NTR
-
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, తన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ అసభ్యంగా పోస్టులు పెట్టిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన రిట్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు.తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ అంబటి ప్రశ్నించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
కన్నీరే పారు
చివరి ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకమే! చంద్రయ్య డ్రెయిన్లో మేట వేసుకుపోయిన గుర్రపుడెక్కబుడమేరు డ్రెయిన్లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ పేరుతో ఏటా కాంట్రాక్టు తీసుకోవడమే కానీ పనులు చేయడం లేదు. పుట్టగుంట వద్ద నుంచి కొల్లేరు వరకు ఒక్క తూడు మొక్క తీసిన దాఖలాలు లేవు. అడ్డగోలుగా సగానికి సగం టెండర్లు దాఖలు చేసి పనులు చేయకుండానే బిల్లులు చేజిక్కించుకుంటున్నారు. దీని వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. – సత్యనారాయణ, రైతు ఎల్ఎన్పురం సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పంట కాలువలు గుర్రపుడెక్క, వ్యర్థాలతో పూడుకుపోయి అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి పూడికతీతలు లేవు. కాలువ చివరి భూములకు నీరు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం గుర్రపుడెక్కపై క్రిమిసంహారక మందులు పిచికారీ చేయటంతో సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో పూడికతీతలు చేపట్టాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటికి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి. – వి.మరియదాసు, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం ఇప్పటికే పరిపాలన అనుమతుల కోసం కాడ్కు ప్రతిపాదనలు పంపాం. ఆమోదం లభించిన వెంటనే పనులను నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపడతాం. కాలువలకు తాగునీరు విడుదల చేసి నిలిపివేసిన తర్వాత ఈ పనులు చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. – మోహనరావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఉమ్మడి కృష్ణా జిలా్ల సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో పనులు చేయక పోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక అల్లాడిపోతున్నారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 6.79 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అయితే కాలువలు, డ్రెయిన్లకు సకాలంలో పూడికతీత, మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ఏడాది(2024–25) పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలోనూ జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. అయితే ఈ పనుల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం తక్కువకు పనులు దక్కించుకున్నారు. వీరంతా కాలువలు, డ్రెయిన్ల పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. నిర్వహణను గాలికి వదిలేశారు. కాలువలకు జూన్లోనే నీరు విడుదల చేసే అవకాశం ఉండటంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామమాత్రంగా పనులు చేసి, బిల్లులు దండుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సారైనా చేస్తారా? 2025–26కు సంబంధించి కృష్ణా డెల్టా ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, సాగునీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ అధికారులు 568 పనులు రూ.26.03కోట్లతో కాడ్(కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ఇంకా పనులకు ఆమోదం లభించలేదు. అయితే ఈ ఏడాది నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగటంతో వారి ఆధ్వర్యంలో పనులు సాగనున్నాయి. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే పనులు కట్టబెట్టనున్నారు. పనులు సకాలంలో మంజూరు చేసి, పరిపాలనా అనుమతులు ఇవ్వకపోతే.. నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అధ్వానంగా డ్రెయిన్లు.. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగటంతో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగి, రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వర్షం వస్తే రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో డ్రెయిన్లు పూడికతీయకపోవడం వల్ల అధ్వానంగా మారాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర్ డ్రెయిన్లు దారుణంగా ఉన్నాయి. లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూడు దట్టంగా పేరుకుపోయి మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడతారు. అధ్వానంగా కాలువలు, డ్రెయిన్లు పేరుకుపోయిన తూటికాడ, గుర్రపుడెక్క వర్షం వస్తే పంట పొలాల మునక ఈ ఏడాది నిర్వహణ పేరిట 568 పనులకు రూ. 26 కోట్లతో ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపాం..ఈ ఏడాది(2025–26) కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు.. డివిజన్ పనుల విలువ సంఖ్య (రూ.కోట్లలో) కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజి విభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 568 26.03 -
బెదిరేది లేదు.. వైఎస్సార్ సీపీని వీడేది లేదు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా.. మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టినా.. భయ పడేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. బందరులోని తన నివాసం వద్ద ఆయన మంగళవారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వినియోగించకుండా రాజకీయంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేసేందుకు వాడుతోందని విమర్శించారు. బియ్యం సరఫరా కేసులో తమకే పాపం తెలియదని పోలీసులు, న్యాయవ్యవస్థకు తెలిసినప్పటికీ, ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కోర్టులో వారు మోపిన చట్టం ఈ కేసులో చెల్లదని న్యాయమూర్తులు చెప్పినప్పటికీ వేధింపులే లక్ష్యంగా హైకోర్టులో తన భార్య బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారన్నారు. క్రిమినల్ కేసులు ఎలా వేస్తారు? పౌరసరఫరాలశాఖ ఏర్పడినప్పటి నుంచి బియ్యం సరఫరాల్లో జరిగిన అక్రమాలపై 6ఏ కేసులు నమోదు తప్ప ఇంత వరకు ఎవరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని పేర్ని నాని అన్నారు. సాక్షాత్తూ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో 20 వేల టన్నుల బియ్యం అక్రమ రవాణాను పట్టుకున్నప్పుడు కూడా 6ఏ కేసు తప్ప క్రిమినల్ కేసులు పెట్టలేదని గుర్తుచేశారు. కేవలం తమను వేధించడానికే కక్షతో దిగజారుడుతనంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో వేధింపులే పై చేయి సాధిస్తే.. తమ కుటుంబమంతా జైలుకెళ్లి వస్తామే తప్ప, వైఎస్సార్ సీపీని వీడేది లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో బియ్యం తరలించినా క్రిమినల్ కేసులు పెట్టలేదు కేవలం కక్షసాధింపు కోసమే మాపై క్రిమినల్ కేసులు పెట్టారు మాజీ మంత్రి పేర్ని నాని -
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారి కోసం 168 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. వారిలో బాలురు 14,212 మంది, బాలికలు, 17,019 మంది ఉన్నారు. వీరిలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులు 1,743 మంది సైతం పరీక్షలకు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర స్థాయి అధికారులతో పాటుగా జిల్లా స్థాయి అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు బృందాలుగా సగానికి పైగా కేంద్రాలను రోజూ తనిఖీలు చేయటంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. సేవలందించిన 2,136 మంది సిబ్బంది జిల్లాలో జరిగే పరీక్షలకు సుమారుగా 2,136 మంది ఉపాధ్యాయులను వినియోగించారు. అందులో డిపార్ట్మెంటల్ అధికారులుగా 168 మందిని, చీఫ్ సూపరింటెండెంట్లుగా మరో 168 మందిని, కస్టోడియన్లుగా 50 మందిని, ఇన్విజిలేటర్లుగా 1,750 మంది సేవలందించారు. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ ప్రాంతా ల్లోని కేంద్రాలపై పలుమార్లు తనిఖీలు చేయటంతో ఎక్కడా ఏ విధమైన ఫిర్యాదులు రాలేదు. అదేవిధంగా సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు రోజూ తనిఖీలు నిర్వహించాయి. సోషల్ పరీక్షకు 263 మంది గైర్హాజరు.. మంగళవారం జరిగిన సోషల్ పేపర్కు 263 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షకు 27,840 మందికి గానూ 27,577 మంది విద్యార్థులు హాజరయ్యారు. 99.06 శాతం శాతంగా నమోదైంది. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మంగళవారం నగరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ఎంసీ పాఠశాల, ఆర్ఆర్పేటలోని కేర్ అండ్ షేర్ పాఠశాల, ఎస్పీఎస్ ఎంసీ ఉన్నత పాఠశాల, రాజీవ్గాంధీ ఉన్నత పాఠశాల, ఎస్బీవీఎస్ఆర్ ఎంసీ పాఠశాల తదితర పాఠశాలలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం పరిశీలన నందిగామ రూరల్: చందర్లపాడు మండలం ముప్పాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, విద్యుత్, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, పరీక్షలు విజయవంతంగా నిర్వహించామన్నారు. -
పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు
గన్నవరం: వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల తాగునీటి తొట్టెలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ వి.కె.షణ్ముఖ్కుమార్తో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న నీటి తొట్టె పనులకు భూమిపూజ, కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం శశిభూషణ్కుమార్ మాట్లాడుతూ వేసవిలో పశువులు, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి తొట్టెల నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. మానికొండ గ్రామంలో రెండు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్యాదవ్, పశుసంవర్థక శాఖ అధికారి చిన నరసింహులు, డీపీఓ జె.అరుణ, తహసీల్దారు జె.విమలకుమారి పాల్గొన్నారు. మర్లపాలెంలో పర్యటన అనంతరం శశిభూషణ్కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన వివిధ రకాల పనులను పరిశీలించారు. వీటి వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన నీటి తొట్టెల నిర్మాణం నందిగామ రూరల్: వేసవి కాలంలో మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహకారంతో యుద్ధప్రాతిపదికన నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో చేపడుతున్న నీటి తొట్టెల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 148 నీటి తొట్టెలను ఏర్పాటు చేశామని, మరో 143 ఆవాసాలలో తొట్టెల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. వేసవి తాగునీటి కార్యాచరణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో నీటి తొట్టెకు రూ.33 వేలు ఒక్కొక్క నీటి తొట్టె నిర్మాణానికి రూ.33 వేలు మంజూరవుతాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని 780 ఆవాసాలలో నీటి తొట్టెల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. వేసవి కాలం నేపథ్యంలో త్వరితగతిన నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేసవి కాలంలో మూగజీవాలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అవసరమైన చోట తొట్టెల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి హనుమంతరావు, డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ అధికారులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ -
దుర్గమ్మకు మల్లెలు, చామంతులతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడో రోజైన మంగళవారం దుర్గమ్మకు పసుపు, తెలుపు చామంతులు, మల్లెలతో ప్రత్యేక పుష్పార్చన జరిగింది. అమ్మవారి ఆలయంలోని పూజా మండపంలో ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత మహా మండపం నుంచి ఊరేగింపుగా ఆలయ డీఈవో రత్నరాజు, అర్చకులు, అధికారులు పూల గంపలతో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్న అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో ఆలయ అర్చకులు పూలతో అర్చన నిర్వహించారు. జపాన్ దేశం టోక్యోకు చెందిన ఇద్దరు భక్తులు ప్రత్యేక పుష్పార్చనలో పాల్గొన్నారు. విజయవాడ సందర్శనకు వచ్చిన వారు అమ్మవారి ఆలయం గురించి తెలుసుకొని వచ్చి పూజలు చేశారు. వీరితో పాటు పలువురు ఉభయదాతలు, భక్తులు పూజలో పాల్గొనగా, వారిని ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
చందర్లపాడు(నందిగామ టౌన్): చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి గ్రామంలోని దేవాలయాలు, ఖాళీ స్థలాలు, భూములు, తదితరాలను పరిశీలించినట్లు తెలిపారు. సభ ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులతో ఆమె చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్ర బాబు నాయుడు నియోజకవర్గానికి వస్తున్నారని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్డీవో బాల కృష్ణ, లాల్ బహదూర్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు పాల్గొన్నారు. హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి లబ్బీపేట(విజయవాడతూర్పు): హై రిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె జిల్లాలో జరుగుతున్న ఎన్సీడీ– సీడీ సర్వేను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, గర్భిణుల నమోదు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పరిశీలించారు. ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ సేవలపై ఆరా తీశారు. అనంతరం బూరుగగూడెం, రంగాపురం సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఎన్సీడీ–సీడీ సర్వేను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును స్వయంగా ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. రెడ్డిగూడెం వైద్యాధికారి డాక్టర్ మణిబాబు, సీహెచ్ఓ శ్యాం సుందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వరంగల్కు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. వరంగల్కు చెందిన సీహెచ్ రమేష్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండి తులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో చైత్రదీపిక సత్తా విజయవాడస్పోర్ట్స్: తైవాన్లో జరిగిన అంతర్జాతీయ తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి చైత్రదీపిక మూడు పతకాలతో సత్తా చాటింది. గత నెల 24 నుంచి 30వ తేదీ వరకు తైవాన్లో జరిగిన ఈ పోటీలకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఉత్తరకొరియా, ఇటలీ, సింగపూర్, భారత దేశాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక పెయిర్ విభాగంలో బంగారు పతకం, ఇన్లైన్ విభాగంలో కాంస్యం, కపుల్ డ్యాన్స్లో రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడాకారిణి చైత్రదీపిక పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. క్రీడాకారిణిని శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కోచ్ పి. సత్యనారాయణను పలువురు క్రీడాభిమానులు అభినందించారు. -
ఇష్టారాజ్యంగా ఉపాధి
శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం ఫీల్డ్ అసిస్టెంట్లకు వారు చేయవలసిన విధులపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ప్రతి బుధవారం ఎంపీడీవో కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ కొలతలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన ఇస్తున్నాం. కొలతల్లో తప్పులు ఉంటే చర్యలు తీసుకుంటాం. –ఎ.రాము, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా, ఎన్టీఆర్ జిల్లా రూ.5లక్షలు ఇచ్చుకుంటేనే ఎఫ్ఏ గా కొనసాగేది జగ్గయ్యపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను ఇష్టారాజ్యంగా తొలగించి వారికి నచ్చిన వారికి పోస్టింగ్లు ఇవ్వడంతో కూలీలకు కొలతల భయం వెంటాడుతోంది. కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు వారి విధులపై సరైన అవగాహన లేకపోవడంతో పాటు కనీసం స్మార్ట్ ఫోన్లో యాప్ల వినియోగం కూడా తెలియకపోవడంతో కొలతల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూలీలు ప్రశ్నిస్తున్నప్పటికీ తాము చెప్పిందే వినాలని, లేకపోతే పనుల నుంచి తీసేస్తామంటూ బెదిరిస్తుండటంతో చేసేది లేక కూలీలు మిన్నకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 271 మంది ఫీల్ట్ అసిస్టెంట్లు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాలను మూడు క్లస్టర్లుగా విభజించారు. విస్సన్నపేట క్లస్టర్లో ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు, రెడ్డిగూడెం, విజయవాడ క్లస్టర్ పరిధిలో జి.కొండూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, కంచికచర్ల, నందిగామ క్లస్టర్ పరిధిలో నందిగామ, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని ఆయా గ్రామాల్లో 271 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 130 మందిని తొలగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో టీడీపీ నాయకులు వారి ఇష్టారాజ్యంగా ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి వారికి ఇష్టమైన వారిని నియమించుకున్నారు. జిల్లాలో ఉన్న 271 మంది ఫీల్డ్ అసిస్టెంట్లలో 130 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మిగిలిన 141 మందిని కూడా తొలగించేందుకు సమాయత్తం అవుతున్నారు. కొన్ని గ్రామాల్లో పాతవారిని కొనసాగించాలంటే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సమర్పించుకోవాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, చందర్లపాడు, తిరువూరు మండలాల్లో ఈ మేరకు డిమాండ్ కూడా చేసినట్లు బహిరంగంగానే అంటున్నారు. కూలీలకు తప్పని కొలతల పాట్లు గ్రామాల్లో కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి పథకంపై పూర్తిగా అవగాహన లేకపోవడంతో కూలీలకు కొలతలు కేటాయించే విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రతి కూలీకి రోజుకు ప్రభుత్వం ఇచ్చే రూ.300 వేతనం అందేలా కొలతలు కేటాయించాలి. అయితే కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు కొలతలపై అవగాహన లేకపోవడంతో రోజువారీగా రూ.100 లేక 150 వేతనం వచ్చేలా కొలతలు ఇస్తుండటంతో కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమని మండల స్థాయి అధికారులను అడిగినప్పటికీ వారి నుంచి కూడా సరైన సమాధానం రావడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల నిర్వహణ అధ్వానం... జిల్లాలో అన్ని గ్రామాల్లో గత కొన్ని నెలల నుంచి రికార్డులు అధ్వానంగా ఉంటున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఏడు రకాల రికార్డులు నిర్వహించాల్సి ఉండగా అవి ఎక్కడా సక్రమంగా జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా అధికారులు కూడా పలు గ్రామాల్లో పనుల తనిఖీల సమయంలో ఈ విషయం గుర్తించారు. ముఖ్యంగా జాబ్కార్డుల నమోదు, గ్రామసభ నిర్వహణ, గ్రామాల్లో పని కావలసిన వారి దరఖాస్తు, పని ఇచ్చింది, కేటాయించింది, పని తాలుకా రిజిస్టర్, మెటీరియల్ రిజిస్టర్, పనుల స్థిరాస్తులు, పనుల్లో కూలీల ఫిర్యాదులు వంటి వాటికి సంబంధించిన రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా అవి ఎక్కడా అమలు కావడంలేదు. యంత్రాలతో పనులు చేస్తున్నట్లు ఆరోపణలు... గ్రామాల్లో మట్టి పనులు, నీటి కుంటలు, చెరువు పూడికతీత, మట్టి రోడ్లు బాగుచేయడం, బీడు భూములు చదును చేయడం, జంగిల్ క్లియరెన్స్, గడ్డి పెంపకాలు వంటి పనులు ఉపాధి కూలీలు చేయవలసి ఉండగా కొన్ని గ్రామాల్లో యంత్రాలతో పని చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం పట్టి రోడ్లు బాగుచేసే విషయంలో కూలీలకు బదులు యంత్రాలతో పనులు చేస్తుండగా మండల స్థాయి అధికారులకు తెలియడంతో ఆ పనికి సంబంధించిన బిల్లులు నిలిపివేశారు. పని చేయకుండానే మేట్లకు వేతనాలు చెల్లింపు... కూలీలతో పాటు మేట్లు పనులు చేయాల్సి ఉండగా మేట్లు మాత్రం కూలీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. పనులు చేయకుండా రోజువారీ వేతనం తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జి.కొండూరు మండలం చెవులూరులో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లినప్పుడు మేట్లు ఖాళీగా ఉండటం గమనించి కూలీలతో పాటు మీరు కూడా పని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడులు ఇప్పటికే దాదాపు సగం మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు అవగాహన లేని వారికి కొత్తగా పోస్టింగ్లు కూలీలకు తప్పని కొలతల పాట్లు కూటమి ప్రభుత్వ నిర్వాకం అధికారులకు తప్పని కష్టాలు జిల్లా సమాచారం... మొత్తం జాబ్ కార్డులు ... 1,56,521 కూలీల సంఖ్య ... 2,68,555 పని దినాలు ... 79,90,793 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు ... 10,696 మేట్లు ... 2,033 -
పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్
నందిగామరూరల్: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియను మంగళవారం వారు పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు, పూర్తి స్తాయిలో పేదరిక నిర్మూలనకు జిల్లా స్థాయి ప్రణాళికల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 33 మందికి జరిమానా విజయవాడలీగల్: మద్యం తాగి వాహనాలు నడిపిన 33 మందికి ఆరవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్బాబు జరిమానా విధించారు. నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు నగరంలో అయిదవ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో 14 మందికి ఒక్కొక్కరికి రూ.15వేలు, 19 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి, పట్టుబడిన వారిపై కేసులు నమోదుచేస్తామని, వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. -
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
గూడూరు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ అరండల్ పేటకు చెందిన సంరెడ్డి ఫణి(34) పామర్రులోని వాటర్ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఫణి పనిమీద పామర్రు నుంచి ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వెళ్తున్నాడు. అదే సమయంలో పాలకొల్లుకు చెందిన పిన్నంరెడ్డి రామారావు కుటుంబ సభ్యులు విజయవాడలో కార్యక్రమానికి హాజరై తిరిగి మచిలీపట్నం జాతీయ రహదారి గుండా పాలకొల్లు వెళ్తున్నారు. గూడూరు మండలం చిట్టి గూడూరు దగ్గరలో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొడుతూ అమాంతం రోడ్డుపక్కనున్న కాల్వలోకి పల్టీలు కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఫణికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున పిన్నంరెడ్డి రామారావుకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. రామారావు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు దామోదర్, మనవరాలు జొన్నల బేబిలకు స్వల్ప గాయా లయ్యాయి. క్షతగాత్రులను మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫణిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. గూడూరు ఎస్ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలు -
సత్వరమే పారిశ్రామిక అనుమతులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): సత్వర పారిశ్రామిక అనుమతుల జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2024, డిసెంబర్ 19 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 105 దరఖాస్తులు అందాయని, వాటిలో ఇప్పటికే 90 ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి విధానం– 2015–20, 2020–23, 2023–27 కింద ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూట్నీ కమిటీ సమావేశాలు నిర్వహించి 46 క్లయిమ్లకు రూ. 3.20 కోట్ల మేర ప్రతిపాదనలు పంపాయన్నారు. ఈ ప్రాతిపాదనలపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఈజీపీ వంటి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, ఎల్డీఎం కె.ప్రియాంక, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, డీపీవో పి.లావణ్యకుమారి, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు పాల్గొన్నారు. -
చరిత్ర తిరగరాసిన రైల్వే డివిజన్
సరుకు లోడింగ్, ఆదాయార్జనలో సరికొత్త రికార్డు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం, సరుకు లోడింగ్, రైళ్ల సమయపాలనలో సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 38.322 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ నమోదు చేసు కుంది. దశాబ్దం తర్వాత 2014–15 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 38.169 మిలియన్ టన్నులను అధిగమించింది. తద్వారా సరుకు లోడింగ్ ద్వారా డివిజన్ రూ.4,239.74 కోట్లు ఆదాయం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 3.8శాతం వృద్ధితో డివిజన్ స్థూల ఆదాయం రూ. 5,836.61 కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ డివిజన్ సాధించిన ఉత్తమ ఫలితాలకు కారణమైన సరుకు వినియోగదారులు, ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా విధుల్లో అంకితభావంతో పనిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులను అభినందించారు. 2024–25లో డివిజన్ వృద్ధి ఇలా.. ● ప్రయాణికుల ద్వారా గతం కంటే 0.12శాతం వృద్ధితో రూ. 1,386.14 కోట్లు ● కోచింగ్ ఆదాయం 18శాతం వృద్ధితో రూ. 111.70 కోట్లు ● ఇతర ఆదాయ మార్గాల ద్వారా 18శాతం వృద్ధితో రూ. 99.03 కోట్లు ● 66.7 మిలియన్ల ప్రయాణికులు డివిజన్ నుంచి ప్రయాణించారు. గతంలో 63.6 మిలియన్లు ఉండగా 4.8 శాతం ప్రయాణికులు పెరిగారు. ● డివిజన్ రైళ్ల నిర్వహణలో 80.19శాతం అత్యుత్తమ సమయపాలన నమోదు చేసుకుంది. -
బంగారు తాపడం పనులకు రూ. 2 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్కు చెందిన భక్తులు సోమవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్కు చెందిన వారణాసి శివరామ శౌరి, సౌజన్య కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. బంగారు తాపడం పనులకు గుంటూరుకు చెందిన కె. కోటేశ్వరరావు రూ. 1,00,101 విరాళంగా ఇచ్చారు. బీసీల హక్కులకు పోరాటం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, హక్కుల కోసం పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని రామారావు వీధిలో ఏపీ బీసీ చైతన్య సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది. దీన్ని సంఘం మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణితో కలిసి హైకోర్టు న్యాయవాది వైకే, వైఎస్సార్ సీపీ ఆర్టిషన్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకే మాట్లాడుతూ బీసీల సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు కన్నా స్కూల్స్ అధినేత కన్నా, సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల శివ, రాధా, పెంటి శ్రీనివాస్, బత్తులనాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మచిలీపట్నంటౌన్: నగరంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2వ తరగతి ఆపై తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి 11వ తేదీ వరకూ దరఖాస్తులను విద్యాలయం పని వేళల్లో కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. తమ వెబ్సైట్లో నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకుని వాటిని పూరించి ఆఫ్లైన్ మోడ్లో తమ కార్యాలయంలో అందజేయా లని, మరిన్ని వివరాలకు కేవీ ఆఫీస్లో సంప్రదించాలని సూచించారు. -
డీలిమిటేషన్పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కృష్ణలంక(విజయవాడతూర్పు): డీలిమిటే షన్పై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ్ భవన్లో జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన సోమవారం డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల చైన్నెలో డీలిమిటేషన్పై జరిగిన సదస్సుకు టీడీపీ, జనసేన హాజరు కాకపోవడం, రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనక పోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి గణనీయంగా డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ తులసీరెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్పై తీర్మానం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీపీఐ సీనియర్ నేత ఎ.వనజ, కాంగ్రెస్ నేత ఎన్.నరసింహారావు, కె.శివాజీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ఆంజనేయులు, సామాజిక విశ్లేషకులు డాక్టర్ కె.వసుంధర తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు
ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తున్నాం. మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులను ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు అన్ని వసతులు అందించడానికి చర్యలు చేపడుతున్నాం. తరగతుల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ తదితర అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం. –సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ, ఎన్టీఆర్ జిల్లా -
ఆలయం.. వివాదాలమయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని రెండో అతి పెద్ద దేవస్థానమైన దుర్గగుడిని కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆలయ బాధ్యతలు నిర్వహించే ఈవో స్థానంలో ఉన్న కె. రామచంద్రమోహన్కు దేవదాయ శాఖలో మరో రెండు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో దుర్గగుడిపై పాలన అదుపు తప్పుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఈ పది నెలల కాలంలో ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. గతంలో ప్రతి నెలా మొదటి, రెండో వారాల్లో వచ్చే ఆలయ సిబ్బంది వేతనాలు గత రెండు నెలలుగా ఆలస్యంగా వస్తుండగా, గత నెల అయితే ఏకంగా 17వ తేదీ తర్వాతే వారి ఖాతాలో జమయ్యాయి. మరి ఏప్రిల్ నెలలో వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో దేవస్థాన ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు ఆలయంలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లు సైతం తమ బిల్లులు ఎప్పుడు అవుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈవో రామచంద్రమోహన్ ప్రతి ఫైల్ను ఈ–ఫైల్లో అప్లోడ్ చేయాలని చెబుతున్నారు. అయితే ఈ–ఫైల్లో పెట్టిన బిల్లు ఎప్పుడు ఆడిట్కు వస్తుందో, అక్కడి నుంచి ఎప్పుడు చెక్కు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుపై ఆలయ డీఈవో ఆగ్రహం.. దుర్గగుడి ఆలయ అధికారులకు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈవో) రత్నరాజుకు మధ్య పోరు నడుస్తోంది. అధికారుల తీరుపై డీఈవో గుర్రుగా ఉన్నారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, ఆర్జిత సేవల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో జరుగుతున్న విశేష పుష్పార్చనలో ఈ వ్యవహారం బయట పడింది. ఆలయంలో కొంత మంది అధికారులు, సిబ్బంది తానంటే లెక్కలేనితనంగా చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సోమవారం ఉదయం అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించే పుష్పాలను ఆలయానికి తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో పూల గంపలను తీసుకుని అమ్మవారి సన్నిధికి వెళ్తున్నామని ఫెస్టివల్ సెక్షన్ అధికారి, ఏఈవో దుర్గారావు డీఈవో రత్నరాజుకు సమాచారం ఇచ్చారు. అయితే డీఈవో అక్కడికి వచ్చే సరికి కొంత మంది బోయి సిబ్బంది, ఆలయ సిబ్బంది పూల గంపలను తీసుకుని రాజగోపురం వరకు వచ్చేశారు. దీంతో తనను పిలిచి ఇలా అవమానించడం సరికాదంటూ రత్నరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత పూజా మండపంలోనూ కొంత మంది అర్చకులు డీఈవోను చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో ఆలయ అధికారులు, సిబ్బంది తీరు సరిగా లేదని తగిన రీతిలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రి దేవస్థానంలో రోజుకో పంచాయితీ కౌంటర్ల నిర్వహణపై వరుస ఫిర్యాదులు పాలన అంతా అస్తవ్యస్తం ఆలయ డీఈఓ వర్సెస్ అధికారులు అన్నట్లుగా పరిస్థితి పర్యవేక్షణ లోపంతో వరుస ఫిర్యాదులు.. దుర్గగుడిలో ఏర్పాటు చేసిన క్లోక్రూమ్, చెప్పుల స్టాండ్, సెల్ఫోన్ కౌంటర్లపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గతంలో కాంట్రాక్టర్ నిర్వహించే చెప్పుల స్టాండ్ను గత ఫిబ్రవరి నెల మధ్య నుంచి దేవస్థానం పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. అయితే కౌంటర్లోని సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులందుతున్నాయి. టెండర్ నిర్వహించడం వల్ల దేవస్థానానికి సుమారు రూ. 30 లక్షల మేర ఆదాయం సమకూరేది. అయితే దేవస్థానం నిర్వహించడం వల్ల ఆదాయం కోల్పోవడమే కాకుండా వివాదాలకు తలకు ఎత్తుకున్నట్లు అయింది. దీంతో సెక్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపున భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్లపైన ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఆలయంలోకి భక్తులెవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని దేవస్థానం నిర్ణయించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా కౌంటర్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్కు అప్పగించింది. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే వారిలో పదిశాతం మంది ఎవరో ఒకరి సిఫార్సులపై ఆలయానికి వచ్చే వారే. వారిని కౌంటర్లో సెల్ఫోన్ భద్రపరుచుకోమని కాంట్రాక్టర్ సిబ్బంది చెప్పడం, అది వివాదాలకు దారి తీయడం పరిపాటిగా మారిపోయింది. సోమవారం క్యూలైన్లో తనిఖీలు చేస్తున్న నలుగురు కాంట్రాక్ట్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ భక్తుడు ఆలయ ఈవో రామచంద్రమోహన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో క్యూలైన్లో తనిఖీలు చేస్తున్న ప్రైవేటు సిబ్బందిని వెంటనే పోలీసులకు అప్పగించాలని ఆదేశించడమే కాకుండా వారిపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు. -
ఊయల వేడుకకు వస్తూ..
టోల్ప్లాజా వద్ద..అవనిగడ్డ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మూడు నెలల కుమారుడిని సంతోషంగా ఊయలలో వేద్దామనుకున్న వారి ఆనందం తీవ్ర విషాదంగా మారింది.మరో ఐదు నిమిషాలైతే దేవస్థ్ధానానికి చేరుకునేవారు. బాలుడిని ఊయలలో వేసి ఎంతో సంతోషించేవారు. అంతలోనే లారీ రూపంలో వారిని మృత్యువు కబళించింది. మండల పరిధిలోని పులిగడ్డ టోల్ప్లాజా వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలి చించినాడకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సీటు కింద ఘటనలో వెనుకసీటులో తల్లిఒడిలో ఉన్న మూడు నెలల షణ్ముఖ ముందుకు ఢీకొని చనిపోయి సీటు కిందకు జారిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్.. మోహనబాబు, అరుణ మృత దేహాలను సిబ్బంది సాయంతో బయటకు తీశారు. గాయాలపాలైన సాత్వికను, సందీప్, పల్లవిని వెంటనే 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీటు కింద అచేతనంగా ఉన్న మూడేళ్ల షణ్ముఖను గుర్తించి బయటకు తీశారు. మరో ఐదు నిమిషాల్లో గుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. మరో ఐదు నిముషాలు గడిస్తే వారంతా ఆలయానికి వెళ్లి షణ్ముఖను ఊయలలో వేసేవారు. అంతలోనే ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే సీఐ యువకుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సర్పంచ్ దాసరి విజయ్కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఎక్కించి అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ట్రాక్టర్ సాయంతో కారుని పక్కకు తీయించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. విషమంగా పల్లవి పరిస్థితి గాయపడిన పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెతో పాటు స్వల్పగాయాలైన సందీప్ను మరింత మెరుగైన చికిత్స కోసం బందరు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. లారీ రూపంలో కబళించిన మృత్యువు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పులిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సీటు కింద విగతజీవిగా మూడునెలల బాలుడు తెనాలికి చెందిన జిడుగు మోహన్బాబు(57), భార్య అరుణ(50), కుమారుడు సందీప్, కోడలు పల్లవి, మనవరాలు సాత్విక(5), మూడునెలల మనవడు షణ్ముఖతో కలసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి సోమవారం మధ్యాహ్నం బయలు దేరారు. షణ్ముఖను ఊయలలో వేసేందుకు కారులో వస్తున్నారు. సందీప్ కారునడుపుతున్నాడు. పులిగడ్డ – పెనుమూడి వంతెన దాటిన తర్వాత టోల్ప్లాజాకు సమీపంలో ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ కారుని ఢీకొంది. ముందు సీటులో కూర్చున్న మోహనబాబు, వెనుక సీటులో కూర్చున్న అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న సాత్వికను తొలుత అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా అప్పటికే పాప చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. -
మధుమేహం వచ్చే ప్రమాదం..
