ కూడా అంతే.. సంతోషంతో గంతేశాడు. తప్పకుండా అని అంగీకారంగా హత్తుకున్నాడు. అప్పుడు ప్రియాంక సగం పెళ్లి అయిపోనట్లే అన్నట్లుగా ఓ ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. నా జీవిత భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు అధికారికంగా నువ్వు నావాడివి. ఎప్పటికీ నాతోనే ఉండాలి. మనం జంటగా ఎన్నో సాహసాలు చేద్దాం. కలిసి ఎదుగుదాం..ఇక్కడివరకు మన ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తర్వాత కూడా అంత ఈజీగా ఉండకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు దాన్ని ఉత్తమంగా మార్చుకునేందుకు ప్రయత్నిద్దాం. ఏయేటికాయేడు కాలాన్ని వృథా చేయకుండా జ్ఞాపకాలు కూడబెట్టుకుందాం. కలిసి ముందుకుసాగుదాం అని రాసుకొచ్చింది. ఇది చూసిన బుల్లితెర తారలు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్తో పాపులర్కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. జానకి కలగనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్తో పాపులర్ అయింది. మౌనరాగం సీరియల్లో శివకుమార్కు జంటగా నటించింది. అక్కడ మొదలైన పరిచయమే తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్న వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బిగ్బాస్ అయిపోగానే వివాహం చేసుకోవాలనుకున్నారు. గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్కాకపోతే అంగరంగ వైభవంగా, కొన్నిరోజులపాటు పెళ్లి వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకుందట ప్రియాంక. అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని, అది సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటామని గతేడాది శివకుమార్ బయటపెట్టాడు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదే వీరి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: చిన్నతనంలో చేదు అనుభవాలు.. అబ్బాయిల్ని నమ్మాలంటేనే.. -
బాలకృష్ణ బర్త్డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!
ఆధునిక టెక్నాలజీతో బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమాలను కలర్ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్కు కొత్త పాటని జత చేసే ట్రెండ్ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి అప్పట్లో హిట్ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. జూన్ 8 న ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్ ను రివీల్ చేసే సాంగ్ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్ కూడా చేసినా ఆ సాంగ్ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్ విజువల్స్ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్ రాయగా, స్వరాగ్ కీర్తన్ ఆలపించగా, భీమ్స్ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్ రోజు కలెక్షన్స్ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్ హౌస్ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా? -
'అఖండ 2' అప్డేట్తో పాటు NBK111.. మొదలైన తాండవం
నందమూరి బాలకృష్ణ 'అఖండ' తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2' నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. జూన్ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో సినిమా ప్రకటించాడు NBK111పేరుతో ఒక పోస్టర్ను విడుదల చేశారు.2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025 -
Devi Prasad: కెవ్వుమని అరవమంటే.. ‘కెవ్వు’ అని పడిపోయింది
సూపర్స్టార్ హీరోగా"గూఢచారి117" సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన "విమానం ఇంటీరియర్ సెట్" లో జరుగుతోంది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. బాలనటుడైన మహేష్బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు. ఫ్లైట్ ఎక్స్టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరిగింది. కృష్ణగారు డైరెక్టర్గారితో "ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు.నేను కావాలంటే తెల్లవారేవరకూ ఉంటాను" అని నవ్వుతూ చెప్పారు. ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్బాబు టకటకా డైలాగులు చెబుతుంటే కృష్ణగారు చూస్తూ భలే మురిసిపోతుండేవారు.కధప్రకారం టెర్రరిస్ట్ భానుప్రియ గ్రూప్ ఫ్లైట్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఒక్కొక్కరినీ చంపుతుంటారు. ఆ ప్రోసెస్ లో భాగంగా కొత్తగా పెళ్ళైన ఓ జంటలోని యువకుడిని చంపుతారు. మా మిత్రుడు పురం రాధాకృష్ణ(తర్వాతికాలంలో"చిరంజీవులు" సినిమాకి దర్శకత్వం వహించాడు) ఆ యువకుడి పాత్ర పోషిస్తే అతని జంటగా ఓ కొత్తమ్మాయి వేసింది. డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో "టెర్రరిస్ట్లు మీ ఆయన్ని కాల్చేశారు అది చూసి నువ్వు కెవ్వుమని అరిచి పడిపోవాలి"అని చెప్పారు. సెట్లో ఒకరిద్దరుగురకపెడుతున్నవాళ్ళను,నిద్రకుజోగుతున్నవాళ్ళను లేపి టేక్ అని అరిచాము. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే రాధాకృష్ణ బుల్లెట్ తగిలినట్లు అరిచి పడిపోతే అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల పైకెత్తి తన చెవులురెండూ మూసుకుని "కెవ్వు" అనే పదం పెద్దగా పలుకుతూ పడిపోయింది. అంతే దెబ్బకి సెట్లో అందరికీ నిద్రమత్తు ఒదిలిపోయింది. విరగబడి నవ్వారందరూ. మీరు చెప్పిందేకదా చేశాను ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లు చూసిందా అమ్మాయి. డైరెక్టర్ గారు "కెవ్వుమనిఅరవమంటే"కెవ్వూ"అనిఅనక్కర్లేదమ్మా.అరిచిపడిపోతే చాలు" అని మళ్ళీ యాక్షన్ చెప్పారు. మళ్ళీ సెకెండ్ టేక్ లో కూడా ఆ అమ్మాయి "కెవ్వూ" అంటూ దీర్ఘం తీయడంతో మళ్ళీ నవ్వులేనవ్వులు.మూడో టేక్ కి అర్ధమైందామెకి.టేక్ ఓకే అయ్యింది. అప్పటి నుండి ఆ అమ్మాయి "కెవ్వుకుమారి" అయ్యింది. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఆ అమ్మాయి తరువాత కనిపించలేదు. నేను దర్శకత్వం వహించిన "బ్లేడ్బాబ్జీ" సినిమాలో.... అల్లరి నరేష్ బృందం బ్యాంక్ రాబరీ చేసి పోలీసులనుండి తప్పించుకున్న ఆనందంలో వైజాగ్ బీచ్ ఒడ్డున లంగరేసివున్న ఓ చిన్న షిప్ లో మందుకొట్టి పడుకుని తెల్లారి లేచి చూసేసరికి షిప్ సముద్రం మధ్యలో ఉంటుంది.షాక్ అయ్యిన వాళ్ళు చేతులు చెవులకు ఆనించి "కెవ్వు" అని అరుస్తారు పెద్దగా. అలా అరిపించటానికి ఆనాటి కెవ్వు కుమారి "కెవ్వే" నాకు ప్రేరణ. ఆ "కెవ్వు" ఆనాడు సెట్లో అందరినీ ఎలా నవ్వించిందో అలాగే ఈ "కెవ్వు" ధియేటర్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెతకాలేగానీ మనచుట్టూ జరిగే సంఘటనల్లో, చుట్టూ ఉండే మనుషుల్లో ఎన్నో నవ్వులు దాక్కునివుంటాయి.మనిషికి కష్టమొచ్చినపుడు కష్టపడకా,దుఃఖం వచ్చినపుడు దుఃఖపడకా తప్పదు. కానీ మిగిలిన విలువైన సమయాన్నికూడా భారంగా ఎందుకు ఖర్చు చెయ్యటం? ఏమాత్రం "ఖర్చు"లేని "నవ్వు" ని ముఖానికెందుకు దూరం చెయ్యటం? సాధ్యమైనన్ని నవ్వుల్ని పోగేసుకుని బ్రతికేద్దాం. (దర్శకుడు, నటుడు దేవీ ప్రసాద్ స్వీయ అనుభవాలను నుంచి..) -
ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ డార్క్ కామెడీ మూవీ... 'సొప్పన సుందరి' ఎలా ఉందంటే?