నైట్రోజన్ డయాకై ్సడ్ అధికంగా ఉన్న గాలిని పీల్చేవారు మధుమేహం బారిన పడతారు. గాలిలో 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న కాలుష్య పదార్థాలు ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి చేరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను పెంచడమే కాక, ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ నిరోధకతకు కారణభూతమై మధుమేహానికి దారితీస్తాయి. వాహనాల శబ్దకాలుష్యంతో నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడితో హార్మోన్లు, మెటబాలిజం అసమతుల్యతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఆ ఫలితంగా మధుమేహం రావచ్చు. – డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు -
బాలకొండలరావుకుఘన సత్కారం
కూచిపూడి(మొవ్వ): ఉగాది వేడుకలు, వసంత నవ రాత్రోత్సవాలను పురస్కరించుకుని కూచిపూడి నాట్య కళాకారిణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఏ బాల కొండలరావు (విశాఖపట్నం)ను కూచిపూడి నాట్య క్షేత్రంలో సోమవారం ఘనంగా సత్కరించారు. కూచిపూడి శిల్పారామం వ్యవస్థాపకుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యాం ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు, దీవి శ్రీ రంగా చార్యులు, పిన్నమనేని గోపాల కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏ బాలకొండలరావ రావు శిష్యులతో పాటు పలువురు నాట్యకళాకారులు కూచిపూడి నాట్యాంశాలను ప్రదర్శించి, ప్రేక్షకులను మన్నలను అందుకున్నారు. ఉద్యోగవిరమణ చేసిన సిబ్బందికి సత్కారం కోనేరుసెంటర్: ఆరోగ్యమే మహాభాగ్యమని సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది తమ శేష జీవితాన్ని సంతోషంతో పాటు ఆరోగ్యవంతంగా గడిపేలా వారిని ఆశీర్వదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగవిరమణ పొందిన ఎస్ఐ ఏకే జిలాని (ఎస్ఐ–777), ఏఎస్ఐ వీఎస్ఎస్ ప్రసాద్ (ఏఎస్ఐ–935)లను సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగమనే సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒత్తిళ్లను అధిగమించి, ఉద్యోగ విరమణ వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం అదృష్టంగా భావించాలన్నారు. ఇది అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఉద్యోగవిరమణ పొందిన ప్రతి ఒక్కరూ శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలన్నారు. -
రంజాన్
భక్తిశ్రద్ధలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రంజాన్ పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, వన్టౌన్, మచిలీపట్నం ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు రంజాన్ సందేశమిచ్చారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించి చివరి రోజు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపు కొన్నారు. పిన్న, పెద్దా తేడా లేకుండా ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ –8లోu -
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇస్లాం శాంతిని బోధిస్తుందని, చెడును మంచి ద్వారా తొలగించాలని సూచిస్తుందని హైదరాబాద్కు చెందిన మౌలానా మొహమ్మద్ అజీజ్ ఉద్దీన్ సిద్ధిఖీ అన్నారు. విజయవాడ ఈద్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించారు. పలుప్రాంతాల ముస్లింలు సుమారు 15 వేల మంది వరకూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధిఖీ ఉర్దూ ప్రసంగం, నమాజు, దువా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నిరసనలు తెలియజేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2024 ద్వారా బీజేపీ ప్రభుత్వం ముస్లింపై దాడి చేస్తోందన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన కూటమి ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని, పవిత్ర రంజాన్ నాడు నిరసన తెలిపే పరిస్థితులు రావడం దురదృష్టకరమని అన్నారు. నేడు ముస్లింలు తమ ఆస్తులను కాపాడాలంటూ దువా చేయాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణం కేంద్రంలోని ఎన్డీఏ, ఏపీలోని టీడీపీ జనసేన లేనన్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు అండగా ఉంటామని అబద్ధాలు చెబుతున్నారని, లోక్సభ, రాజ్యసభల్లో ముస్లింలకు వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచింది వైఎస్సార్ కుటుంబమేనన్నారు. పార్లమెంటులో బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా వైఎస్సార్ సీపీ వ్యతిరేకించిందని, ఎలాంటి మొహమాటం లేకుండా రాజ్యసభ, లోక్సభ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును టీడీపీ, జనసేన ఎంపీలు ఎందుకు వ్యతిరేకించలేక పోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈద్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కాలేషావలి, ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో టీడీపీలోని రెండు వర్గాల మధ్య అక్రమార్జన విషయంలో ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ అంశం టీడీపీ అధిష్టానానికి తల నొప్పిగా మారింది. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధికి మధ్య అక్రమార్జనలో ఏర్పడిన వివాదం అక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలకు బీజం వేసింది. ప్రతి పనిలో కమీషన్లకు పాకులాడుతూ తనంత నిజాయతీపరుడైన రాజకీయ నాయకుడు మరెవరూ లేరంటూ నిత్యం మీడియాలో పబ్లిసిటీ కోరుకునే ప్రజాప్రతినిధి ఒకరు. సైలెంట్గా తాను చేసే అవినీతి తన నీడకు కూడా తెలియనీయకుండా ప్రతి నియోజకవర్గం నుంచి వాటా రావాలని ఆదేశాలిచ్చే నేత మరొకరు. వికృత క్రీడలో నేతలు బలిపశువులు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్లమెంటు ప్రజాప్రతినిధి, నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఇద్దరూ కలిసి ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలో సొంతపార్టీ నేతలు బలి పశువులు అవుతున్నారని తెలుస్తోంది. ఇద్దరు నేతలూ అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్ల ప్రజా ధనాన్ని వెనకేసుకొని వాటాల వద్ద తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ రాజకీయ రచ్చ స్థానికులు, అధికారులకు తలనొప్పిగా మారింది. మట్టి దందాలో తలెత్తిన వివాదం తిరువూరు నియోజకవర్గంలో ఎ.కొండూరు మండలం గోపాలపురం, విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇద్దరు నేతల కనుసన్నల్లో మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. రోజూ వందల లారీల గ్రావెల్ను తెలంగాణకు తరలించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఇద్దరు నేతలూ కొంతకాలం మట్టి దందాను కొనసాగించారు. అధికారులు సతమతం ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో అధికారులు సతమతమవుతున్నారు. ఇద్దరి నాయకుల తీరుతో అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులే వర్గాలుగా ఏర్పడి బహిరంగ సవాళ్లు చేసుకోవడంతో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. టీడీపీలో పార్లమెంట్, తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ప్రజాప్రతినిధుల మధ్య వికృత రాజకీయ క్రీడ గోపాలపురం మట్టి దోపిడీలో ముదిరిపాకాన పడ్డ విభేదాలు గ్రూపు రాజకీయాలతో కుంటుపడుతున్న అభివృద్ధి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై వేటుకు రంగం సిద్ధం! చర్యలకు రంగం సిద్ధం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ తిరువూరు ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి మరొక ఇన్చార్జిని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని అణగదొక్కేందుకు నియోజకవర్గంలోని అగ్ర కులాల నేతలందరినీ గ్రూపుగా తయారుచేసి పార్లమెంటు ప్రజాప్రతినిధి అధిష్టానానికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నాడని, అసమ్మతి నేతల వెనుకుండి కఽథ నడిపిస్తున్నారని నియోజక వర్గ ప్రజాప్రతినిధి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రమేయం ఏమీలేదని పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం ఆరోపిస్తోంది. తిరువూరు టీడీపీలోని ఈ వివాదం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఎంపీ వర్గంలో ఎ.కొండూరు మండలానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ దళిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని అతనిపై చర్యలు తీసుకోపోతే తాను రాజీనామా చేస్తానంటూ ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇదంతా ఎమ్మెల్యే నాటకమని ఏఎంసీ మాజీ చైర్మన్ మీడియా సాక్షిగా ప్రకటించారు. తాను ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఇచ్చానని, మళ్లీ రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రవర్తన ఘటనపై అధిష్టానం చర్యలు తీసుకోకుండా పార్లమెంటు ప్రజా ప్రతినిధి పీఏకి ముడుపులు ఇచ్చినట్లు తన విచారణలో తేలిందని నియోజక వర్గ ప్రజాప్రతినిధి ఆరోపించారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల్లో, ప్రైవేటు కట్టడాల్లో, రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో, అక్రమ రేషన్ దందాలో ఎమ్మెల్యే కమీషన్లు దండుకుంటున్నాడని పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది. -
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పాస్టర్ ప్రవీణ్ పడగాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరమ్ అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో సోమవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన క్రైస్తవ సంఘాల మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కరుణాకర్ దాస్ మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాల మృతి ఘోర పరిణామం అన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో విభిన్న చిత్రాలు వెళ్లడవుతున్నాయని, పోలీసులు చెప్పిన చిత్రాల్లో ముఖం సరిగా కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటి వరకూ రాలేదని, పంచనామా క్లియర్గా లేదని, డాక్టర్ల నుంచి సరైన సమాచారం లేదని, ఇవి అనుమానాలకు తావిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు క్రైస్తవులు తమని తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. అందుకోసం పాస్టర్లు, మతపెద్దలు అందరూ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశమైనట్లు తెలిపారు. క్రైస్తవులపై ఎవరైనా దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలన్నారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత బిషప్ పి.స్పర్జన్ రాజు, పాస్టర్ వేశపోగు జాన్ భాస్కరరావు, సింపని గాస్పల్ అధినేత ఏఆర్ స్టీఫెన్ సన్, సువార్త చానల్ అధినేత చాట్ల లూథర్ ప్రశాంత్, పాస్టర్లు ఎం.రవికుమార్, ఎం. మ్యాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ -
చేతికొచ్చే సమయంలో పంట ధ్వంసం
మైలవరం: ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి కొంతమంది వ్యక్తులు ఆ పంటను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మైలవరం పొందుగల రోడ్డులోని భవానీనగర్కు సమీపంలో తనకు పొలం ఉందని, 2012లో తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందని, అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేస్తూ జీవనం గడుపుతున్నానని మైలవరానికి చెందిన రైతు బొమ్మారెడ్డి రవికుమార్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది పొలంలో గుమ్మడి పంట సాగు చేశానని, నాలుగైదు రోజుల్లో కాపుకొచ్చిన గుమ్మడి కాయలు కోద్దామని అనుకుంటున్న సమయంలో గత రాత్రి వజ్రాల వెంకటేశ్వరరెడ్డి మరి కొంతమందితో కలిసి ట్రాక్టర్ను తీసుకువచ్చి పంటను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టానని, పంట ధ్వంసం చేయడంతో చిల్లి గవ్వ కూడా రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. దొంగ సంతకాలు సృష్టించి తనను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. దీనిపై మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవికుమార్రెడ్డి తెలిపారు. రవికుమార్ రెడ్డికి చెందిన భూమిని కొంతమంది దొంగ పత్రాలు సృష్టించడంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్ఐ సుధాకర్ను వివరణ కోరగా పంట ధ్వంసం చేయడానికి ఉపయోగించిన ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చామని, డ్రైవర్ దొరకలేదని తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సోమవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే అన్ని క్యూలైన్లలో భక్తులు బారలు తీరి కనిపించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ. 100, రూ.300 దర్శనం గంట లోపే పూర్తి కాగా, రూ. 500, వీఐపీ దర్శనం గంటన్నర పైగా సమయం పట్టింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో మహా మండపం ఆరో అంతస్తు వరకు, ఘాట్రోడ్డులో దేవస్థాన సమాచార కేంద్రం వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరలించారు. సర్వ దర్శనానికి రెండు గంటలు -
మెదడుపై ప్రభావం..
కాలుష్యం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మెదడులో కీలక భాగాలపై కాలుష్యంలోని రసాయనాలు ప్రభావం చూపి న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తవచ్చు. అంటే కాలు, చేయి పట్టుతప్పడం, బ్రెయిన్స్ట్రోక్, వణుకుడు రోగం (పార్కిన్సన్) వంటివి రావచ్చు. కాలుష్యం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ సమయాల్లో మాస్క్ వాడటం మంచిది. – డాక్టర్ దేవనబోయిన అనిల్కుమార్, న్యూరాలజిస్ట్ -
ఆమ్రపాలి బోట్ పునఃప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు సంబంధించి భవానీపురంలోని బెరంపార్క్లోగల బోటింగ్ పాయింట్ వద్ద ఆధునికీకరించిన ఆమ్రపాలి బోట్ సర్వీస్ను ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరమ్మతులకు గురైన ఈ బోట్ గత రెండేళ్లుగా పక్కన ఉందన్నారు. దీనిని ఆధునికీకరించి, అధిక సంఖ్యలో పర్యాటకులు ప్రయాణించేలా రూపకల్పన చేశామని తెలిపారు. విశాలమైన సీటింగ్, ప్రథమ చికిత్స సదుపాయం, భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ బోటు కృష్ణానదిపై రోజుకు మూడు ట్రిప్పులు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) తిరుగుతుందని చెప్పారు. పర్యాటకులు ఆన్లైన్ లేదా బెరంపార్క్లోని టికెట్ కౌంటర్ వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏపీటీడీసీ విజయవాడ డీవీఎం పి. కృష్ణచైతన్య, బెరంపార్క్, బోటింగ్ మేనేజర్లు కె. శ్రీనివాస్, నాగరాజు, మన్నం కొండయ్య, బోటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మూర్తి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ఎంవీవీఎస్ఎన్ మూర్తిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. స్థానిక మొగల్రాజపురం రత్నమాంబ వీధి లోని కుమ్మరి శాలివాహన సంఘం కార్యాలయంలో కేసన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం యువత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ కలిసి ఎంవీవీఎస్ఎన్ మూర్తికి నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ జిల్లా అటవీ శాఖ అధికారిగా, కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఎంబీసీ) ఆల్ ఇండియా ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంవీవీఎస్ఎన్ మూర్తి పనిచేశారని వివరించారు. అలాగే 2005 నుంచి 2008 వరకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఉద్యోగుల సంఘా నికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలు అందించారని చెప్పారు. బీసీల సమస్య పరిష్కారంతోపాటు సమస్యలు, బీసీ సమాజ సాధికారతకు తన వంతు కృషి చేస్తానని ఎంవీవీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. -
‘విశ్వావసు’లో కొత్త వెలుగులు
కలెక్టరేట్ వద్ద ఉగాది వేడుకల్లో పండితులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకట రంగసాయి కుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలు వివరించారు. కొత్త తెలుగు సంవత్సరంలో ప్రతిఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలతో కొత్త వెలుగులు నిండాలంటూ వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వేడుకల్లో పాల్గొన్న డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సారథ్యంలో జిల్లా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధి చెందాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని.. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు వెంకట రంగసాయి కుమార్ శర్మతో పాటు దాములూరి అప్పయ్యశర్మ, వేదాంతం అజయ్కుమార్, తూములూరి కృష్ణమూర్తి, దుర్బాకుల సాంబమూర్తి అవధానిని సత్కరించారు. బంగారు గరుడోత్సవంమంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం ఉగాది తిరువంజనోత్సవంతోపాటు స్వామికి శాంతి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం ఉగాది సందర్భంగా శనగల శేషాంజనేయ గోపాల్ పంచాంగ పఠనం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామి బంగారు గరుడోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తరించారు. అదాందల మహల్ పవళింపు సేవలో గులాబీ పువ్వులతో సహస్ర నామార్చన నిర్వహించారు. -
విజయమియ్యవే విశ్వావసు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, అర్చన అనంతరం ఉదయం 8.15 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, ఇతర అధికారులు అమ్మవారిని తొలుత దర్శించుకున్నారు. ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి ఈవో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా నూతన పూజా మండపానికి తీసుకువచ్చారు. వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను జరిపించారు. నూతన మండపంలో ప్రత్యేక పుష్పార్చన ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపాన్ని ఆలయ ఈవో కె. రామచంద్రమోహన్, డీఈవో రత్నరాజు, ఈఈ కోటేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన ఆదివారం అమ్మవారికి మల్లెలు, మరువంతో ఆలయ అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం పంచహారతుల సేవ నిర్వహించి ఉభయదాతలకు ప్రసాదాలను అందజేశారు. భక్తులకు పుష్పార్చనలో వినియోగించిన పుష్పాలను పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ కౌంటర్ వద్ద ఉగాది పచ్చడిని అందజేశారు. అంతరాలయ దర్శనం రద్దు.. ఉగాదికి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం 8.15 గంటలకు దర్శనం ప్రారంభమయ్యే సమయానికి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉదయం నుంచే మహా మండపం దిగువన, ఘాట్రోడ్డులోని కౌంటర్ల రూ. 500 టికెట్లు విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. ముందుగానే ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వీఐపీ క్యూలైన్లోకి అనుమతించారు. దీంతో అరగంట లోపే వారికి అమ్మవారి దర్శనం పూర్తయింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా, రూ. 100, రూ. 300 టికెట్టుపై దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మజ్జిగ పంపిణీ.. వేసవిని నేపథ్యంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. లక్ష్మీ గణపతి ప్రాంగణం, మహా మండపం 7వ అంతస్తులోని తులాభారం వద్ద భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. దాతల సహకారంతో ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మజ్జిగ పంపిణీ జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వెండి రథంపై ఆది దంపతులు ఉగాదిని పురస్కరించుకుని ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథోత్సవంపై నగరోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం వద్ద ఆదిదంపతులకు ఈవో కె. రామచంద్రమోహన్ దంపతులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, బ్రాహ్మణ వీధి, సామారంగం చౌక్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. స్థానాచార్య శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్త్రి, ఈఈ వైకుంఠరావు, ఉభయదాతలు, భక్తులు పాల్గొని తరించారు. కొత్త సంవత్సరాది వేళ భక్తుల ప్రత్యేక పూజలు కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి తెల్లవారుజామున దుర్గమ్మకు స్నపనాభిషేకం ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైన దర్శనం కనులపండువగా ఆది దంపతుల నగరోత్సవం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 20257నేడు పీజీఆర్ఎస్ రద్దు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుది దశకు ట్రాక్ల ఆధునికీకరణ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో హైస్పీడ్ రైళ్ల కోసం ప్రధాన మార్గాలలో చేపట్టిన ట్రాక్ల ఆధునికీకరణ పనులు తుది దశకు చేరాయి. ఈద్ ముబారక్ నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాస దీక్షలను పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. u8లో ●● ఓవర్హెడ్ ట్యాంకుల నిర్వహణను గాలికొదిలేస్తున్న గ్రామ పంచాయతీలు ● ట్యాంకులు శిథిలావస్థకు చేరి, రెయిలింగ్లు లేక సిబ్బందికి అవస్థలు ● ట్యాంకుల పరిశుభ్రత, క్లోరినేషన్పై అనుమానాలు ● నిర్లక్ష్యం వహిస్తే ప్రజారోగ్యానికే ప్రమాదం ● ఎన్టీఆర్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కింద 464వాటర్ ట్యాంకులు జి.కొండూరు: ప్రజలకు తాగునీటి సరఫరాలో కీలకమైన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్వహణను గ్రామ పంచాయతీలు గాలికొదిలేస్తున్నాయి. కొన్ని ట్యాంకులు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. కొన్ని ట్యాంకుల మెట్ల మార్గాలు ధ్వంసమై కొన్ని, రెయిలింగ్లు ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. ట్యాంకుల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో పరిశుభ్రత, క్లోరినేషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి పరిశుభ్రతలో ఏమరపాటుగా ఉంటే ప్రజారోగ్యమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నిర్వహణపై అనుమానాలు.. ఎన్టీఆర్ జిల్లాలో సమగ్ర రక్షిత, రక్షిత, మీడియం రక్షిత మంచినీటి పథకాల కింద 464 ఓవర్హెడ్ ట్యాంకులతో పాటు కృష్ణావాటర్ను సరఫరా చేసే ట్యాంకులు, సంపులు అదనంగా ఉన్నాయి. కాగా వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ట్యాంకులలో క్లీనింగ్, క్లోరినేషన్ చేసేందుకు సిబ్బంది ఎక్కి, దిగడానికి వీలుగా నిర్మించిన మెట్లమార్గాలు, రైలింగ్లు ఊడిపోయిన ట్యాంకులు కొన్ని ఉన్నాయి. మెట్ల మార్గాలు, రైలింగ్లు సక్రమంగా లేకపోవడం వల్ల ప్రతి పదిహేను రోజులకు ట్యాంకులను క్లీన్ చేయాల్సిన సిబ్బంది ట్యాంకులపైకి ఎక్కేందుకు భయపడి క్లీనింగ్ చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా బోరువాటర్ను ట్యాంకులకు ఎక్కించి సరఫరా చేసే గ్రామా ల్లో సిబ్బంది క్లోరినేషన్కు వాడే పదార్థాలను బకెట్లో తీసుకెళ్లి ప్రతిరోజూ ట్యాంకులో కలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో క్లీనింగ్, క్లోరినేషన్ సక్రమంగా చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతిపంపుల తీరు అంతే.. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం అనంతరం నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపడతాయి. అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇస్తున్న క్రమంలో చేతి పంపుల నిర్వహణకు కూడా గ్రామ పంచాయతీల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల అధికారులు ట్యాంకులు, చేతి పంపుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచినప్పుడు, మంచినీటి పథకాలలో నీటి సరఫరా నిలిచినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలను ఈ చేతి పంపులే ఆదుకుంటాయి. కనుక సమస్యలు ఉన్న చేతి పంపులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. మైలవరం మండల పరిధి గణపవరంలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకు జి.కొండూరు మండల పరిధి సున్నంపాడులో మెట్లమార్గం, రైలింగ్ ధ్వంసమైన వాటర్ ట్యాంకు న్యూస్రీల్ఎన్టీఆర్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కింద తాగునీటి సరఫరా వివరాలుతాగునీరు సరఫరా గ్రామాలు: 794 జనాభా: 9,87,854 కుటుంబాలు: 2,67,574 ఇంటింటి కుళాయి కనెక్షన్లు: 1,10,727 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు: 20 ట్యాంకులు రక్షిత మంచినీటి పథకాలు: 380 ట్యాంకులు మీడియం రక్షిత పథకాలు: 64 ట్యాంకులు డైరెక్ట్ పంపింగ్ స్కీములు: 510 చేతి పంపులు: 8,444 మరమ్మతులు చేయకపోతే ప్రమాదమే.. ప్రజలకు సరఫరా చేసే తాగునీటి విషయంలో నిర్లక్ష్యం తగదు. గ్రామాలలో ఓవర్హెడ్ ట్యాంకులు ఎక్కువ శాతం శిథిలావస్థకు చేరి ఉన్నాయి. కాలం చెల్లిన వాటిని కూల్చి కొత్తవి నిర్మించాలి. మెట్ల మార్గాలు, రైలింగ్లు ధ్వంసమైన చోట పునఃరుద్ధరించాలి. లేదంటే సిబ్బంది ట్యాంకులను క్లీన్ చేయడం, క్లోరినేషన్ చేయడం కష్టమవుతుంది. – ఎం. మహేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఇబ్రహీంపట్నం శిథిలావస్థకు చేరిన ఓవర్హెడ్ ట్యాంకులను సౌండ్నెస్ టెస్టులు చేయించి కాలం చెల్లినట్లు నిర్ధారణ అయితే ట్యాంకులను కూల్చి.. కొత్త ట్యాంకులను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ట్యాంకులు ఎక్కువ శాతం గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇళ్ల మధ్యన ఉండడం వల్ల శిథిలావస్థకు చేరిన ట్యాంకులు అకస్మాత్తుగా కూలితే ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ట్యాంకుల మరమ్మతులు, మెట్లమార్గాల పునఃరుద్ధరణ వంటి పనులను వెంటనే చేపట్టకపోతే నీటి పరిశుభ్రత లేక ప్రజారోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. -
దుర్గమ్మకు పోలీసుల ప్రత్యేక పూజలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినం సందర్భంగా వెండిరథంపై ఊరేగిన దుర్గమ్మకు పోలీసు శాఖ పక్షాన ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం రోజు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించే వెండి రథోత్సవం పాతబస్తీ వీధుల్లో ఊరేగుతూ తిరుగు ప్రయాణంలో వన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుంది. అక్కడ పోలీసు శాఖ పక్షాన సీపీ ఎస్వీ రాజశేఖర్బాబు దంపతులు, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ గురుప్రకాష్,, ఏసీపీ దుర్గారావు, ఇతర అధికారులు పూజలు నిర్వహించి స్టేషన్ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. అనంతరం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధికారులు గౌతమిశాలి, గుణ్ణం రామకృష్ణ, ఎం. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్లో సీపీ దంపతులను జ్ఞాపికతో సత్కరించారు. విజయవాడ వన్టౌన్ పీఎస్ వద్ద పండుగ వాతావరణం -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
జి.కొండూరు: బైక్పై మేనత్త ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా, వీరులపాడు మండల పరిధి పొన్నవరం గ్రామానికి చెందిన షోడగిరి రాజేష్(24) అదే గ్రామానికి చెందిన షోడగిరి అనిల్తో కలిసి బైక్పై వెల్లటూరులోని మేనత్త ఇంటికి శనివారం ఉదయం బయలుదేరాడు. వెల్లటూరు శివాలయం మలుపు వద్దకు రాగానే గేదెలు ఆకస్మాత్తుగా రోడ్డు మీదకు రావడంతో బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న ప్రహరీ వైపు పడ్డారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రాజేష్ తలకు తీవ్రమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెనుక కూర్చున్న అనిల్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాంబే కాలనీ రైల్వే ట్రాక్ పక్కన మగ వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, ఒంటిపై వంకాయ రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీకి విజయవాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లేదా 94406 27544 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. ఫుట్బోర్డుపై ప్రయాణిస్తూ.. ఉంగుటూరు: బస్సులో ఫుట్బోర్డుపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి జారిపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అవుటపల్లి గ్రామానికి చెందిన అవుటపల్లి ఏసుబాబు(29) రెండు రోజుల క్రితం బస్సు ఎక్కి విజయవాడ వెళ్తున్నాడు. పెద్ద అవుటపల్లి సెంటర్లో సర్వీస్ రోడ్డు నుంచి హైవే పైకి బస్సు మలుపు తిరుగుతుంది. అదే సమయంలో ఫుట్బోర్డుపై నిల్చున్న ఏసుబాబు ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలో చికిత్స పొందుతున్న ఏసుబాబు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఏఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అవివాహితుడు, దివ్యాంగుడు. గన్నవరం బస్స్టాండ్ వద్ద ఆటోలకు సర్వీసింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
ఈడుపుగల్లులో బస్సు బీభత్సం
భీతిల్లిన డ్వాక్రా మహిళలు కంకిపాడు: సీఎం సభకు వెళ్లొచ్చిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించిన ఘటన మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు ఈడుపుగల్లు గ్రామం నుంచి డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్సులో తరలివెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఈడుపుగల్లు చేరుకున్న ఆర్టీసీ బస్సు శివాలయం సెంటరులో మలుపు తిప్పుతుండగా బస్సు అదుపుతప్పి సిమెంటు రోడ్డు మార్జిన్ దిగింది. ఇటీవలే సిమెంటు రోడ్డు నిర్మించినా బరంతు మాత్రం వేయలేదు. దీంతో బస్సు మలుపు సక్రమంగా తిరగక శివాలయం ప్రహరీని పలు మార్లు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది భయంతో భీతిల్లారు. అప్పటికే ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు వచ్చిన ప్రజలు, వాహనదారులు, రాకపోకలకు అడ్డుగా బస్సు నిలిచిపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. బస్సు డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినంతో పాటు సెలవు దినం కావటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనా లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. మాస్టర్ అథ్లెటిక్స్లో విజేతలకు సత్కారం భవానీపురం(విజయవాడపశ్చిమ): బెంగళూరులో ఇటీవల నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలో కృష్ణాజిల్లా నుంచి 13 మంది పాల్గొనగా 8 మంది క్రీడాకారులు రెండు గోల్డ్, 10 మంది సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని అథ్లెటిక్స్ అసోసియేషన్ హాల్లో విజేతలను సత్కరించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ (ఇంటెలిజన్స్) కె.మెహర్బాబు హాజరై విజేతలను అభినందించారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు కంది గంగాధరరావు, సెక్రటరీ జీవీ ప్రసాదరావు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పున్నమి ఘాట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని భవానీపురం పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. మృతుడి ఒంటిపై నలుపు, ఎరుపు రంగు గళ్ల షర్ట్, తెలుపు రంగుపై బ్లూ కలర్ గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. 40వ డివిజన్ 121 సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి నల్లూరి శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