టైటిల్: సొప్పన సుందరినటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ, చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్ తదితరులుడైరెక్టర్: ఎస్జీ ఛార్లెస్ఓటీటీ ప్లాట్ఫామ్: జియో హాట్స్టార్'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన బ్యూటీ 'ఐశ్వర్య రాజేశ్'(Aishwarya Rajesh). ఇప్పుడు తెలుగువారికి సుపరిచితమైన పేరు. గతంలో ఆమె పలు తమిళ చిత్రాల్లో మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రలో వచ్చిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ సొప్పన సుందరి (Soppana Sundari). 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.'సొప్పన సుందరి' కథేంటంటే..అహల్య (ఐశ్వర్య రాజేశ్) తన తల్లి, అక్కతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటుంది. తాను ఓ నగల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే అహల్యకు ఉహించని విధంగా రూ.10 లక్షల విలువైన లక్కీ డ్రాలో బహుమతిగా లభిస్తుంది. అయితే కారు దక్కిందని సంతోషించేలోపే అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ ఆ కారు అహల్య కుటుంబానికి దక్కిందా? నగలే కొనకుండా అసలు ఈ బహుమతి వీరికెలా వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే సొప్పన సుందరి చూడాల్సిందే.ఎలా ఉందంటే..వీకెండ్ వచ్చిందంటే చాలు. సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. అలాంటి వారిని కడుపుబ్బా నవ్వించే డార్క్ కామెడీ చిత్రం సొప్పన సుందరి. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశం కూడా ఇచ్చే మూవీ. అహల్య(ఐశ్వర్య రాజేశ్), అన్నయ్య దొర (కరుణాకరన్) పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో అహల్య తన అక్క పెళ్లి బాధ్యతను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రథమార్థంలో అహల్య కారు గెలుచుకోవడం, ఆ తర్వాత అహల్య అక్కకు కూడా పెళ్లి కుదురుతుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కారు కోసం అన్నయ దొర ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. అలా ఈ కథ చివరికీ పోలీస్ స్టేషన్కు చేరడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.పోలీసుల చేతికి కారు వెళ్లడంతో.. సెకండాఫ్ వచ్చేసరికి కథ మొత్తం కారు చుట్టే తిరుగుతుంది. ఆ కారును దక్కించుకునే క్రమంలో ఐశ్వర్య రాజేశ్.. ఆమె అన్నయ్య దొర తన టీమ్తో కలిసి చేసే ప్రయత్నాలు ఫుల్ కామెడీని తలపిస్తాయి. అయితే కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ లాజిక్లెస్గా ఉంటాయి. అయితే కామెడీ కథ కోణంలో చూస్తే అలా ఉంటేనే సెట్ అవుతుంది. అందుకే డైరెక్టర్ ఎలాంటి లాజిక్ లేకుండా కథను రాసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుడికి ఆ ఫీలింగ్ కలగదు. చివర్లో కారును అడ్డం పెట్టుకుని ఎస్సై చేసే దుర్భుద్దిని చూపిస్తూ డైరక్టర్ ఆ కోణంలోనూ ఆడియన్స్కు మేసేజ్ ఇచ్చారు. అయితే ఈ మూవీతో మనది కానీ వస్తువును బలవంతంగా తీసుకెళ్తే మనిషికి మనశ్శాంతి ఉండదనే సందేమిచ్చారు. కక్లైమాక్స్లో దురాశ దుంఖానికి చేటు అనే సామెతతో కథను ముగించాడు. కామెడీతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచి సందేశాన్నిచ్చే చిత్రం సొప్పన సుందరి. వీకెండ్లో మంచి కామెడీతో పాటు సందేశాత్మక చిత్రం చూడాలనుకుంటే సొప్పన సుందరి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..ఐశ్వర్య రాజేశ్ ఈ కథకు ప్రధాన బలం. తన పాత్రలో సహజంగా నటించి అభిమానులను మెప్పించింది. ఐశ్వర్య రాజేశ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలా తన పాత్రలో ఒదిగిపోయింది. ఐశ్వర్యకు తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్, ఆమె అన్నయ్యగా దొరగా కరుణాకరన్ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్లో సాగదీత సన్నివేశాలు కట్ చేయాల్సింది. నేపథ్య సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఫర్వాలేదనిపించాయి. -
పవన్ కల్యాణ్ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్ నారంగ్
‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్ కల్యాణ్) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్ వీక్ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎస్ఎఫ్సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్ నారంగ్ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్ రావు జె, ట్రెజరర్గా సత్యనారాయణ గౌడ్ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్గారు, ‘దిల్’ రాజు, సురేష్బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్ లీజ్... ప్లస్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన వీఎమ్ఎస్, క్యూబ్ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.‘టీఎస్ఎఫ్సీసీ’ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ 2, కోర్ట్’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టిక్కెట్ ధరలు, క్యాంటీన్ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్బాబు, కిరణ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
మహేశ్బాబు, అల్లు అర్జున్.. కొత్తగా మల్టీఫ్లెక్స్ నిర్మాణాలు ఎక్కడంటే?
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఏషియన్ గ్రూప్స్ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్ను (AMB) మహేశ్బాబు నిర్మించగా.. (AAA)పేరుతో అల్లు అర్జున్ రీసెంట్గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది.అయితే, (AMB) పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్ను మహేశ్ నిర్మించారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నై, గోవాలో కూడా మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఏషియన్ సినిమాస్తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్ను నిర్మించాలని ప్రిన్స్ మహేశ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తన సన్నిహితుల వద్ద చెప్పారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటికే హైదరాబాద్లోని అమీర్పేట్లో (AAA) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆయన వైజాగ్లో AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజాగ్లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారట. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.హైదరాబాద్లో అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ చెప్పారని మీడియా సర్కిల్లో ఒక వార్త ఉంది. భాగ్యనగరంలో ఇప్పటి వరకు నిజమైన IMAX థియేటర్లు లేవు. గతంలో హైదరాబాద్లో IMAX థియేటర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి లేవు. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్లో "PCX" అని పిలువబడే ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఇది 3D IMAX 70mm స్క్రీన్గా ఉండేది.., కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్కు తొలి ఐమాక్స్ థియేటర్ త్వరలో రానుంది. -
'కన్నప్ప' వేడుకలో ప్రభాస్పై మోహన్బాబు వ్యాఖ్యలు
విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి నటుడు మోహన్బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్ ప్రభాస్. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని ఆయన అన్నారు. కన్నప్ప సినిమాను థియేటర్స్లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని ఆయన సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని చెప్పుకొచ్చారు. -
డబ్బింగ్ డన్
హీరో అక్కినేని నాగార్జున ‘కుబేర’ సినిమాలోని తనపాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, జిమ్ సర్భ్ కీలకపాత్రపోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా తనపాత్రకి సంబంధించిన డబ్బింగ్ని నాగార్జున పూర్తి చేశారు. ఈ విషయాన్ని ప్రకటించి, డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, పుస్కూర్ రామ్మోహన్ రావు కలసి మాట్లాడుతున్న ఫొటోలని మేకర్స్ షేర్ చేశారు.‘‘ఈపాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల అద్భుతంగా తీర్చిదిద్దారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో గేమ్ ఛేంజర్గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన వచ్చింది. పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేర...’ వంటిపాటలు టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మాఫియా డాన్గా ప్రభాస్!
ప్రభాస్ మాఫియా డాన్పాత్రలో కనిపించనున్నారా? అంటే... వార్తల్లో ఉన్న ప్రకారం ‘స్పిరిట్’ సినిమాలో ఈపాత్రలో కనిపిస్తారట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసాఫీపర్పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్లా కనిపిస్తారని సమాచారం.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ‘స్పిరిట్’లో ప్రభాస్ క్యారెక్టర్లో త్రీ షేడ్స్ ఉంటాయట. వాటిలో ఒకటిపోలీసాఫీసర్ క్యారెక్టర్ అని, మరొకటి మాఫియా డాన్ అని భోగట్టా. మరి... ఇంకోపాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ చిత్రంలో ప్రభాస్పాత్రలో త్రీ షేడ్స్ ఉంటాయా? అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
చాప్టర్ వన్... చంద్ర
హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ నటించనున్న కొత్త సినిమాకు ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. డొమినిక్ అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘లోక: చాప్టర్ వన్ చంద్ర’ సినిమాపోస్టర్ను విడుదల చేసి, ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఈ సూపర్ హీరో ఫ్యాంటసీ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. కాగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ గెస్ట్ రోల్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మహేశ్ సినిమాలో..?