తుది దశకు హైస్పీడ్ ట్రాక్ల ఆధునికీకరణ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భారతీయ రైల్వేలో రోజురోజుకు పెరుగుతున్న హైస్పీడ్ రైళ్ల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్వేశాఖ ట్రాక్ల ఆధునికీకరణ దిశగా చర్యలు చేపట్టారు. ఈ దిశగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో హైస్పీడ్ రైళ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు ప్రధాన మార్గాల్లో ట్రాక్ల ఆధునికీకరణ పనులను చేపట్టారు. విజయవాడ డివిజన్లో ప్రధానంగా 1,070.83 కిలో మీటర్ల(టీకేఎం) మేర ట్రాక్లు ఉన్నాయి. ప్రధాన మార్గంలోని ఇతర ట్రాక్లతో కలుపుకొని మొత్తంగా 2,228.35 ట్రాక్ కిలో మీటర్లు ఉన్నాయి. వీటి గరిష్ట వేగం ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క విధంగా సాధారణ రైళ్ల నిర్వహణకు తగినట్టుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో వందేభారత్, అమృత్ భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల ప్రవేశంతో ట్రాక్లు సామర్థ్యం తట్టుకునేలా గంటకు 110 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్ల గరిష్ట వేగానికి తగినట్లుగా ట్రాక్ల ఆధునికీకరణ దిశగా డివిజన్ అధికారులు చర్యలు చేపట్టారు. పనులు వేగంగా పూర్తిచేసేలా ప్రణాళికలు విజయవాడ డివిజన్లో ప్రధాన మార్గాలైన గూడురు – విజయవాడ – దువ్వాడ మార్గంతో పాటుగా విజయవాడ – కొండపల్లి సెక్షన్లలో ఇప్పటి వరకు గంటకు 130 కిలో మీటర్ల గరిష్ట వేగ సామర్థ్యంతో 1,128.76 టీకేఎం ఆధునికీకరించారు. దీంతో డివిజన్లో 130 కిలోమీటర్ల సామర్థ్యంతో 58 శాతం ట్రాక్ల ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. వీటితో పాటుగా బ్రాంచ్ లైన్లు అయిన నిడదవోలు, భీమవరం – నర్సాపూర్ – గుడివాడ – మచిలీపట్నం, కాకినాడ పోర్టు–సామర్లకోట సెక్షన్లో 473.4 టీకేఎంలు గంటకు 110 కిలో మీటర్ల రైళ్ల వేగాన్ని నిర్వహించేందుకు అప్గ్రేడ్ చేశారు. దీంతో డివిజన్లో ఇప్పటి వరకు 1,761 ట్రాక్ కిలోమీటర్లతో 80 శాతం ట్రాక్ల అప్గ్రేడ్ పనులు పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఇతర అన్ని సెక్షన్లలో కూడా ట్రాక్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తిచేసేలా అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇంజినీరింగ్ అధికారుల కృషి..80 శాతం ట్రాక్ల పునరుద్ధరణ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ సజావుగా జరిగేలా ట్రాక్ల అప్గ్రేడ్ పనులు చేపట్టాం. ట్రాక్ల బలోపేతం, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఆధునిక యంత్రాలతో పనులు చేస్తున్నాం. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్లు, స్లీపర్లను అనుసంధానం చేసేందుకు ‘పాండ్రాల్ రహీ ఫాస్టెనింగ్’, ‘వోస్లోహ్ ఫాస్టెనింగ్’ వంటి కొత్త ఫిటింగ్లను ఉపయోగించడంతో 12 ఏళ్ల పాటు మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్లు దృఢంగా ఉంటాయి. టీఆర్టీ యంత్రాన్ని ఉపయోగించి గోదావరి వంతెనపై గడువు ముగిసిన స్లీపర్లను నిర్ణీత సమయంలోనే విజయవంతంగా పునరుద్ధరించాం. రానున్న రోజుల్లో అన్ని సెక్షన్లలో ట్రాక్ల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం. – ఎస్.వరుణ్బాబు, సీనియర్ డీఈ ప్రధాన మార్గంలో 130 కి.మీ. సామర్థ్యంతో 1,287 టీకేఎం పనుల పూర్తి బ్రాంచ్ లైన్లతో 110 కి.మీ.సామర్థ్యంతో 473 కి.మీ. ట్రాక్ల ఆధునికీకరణ విజయవాడ డివిజన్లో అంతటా 1/4 వంతు నాసిరకం మట్టితో ట్రాక్ల నిర్మాణం జరిగింది. తరచూ వర్షాలకు మట్టి కుంచించుకుపోవడం, జారి పోవడం జరుగుతుండేవి. దీంతో తరచూ ట్రాక్ల పటిష్టత దెబ్బతింటుండేది. ఇటువంటి పరిస్థితుల్లో తరచూ ట్రాక్ల పటిష్టతను పర్యవేక్షించడం, లోపాలను లోతుగా పరిశీలించి ట్రాక్ల పునర్నిర్మాణ పనులు చేపడ్డం ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందికి సవాలుతో కూడి ఉండేది. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వేలోనే మొదటిసారిగా మ్యానువల్ జోక్యం లేకుండా ట్రాక్ల డీప్ స్క్రీనింగ్ కోసం డివిజన్లో ఒక డీసీఎం(బ్యాలెస్ట్ క్లీనింగ్ మెషిన్)ను ఏర్పాటు చేసుకుంది. ఈ ఆధునిక మిషన్తో 30 రోజుల్లో జరిగే పనులను కేవలం రెండు లేదా మూడు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీఆర్టీ(ట్రాక్ రిలేయింగ్ ట్రైన్), పీక్వూర్ఎస్ (ప్లాసర్ క్వీక్ రిలేయింగ్ సిస్టం) మిషన్లను ఉపయోగించి రికార్డు స్థాయిలో 129 కిలో మీటర్ల స్లీపర్లను పునరుద్ధరణతో పాటు 164 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులను సాధించింది. -
కార్తికేయ పుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు
మోపిదేవి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఆలయ ప్రాంగణంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు నేతృత్వంలో ఉదయం ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ వేద పండితులు ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు దేవదాయశాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. ఉగాది సందర్భంగా దేవస్థానం ఆచార మర్యాదలో భాగంగా శ్రీకాకుళం దేవస్థానం ప్రధాన అర్చకులు అగ్నిహోత్రం భాస్కరాచార్యులు, పంచాంగ కర్త నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్యశర్మలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్దప్రసాద్ సతీమణి విజయలక్ష్మి, నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్, సాయిసుప్రియ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి లడ్డుప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. ఆలయ అధికారులు, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం.. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తరఫున చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆదివారం ఉదయం దేవస్థానం ఎదుట నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు, యాత్రికులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. -
ఆధునిక సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో మిత్ర హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలో నూతన హాస్పిటల్ను ఆదివారం ప్రారంభించారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చికిత్సలందించేలా మిత్ర హాస్పిటల్ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో తనతో పాటు యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కేవీ రవికుమార్, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ పీ విశ్వేశ్వరరావులు సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పారదర్శకంగా రోగ నిర్ధారణ, పరిపూర్ణ వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీనదయాళన్, స్పైన్ సర్జన్ డాక్టర్ అజోయ్ ప్రసాద్ శెట్టి, యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చోడిశెట్టి, ఏజీహెచ్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్, ఫిజీషియన్ డాక్టర్ పి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘వాలంటీర్లకు చంద్రబాబు ఉగాది పండుగ లేకుండా చేశారు’
విజయవాడ: ఏపీలో వాలంటీర్ల ఉద్యోగాలు తీసేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారికి ఉగాది పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎన్నికల సమయంలో వారికి రూ. 10 వేలు జీతం పెంచుతామని చెప్పి ఉన్న ఉద్యోగం కూడా తీసేసిన ఘనత చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చిత్తూరులో వైఎస్సార్ సీపీ కార్యకర్త మురళీరెడ్డిపై దారుణంగా దాడి చేశారు. ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది. ఏడాది కాకుండానే ప్రజలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో రోడ్డెక్కుతున్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ఎన్ని లక్షల కోట్లు అప్పులున్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తా అని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు అన్ని అప్పులు లేకపోయినా ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఆరోజు అన్నీ హామీలు అమలు చేయగలుగుతాం అనిపించింది
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామీల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్లేటు ఫిరాయించారు. సూపర్ సిక్స్ను ఎగ్గొట్టేందుకు ఈసారి కొత్త రాగం అందుకున్నారు. ఇందుకు మంగళగిరి ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ సమావేశాలు వేదిక అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ హామీలిచ్చాం. ఆరోజు బయట నుండి చూస్తే అన్నీ చేయగలుగుతాం అనిపించింది. నేను అనేకసార్లు చెప్పా. అభివృద్ధి జరగాలి.. సంపద సృష్టించాలి. ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అప్పులు చేసి సంక్షేమపథకాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూరుకుపోయాం అంటూ వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో అప్పులపైనా మళ్లీ పచ్చి అబద్ధాలు చెప్పారాయన. రాష్ట్రానికి రూ. 9.75 లక్షల కోట్లు అప్పుందంటూ వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలు ఇదేం కొత్త కాదు. గతంలోనూ ఇలాగే మాట్లాడారాయన. ఇప్పుడు టీడీపీ సభలోనూ అమలు చేయలేకపోతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. -
ముగిసిన కొలికపూడి డెడ్లైన్.. బోసుబొమ్మ సెంటర్లో హైటెన్షన్
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్లతో వేడెక్కిన తిరువూరు టీడీపీ రాజకీయం.. ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చిన డెడ్లైన్ శనివారం ముగిసిపోయింది. దీంతో తర్వాత ఏం జరగనుందా? అనే చర్చ నడుస్తోంది. టీడీపీ నేత, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ అధిష్టానానికి 48 గంటల డెడ్లైన్ విధించారాయన. శనివారం ఆ గడువు కాస్త ముగిసిపోయింది. దీంతో రాజీనామా చేస్తారా? అనేది చూడాలి. మరోవైపు.. రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి తనను టార్గెట్ చేశాడని రమేష్ రెడ్డి ఆరోపించడం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచే కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం.. ప్రత్యేకంగా పార్టీ కేడర్ ద్వారా తిరువూరు నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై వేటు పడవచ్చనే చర్చా నడుస్తోంది. దీంతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బహిరంగ చర్చకు రావాలంటూ ప్రత్యర్థులకు కొలికపూడి సవాల్ విసరగా.. పార్టీ కేడర్ అందుకు ధీటుగా స్పందించింది. తాడే పేడో తేల్చుకుందాం రమ్మంటూ.. బోసుబొమ్మ సెంటర్లో చర్చకు కొలికపూడిని ఆహ్వానించింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ కేడర్ సవాళ్ల నేపథ్యంలో.. బోసుబొమ్మ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే.. సవాల్ విసిరిన కంచెపోగు ప్రసాద్ , డేవిడ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. -
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
విజయవాడ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలంటూ ముస్లింలు సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు(శనివారం) విజయవాడ ధర్నాచౌక్ లో మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ ధర్నా చేయనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు హెచ్చరిస్తున్నాయి.ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిన్న(మార్చి 27వ తేదీ గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం(మార్చి 26వ తేదీ) ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
AP Govt: లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు రూ.2.86 కోట్లు చెల్లింపు
విజయవాడఛ కూటమి సర్కారు కేసులు వాదిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ. 2.86 కోట్లు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కేసులు వాదించిందుకు గాను ఈ మొత్తాన్ని చెల్లించింది. హైకోర్టులో నాలుగు కేసులు వాదించినందుకు రూ. 2.86 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో అవినీతి కేసులను సిద్థార్థ్ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ స్కామ్, అమరావతి స్కామ్ కేసులు వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరఫున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కారు.సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థకు సూపర్ బాస్గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తున్నారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విజయవాడ: సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్టీ జెండాను వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్రెడ్డి ఆవిష్కరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పునూరు గౌతమ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని.. వైఎస్ జగన్ కార్మికుల పక్షపాతిగా ఉన్నారన్నారు. ‘‘ఆప్కస్ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో 1,30,000 మందికి పర్మినెంట్ ఎంప్లాయిస్ తీసుకొచ్చారు. నాలుగు లక్షల మందిని వాలంటీర్లు ఏర్పాటు చేశారు’’ అని గౌతమ్రెడ్డి తెలిపారు.సంక్షేమం అందించడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: దేవినేని అవినాష్దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులను, కార్మికులను ఇబ్బంది పెట్టలేదని.. ఆటో కార్మికులకు వైఎస్ జగన్ రూ.పదివేలు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు కార్మికులు అభ్యున్నతను విస్మరించారు. కోవిడ్ సమయంలో కార్మికులకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఎస్సార్సీపీ ప్రతి గ్రామంలో కార్మికులకు అండగా ఉంటుంది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అబద్ధాలు చెప్పి.. అధికారంలోకి వచ్చి..మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాహన మిత్రతో కార్మికులకు అండగా నిలిచారు. చంద్రబాబు వాలాంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆప్కాస్ వ్యవస్థను ఎత్తివేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ప్రశాంతంగా విధులు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు. సంవత్సరం గడుస్తున్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం లేదు. అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేం అని గవర్నమెంట్ రాకమందు చంద్రబాబు తెలియదా’’ అంటూ ఆమె ప్రశ్నించారు.కార్మికులకు వ్యతిరేకంగా కూటమి సర్కార్ నిర్ణయాలు: మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2 వేల మందికి ఆటో కార్మికులకు చేయూతను అందించింది. కూటమి ప్రభుత్వంలో ఆటో కార్మికులపై చలనాలు చేస్తున్నారు. 9 నెలల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు ఏం చేశారో చెప్పాలి. విజయవాడ నగరంలో హ్యాకర్లుపై దౌర్జన్యలు పెరిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? నిన్న(గురువారం) జరిగిన పరిషత్ ఎన్నికలో విజయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు ఆపలేకపోయారు. ఎంపీటీసీలు, జడ్పిటిసిలు వైఎస్సార్సీపీ పక్షాన బలంగా నిలబడ్డారు’’ అని ఆయన చెప్పారు. -
కొలికపూడి డ్రామా.. కేశినేని చిన్ని రివర్స్ డ్రామా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో కమీషన్ల పంచాయతీ రచ్చ రచ్చగా మారింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో లెక్కలు బట్టబయలయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమీషన్ల పంచాయితీ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా, ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి వాటాల్లో తేడా వచ్చింది. దీంతో ఎంపీ కేశినేని చిన్నిని కొలికపూడి పరోక్షంగా టార్గెట్గా చేశారు. చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హడావుడి సృష్టించారు.ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. 48 గంటల్లో రమేష్రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. తనను కాపాడేందుకు రమేష్రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిషోర్కు నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షల నగదు ఇచ్చాడంటూ కొలికపూడి ఆరోపించారు.కాగా, కొలికపూడి డ్రామాకు ఎంపీ కేశినేని చిన్ని రివర్స్ డ్రామా నడిపారు. తమకు లోన్లు ఇప్పిస్తామంటే వచ్చామని కొలికపూడి ఇంటి వద్ద ధర్నా చేసిన గిరిజన మహిళలు అన్నారు. లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయలు కూలీకి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్నారు. మరో వైపు, తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ అనుచరుడు రమేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.కొలికపూడికి ఎన్నికల సమయంలో 50 లక్షల ఆర్థిక సహాయం చేశానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను రెండు కోట్లు అడిగారని.. మండలంలో కాంట్రాక్టులన్నీ తాననే చేసుకోమన్నారంటూ ఎంపీ అనుచరుడు ఆలవాల రమేష్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్ పనుల్లో 10 శాతం కమిషన్ ఇస్తే చాలన్నారు. నేను రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు. మహిళలను లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయల కూలీకి తీసుకొచ్చి ధర్నా చేయించారు’’అని రమేష్రెడ్డి ఆరోపించారు. -
విజయ డెయిరీ టర్నోవర్ లక్ష్యం రూ.1,350 కోట్లు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.1,350 కోట్లు టర్నోవర్ సాధించా లని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ది కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. డెయిరీ పాలక వర్గ సమావేశం గురువారం ఫ్యాక్టరీ ఆవరణలోని పరిపాలనా భవనంలో జరిగింది. చైర్మన్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డైరెక్టర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాడి రైతులకు మూడో విడత బోనస్గా రూ.18 కోట్లు చెల్లించేందుకు సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. దీంతో ఈ ఏడాది మూడు విడతల్లో రూ.50 కోట్ల బోనస్ను అందిస్తున్నామని వివరించారు. పాడి రైతు సంక్షేమానికి, పశు సంరక్షణ కింద గత ఆర్థిక సంవత్సరంలో సుమారుగా మరో రూ.18 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ఏడాది విజయ డెయిరీ రూ.50 కోట్ల లాభాలను ఆర్జించిందన్నారు. కొత్త ఏడాదిలో రూ.1,350 కోట్ల టర్నోవర్తో పాటు కొత్త మార్కెట్లకు విస్తరణ, నూతన ఉత్పత్తుల ఆవిష్కరకు, పాడి రైతుల ఆర్తికాభివృబ్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు దాసరి వెంకట బాలవర్ధనరావు, వుయ్యూరు అంజిరెడ్డి, అర్జా వెంకట నగేష్, చలసాని చక్రపాణి, వేమూరి సాయివెంకట రమణ, పాలడుగు వెంకట రామవరప్రసాద్ పాల్గొన్నారు. -
నిత్యావసరాల ధరలపై పర్యవేక్షణ అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినియోగ దారుల ప్రయోజనాలకు భరోసా కల్పించేలా కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ, మార్కెట్ జోక్యం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌర సరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల అధికారులతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి, మార్చితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కూరగాయల ధరల్లో వ్యత్యాసాలు, విజయవాడ రాజీవ్గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్, కాళేశ్వరరావు రిటైల్ మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా విజయవాడ రైతుబజార్లలో నిర్ణయించిన ధరలు, బియ్యం, కందిపప్పు, పామాయిల్ తదితర నిత్యావసర సరుకుల ధరల్లో మార్పులు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులు, వినియోగదారులు, వ్యాపార వాణిజ్య వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రణాళికల రూపకల్పన, అమలు లక్ష్యంగా ఏప్రిల్లో భాగస్వామ్య పక్షాలతో వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎస్వో ఎ.పాపారావు, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
భానుడు భగభగ.. ప్రజలు విలవిల
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి మూడో వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం పది రోజులుగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉండగా, గత ఆది, సోమవారాల్లో కొంచెం తక్కువగా ఉంది. ఎండ తీవ్రతకు గురైన అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు దారి తీస్తున్నారు. ఈ ఏడాది ఎండలు ప్రజలకు కొత్త సమస్యలను తీసుకువస్తున్నాయి. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 డిగ్రీలు ఎక్కువ ప్రభావం ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంఖ్య కంటే దాని ప్రభావం ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెపుతున్నారు. ఆల్ట్రా వైలెట్ కిరణాలు ఎక్కువగా పడటం, ఉష్ణ కిరణాలు బాగా వేడిని కలిగిస్తున్నాయంటున్నారు. ఓజోన్ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఖాళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగం ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, గర్భిణులు, బాలింతలు ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. ఐదేళ్లలోపు పిల్లల్ని బయటకు పంపవద్దు. మంచినీరు ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం, మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా కాంక్రీట్ జంగిల్తోనే అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్ జంగిల్గా మారడంతో మార్చిలోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెట్లు లేకపోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వంటి కారణాలతో చల్లని వాతావరణం కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం నీళ్లు చల్లడం చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి. – డాక్టర్ ఎ.శ్రీకుమార్, వాతావరణ శాస్త్రవేత్త జాగ్రత్తలు తప్పనిసరి ఎండలోకి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కింది విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు ఎక్కువగా తాగటం, తీవ్రమైన ఎండకు ఫోకస్ కాకుండా ఉండాలి. మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలివే.. ఎండ తీవ్రతకు గురైన వారిలో కింద పేర్కొన్న లక్షణాలు గోచరిస్తున్నాయి. ఆకస్మికంగా వాంతులు, విరోచనాలతో పాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. చలితో కూడిన జ్వరం కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. వికారంగా ఉండటం, ఆకలి లేక పోవడం వంటి లక్షణాలు ఉంటున్నాయి. ఎండలో తిరిగే వారిలో చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు కొందరికి చర్మంపై దురదలు వస్తున్నాయి. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కొత్త సమస్యలతో బాధపడుతున్న వైనం ఎండల తీవ్రతకు వాంతులు, విరోచనాలు చలితో కూడిన జ్వరం, తీవ్రమైన నీరసం ఇప్పటికే జిల్లాలో చాలా మందిలో ఈ లక్షణాలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు -
చర్యకు ప్రతి చర్య ఖాయం
నందిగామ టౌన్: కూటమి పాలనలో జైళ్లకు హౌస్ఫుల్ బోర్డులు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం అక్రమ కేసులు మోపుతూ ఇబ్బంది పెడుతున్నారని, వారితో జైళ్లను నింపేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందన్నారు. మాయ మాటలతో అధికారం మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి తొమ్మిది నెలల పాలనలో సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అరుణకుమార్ మండిపడ్డారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లని చెప్పి ఏడాది ఒక్క సిలిండర్తో సరిపెట్టారని ఎద్దేవాచేశారు. అసలు సూపర్ సిక్స్ హామీ ఏమైందో ప్రజలకు అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. వంద పడకల ఆస్పత్రిని ప్రస్తుత ఆస్పత్రి స్థలంలో నిర్మించి నందిగామ భవిష్యత్తును కాలరాయొద్దని సూచించారు. వంద పడకల నిర్మాణం పేరుతో ఇప్పుడు ఆస్పత్రిని కూల్చి మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ జ్ఞాపకాలను చెరిపివేసేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వ ధరకు భూమి ఇవ్వటానికి ముందుకొచ్చిన రైతులను అవినీతిపరులుగా చిత్రీకరించేందుకు కూటమి నేతలు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలి ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేయాలే తప్ప కీడు తలపెట్టకూడదని అరుణకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ అభివృద్ధిపై కాకుండా ఏవేవో విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారని, వంద పడకల ఆస్పత్రి తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలుసని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు, ఎంపీపీ రమాదేవి, మంచాల చంద్ర శేఖర్, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అరుణకుమార్ -
టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే అల్టిమేటం
48 గంటల్లో రాజీనామా చేస్తానన్న కొలికపూడి తిరువూరు: తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అలవాల రమేష్రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే తన పదవికి రాజీ నామా చేస్తానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. ఇటీవల రమేష్రెడ్డి ఒక గిరిజన మహిళకు బ్యాంకు రుణం ఇప్పిస్తానని ఫోన్లో అసభ్యకర పదజాలం వాడారని, తన వెనుక విజయవాడ ఎంపీ చిన్ని ఉన్నారని ఆయన చెప్పుకొంటున్నారని కొలికపూడి తన నివాసం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్రెడ్డి తనకు ఎదురుపడితే గూబ పగలగొడతానని, ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్, మట్టి తరలింపు వ్యవహారంలో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, 97 లారీలను వదిలి మూడు లారీలను స్వాధీనం చేసుకోవడం వెనుక కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేధిస్తున్నారు అసత్య ఆరోపణలతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధిస్తున్నా రని టీడీపీ సీనియర్ నేత అలవాల రమేష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాత్రి ఎ.కొండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గిరిజన మహిళతో ఫోనులో అసభ్యంగా మాట్లాడినట్లు బోగస్ వీడియో సృష్టించి తనను వేధిస్తు న్నారని ఆరోపించారు. తనపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారని చెప్పడం కూడా అవాస్తవమన్నారు. ఎ.కొండూరుకు చెందిన గిరిజన మహిళలను రుణాలిప్పిస్తామని పిలిపించి వారితో ఫొటోలు దిగి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో తాను పార్టీ కోసం కష్టించి పనిచేసి శ్రీనివాసరావును గెలిపించానని, ఇందుకు ఆయన ఇచ్చే గుర్తింపు ఇదా అని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఎ.కొండూరు ప్రజలతో మమేకమైన తనపై అసత్యారోపణలు చేస్తున్న ఎమ్మెల్యే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పేదలు నివాసగృహాలు నిర్మించుకోడానికి అవసరమైన గ్రావెల్, మట్టి తోలకాలకు సైతం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తాను తప్పు చేస్తే అధిష్టానం తీసుకునే చర్యలకు బద్ధుడినని పేర్కొన్నారు. -
ఎన్టీటీపీఎస్లో ఉద్యోగాల పేరుతో మోసం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంటులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వి.పోతురాజు ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించి రూ.23 లక్షలు వసూలు చేశాడు. మూడేళ్ల క్రితం మోసానికి గురైన బాధితులు ఇబ్రహీంపట్నంలో గురువారం మీడియాను ఆశ్రయించి వివరాలు వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఎన్టీటీపీఎస్కు చెందిన 327 కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ అధ్యక్షుడు వి.పోతురాజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసపు వల విసిరాడు. విద్యుత్ సౌధలో సీఎండీ పీఏగా పనిచేస్తున్నట్లు బాధితులను నమ్మించి శ్రీహరి అనే వ్యక్తిని పరి చయం చేశాడు. అతని ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. యూనియన్లో మరో నాయకుడు రామును మధ్యవర్తిగా పెట్టి మచిలీపట్నానికి చెందిన 23 మంది యువకుల నుంచి విడతల వారీగా రూ.23 లక్షలు వసూలు చేశాడు. గేట్ పాస్ల కోసం వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆరు నెలల క్రితం పోతురాజును నిలదీయడంతో రూ.4 లక్షలు తిరిగి చెల్లించాడు. మరో రూ.19 లక్షలు చెల్లించకుండా, ఉద్యోగాలు ఇప్పించకుండా ముఖం చాటేశాడు. ఈ మోసంపై మచిలీపట్నం స్టేషన్కు సమాచారం ఇచ్చామన్నారు. పోతురాజును పిలిపించి విచారిస్తామని పోలీసులు తెలిపినట్లు వారు వివరించారు. రూ.23 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్ట్ కార్మికుడు న్యాయం కోసం మీడియాను ఆశ్రయించిన బాధితులు -
మండల పరిషత్ పీఠం వైఎస్సార్ సీపీదే
నందిగామ రూరల్: నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసు కుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. దీనిలో భాగంగా రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవిని ఎంపీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ ఆకుల హనుమంతరావు ప్రతిపాదించగా కేతవీరునిపాడు ఎంపీటీసీ సభ్యురాలు అరిగెల సుందరమ్మ బలపరిచారు. పెసరమల్లి రమాదేవి నామినేషన్ తప్ప కూటమి పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకపోవటంతో ఎన్నికల అధికారి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి ఎంపీపీగా పెసరమల్లి రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అనంతరం రమాదేవికి నియామకపత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. కాగా టీడీపీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన అంబారుపేట ఎంపీటీసీ సభ్యుడు ఓటింగ్కు హాజరు కాలేదు. ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సురేష్బాబు పాల్గొన్నారు. 12 మంది ఎంపీటీసీల మద్దతు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఎంపీపీ అభ్యర్థి పెసరమల్లి రమాదేవికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు పలికారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత కూటమి పార్టీలు అధికారంలోకి రావటంతో అంబారుపేట ఎంపీటీసీ సభ్యుడు అన్నం పిచ్చయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 12కు చేరింది. ఎంపీటీసీ సభ్యులందరి ఏకాభిప్రాయంతో మండల పరిషత్ పీఠాన్ని మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. అభినందనలు తెలిపిన నేతలు.. మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ నాయకులతో కలిసి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికై న రమాదేవిని ఎంపీపీ చాంబర్లోని కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. అనంతరం జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు గాదెల వెంకటేశ్వరరావు, కేడీసీసీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, మాజీ ఎంపీపీ సుందరమ్మ, వైస్ ఎంపీపీ హనుమంతరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావుతో పాటు పార్టీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికై న రమాదేవి మద్దతు పలికిన 12 మంది సభ్యులు సముచిత స్థానం దక్కింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను ఎంపీపీగా గెలిపించి సముచిత స్థానం కల్పించిందని రమాదేవి పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు, శాసనమండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి విధేయతగా పని చేసి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. -
రుద్రాక్ష వృక్షం
ఆకట్టుకుంటున్న నాగాయలంకలో తలశిల వెంకట నరసింహారావు (తాతయ్య) ఇంటి పెరటిలో రుద్రాక్ష వృక్షం ఏపుగా పెరుగుతోంది. చెట్టు నిండా కాయలతో ఆకట్టుకుంటోంది. శివుడి నయనాల నుంచి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సముద్ర తీరప్రాంతమైన నాగాయలంక గ్రామంలో ఎనిమిదేళ్ల క్రితం తాతయ్య రుద్రాక్ష మొక్క నాటారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో సేవా కార్యకర్తగా పనిచేస్తున్న తరుణంలో 2016లో దేవాలయాల ప్రాంగణాల్లో నాటేందుకు కొన్ని రుద్రాక్ష మొక్కలు తెప్పించారు. తన పెరటిలో, స్థానిక శివాలయ ప్రాంగణంలో ఒక్కొక్క రుద్రాక్ష మొక్క నాటారు. గత ఏడాది కొంత మేరకు కాపు వచ్చింది. ఈ ఏడాది ప్రస్తుతం వందల సంఖ్యలో రుద్రాక్షలతో చెట్టు ఆకట్టుకుంటోంది. చెట్టు ప్రధాన కాండం మూడు కొమ్మలుగా త్రిశూలాకృతిలో విస్తరించి చెట్టు అంతా కాయలు కాయడం తమ అదృష్టమని, త్రిమూర్తుల ఆవతారంగా భావించే త్రిముఖ రుద్రాక్షలే అధికశాతం వస్తుండటం విశేషమని తాతయ్య కుటుంబం సంబరపడుతోంది. అడిగిన వారికి రుద్రాక్షలను ఉచితంగా అందజేస్తోంది. – నాగాయలంక -
పెద్దాస్పత్రిలో పేదోళ్ల కష్టాలు
‘ఓపీ’క నశించి.. నీరసిస్తున్న రోగులుపేదోళ్లకు పెద్దాస్పత్రి అంటే పెద్దన్నలాంటిది. ఎలాంటి వ్యాధియైనా వారికి కనిపించే ఏకై క దిక్కు అదే. అలాంటి ఆస్పత్రిలో వైద్యం మిథ్యగా మారుతోంది. కనీస సౌకర్యాలు కనుమరుగవుతున్నాయి. చికిత్స కావాలంటే గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రిలో సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఏసీ గదులు దాటి బయటకు రాకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగుల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్కడ చూసినా రోగులు బారులు తీరి క్యూలైన్లలో దర్శనం ఇస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక పోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఏసీ గదులను వీడటం లేదు. దీంతో సిబ్బంది కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రిలో సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. పర్యవేక్షణేది.. రోగులకు అందుతున్న సేవలను నిత్యం రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షించాల్సి ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.. అవసరమైతే సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఆర్ఎంఓలు ఏసీ గదులకే పరిమితం కావడంతో పట్టించుకునే వారే కరువయ్యారు. అంతేకాదు సమయం దాటిన తర్వాత మహాప్రస్థానం వాహనం కోసం మాట్లాడేందుకు ఆర్ఎంఓలు ఫోన్లు ఎత్తడం లేదు. దీంతో సూపరింటెండెంట్కు ఫోన్చేస్తే ఆయన స్పందించాల్సి వస్తోంది. ఆర్ఎంఓల పనితీరుపై ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నా, వారిలో చలనం మాత్రం రావడం లేదు. రోగుల కష్టాలు వారికి పట్టడం లేదు. అరకొరగా మందులు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పక్షవాతం, గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగులు నిత్యం 300 నుంచి 400 మందికి పైగా వస్తుంటారు. వారికి గతంలో వైద్య పరీక్షలు చేసి, 30 రోజులకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. దీంతో నెలలో రెండు సార్లు ఆస్పత్రికి రావాల్సి వస్తోందని, చార్జీలకే చాలా వ్యయం అవుతోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దీర్ఘకాలిక రోగులకు నెలకు మందులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విజయవాడ జీజీహెచ్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎక్కడ చూసినా క్యూలైన్లలో నిరీక్షణే దీర్ఘకాలిక రోగులకు మందులు వారం నుంచి 15 రోజులకే ఇస్తున్న వైనం ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు ఎక్కడ చూసినా క్యూలైన్లే.. జీజీహెచ్కి వచ్చిన రోగులు ఓపీ తీసుకునే వద్ద నుంచి వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత మందులు తీసుకునే వరకూ ప్రతిచోట క్యూలైన్లలో వేచి ఉండాల్సిందే. ఓపీ కోసం కనీసం 30 నిమిషాలు క్యూలో ఉంటున్నారు. ఒక్కోసారి 45 నిమిషాలకు పైగానే పడుతోంది. అక్కడి నుంచి డాక్టర్ కన్సల్టేషన్ వద్దకు వెళితే అక్కడ గంటపాటు క్యూలో ఉండాల్సిందే. అక్కడి నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వెళ్తే మరో 30 నుంచి 45 నిమిషాలు, మందులు కోసం 30 నిమిషాలు.. ఇలా ప్రతిచోట క్యూలైన్లు ఉండటంతో రోగులు నీరసించి పోతున్నారు. ప్రస్తుతం ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. సూపర్ స్పెషాలిటీ విభాగాలైన న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ విభాగాల వద్ద పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. -
ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి గుండె తరలింపు
విమానాశ్రయం(గన్నవరం): బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను జీవన్దాన్లో భాగంగా గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ శరీరంలోని అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు. ఆమె గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బాక్స్లో భద్రపరిచిన గుండెను అంబులెన్స్లో గ్రీన్ చానల్ ద్వారా గుంటూరు నుంచి ఎయిర్పోర్ట్కు తరలించారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్యుల పర్యవేక్షణలో గుండెను తిరుపతి విమానాశ్రయానికి తీసుకు వెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. మెట్రో భూ సేకరణపై దృష్టి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ మెట్రో ప్రాజెక్టు భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎంఆర్సీఎల్) అందించిన ప్రతిపాదనల ప్రకారం ఉమ్మడి తనిఖీలకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం జరిగిన మెట్రోరైలు కార్పొరేషన్ బోర్డు సమావేశానికి వర్చువల్గా కలెక్టర్ హాజరయ్యారు. సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణ సంబంధిత అంశాలపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ సూచనలు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫేజ్–1 విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు భూ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేజ్–1 కారిడార్ 1ఏ (గన్నవరం–పీఎన్బీఎస్), కారిడార్ 1బీ (పీఎన్బీఎస్–పెనమలూరు) భూ సేకరణ, నిధుల అంచనా తదితరాలపై అధ్యయనం చేస్తామన్నారు. -
కోల్డ్ స్టోరేజీ భవనం నేలమట్టం
జగ్గయ్యపేట: పట్టణంలోని తొర్రకుంటపాలెంలోని సాయితిరుమల కోల్డ్స్టోరేజీలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే కోల్డ్స్టోరేజీ భవనం గురువారం నేలమట్టమైంది. నాలుగు రోజులుగా స్టోరేజీలోని మిర్చి బస్తాలు, అపరాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను ఆర్పుతున్నారు. భవనం పూర్తిగా నేలమట్టమైనప్పటికీ లోపలున్న మిర్చి పూర్తిగా కాలిపోలేదని శుక్రవారం నాటికి మంటలు అదుపులోకి వస్తాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. భవనం కుప్పకూలడంతో యంత్రాల ద్వారా మిర్చిని పక్కకు తీసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కనిపించని అధికారులు మూడు రోజులుగా కోల్డ్స్టోరేజీలో రైలులు నిల్వచేసిన రూ.కోట్ల విలువైన మిర్చి బుగ్గిపాలైనప్పటికీ సంబంధిత అధికారులు కనిపించడం లేదు. పంట నిల్వలు చేసిన రైతులు స్టోరేజీ వద్దకు వచ్చి కన్నీటిపర్యంతమవుతున్నారు. మక్కపేటకు చెందిన రైతు మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజీలో మినుము పంటను నిల్వచేశానని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని అగ్నిమాపక సిబ్బంది వద్ద వాపోయాడు. హోం మంత్రికి బాధిత రైతుల ఆవేదన పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి గురువారం వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనితను కలిసేందుకు కోల్డ్స్టోరేజీ బాధితులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అగ్నిప్రమాదంలో సుమారు 350 మంది రైతులకు చెందిన 35 వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయని, తమను ఆదుకోవాలని నియోజకవర్గంలోని ఇందుగపల్లి, భీమవరం, మక్కపేట, రామచంద్రునిపేట గ్రామా లకు చెందిన రైతులు కోల్డ్స్టోరేజీ ఇచ్చిన రశీదులు తీసుకొచ్చి నినాదాలు చేశారు. రెండు రోజులవుతున్నా పాలకులు పట్టించుకోవటం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు చేసిన తప్పునకు తాము బలవ్వాలా అని నినాదాలు చేశారు. హోంమంత్రి తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత హోంమంత్రిని కలిసేందుకు ఇద్దరు రైతులకు అనుమతిచ్చారు. వారు రైతుల పరిస్థితిని వివరించగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హోం మంత్రి అనిత బదులిచ్చారు. మూడు రోజులుగా ఆరని మంటలు శుక్రవారం నాటికి మంటలుఅదుపులోకి వస్తాయన్న ఫైర్ సిబ్బంది -
వైఎఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా శిరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కన్నమాల శామ్యూల్, ఎస్సీ సెల్ కార్యదర్శులుగా కన్నెగంటి జీవరత్నం, కొమ్ము చంటిబాబు, జాయింట్ సెక్రటరీగా చింతగుంట విజయ ఆనంద కుమార్, రాష్ట్ర వలంటీర్స్ వింగ్ కార్యదర్శిగా బొమ్మన శివ శ్రీనివాస్, బూత్ కమిటీస్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా చిలుకూరి ఉమా మహేష్, వీవర్స్ వింగ్ అధికార ప్రతినిధిగా పెంటి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా మావారి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిట్–1 జర్మన్ పరీక్షలో నూరుశాతం ఉత్తీర్ణత మధురానగర్(విజయవాడసెంట్రల్): చైన్నె గోధే ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఫిట్–1 జర్మన్ భాష పరీక్షలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధించడం సంతో షంగా ఉందని విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.ఆదిశేషు శర్మ పేర్కొన్నారు. మధురానగర్ కేంద్రీయ విద్యాలయంలో ఫిట్–1 జర్మన్ భాష పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గురువారం సర్టిఫికెట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆదిశేషు శర్మ మాట్లాడుతూ.. పరీక్షలు రాసిన 36 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందన్నారు. జర్మన్ భాషా ఉపాధ్యాయిని కారుమంచి రత్న స్వరాజ్ విద్యార్థులను విజయానికి నడిపించడంలో కీలకపాత్ర వహించారని కొనియాడారు. -
తిరుపతమ్మ హుండీ కానుకల ఆదాయం రూ.87.48 లక్షలు
పెనుగంచిప్రోలు: తిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.87.48 లక్షల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. గురువారం అమ్మవారి మండపంలో కానుకలను లెక్కించారు. 52 రోజులకు గాను ఆలయంలో మొత్తం హుండీ కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.87,48,911, బంగారం 35 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 620 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బీహెచ్వీఎస్ఎన్ కిషోర్కుమార్ పేర్కొన్నారు. అలాగే విదేశీ నగదు కొంత వచ్చిందన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో పాటు చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు, జూపూడి గ్రూప్ టెంపుల్స్ ఈవో బి. రవీంద్రబాబు, ఏఎస్ఐ శంకర్ పర్యవేక్షించారు. దుర్గమ్మ సన్నిధిలో చలువ పందిళ్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో దేవస్థానం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తోంది. ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ మొదలు లక్ష్మీగణపతి ప్రాంగణం, గాలి గోపురం, ఆలయ ప్రాంగణం, రాజగోపురం పరిసరాల్లో ఈ పందిళ్ల పనులు నిర్వహిస్తోంది. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆయా చలువ పందిళ్ల కింద సేదదీరేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పరిసరాల్లోని క్యూలైన్ మార్గాలలో కూలర్లు అందుబాటులో ఉంచారు. దేవస్థానంపై కీలక ప్రాంతాలతో పాటు ఘాట్రోడ్డు, మహా మండపం, కనకదుర్గనగర్లలో మంచినీటి సరఫరా చేసేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్గా అలవాల సుందరయ్య వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో చైర్మన్గా అలవాల సుందరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్గా డాక్టర్ ఇంటి రాజు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం నూతన కమిటీని ఎన్నిక చేసుకుంది. ఎన్నికల అధికారిగా సయ్యద్ ముస్తాక్ వ్యవహించారు. సమావేశంలో ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్గా అలవాల సుందరయ్య (యూటీఎఫ్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని సయ్యద్ ఖాసీం ప్రకటించారు. అదేవిధంగా సెక్రటరీ జనరల్గా డాక్టర్ ఇంటి రాజు (బీటీఏ), కోచైర్మన్లుగా జి. రామారావు(డీటీఎఫ్), ఆర్. రాంబాబు నాయక్ (ప్రధానోపాధ్యుయుల సంఘం) సయ్యద్ హఫీజ్ (రూటా), డెప్యూటీ సెక్రటరీ జనరల్గా సయ్యద్ ఖాసీం ( ఏపీటీఎఫ్), వి. భిక్షమయ్య(ఎస్టీయూ), సదారతుల్లా (ఏపీపీటీఏ), రవీంద్రప్రసాద్ (ఏపీటీఎఫ్ ) లను సమావేశం ఎన్నుకుంది. పరమ పదనాథుడు అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం పరమ పద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
రోగుల ఇబ్బందులు పట్టడం లేదు..
జబ్బు చేసి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన రోగులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఏదైనా ప్రశ్నిస్తే మేమింతే అన్నట్లుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో చేసేది లేక అష్టకష్టాలు పడుతూ వైద్యం పొందుతున్నారు. ముఖ్యంగా రోగులు అధికంగా వచ్చే న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల వద్ద పర్యవేక్షణ కొరవడింది. – చందా కిరణ్తేజ, మాచవరం మందులు ఇవ్వడం లేదు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగులకు మందులు అరకొరగా ఇస్తున్నారు. దీంతో పదిహేను రోజులకోసారి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్తే క్యూలైన్లలో ఉండలేక పక్షవాతం వచ్చిన రోగులు, గుండె జబ్బులు ఉన్న వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోగులపై కనికరం కూడా ఉండటం లేదు. – ఎండీ రిజ్వాన్, అశోక్నగర్ -
Chandrababu: ఇఫ్తార్ విందులో టీడీపీ టోపీ పంచాయితీ
విజయవాడ: ఇఫ్తార్ విందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టోపీ పెట్టే క్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్ జలీల్ ఖాన్ ల మధ్య పంచాయితీ జరిగింది. చంద్రబాబుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మొదట టోపీ పెట్టగా, దాన్ని జలీల్ ఖాన్ తీసేసి ఆ స్థానంలో తాను తెచ్చిన టోపీని పెట్టారు. తాను పెట్టిన టోపీని తీయడమేంటని ఆగ్రహించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.. జలీల్ ఖాన్ పెట్టిన టోపీని కూడా తీసేయబోయారు. దాన్ని జలీల్ ఖాన్ అడ్డగించారు. తాను పెట్టిన టోపీని తీయడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేని అడ్డుకున్న జలీల్ ఖాన్.. ఎమ్మెల్యే చేయిన పక్కకు తోసేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపించింది. ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు.సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
రైతుల పేరుతో రూ.6 కోట్ల రుణం
జగ్గయ్యపేట: ఆరుగాలం పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు లేక ఒక పక్క రైతులు ఆర్థిక నష్టాలతో అల్లాడుతున్నారు. గిట్టుబాట ధర వచ్చాకే విక్రయించాలన్న భావనతో అదనపు ఖర్చయినా భరించి పంటను నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరీజీలను ఆశ్రయిస్తున్నారు. అయితే కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం రైతులకు శాపంగా మారింది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు పంటను కోల్పోయి, పరిహారం వచ్చే దారిలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏడాదంతా కష్టపడి సాగు చేసి చివరకు అగ్ని ప్రమాదాలకు గురవటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 11 కోల్డ్ స్టోరేజీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 11 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, గొల్లపూడి, సూరాయపాలెం, ఇబ్రహీంపట్నం మండ లంలోని కొండపల్లి, తుమ్మలపాలెం, నందిగామ మండలంలోని అంబారుపేట, నందిగామ, మునగచర్ల, అనాసాగరం, పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల, నవాబుపేట, జగ్గయ్యపేట, మండల కేంద్రమైన వత్సవాయిలో కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ స్టోరేజీల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మిర్చి, పసుపు, బెల్లం, చింతపండు, మినుము, పెసలు, కందులు, బెంగాలి శనగలు వంటి ఉత్పత్తులు రైతులు నిల్వ చేసుకుంటారు. ఒక్కొక్క కోల్డ్ స్టోరేజీలో నాలుగు నుంచి ఎనిమిది అంతస్తులు ఉంటాయి. వేల టన్నుల పంట ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం ఈ కోల్డ్ స్టోరేజీలకు ఉంది. స్టోరేజీల్లో కానరాని నిబంధనలు కోల్డ్స్టోరేజీల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు పలు శాఖల అధికారులు విధించే నిబంధనలను యాజమాన్యాలు విధిగా పాటించాలి. ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. కానీ పలు స్టోరేజీల్లో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించటం లేదు. దీంతో రైతులు పండించిన పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కొందరు వ్యాపారులు లాభాలు వస్తాయని ఇష్టానుసారంగా గ్రూపులుగా ఏర్పడి కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు చేపట్టటమే కాకుండా అద్దెకు తీసుకుంటున్నారు. అధికారులు నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా జిల్లాలోని కొన్ని కోల్డ్ స్టోరేజీలు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా స్టోరేజీ నిర్మాణం చేయాలంటే సొంత స్థలం ఉండాలి. లేదా లీజుకు తీసుకుంటే దానికి సంబంధించిన లీజు డాక్యుమెంట్లు, మార్కెటింగ్ శాఖ ఇచ్చే లైసెన్స్, జీఎస్టీ నంబరు, ఫైర్ ఎన్ఓసీ వంటి అనుమతులు తప్పనిసరి. మార్కెటింగ్ శాఖ స్టోరేజీకి ఐదేళ్లకు ఒకసారి లైసెన్స్ ఇస్తుంది. ఆ గడువు దాటితే తప్పక రెన్యు వల్ చేయించాలి. ముఖ్యంగా స్టోరేజీల్లో పంట నిల్వల ప్రకారం యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని స్టోరేజీలు యాజమాన్యాలు ఇన్సూరెన్స్ చేయించడంలేదు. ఆయా స్టోరేజీల్లో ఏదైన ప్రమాదం జరిగితే పూర్తిగా నష్టపోయేది రైతులే. ఈ కోవలో ఈ నెల 25 అర్ధరాత్రి జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని తొర్రకుంటపాలెంలో ఉన్న సాయితిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత నెలలోనే ఈ కోల్డ్ స్టోరేజీ ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కోల్డ్ స్టోరేజీలో పంట నిల్వ చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తనిఖీలు హుష్కాకి కోల్డ్స్టోరేజీల్లో ఏడాది పొడవునా మార్కెటింగ్, అగ్నిమాపక, విద్యుత్, రెవెన్యూ శాఖాధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు రైతుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా స్టోరేజీ లైసెన్స్లు, పంటల స్టాకు వివరాలతో పాటు ఇన్సూరెన్స్ వివరాలను తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖల కింది స్థాయి అధికారులు కూడా తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. రైతులతో యాజమాన్యాల చెలగాటం పలు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు తమ అవసరాల కోసం రైతులతో చెలగాటమాడుతున్నాయి. స్టోరేజీల్లో పంట ఉత్పత్తుల పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ.కోట్లలో రుణాలు తీసుకుంటున్నాయి. దీంతో రైతులు పడిన కష్టాన్ని కోల్డ్ స్టోరేజీల నిర్వాహకులు అనుభవిస్తున్నారు. 2015– 16లో జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో శ్రీసాయి యోగానంద కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతులు నిల్వ ఉంచిన దాన్యంపై బ్యాంకులో రుణం తీసుకుని చెల్లించలేదు. బ్యాంకు అధికారులు స్టోరేజీను వేలం వేయటంతో రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు. కోల్డ్స్టోరేజీల్లో కనిపించని భద్రతా ప్రమాణాలు ప్రమాదాలు జరుగుతున్నా మేల్కొనని యంత్రాంగం 11 కోల్డ్ స్టోరేజీల్లో వేల టన్నుల మిర్చిపంట నిల్వలు జగ్గయ్యపేట కోల్డ్స్టోరేజీకి ముగిసిన ఇన్సూరెన్స్ గడువు రెన్యువల్ చేయించడాన్ని విస్మరించిన యాజమాన్యంలైసెన్స్ లేకుంటే చర్యలు కోల్డ్ స్టోరేజీల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు. స్టోరేజ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్లకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నాం. జగ్గయ్యపేట సాయి తిరుమల కోల్డ్ స్టోరేజ్కు ఇన్సూరెన్స్ గడువు ముగిసిందని విచారణలో తేలింది. ఇప్పటికే రైతుల వివరాలు తెలుసుకుంటున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. – మంగమ్మ, మార్కెటింగ్ శాఖ ఏడీ జగ్గయ్యపేటలోని సాయితిరుమల అగ్రిప్రొడక్ట్స్ యాజమాన్యం 19 మంది రైతుల పేరుతో రూ.6.60 కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. బ్యాంకు అధికారులు కోల్డ్ స్టోరేజీ ఇన్సూరెన్స్ గడువు ముగిసినప్పటికీ రుణం మంజూరు చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం పలు గ్రామాల రైతులు ఇన్సూరెన్స్ విషయమై కోల్డ్ స్టోరేజీ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. -