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా చోప్రా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఈ టీమ్లోకి మాధవన్ కూడా చేరినట్లు ఫిల్మ్నగర్ సమాచారం. ఆయన ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ మేరకు మాధవన్తో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టబోతున్నారని భోగట్టా.మరి... ఈ చిత్రంలో మాధవన్ భాగం అవుతారా? లేదా అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ని ఈ నెలలోనే మొదలు పెట్టనున్నారట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ ఈ అడ్వెంచరస్ ఫిల్మ్ను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తోపాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలుగులో ఇదే అత్యధిక బడ్జెట్ ఫిల్మ్ అని టాక్. -
సూపర్ హీరోలు వస్తున్నారోచ్
ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్... ఇలా హాలీవుడ్ సూపర్ హీరో కథలను భారతీయ ప్రేక్షకులు వీక్షించారు. అబ్బురపరచే వారి సాహసాలను శభాష్ అన్నారు. అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ కూడా వస్తున్నారోచ్. వెండితెరపై ఆడియన్స్ను ఆశ్చర్యపరచే అద్భుత విన్యాసాలు, సాహసాలతో ఆడియన్స్ వావ్ అనేలా కష్టపడటానికి రెడీ అవుతున్నారు. ఇక మన సూపర్ హీరో వివరాలపై ఓ లుక్ వేయండి.విశ్వంభర ప్రపంచంలో... ‘విశ్వంభర’ సినిమాలో సూపర్ హీరో మాదిరి యాక్షన్ చేయనున్నాడట దొరబాబు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ అండ్ యాక్షన్ మూవీ ‘విశ్వంభర’. కాగా ఈ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు దొరబాబుపాత్రలో చిరంజీవి కనిపిస్తారని, దొరబాబుగా విశ్వంభర ప్రపంచంలో సాగే కొన్ని సన్నివేశాల్లో సూపర్ హీరోలా యాక్షన్ సన్నివేశాలు చేస్తారని ఫిల్మ్నగర్ సమాచారం. పంచభూతాల (గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు) నేపథ్యం, విశ్వంభర అనే బుక్, సిస్టర్స్ సెంటిమెంట్తో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం.యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాక΄ోతే వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమౌతోందని తెలుస్తోంది. ఈ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ రానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర ప్రధానపాత్రల్లో ఆషికా రంగనాథ్, బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కనిపిస్తారు. కీలకపాత్రల్లో సురభి, ఇషా చావ్లా, ప్రవీణ్ కనిపిస్తారని తెలిసింది.వచ్చే ఏడాది స్టార్ట్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి మాస్ సినిమాలు తీసిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఓ సూపర్ హీరో కథను రెడీ చేశారు. లోకేశ్ కనగరాజ్ కథలోని సూపర్ హీరోగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కనిపించనున్నారు. ఈ సూపర్ హీరో సినిమాను ఇటీవల ఆమిర్ ఖాన్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనకు ఓ సూపర్ హీరో కథ చెప్పారని, లోకేశ్తో తాను ఈ సూపర్ హీరో మూవీ చేయనున్నానని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభిస్తామని ఆమిర్ ఖాన్ చెప్పారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తాను హీరోగా నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఆమిర్ ఖాన్. ఈ సినిమా తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా చేసేస్తారు లోకేశ్ కనగరాజ్. ఇలా... ఆమిర్–లోకేశ్ల ఇతర కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్కు వెళ్తుందని ఊహించవచ్చు. అలాగే లోకేశ్ దర్శకత్వంలోని తాజా చిత్రం ‘కూలీ’లో ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా, నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.ఆన్ ద వే! సిల్వర్ స్క్రీన్పై రవితేజను ఓ సూపర్ హీరోగా చూపించనున్నారు ‘మ్యాడ్’ డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే ఓ సూపర్ హీరో స్క్రిప్ట్ను రెడీ చేసుకున్నారు. ఈ కథను రవితేజకు వినిపించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట కల్యాణ్ శంకర్. ఈ స్క్రిప్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ ఓ కొలిక్కి వచ్చి, రవితేజకు కల్యాణ్ శంకర్ ఫైనల్ నరేషన్ ఇచ్చి, రవితేజ ఈ సినిమాకు ఓకే చెబితే, మూవీ సెట్స్పైకి వెళ్లినట్లే. అయితే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లడానికి మాత్రం కాస్త సమయం పట్టవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నూతన దర్శకుడు భాను భోగవరపుతో ‘మాస్ జాతర’ అనే మూవీ చేస్తున్నారు రవితేజ.ఆగస్టు 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘అనార్కలి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ కూడా చేస్తున్నారు రవితేజ. ‘మాస్ జాతర’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘అనార్కలి’ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. పైగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆల్రెడీ రవితేజ ప్రకటించారు. సో... ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే కల్యాణ్ శంకర్తో సూపర్ హీరో తరహా సినిమా చేసే ఆలోచన చేయవచ్చు రవితేజ. ఇక ఈ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాలు, రవితేజ ‘మాస్ జాతర’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థనే కల్యాణ్ శంకర్–రవితేజల సూపర్ హీరో సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో... సూపర్ హీరో ఆన్ ద వే అన్నమాట.సరికొత్త ప్రపంచంలోకి... ఆడియన్స్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు హీరో అల్లు అర్జున్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారట దర్శకుడు అట్లీ. ఈ సినిమాలో ఊహకందని లొకేషన్స్, వినూత్నమైన జీవరాసులు ఉంటాయట. పైగా ఈ చిత్రంలో అల్లు అర్జన్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ మూడుపాత్రల్లో ఒకపాత్ర సూపర్ హీరో తరహాలో ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఆల్రెడీ ఈపాత్రకు సంబంధించి విదేశీ సాంకేతిక నిపుణులు, ఫైటర్స్ నేతృత్వంలో అల్లు అర్జున్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలిసింది.ఇక ఈ చిత్రంలో కథ రీత్యా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్గా దీపికా పదుకోన్ నటించనున్నారు. దీపికపాత్రకు యాక్షన్ సీక్వెన్స్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓ వారియర్ తరహాపాత్రలో కనిపిస్తారామె. ఇంకా ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ భాగమయ్యారని, ఈ విషయంపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది చిత్రయూనిట్ ΄్లాన్ అని భోగట్టా.ఇటు అధీర... అటు మహాకాళి! ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా కొన్ని సూపర్ హీరో తరహా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హను–మాన్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో పవర్స్ ఉన్న యువకుడు హనుమంతుపాత్రలో కనిపించి, ఆడియన్స్ను మెప్పించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తారు. అయితే ఈ చిత్రంలోనూ హనుమంతుపాత్ర ఉంటుందట. ఇంకా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ‘అధీర’ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.ఈ సూపర్ హీరో సినిమాలో నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరి హీరోగా నటిస్తారు. ఇంకా ప్రశాంత్ వర్మ యూనివర్స్లో భాగంగానే ‘మహాకాళి’ అనే మూవీ రానుంది. విశేషం ఏంటంటే... ఇది ఫీమేల్ సూపర్ హీరో మూవీ అన్నమాట. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేశ్ దుగ్గల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎవరు మెయిన్ లీడ్ చేస్తారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాగా ప్రశాంత్ వర్మ షో రన్నర్గా ఉన్న ‘మహాకాళి’ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఓ కీలకపాత్రలో నటిస్తారు. గత ఏడాది దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు ప్రశాంత్వర్మ. ఈపోస్టర్పై మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో ఇన్ ది యూనివర్స్ అని ఉండటం విశేషం.పీపుల్స్ సూపర్ హీరో పీపుల్స్ సూపర్ హీరోగా చెప్పుకునే శక్తిమాన్ సరికొత్త పవర్స్తో వెండితెరపైకి రానున్నాడు. మూడు సంవత్సరాల క్రితమే ఈ ‘శక్తి మాన్’ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో శక్తి మాన్గా రణ్వీర్ సింగ్ నటిస్తారని, మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని, హీరోయిన్గా వామికా గబ్బి కనిపిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ‘శక్తి మాన్’ సినిమాలోని నటీనటులపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సిని మాలో రణ్వీర్ సింగ్ నటించడం లేదని, ఈ సినిమాకు ఓ నిర్మాతగానే ఆయన ఉంటారనే ప్రచారం కూడా బాలీవుడ్లో వినిపించింది. మరి... శక్తి మాన్గా ఎవరు కనిపిస్తారనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.సూపర్ యోధ ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా రూపొందుతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ ‘మిరాయ్’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో తేజ సజ్జా సూపర్ హీరో తరహాలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన, ఈ ‘మిరాయ్’ గ్లింప్స్ వీడియోతో ఈ విషయం స్పష్టమౌతోంది. అడ్వెంచరస్తోపాటు కొన్ని మైథలాజికల్ అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.మల్టీవర్స్ మన్మథన్ మలయాళ నటుడు నివిన్ పౌలీ ఓ సూపర్ హీరో ఫిల్మ్ చేస్తున్నారు. ‘మల్టీవర్స్ మన్మథన్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆదిత్యన్ చంద్ర శేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆనంద్, నితీరాజ్ ఈ సినిమాకు కో రైటర్స్గా పని చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా ప్రక టించారు. ‘‘ఇండియాస్ ఫస్ట్ మల్టీవర్స్ సూపర్ హీరో సినిమా ఇది’’ అని ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో నివిన్ పౌలీ ‘ఎక్స్’పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఈ సూపర్ హీరో ఫిల్మ్ మూడు నాలుగు భాగాలుగా రానుందని, తొలి భాగంగా ‘మన్మథన్ రైజింగ్’ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.కల నిజమైంది నటుడిగా ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘భాగమతి, కిలాడి, యశోద’ వంటి సినిమాల్లో ఉన్ని ముకుందన్ నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ మలయాళ నటుడు ఓ సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఆ మధ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉన్ని ముకుందన్. తాను చిన్నప్పట్నుంచి సూపర్ హీరో కథలు, వీరోచితపోరాటాలు చూస్తూ పెరిగానని, తన కలలో కొందరు సూపర్ హీరోస్ ఉన్నారని, వారిని వెండి తెరపైకి తీసుకువచ్చేందుకు తొలిసారి దర్శకత్వం వహించనున్నానని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. మిథున్ మాన్యువేల్ థామస్ కథ అందిస్తున్న ఈ సినిమాను గోకులమ్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు ఉన్ని ముకుందన్. ఈ కోవలో మరికొంతమంది సూపర్ హీరోలు వెండితెరపైకి రానున్నారు. – ముసిమి శివాంజనేయులు -
'రూ. 2 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని హీరోకు రూ. 13 కోట్లు ఇచ్చారు'
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బంద్ అంశంపై నూతనంగా ఎన్నికైన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శి శ్రీధర్ పలు వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరోలు తమకు దేవుళ్లు లాంటి వారని, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు. థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు కలిసి పెద్ద వివాధంగా మార్చారని, త్వరలోనే వారికి రిటర్న్ గిప్ట్ ఇస్తామని కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. థియేటర్స్ బంద్ అనేది తమ నిర్ణయం కాదని చెప్పుకొచ్చారు. అలాంటి ప్రకటన ఫిల్మ్ ఛాంబర్ చేయలేదన్నారు.పవన్ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడిందని శ్రీధర్ వాపోయారు. ప్రస్తుతం ఒక్కో హీరో రెండేళ్లకో సినిమా చేయడం వల్ల సింగిల్ థియేటర్ల పరిస్థితి మనుగడ కష్టంగా తయారైందని ఆయన అన్నారు. హీరోలందరికీ స్టార్ హోదా రావడానికి కారణం ఎవరు..? వారు ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హీరోలు కూడా అని ఆయన అన్నారు.రూ.10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరోకి తదుపరి సినిమా కోసం రూ.30 లక్షలు నిర్మాతలు ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఒక సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ రూ. 2కోట్లు. కానీ, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు.' అని ఆయన వాపోయారు. అయితే, శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు 'జాక్' సినిమా గురించి అంటూ నెటిజన్లు ఆపాదిస్తున్నారు. ఈ సినిమా కోసం సిద్ధూ జొన్నలగడ్డ రూ. 13 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని, సినిమా డిజాస్టర్ కావడంతో ఆ చిత్ర నిర్మాతకు కొంత తిరిగిచ్చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సినిమా పేరు చెప్పకపోవడంతో నెటిజన్లు మాత్రం వరుణ్ తేజ్, నితిన్ అంటూ ఎవరికితోచిన పేరు వారు చెప్పుకుంటూ పోతున్నారు.అయితే, అధ్యక్షుడు సునీల్ నారంగ్.. హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు తమకు లేదని చెప్పుకొచ్చారు. కానీ, హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలనేది తమ కోరిక అంటూ పేర్కొన్నారు. థియేటర్ల బంద్ వార్త విన్న తర్వాత తాను కూడా ఆశ్చర్యానికి లోనయ్యా అన్నారు. థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనే వారు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలామంది ఓనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. సింగిల్ థియటర్స్ యాజమాన్యం కోరుతున్న పర్సంటేజ్ విధానం త్వరలోనే పరిష్కారం అవుతుందని సునీల్ నారంగ్ చెప్పారు. -
అమెరికా నుంచి భారత్కు వచ్చి తుదిశ్వాస విడిచిన నటి
అలనాటి నటి విజయభాను (68) ఇక లేరు. అమెరికాలో స్థిరపడిన ఆమె ఏప్రిల్ నెలలో భారత్కు వచ్చారు. అయితే, అదే నెల 24న తీవ్రమైన ఎండల వల్ల ఆమెకు వడదెబ్బ సోకడంతో మరణించారు. ఆమె ఆకస్మిక మృతి పట్ల జయప్రద, సుమన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా నటి విజయభాను(Vijaya Bhanu) గురించి తన సోదరి డా. సింధూరి అమెరికా నుంచే పలు విషయాలను పంచుకున్నారు. ' మా అక్క ప్రేరణ వల్ల నేను కూడా అమెరికా వచ్చి స్థిరపడ్డాను. చాలామందికి ఆమె సాయం చేశారు. ఆమె జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకమైనది. అందుకే ఆమె జీవితంపై ఒక పుస్తకం రచించాలని కోరుకుంటున్నాను. జయప్రద అంటే మా అక్కకు చాలా ఇష్టం. చెన్నైలో జరిగిన మా అక్క దశదినకర్మకు కూడా ఆమె హాజరయ్యారు. భారత గడ్డపైనే తనువు చాలించాలని మా అక్కకు ఉన్న చివరి కోరిక.. ఇలా అనుకోకుండానే ఆమె ఆకాంక్ష తీరింది. కానీ, ఆమె లేని లోటు మాకు ఎవరూ పూడ్చలేరు.' అని ఆమె చెప్పుకొచ్చారు.అనంతపురం జిల్లాకు చెందిన విజయభాను సినిమా ఛాన్సుల కోసం చెన్నైకి వెళ్లి తన సత్తా చాటారు. 70వ దశకంలో అప్పటి టాప్ హీరోల సినిమాల్లో నటించారు. ఆరోజుల్లో రాజబాబు - విజయభాను జంటకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. సుమారు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయభాను కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే ఒక అమెరికన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాఓ స్థిరపడ్డారు. లాస్ ఏంజెల్స్ లో 'శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్' పేరుతో నృత్య కళాశాల స్థ్థాపించిన ఆమె వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. అమెరికాలో ఏదైనా సాయం కోసం వెళ్లిన తెలుగు వారికి ఆమె ఎంతో అండగా నిలబడ్డారని చెప్పుకుంటారు.1979లో విడుదలైన 'ఇది కథ కాదు' సినిమాకు గాను ఆమెకు నంది అవార్డు దక్కింది. చిరంజీవి, కమల్ హాసన్, జయసుధలతో కలిసి పోటీపడి ఆమె నటించారు. కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇందులో నటించిన జయసుధకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కగా.. ఉత్తమ సహాయ నటిగా విజయభానుకు దక్కింది. ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రంలో కూడా ఆమె మెప్పించారు. -
తెలుగు బ్యూటీ న్యూ బిగినింగ్స్.. పెళ్లికి రెడీ అన్న ఐశ్వర్య
దుబాయ్లోనే చిల్ అవుతున్న సమంత... నక్షత్రాలను అందుకుంటానంటూ పోస్ట్ఫుట్బాల్ గ్రౌండ్లో జెనీలియా దేశ్ముఖ్న్యూ బిగినింగ్స్ అంటూ గుడికి వెళ్లిన ఫోటోలు షేర్ చేసిన గౌరీప్రియడోసు పెంచిన రాశీ ఖన్నారెడ్ మిర్చిలా 3 రోజెస్ బ్యూటీ రాశీ సింగ్ పెళ్లికి రెడీ అంటున్న ఐశ్వర్య.. కాకపోతే ఎవరో పెళ్లో గెస్ చేయమన్న బ్యూటీ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Aishwarya pisse__Official (@aishwarya_pisse_) -
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
హిందీ బిగ్ బాస్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నానంటూ షాక్ ఇచ్చింది. మోడల్గా కెరీర్ను ప్రారంభించిన ఎడిన్ రోజ్ హిందీలో రెండు సినిమాలు చేసింది. ఆపై తెలుగులో రవితేజ నటించిన 'రావణాసుర' చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్లో మెరిసింది. ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న కొత్త సినిమా LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే, తాజాగా ఫిల్మిగ్యాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ 18తో భారీగా పాపులారిటీ తెచ్చుకున్న ఎడిన్ రోజ్, క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్తో తనకున్న అనుబంధాన్ని ఇలా చెప్పుకొచ్చింది. 'నా మనసులో, నేను ఇప్పటికే అతనిని ( శ్రేయాస్ అయ్యర్) వివాహం చేసుకున్నాను. నేను అతని పిల్లలకు తల్లిని అని నేను నమ్ముతున్నాను. అతను నాకు నచ్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అతను మంచి హైట్తో పాటు చామని ఛాయ రంగులో ఉంటాడు. ఎప్పుడూ తను గడ్డంతో కనిపిస్తూ మంచి కండలతో ఉంటాడు.భవిష్యత్లో భారత జట్టుకు కెప్టెన్ తప్పకుండా అవుతాడు. నా తండ్రిలాగే శ్రేయాస్ కూడా దక్షిణ భారతీయుడు.' అంటూ సంతోషంతో చెప్పుకొచ్చింది. తన తండ్రి ఒక తమిళయన్ అని చెప్పిన ఈ బ్యూటీ.. శ్రేయాస్ అయ్యర్ కూడా తమిళయన్ అంటూ పేర్కొంది. అయితే, ప్రస్తుతం వారు ముంబైలో స్థిరపడ్డారని చెప్పుకొచ్చింది. అయితే, ఇలా మనుసులో అనేసుకుంటే పెళ్లిళ్లు కావంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట అంటే తనకు చాలా ఇష్టమని ఎడిన్ రోజ్ చెప్పుకొచ్చింది. వారిద్దరూ ఆదర్శ దంపతులు అంటూ పేర్కొంది. 'వారు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తారు. వారు చాలా పరిపూర్ణ జంట, చాలా అందంగా ఉండాలని కోరుకుంటాను. వారికి ఎప్పుడూ చెడు జరగకూడదని నేను ఆశిస్తున్నాను. వారు ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి.' అని కోరుకుంది. View this post on Instagram A post shared by Edin Rose (@itsedinrose) -
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్బాబు, ఆర్.శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్బాబు నిర్మించారు. -
'ఢీ'.. దిల్రాజు సహా ఎవరూ కొనలేదు: మంచు విష్ణు
సూపర్ హిట్ కామెడీ చిత్రాల్లో 'ఢీ: కొట్టి చూడు' ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా, జెనీలియా హీరోయిన్గా నటించిన ఈ మూవీ 2007లో వచ్చింది. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఢీ మూవీ(Dhee Movie)ని నిన్న (జూన్ 6) రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఢీని మాత్రం పట్టించుకునేవాళ్లే కరువయ్యారు. ఆడియన్స్ లేక థియేటర్లు ఖాళీగా దర్శనిమస్తున్నాయి.నా బర్త్డే రోజు ఫస్ట్ షోఅయితే ఢీ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విష్ణు. కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రమోషన్స్లో విష్ణు మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య మనమంతా ఎక్స్ట్రార్డినరీ అనుకున్న సినిమాలు ఆడియన్స్కు రీచ్ అవకపోవచ్చు. కొన్నేమో రివర్స్లో జరుగుతాయి. 2006లో నా పుట్టినరోజైన నవంబర్ 23న ప్రసాద్ ల్యాబ్లో ఢీ ఫస్ట్ షో పడింది. తర్వాత అది 2007, ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదలైంది.ఆడటం కష్టమే..ఈ మధ్యలో దాదాపు వంద షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడ్డాయి. దిల్రాజు సహా ఎంతోమంది.. ఈ సినిమా యావరేజ్, పెద్దగా ఆడదు.. కష్టం! అని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చివర్లో నాన్న ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. తర్వాత మూవీ హిట్టయిన విషయం మీకు తెలిసిందే! అని విష్ణు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఢీ మూవీని మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించగా చక్రి సంగీతం అందించాడు.చదవండి: 90 ఏళ్ల వయసులో సినిమాలో ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో తల్లి! -
'హరిహర వీరమల్లు' ఫ్యాన్స్ కోసం మరో సినిమా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్లోనే సూపర్హిట్ చిత్రంగా నిలిచిన 'తొలిప్రేమ' (Tholiprema) 1998 జూన్ 24న విడుదలైంది. ఇప్పుడు మరోసారి రిలీజ్ కానుంది. ఈమేరకు ఒక పోస్టర్ సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించగా ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. జీవీజీ రాజు నిర్మాత. అయితే, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ పలుమార్లు రీరిలీజ్ అయింది. 'తొలిప్రేమ' విడుదలై 25 ఏళ్లు సందర్భంగా 2023లో చివరిసారిగా రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవన్ కల్యాణ్ నటించిన కొత్త సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో తెరపైకి తొలిప్రేమ సినిమాను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 14న తొలిప్రేమ రీరిలీజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ వైరల్ అవుతుంది. దానిని నిర్మాత ఎస్కేఎన్ కూడా షేర్ చేశారు. -
ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మరో హీరో... మహేశ్ బాబు భారీ స్కెచ్!
టాలీవుడ్లో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్గా నిలిచారు సూపర్స్టార్ కృష్ణ ఈ ప్యామిలీ నుంచి వచ్చిన వాడే. ఆ తర్వాత కృష్ణ వారసుడిగా మహేశ్ బాబు(Mahesh Babu) హీరో అయ్యాడు. తనదైన శైలీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ఇప్పుడు ఘట్టమేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేశ్ అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతోంది.ఈ కొత్త ప్రాజెక్టును దర్శకుడు అజయ్ భూపతి స్వయంగా హెల్మ్ చేయనున్నారని తాజా సమాచారం. RX 100 వంటి బ్లాక్బస్టర్తో తన ప్రతిభను చాటిన అజయ్ భూపతి, ఇటీవల థ్రిల్లర్ "మంగళవరం"తో మళ్ళీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం "మంగళవరం 2" ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే, మరో హై-ప్రొఫైల్ లాంచింగ్ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నాడు.ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ కేటాయించి వైజయంతి ఆర్ట్స్, అనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నారని తెలియడంతో చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.జయకృష్ణ ప్రస్తుతం లండన్లో ప్రొఫెషనల్ నటనా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. సోషల్ మీడియాలో ఇటీవల బయటకు వచ్చిన ఫోటోల ద్వారా అతని లుక్ పై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ను జయకృష్ణ బాబాయి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంచి లాంచ్ కోసం అవసరమైన నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలపై మహేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్ విడుదల
అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. -
'గుండమ్మ కథ'కు 62ఏళ్లు.. వీడియో విడుదల, ఈ విషయాలు తెలుసా?
చిత్ర పరిశ్రమ ఏదైనా సరే.. అందులో కొన్ని క్లాసిక్స్ సినిమాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు..? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా..? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ సినిమా విడుదలైంది ఇదే రోజు.. తాజాగా ఈ మూవీ 62 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు విశేషాలను గుర్తు చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.వారిద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.గుండమ్మ పాత్ర ఎంపిక కోసం..సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
పాన్ వరల్డ్ హీరోయిన్ రీఎంట్రీ..
మలయాళంలో హీరోయిన్గా రంగప్రవేశం చేసి, టాలీవుడ్, కోలీవుడ్లను దాటి ఉత్తరాది భాషల్లోనూ తన కంటూ స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న తెలుగింటి ఆడపడుచు రంభ. సర్గం (1992) అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ అదే ఏడాదిలో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఆపై తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్ వరల్డ్ కథానాయకిగా వెలిగారు. అలా రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణించిన రంభ చివరిగా తమిళంలో పెణ్ సింగం (2010) అనే చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అలా 100కు పైగా చిత్రాల్లో నటించిన ఈమె 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే పారిశ్రామిక వేత్తను పెళ్లాడారు. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన రంభ 2017 తరువాత నటనకు దూరమయ్యారు. కాగా 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. అయితే, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్.. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్ మరో పక్క సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. -
సినీ ఇండస్ట్రీలో సమస్యలు: 30 మందితో కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వెలవెలబోతున్న థియేటర్లు, నెలరోజుల్లోనే ఓటీటీ (OTT)లోకి సినిమాలు, సినిమా రిలీజ్ కష్టాలు.. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయి. వీటి పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటైంది. తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్.. అంతర్గత కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ విభాగాల నుంచి పది మంది చొప్పున సభ్యులుగా తీసుకుంది. మొత్తం 30 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. దీనికి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నారు.ఏ విభాగంలో ఎవరున్నారంటే?నిర్మాతల విభాగం: దిల్ రాజు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియడిస్ట్రిబ్యూటర్ విభాగం: భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరిఎగ్జిబిటర్ విభాగం: రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.చదవండి: నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా! -
మెడ భాగంపై ఉన్న టాటూ తొలగించిన సమంత.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. సినిమాలు ఉన్నా లేకున్నా..ఆమె మాత్రం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలు, ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్తో పంచుకుంటూనే ఉంటారు. అలాగే తను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సంస్థలను కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ సంస్ధకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ స్పెషల్ వీడియోలో సమంత ‘నథింగ్ టు హైడ్’ అని రాస్తూ.. నవ్వుతూ తిరిగి వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారగా..పలువురు నెటిజన్స్ సమంత టాటూపై కామెంట్ చేస్తున్నారు. ఆమె మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటు ఆ వీడియోలు కనిపించడం లేదు. దీంతో ‘వైఎంసీ టాటూని తొలగించావా సమంత?’ అని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మేకప్తో అది కవర్ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.వైఎంసీ టాటూ స్పెషల్ ఏంటి?సమంత హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటించారు. 2010లో విడుదలైన ఈ ప్రేమ కథాచిత్రం .. ఆ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి గుర్తుగా సమంత ‘వైఎంసీ’(ఏం మాయ చేసావే) అనే టాటుని వేయించుంది. ఈ టాటు తనకు చాలా స్పెషల్ అని సమంత పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటికీ సామ్ మాత్రం ఈ టాటుని తొలగించలేదు. తాజాగా ఈ టాటూ కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగా, నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడే సామ్ ఈ టాటూలు వేయించుకుంది. విడాకుల తర్వాత ఒక్కో టాటూని తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ‘చై’ అనే టాటూని తొలగించింది. వెబ్ సిరీస్.. సినిమాలతో బిజీ బిజీఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఇంట్రెస్టింగ్గా 'శంబాల' టీజర్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శంబాల'. సూపర్ నేచురల్ హారర్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అర్చన అయ్యర్, శ్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే పోస్టర్స్ రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు టీజర్ని విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న టీజర్.. అంచనాలు పెంచుతోంది.(ఇదీ చదవండి: బన్నీ-అట్లీ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే?)ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో శంబాల అనే ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు ఆది సాయి కుమార్ అదే పేరుతో సినిమాతో తీస్తున్నాడు. టీజర్ బట్టి చూస్తే.. అంతరిక్షం నుంచి ఓ ఉల్క లాంటి పదార్థం ఓ ఊరిలో పడుతుంది. అప్పటినుంచి ఆ ఊరిలో మనుషులు అందరూ వింతగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి చోటుకు హీరో వస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ గురించి ప్రకటించనున్నారు.ఈ సినిమాలో 'మొగలిరేకులు' ఫేమ్ ఇంద్రనీల్.. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు. యుగంధర్ ముని దర్శకుడు కాగా.. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ఈ జానర్ సినిమాలకు కాస్త ఆదరణ లభిస్తోంది. మరి 'శంబాల'.. ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న తమిళ హీరో.. పోస్ట్ వైరల్) -
బన్నీ-అట్లీ.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది
'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అని ఎదురుచూసిన అభిమానులకు.. కొన్నిరోజుల క్రితం సమాధానమిచ్చేశాడు. తమిళ దర్శకుడు అట్లీతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఓ అప్డేట్ వచ్చేసింది. హీరోయిన్ ఎవరనేది ప్రకటించారు.ప్రభాల్ 'కల్కి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణెని అల్లు అర్జున్కి జోడీగా ఎంపిక చేశారు. బన్నీకి ఈమెతో పనిచేయడం తొలిసారే. కానీ దర్శకుడు అట్లీ మాత్రం తన గత చిత్రం 'జవాన్'లో దీపికతో కలిసి పనిచేశాడు. ఇప్పుడు బన్నీతో చేయబోయే మూవీలోనూ ఈమెని హీరోయిన్గా ఎంపిక చేశాడు. ఈ మేరకు ఓ వీడియోని రిలీజ్ చేశారు.గత కొన్నిరోజుల నుంచి దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తోంది. 'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా ఈమెని అప్రోచ్ అయ్యాడు. దాదాపు సెట్ అనుకునే టైంలో ప్రాజెక్ట్ నుంచి దీపిక బయటకొచ్చింది. ఈ క్రమంలోనే స్టోరీని లీక్ చేయడం లాంటివి జరిగేసరికి సందీప్ వంగా.. ఈమె పేరు చెప్పకుండా పరోక్షంగా ట్వీట్ పెట్టాడు. మరోవైపు 8 గంటల షిఫ్ట్ కారణంగా 'కల్కి 2' నుంచి కూడా ఈమె తప్పుకోనుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇలా కాంట్రవర్సీ పుకార్లకు కేరాఫ్ అయిన దీపిక.. బన్నీ-అట్లీ మూవీ విషయంలో ఏం చేస్తుందో చూడాలి?దీపిక స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ.. కెరీర్ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది. పద్మావత్, రామ్ లీలా తదితర చిత్రాలు ఈమె చాలా గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక తనతో పాటు కలిసి సినిమాలు చేసిన రణ్వీర్ సింగ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకుంది కానీ ఇప్పుడు మళ్లీ బిజీ కానుంది. -
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
తెలుగులో కొన్ని సినిమాలకు రిపీట్ వాల్యూ ఉంటుంది. అంటే ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. అలాంటి వాటిలో రవితేజ 'వెంకీ' ఒకటి. ఇది రిలీజై దాదాపు 20 ఏళ్లు దాటేసింది. కానీ ఇప్పటికీ ఈ మూవీలోని కామెడీ సీన్స్ని చూసి ఆడియెన్స్ భలే ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లలో మీరు కూడా ఒకరు అయ్యిండొచ్చు. కానీ దర్శకుడు ఓ విషయంలో మాత్రం మాయ చేశాడు. ఇన్నేళ్ల తర్వాత దాని గురించి బయటపెట్టాడు.(ఇదీ చదవండి: మూడుసార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని పవన్ హామీ: డైరెక్టర్)దర్శకుడు శ్రీనువైట్ల రేంజ్ పెంచిన సినిమా 'వెంకీ'. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని ట్రైన్ కామెడీ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయానికొస్తే.. ఇదే శ్రీనువైట్ల తీసిన 'ఢీ' మూవీ రీ రిలీజ్ అయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పటి సంగతులు చాలానే చెప్పారు. పనిలో పనిగా 'వెంకీ' గురించి ప్రస్తావన వచ్చేసరికి ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని విషయాన్ని బయటపెట్టారు.వెంకీ సినిమాలో హీరో పేరు కూడా అదే. కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శీను అనే పేరుతో తీసేశారు. చివరకు టైటిల్ కూడా శీను అనే పెడదామని అనుకున్నారట. కానీ చివర్లో దర్శకుడికి ఎందుకో 'వెంకీ' అని టైటిల్ పెడదామనిపించింది. ఇదే విషయాన్ని రైటర్తో మాట్లాడితే.. వేరే హీరో పేరు ఎందుకు పెట్టడం? రవితేజ అని టైటిల్ పెట్టేద్దాం అని సూచించారట. కానీ హీరో రవితేజ 'వెంకీ' టైటిల్ వైపు మొగ్గు చూపడంతో చివరగా అదే ఫిక్సయ్యామని, డబ్బింగ్లో శీను అనే పేరుని కాస్త వెంకీగా మార్చాం అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
మూడు సార్లు సినిమా చూశారు.. మరో మూవీ చేస్తానని హామీ: డైరెక్టర్
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా చేశారు. దాదాపు ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. సోషల్ మీడియాలో మాత్రం వేరే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాకు బయ్యర్లు దొరకట్లేదని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు పక్కనబెడితే మూవీని అధికారికంగా వాయిదా వేసినా సరే ప్రమోషన్స్ మాత్రం ఆపట్లేదు. తాజాగా మచిలీపట్నంలో ఈవెంట్ నిర్వహించారు.మచిలీపట్నం బీచ్ ఒడ్డున 'హరిహర..' ఈవెంట్ శుక్రవారం సాయంత్రం జరిగింది. దీనికి హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ హాజరయ్యారు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతికృష్ణ ఏమన్నారంటే.. 'పవన్ కల్యాణ్.. ఒక్కసారి కాదు ఈ సినిమాని మూడు సార్లు చూశారు. గంటపాటు నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చారు. అసురన్ అనే పాటని అయితే ఏకంగా 500 సార్లు విన్నారు' అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మాట్లాడటం బాగానే ఉంది. కాకపోతే రియాలిటీలో చూసుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమాకు మార్కెట్లో పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పుడెప్పుడో రావాల్సిన ఈ మూవీ.. దాదాపు 11-12 సార్లు వాయిదా పడింది. దీంతో పవన్ అభిమానులే ఈ చిత్రం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదనిపిస్తుంది. అలాంటిది పవన్.. తన సినిమాని మూడుసార్లు చూడటం, మరో మూవీ చేస్తానని దర్శకుడికి మాటివ్వడం అంటే నెటిజన్లు సందేహపడుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?డైరెక్టర్ జ్యోతికృష్ణ విషయానికొస్తే.. నిర్మాత ఏఎం రత్నం కొడుకు. చాన్నాళ్లుగా డైరెక్షన్ చేస్తున్నాడు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కేడీ, ఊ ల లా లా అనే తమిళ చిత్రాలు చేశారు. తెలుగులో గోపీచంద్తో 'ఆక్సిజన్', కిరణ్ అబ్బవరంతో 'రూల్స్ రంజన్' తీశారు. ఇవన్నీ థియేటర్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు కూడా క్రిష్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. మరి 'హరిహర..'తోనైనా హిట్ కొడతారేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోనున్న 'సూర్య'
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, సూర్య కథానాయకుడిగా వాడివాసల్ చిత్రం చేయడానికి చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. అయితే, వెట్రిమారన్ తన తర్వాతి సినిమాను హీరో శింబుతో తెరకెక్కించాలనే ప్లాన్లో ఉన్నారట.కోలీవుడ్ హీరో శింబు గత రెండేళ్లకు పైగా ఎలాంటి చిత్రంలో నటించలేదు. తాజాగా కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్లైఫ్ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్ చిత్రం రాంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్ అయినట్లు తెలిసింది. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్న్స్ సంస్థ నిర్మించనుందని టాక్.. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
'దీపికా పడుకోణె'కు గోల్డెన్ ఛాన్స్!
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్ 7న ఒక అప్డేట్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకుని, అల్లు అర్జున్తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్ ఇస్తామని పోస్టర్ను రిలీజ్ చేసింది. బహుశా హీరోయిన్ గురించి ప్రకటన చేస్తారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.అల్లు అర్జున్- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ 'దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్ శనివారం అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్, సూపర్హీరో అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ పలు లుక్స్ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ఫిక్షన్ సినిమాగా ఇది రానున్నట్లు ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.When Elegance meets Magic! ✨ Revealing Tomorrow 11 AM❤️🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/AlG9DwRQSR— Sun Pictures (@sunpictures) June 6, 2025 -
కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగార్జున
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్ షేర్ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జూన్ 8న రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.అఖిల్ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..' నాగార్జున పోస్ట్ చేశారు.అఖిల్ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్లో అఖిల్-జైనబ్ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025 -
'గీతగోవిందం' నటి గ్రాడ్యుయేషన్.. ధనశ్రీ వర్మ ట్రెక్కింగ్
మత్తెక్కించేలా చూస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీలఫుడ్ గురించి నివేదా థామస్ ఇంట్రెస్టింగ్ పోస్ట్పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్ షాజన్ పదమ్సీట్రెక్కింగ్ చేస్తూ అందాలన్నీ చూపిస్తున్న ధనశ్రీ వర్మరిలాక్స్ మోడ్లో అక్కినేని వారి కోడలు శోభితఇంటీరియర్ డిజైన్లో మాస్టర్స్ పూర్తి చేసిన నటి అనీషాజిమ్లో తెగ కష్టపడుతున్న పూరీ ఫ్రెండ్ ఛార్మీ View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Aneesha Dama (@aneeshadama) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
మొదలైన 'బ్యాచిలర్స్ ప్రేమకథలు'
యస్.యం. 4 ఫిలిమ్స్ బ్యానర్పై గీత సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీనటులుగా యం.యన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం "బ్యాచిలర్స్ ప్రేమ కథలు". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు.చిత్ర దర్శక, నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. 'ఇంతకుముందు నేను తీసిన "కాలం రాసిన కథలు" సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్గా 'బ్యాచిలర్స్ ప్రేమ కథలు' సినిమా తీస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను.ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి ఇదే ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.' అని అన్నారు. -
నార్నే నితిన్ ఫస్ట్ సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రివ్యూ
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో ఆయనకంటూ గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru). జూన్ 6న థియేటర్స్లోకి వచ్చేసింది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. అయితే, తాజాగా విడుదలైన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల వరకు తన కుమారుడు సిగరెట్ ముట్టడని, ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమాకు ప్రధాన బలం నార్నే నితిన్, దర్శకుడు సతీశ్ వేగేశ్న అని చెప్పవచ్చు. నార్నే నితిన్ కెరీర్లో మొదటి చిత్రంగా విడుదల కావాల్సిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు తన నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 'తీవండి' మూవీనే దర్శకుడు తెలుగులో రీమేక్ చేశారు. కథలో హీరో పుట్టగానే సిగరెట్ పొగ వల్ల ప్రాణాలు పోసుకున్నట్లు చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆత్రేయపురం బ్యాక్డ్రాప్ అదిరిపోతుంది. కానీ, దానిని తెరపై చూపించడంలో దర్శకుడు అక్కడక్కడ కాస్త ఇబ్బందిపడ్డాడు అని చెప్పవచ్చు. ఈ కథలో హీరో పాత్ర చాలా బలంగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన పాత్రలపై అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది. అయితే, కేవలం హీరో పాత్రకే ఎక్కువ సమయం ఇవ్వడంతో కాస్త బోర్గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది. ఈ కథ చాలా సినిమాలలో చూసిందే కూడా.. అయితే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంతో సెకండాఫ్ అదిరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, అంతగా మెప్పించలేదని చెప్పవచ్చు. ఇరు కుటుంబాలతో పాటు హీరో, హీరోయిన్ పడే సంఘర్షణ ఫర్వాలేదనిపించినప్పటికీ... ప్రతి సీన్ మనం ముందే అంచనా వేయవచ్చు. ప్రీక్లైమాక్స్లో ఫ్యామిలీ ట్రాక్లోకి కథ వెళ్తుంది. తండ్రి సవాల్ కోసం హీరో తీసుకున్న నిర్ణయం.. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదని కృష్ణమూర్తి పడే పాట్లు కొన్ని మెప్పిస్తాయి. ఫనల్గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని సినిమాగా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మిగిలిపోతుంది.ఎవరెలా చేశారంటే..నార్నే నితిన్కు ఇదే మొదటి సినిమా.. ఆపై కథలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయినప్పటికీ రాజా పాత్రలో బాగానే మెప్పించాడు. గత మూడు సినిమాల్లో అతనిలోని కామెడీ యాంగిల్ చూసి ఉంటారు. ఇందులో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను సులువుగా పండించాడు. హీరోయిన్గా సంపద చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్రమేరకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో న్యాయం చేసింది. రావు రమేశ్, నరేశ్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ అదరగొట్టేశారు. కైలాస్ మేనన్ అందించిన సంగీతం అక్కడక్కడ సౌండ్ చేస్తుంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమెరామెన్ పల్లెటూరి అందాల్ని తెరపై బాగానే చూపించారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. -
‘బద్మాషులు’ మూవీ రివ్యూ
టైటిల్ : బద్మాషులునటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులుదర్శకత్వం-శంకర్ చేగూరినిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్సంగీతం- తేజ కూనూరుసినిమాటోగ్రఫీ- వినీత్ పబ్బతిఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాలు నేడు(జూన్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్ కారంపురి) స్నేహితులు. ఇద్దరు పని దొంగలు...మందు తాగనిదే ఉండలేరు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. నిత్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరిని ఊరంతా ‘బద్మాషులు’ అని తిట్టినా పట్టించుకోరు. డబ్బుల కోసం తిరుపతి తన కస్టమర్ల డ్రెస్లను అమ్ముకుంటే.. ముత్యాలు ఇంటింటికెల్లి హెయిర్ కటింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతుంటారు. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్లో పెన్షిన్ వైర్ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్లో కూడా వీరి బుద్ది మారదు. పోలీసుల పేరు చెప్పి స్టేషన్కు వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి తాగుతుంటారు. చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వారిని వదిలేస్తారు. అదే సమయంలో స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. ఆ కేసు వీరిద్దరిపైకే వస్తుంది. అసలు ఆ కంప్యూటర్ దొంగిలించిదెవరు? అది ఎక్కడ ఉంది? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్(మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు చేసిన సహాయం ఏంటి? అసలు తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్లి సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. పల్లెటూరికి చెందిన ఇద్దరి తాగుబోతుల చుట్టూ కథనం సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజజీవితంతో మన ఊరిలో వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి. చివరితో ఓ మంచి సందేశం కూడా ఇచ్చారు. అయితే దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొన్ని చోట్ల ‘జాతి రత్నాలు’ ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగుతుండడంతో నిడివి తక్కువ అయినా.. సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. డ్రెస్ కుట్టమని వస్త్రం ఇస్తే..దాన్నే అమ్ముకొని తాగే ట్రైలర్ ఒకవైపు.. సగం సగం షేవింగ్ చేస్తూ.. మధ్యలోనే బార్ కెళ్లే బార్బర్ మరోవైపు.. వీరిద్దరి పాత్రల పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి పాత్రలతో మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా..దర్శకుడు రోటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అవి కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లేవరకు కథనం సోసోగానే సాగుతుంది. స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్ రొటీన్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా మళ్లీ దొంగతనం చుట్టే తిరగడంతో బోరింగ్గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్ ఈ చిత్రంతో హీరోగా మారి.. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వులు పూయించాడు. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక ట్రైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా నేచులర్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆయన వేసే సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేశ్ ఇద్దరు తెరపై నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించారు. మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
స్టార్ హీరోయిన్ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్
ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు. అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముంబైకి చెందిన సిమ్రాన్ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలో దీపక్ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. అందులో సీరియల్స్తో పాటు పలు చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ఇప్పుడు అధీప్ గ్రాడ్యేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్ పేర్కొన్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టింది. 1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. సౌత్లో చిరంజీవి,రజనీకాంత్,కమల్ హాసస్, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా మెప్పించింది. View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్ని ఎలా మారుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
హరిహర వీరమల్లు విడుదల లేనట్లే.. ప్రకటించిన నిర్మాత
జూన్లో రిలీజవుతున్న పెద్ద సినిమాల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu Movie) ఒకటి. జూన్ 12న ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదని చాలారోజులగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. ఇప్పటికే పలుమార్లు సినిమాను పోస్ట్పోన్ చేసిన చిత్రబృందం తాజాగా మరోసారి మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ఏ.ఎం రత్నం వెల్లడించాడు.వాయిదా తప్పట్లేదుజూన్ 12న సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అది కుదర్లేదని పేర్కొన్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పడం లేదన్నాడు. హరిహర వీరమల్లును మరింత గొప్పగా మలచాలన్నదే తమ ప్రయత్నం అని, ప్రతి ఫ్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని వివవరణ ఇచ్చాడు. దీనికోసమే మరికాస్త సమయం అవసరమవుతుందని, అందరి ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చాడు.ఎప్పటికీ గుర్తుండిపోయేలా..ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నాడు.. త్వరలో ట్రైలర్తోపాటు కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాం అని తెలిపాడు. హరిహర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్లోకి సోషల్ మీడియా సెన్సేషన్!
హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్లో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఉండటం విశేషం.హాలీవుడ్ హీరోతో పనిచేసిన సెన్సేషనల్ బ్యూటీసోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. మ్యాడ్నెస్ మొదలైందిఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్లుక్ పోస్టర్తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా? -
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు జైనబ్ రవ్జీతో ఒక్కటయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్గా ఉంటారు. ఎంగేజ్మెంట్ జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్)అఖిల్ భార్య జైనబ్ రవ్జీ.. ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమెకు జైన్ రవ్జీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు.జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం. అలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్ల పెద్ద. అఖిల్ ప్రస్తుత వయసు 31 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 అని తెలుస్తోంది. జైనబ్ కూడా గతంలో 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే హిందీ సినిమాలో నటించిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
సైలెంట్గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' ... చాలామందికి ఫేవరెట్ సినిమా. ఇందులో రామ్ చరణ్ సరసన జెనీలియా నటించగా.. మరో హీరోయిన్గా షాజన్ పదమ్సీ చేసింది. తర్వాత తెలుగులో రామ్ సరసన 'మసాలా' మూవీ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈమెని గ్రాండ్గా ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరంటే?మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్కి పరిచయం. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: సడన్గా నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్' శుభశ్రీ)గత రెండు మూడు రోజుల నుంచి హల్దీ, సంగీత్ తదితర కార్యక్రమాలతో పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు జూన్ 5న అంటే గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. జూన్ 7న అంటే శనివారం.. రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే షాజన్ పదమ్సీ పెళ్లికి సంబంధించిన ఫొటోలని తన్ ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేస్తోంది.మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2009 నుంచి సినిమాలు చేస్తోంది. రాకెట్ సింగ్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా మారింది. తర్వాత కనిమొళి, ఆరెంజ్, దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2, మసాలా, సాలిడ్ పటేల్స్, పాగల్ పన్ నెక్స్ట్ లెవల్ తదితర చిత్రాల్లో నటించింది. సూపర్ ధమాల్, హై జానూన్ లాంటి షోలు కూడా చేసింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అంటే పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపిక లేనట్లేనా?
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?దీపికా స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.బ్లాక్బస్టర్ కల్కిస్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్.. ఇవి రెండూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ నిర్మించాడు. గతేడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు -
కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఆవేదన వ్యక్తం చేశాడు. థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైతే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్లు కనిపించబోవని హెచ్చరించాడు. శుక్రవారం నాడు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా టాలీవుడ్లో నెలకొన్న సంక్షోభం గురించి ఓ ట్వీట్ చేశాడు.ఈ ట్రెండ్ కొనసాగితే..ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పర్సంటేజీ సిస్టం గురించి మాట్లాడుకునేబదులు... ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలా? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి? అనేది ఆలోచించాలి. ఇక సినిమా రిలీజైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో 90% సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి.పెద్ద హీరోలు ఆలోచించాలిఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో సినిమా, మూడేండ్లకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలోనే చాలామంది థియేటర్ యజమానులు వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. పెద్ద హీరోలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సింగిల్ స్క్రీన్స్ మూతపడి కేవలం మల్టీప్లెక్స్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది అని రాసుకొచ్చాడు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025 చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ బొమ్మ.. ఎక్కడంటే?
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.సింగిల్ సినిమా కథేంటంటే?విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్గా మారాయి. దుబాయ్లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు. ప్రియురాలు జైనబ్ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్కు హాజరయ్యారు. సెలబ్రిటీల హాజరుమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ, రామ్చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.అఖిల్ ఎంగేజ్మెంట్అఖిల్- జైనబ్ల నిశ్చితార్థం గతేడాది నవంబర్లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య (Naga Chaitanya)- శోభితల పెళ్లి పనులు మొదలుకావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. చై-శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్లో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్ను ప్రదర్శించారట! మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట! ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. గతంలో పెళ్లి క్యాన్సిల్మరి అఖిల్- జైనబ్లు పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే ఒకరికొకరు పరిచయమయ్యారా? అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ గతంలో.. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్తో ప్రేమలో పడ్డాడు. 2016లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి కాబోతారనుకునేలోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే సినిమా చేస్తున్నాడు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Director #PrashanthNeel at #AkhilAkkineni's wedding.#NTRNeelpic.twitter.com/D8jMH6gJHx— Milagro Movies (@MilagroMovies) June 6, 2025Yuvasamrat #NagaChaitanya at the baraat ceremony of his brother @AkhilAkkineni8!📸#AkhilAkkineni #Nagarjuna pic.twitter.com/wVUqswOfVV— shiva (@shivshankar68) June 5, 2025#TFNExclusive: Yuvasamrat @chay_akkineni and @sobhitaD snapped at #AkhilAkkineni & #ZainabRavdjee's wedding! 📸😍#NagaChaitanya #SobhitaDhulipala #SoChay #TeluguFilmNagar pic.twitter.com/1uCz8xUcym— Subhodayam Subbarao (@rajasekharaa) June 6, 2025చదవండి: విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే! -
చలో డెహ్రాడూన్
డెహ్రాడూన్ వెళ్తున్నారట చిరంజీవి అండ్ టీమ్. చిరంజీవి హీరోగా అనిల్ రాపూడి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని మరో హీరోయిన్ పాత్రలో కేథరిన్, ఓ కీలకమైన అతిథి పాత్రలో వెంకటేశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.చిరంజీవితో పాటు ఈ సినిమాలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ డెహ్రాడూన్, ముస్సోరి లొకేషన్స్లో జరుగుతుందని, అక్కడ ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు సాగుతుందట. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.