మూల్యాంకన పారితోషికం సకాలంలో ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పదో తర గతి మూల్యాంకన విధులు ముగిసిన వెంటనే ఉపాధ్యాయులకు పారితోషికం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధి కారి యు.వి సుబ్బారావును డీపీఆర్టీయూ ప్రతినిధులు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను ఆధ్వర్యంలో నాయకులు డీఈఓను బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. విజయవాడకు దూరంగా ఉన్న గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఉపాధ్యాయులకు వారి ఆసక్తిని బట్టి మూల్యాంకన విధులు కేటాయించాలని, గర్భిణులు, పసి బిడ్డల తల్లులకు మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమ వినతిపై డీఈఓ సానుకూలంగా స్పందించారని శ్రీను తెలిపారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ వేలంలో రూ. 27.48 లక్షల ఆదాయంపెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయం వద్ద ఏడాది కాలంలో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో రూ.27.48 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కిషోర్కుమార్ తెలిపారు. ఆలయంలో ఫొటలు తీసుకునే హక్కును రూ.8.50 లక్షలకు కె.శ్రీనివాసరావు), చాపలు ఆద్దెకిచ్చే హక్కును రూ.88 వేలకు కె.అజయకుమార్, భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరిచే హక్కును రూ.3 లక్షలకు జి.గోపినాథ్, నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ హక్కును రూ.8.12 లక్షలకు ఎన్నురేష్ దక్కించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో 20 దుకాణాల నిర్వహణకు వేలంలో రూ.6,98,000 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంగాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడలో ఆర్పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభమైంది. ఆర్పీఎఫ్ మహిళా సిబ్బంది సంక్షేమం, సాధికారత దిశగా విజయవాడ డివిజన్లో రూ.1.5 కోట్లుతో 30 పడకల మహిళా బ్యారక్ను రైల్వే కోర్టు సమీపంలో నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే ఇన్స్పెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా సింగ్ ఠాకూర్ ఈ బ్యారక్ను బుధవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్పీఎఫ్ ఎస్కార్ట్, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ), రైల్వే విధులకు హాజరయ్యే మహిళా పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు బ్యారక్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్పై వర్కుషాపు విజయవాడ డివిజన్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో రైల్వే ఆడిటోరియంలో ఏపీఆర్పీఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ‘యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ’ పై శిక్షణ ఇచ్చారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల్కు కీలకమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే శిక్షణ తరగతుల లక్ష్యమని ఆరోమా సింగ్ ఠాకూర్ తెలిపారు. అనంతరం విధుల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఎస్సీ వల్లేశ్వర బి.టి, సీనియర్ డీఈఎన్ ఎస్.వరుణ్బాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిలో పిండాల్ ఘాట్వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయసు 40 నుంచి 45 సంవత్సరాలు మధ్య ఉంటుంది. ఒంటిపై నలుపురంగు చారల డిజైన్ ఫుల్హ్యాండ్ షర్ట్, నలుపు రంగు బనియన్, లైట్ కాఫీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహం నీటిలో తేలియాడుతూ ఉండడం గమనించిన స్థానికులు సచివాలయ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీకి సమాచారం అందించారు. ఉమెన్ ప్రొటెక్షన్సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు గుర్తు తెలియని మగ వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.భవనం పైనుంచి జారి పడి యువకుడు మృతిసత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ప్రమాదవశాత్తు ఓ భవనం మూడవ అంతస్తు నుంచి జారి పడి యువకుడు మృతిచెందిన ఘటనపై ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ మస్తాన్ నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలసి కేదారేశ్వరపేట జీరో లైన్లో మూడంతస్తుల భవనంలో నివాసముంటున్నాడు. అతని కొడుకు షేక్ మంజీ గతంలో మెడికల్ ఫీల్డ్లో పనిచేసి ఆరోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో వారు ఉంటున్న ఇంటి వరండాలో దుస్తులు ఆరేసేందుకు తాడు కట్టమని తల్లి చెప్పడంతో కొడుకు మంజీ సరే అని కట్టేందుకు వెళ్లగా అప్పటికే అక్కడ బట్టలు ఉతికిన సబ్బు నీరు ఉండటంతో కాలు జారి అదుపు తప్పి గోడ మీదుగా కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలిపటమట(విజయవాడతూర్పు): దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పలు అనుమానాలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసినప్పుడు ఎవరో చంపేసి అక్కడ పడవేసినట్లుగా ఉందని, దీనిపై పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా వారి నుంచి సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించిన వ్యక్తికి తలకి గాయం కావడం ముఖం మీద ఎవరో కొట్టినట్లు ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితం స్వయంగా ప్రవీణ్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో తనకు ప్రాణహాని ఉన్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి లోతైన విచారణ జరిపి నిజాలు బయటికి తీయవలసిందిగా బిషప్ కౌన్సిల్ తరఫున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.తల్లిని చంపిన వ్యక్తికి జీవితఖైదుతిరువూరు: డబ్బు కోసం తల్లిని చంపిన నిందితుడికి 15వ ఏడీజే కోర్టు జడ్జి జీవితఖైదు విధించినట్లు గంపలగూడెం ఎస్ఐ శ్రీను తెలిపారు. 2023లో గంపలగూడెం మండలంలోని చింతలనర్వకు చెందిన మరీదు వెంకటేశ్వరరావు డబ్బు కోసం తల్లి వెంకమ్మను వేధించి ఆమె నిరాకరించడంతో దాడిచేసి కొట్టి చంపాడు. నిందితుడిని అరెస్టు చేసిన గంపలగూడెం పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితుడు 2006లో తండ్రి జగ్గయ్యను కూడా హత్య చేసినట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అబ్దుల్ షరీఫ్ వాదించారు. -
రాగి తీగలు చోరీ చేసే అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
కంకిపాడు: సులభ సంపాదన మోజులో రాగితీగల చోరీలకు పాల్పడ్డ అంతర్ రాష్ట్ర ముఠాకు కంకిపాడు పోలీసులు చెక్ పెట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 22 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల రాగి తీగ స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు పోలీసుస్టేషన్లో బుధవారం గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన పంబి శ్రీను తాపీ కార్మికుడు. జల్సాల కోసం చోరీలను మార్గంగా ఎంచుకున్నాడు. ఇతనిపై గతంలోనే 12 వైరు చోరీ కేసులు, రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. పరిచయస్తులైన ఇబ్రహీం పట్నం ఫెర్రీకి చెందిన ముత్యాల గోపాలకృష్ణ, జి.కొండూరు గ్రామానికి చెందిన వెన్నముద్దల దుర్గాప్రసాద్రెడ్డిలను కలుపుకొని వ్యవసాయ మోటర్ల దగ్గర ఉండే కరెంటు వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లకు ఉండే వైర్లు కత్తిరించి అందులోని రాగివైరు చోరీ చేయటం మొదలుపెట్టారు. పొలాల్లో వ్యవసాయ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి వైర్లు కత్తిరించి అక్కడే వైర్లు కాల్చి అందులో ఉన్న రాగివైరు చోరీ చేసి అమ్ముకుంటుంటారు. రెక్కీలో పట్టుబడ్డ నిందితులు కంకిపాడు మండలం ప్రొద్దుటూరు పరిధిలోని కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రెండు మోటర్ బైక్లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తించటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులైన పంబి శ్రీను, ముత్యాల గోపాలకృష్ణ, వెన్నముద్దల దుర్గా ప్రసాద్రెడ్డిగా గుర్తించారు. వీరిపై ఇప్పటివరకూ కంకిపాడు–4, ఉంగు టూరు–1, తోట్లవల్లూరు–4, ఆత్కూరు–2, వీరవల్లి–7, హనుమాన్ జంక్షన్–3, ఎ.కొండూరు–1 చొప్పున 22 కేసులు ఉన్నాయి. వీరు 216 వ్యవసాయ మోటర్లు, 7 ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగివైరు చోరీ చేసినట్లు నిర్థారించారు. వారి నుంచి రూ.4.50 లక్షల విలువైన 300 కిలోల బరువు, 2400 మీటర్ల పొడవు గల రాగివైరు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన సీఐ జె. మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్ఎన్ మూర్తి, అశోక్, బాజీబాబు, హెచ్జీలు మురార్జీ, పిళ్లైలకు రివార్డులు అందించారు. సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరురూరల్ ఎస్ఐ సురేష్బాబు పాల్గొన్నారు. -
రంగు వెలుస్తున్న రంగస్థలం
జి.కొండూరు: ప్రాచీన కళలు ఆదరణ కోల్పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కళాసంస్థల కృషి కారణంగానే అక్కడక్కడ ఈ కళలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాచీన యుగం నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, సామాజిక సమస్యల పరిష్కారం, స్వాతంత్రోద్యమం, ప్రజా ప్రయోజన ఉద్యమాల్లో ప్రజల్లో ఆలోచన, చైతన్యం, అవ గాహన కల్పించడంలో కళారంగానికి ప్రత్యేక స్థానం ఉంది. టీవీలు, థియేటర్ల రాకతో వాటికి ఆదరణ కరువైంది. ప్రస్తుతం సెల్ఫోన్ల కారణంగా సోషల్ మీడియా, సినిమా, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోల వైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసిన ప్రాచీన కళారంగం నిరాదరణకు గురైంది. వాటికి జీవం పోయాల్సిన ప్రభుత్వాలు సైతం రంగస్థల దినోత్సవాల్లో హామీలు గుప్పించడం మినహా ప్రోత్సాహం ఇస్తున్న దాఖలాలు లేవు. కాలంతో పోటీ పడుతూ ప్రాచీన కళారంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటక రంగ కళాకారులు కొందరు ఆరాటపడుతున్నారు. గురువారం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. మైలవరంలో నాటకరంగ ఆనవాళ్లు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో పూర్వం జమీందార్లు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని చరిత్ర చెబుతోంది. మైలవరం రెండో రాజుగా ప్రసిద్ధి చెందిన రాజా సూరానేని వెంకటపాపయ్యారావు బహుద్దూర్ 1912లో మైలవరం కంపెనీ అని పిలవబడే ‘బాలభారతి నాట్యమండలి’ని స్థాపించారు. ఆయన ఈ సమాజం ద్వారా నాటక రంగాన్ని, కళాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. 1917, 1918లో బెజవాడలో ‘మైలవరం థియేటర్’ నిర్మించిన తర్వాత ఈ నాటక సమాజాన్ని అక్కడికి తరలించి ఎందరో ప్రముఖ కళాకారులకు వేతనాలు చెల్లించి ప్రోత్సహించారు. మైలవరం బాలభారతి నాటక సమాజ ప్రదర్శన అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు ఉండేదని కళాకారులు చెబుతున్నారు. ఈ నాటక సమాజంలో యడవల్లి సూర్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలం, ఉప్పులూరి సంజీవరావు, గోవిందరాజుల వెంకట్రామయ్య వంటి ఎందరో సుప్రసిద్ధ కళాకారులు పనిచేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో... ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రాచీన కళలకు ప్రత్యేక స్థానం ఉంది. పౌరాణిక పద్య నాటకం, చారిత్రక , జానపద నాటకాలు, సాంఘిక నాటకాలు, పరిషత్తు నాటకాలు, హరికథ, బుర్రకథ, జముకుల కథ, చెక్క భజన, తోలు బొమ్మలాట, డప్పు కళలు ఇలా అన్ని ప్రాచీన కళలకు చెందిన నాలుగువేల మంది వరకు కళాకారులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్నారు. వీరిలో నాటక రంగానికి చెందిన కళాకారులు 1500 మంది ఉన్నారు. వీరు కాక కోలాటం వంటి వివిధ కళలకు చెందిన కళాకారులు అదనం. పూర్వ వైభవానికి కృషి ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన నాటక, సినీరంగ కళాకారులు పోలుదాసు రంగనాయకులు, పోలుదాసు శ్రీనివాసరావు సోదరులు ‘ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సేవా సంస్థ’, ‘వెలగలేరు థియేటర్ ఆర్ట్స్’ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నాటక సమాజాలను ఆహ్వానించి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోదరుల్లో ఒకరైన పోలుదాసు రంగనాయకులు 50కి పైగా నాటకాల్లో విభిన్న పాత్రలు పోసిస్తూ రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నాటకరంగానికి జీవం పోసేందుకు కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించడం, సీనియర్ కళాకారులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. పోలుదాసు శ్రీనివాసరావు వినూత్న కథాంశంతో నాటికలు రచించి, కళాకారులకు శిక్షణ ఇచ్చి, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇప్పిస్తుంటారు. ఇదే మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన నాటక, సినీ రంగ కళాకారుడు వీరంకి వెంకట నర్సింహారావు ‘చైతన్య కళా స్రవంతి’ సంస్థను స్థాపించి గ్రామంలో నాటకోత్సవాలను నిర్వ హిస్తున్నారు. ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని ప్రాచీన కళలు స్వచ్ఛందంగా నాటక రంగానికి జీవం పోస్తున్న కళాకారులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1500 మంది నాటకరంగ కళాకారులు నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం -
భవానీ ద్వీపం పునరుద్ధరణ పనులు ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వరద వచ్చిన దాదాపు ఏడు నెలలకు పర్యాటక శాఖకు చెందిన భవానీ ద్వీపం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఆగస్ట్ 31న కృష్ణానదికి వరద వచ్చి దాదాపు పది అడుగులకుపైగా నీట మునిగిన భవానీ ద్వీపం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు ద్వీపానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో భవానీ ద్వీపంలో పవర్ రెస్టోరేషన్, వరద ఉధృతికి కూలిపోయిన భారీ వృక్షాలు, మేట వేసిన ఇసుక దిబ్బల తొలగింపు ప్రక్రియ కాంట్రాక్ట్ను టెండర్ ద్వారా దక్కించుకున్న బొర్రా క్రాంతి కుమార్ మొదలు పెట్టిన పునరుద్ధరణ పనులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ నూకసాని బాలాజీ బుధవారం కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, విజయవాడ డీవీఎమ్ కృష్ణచైతన్యతో కలిసి ద్వీపంలో పర్యటించారు. కార్యక్రమంలో భవానీ ఐలాండ్, బెరంపార్క్, బీఐటీసీ మేనేజర్లు డి.సుధీర్, కె.శ్రీనివాస్, రవీంద్ర, కాంట్రాక్టర్లు బొర్రా శ్రీకాంత్, మన్నం కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్సీ ఉచిత శిక్షణకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోండి చిలకలపూడి(మచిలీపట్నం): సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహెద్బాబు బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను వెబ్పోర్టల్లో ప్రదర్శించారని, ఎంపికై న అభ్యర్థులందరూ తమ ఆప్షన్ సర్వీస్ ద్వారా జ్ఞానభూమి పోర్టల్లో ఎం.ప్యానల్ కోచింగ్ సంస్థలకు ఈ నెల 28వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందు మాకొద్దు!
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు. -
బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జి.వి రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఫలే ఆలీబేగ్ వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని రాజాంపేటకు చెందిన గుడిమెట్ల భానుప్రియ ఈ నెల 13న కుటుంబసభ్యులతో సామర్లకోటకు గౌతమి ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. ఆమె బ్యాగులో ల్యాప్టాప్, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను ఉంచి దాన్ని తలకింద పెట్టుకుని నిద్రపోయింది. విజయవాడ దాటిన తర్వాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. టీటీఈలకు ఫిర్యాదు చేసి ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. తిరిగి ఈ నెల 16న విజయవాడ జీఆర్పీ స్టేషన్కు చేరుకుని తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేసింది. 95 గ్రాముల చైను, 44 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల రెండు జతల చెవి రింగులు, 42 గ్రాముల నల్లపూసల గొలుసు, 24 గ్రాముల వెండి భరణితో పాటు ల్యాప్టాప్, ఒక సెల్ఫోన్ బ్యాగులో ఉన్నట్లు వాటి విలువ సుమారు రూ. 15.65 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు ప్రత్యేక బృందాలుగా.. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిలో ఖమ్మంజిల్లా బోనకల్లు మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ (25), షేక్ హైమద్(25)ను గుర్తించారు. నిందితులు హైదరాబాద్లోని కేజీహెచ్బీ కాలనీలోని రాఘవేంద్ర మెన్స్ హాస్టల్లో ఉన్నట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా చోరి చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద కొంత బంగారం, ల్యాప్ట్యాప్ లభ్యమవ్వగా, కొంత బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్ మినహా మొత్తం రికవరీ చేశారు. వీరిపై గతంలో కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూ.15.62 లక్షల ఆభరణాలు స్వాధీనం -
చెప్పుకోలేక.. కన్నీళ్లు దిగమింగలేక!
కన్నబిడ్డలు ఉన్నారో లేరో తెలియదు.. భారమై వదిలించుకున్నారో, తానే వాళ్లకు భారమనుకున్నాడో చెప్పుకోలేడు.. ముదిమి వయసులో మండుటెండలో జీవశ్చవమయ్యాడు. కాళ్లు కదపలేడు, కన్నీటిని ఆపుకోలేడు.. ఊరు పేరు తప్ప వివరాలకు ఉబికి వచ్చే కన్నీళ్లే సమాధానం. ఈ 70 ఏళ్ల శరీరం కర్నూలు నడిబొడ్డున, ప్రభుత్వాసుపత్రి ఎదుట మంగళవారం మధ్యాహ్నం దిక్కులు చూస్తూ.. దేవుడిపైనే భారం వేసింది. రోడ్డు మధ్యనున్న పచ్చని డివైడర్లో ఈ ‘పెద్దరికం’ మోడుబారి పడుకుంది. ఇతని పేరు సత్యనాగరాజు. ఊరు విజయవాడ తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి అతనిది. విషయం తెలుసుకున్న ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు చలించిపోయారు. ‘108’ని పంపి ఆయన్ను క్యాజ్వాలిటీలో అడ్మిట్ చేయించారు. –కర్నూలు(హాస్పిటల్) -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) విజయవాడ 6.24 4.49 మచిలీపట్నం 6.23 4.47నిందితులు అరెస్టు రైలులో బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జగ్గయ్యపేటలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. –IIలోuI -
స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ (ఏపీఏ ఏఏ) రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎం. ఓబుల్ రెడ్డి, ఎం. మోహనవెంకటరామ్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రాష్ట్ర సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘ చైర్మన్గా డాక్టర్ కె. రవికాంత్, గౌరవాధ్యక్షుడిగా పి.గోవిందరాజు, ఉపాధ్యక్షుడిగా రవి శంకర్ రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసరావు, మధు, భాస్కర్, సతీష్, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జునరావు, వినోద్, శ్రీధర్, సుబ్బారెడ్డి, నటరాజరావు, కోశాధికారిగా ఐ. రమేష్, కార్యవర్గ సభ్యులుగా కాజ మొహిద్దిన్, నాగ మురళి, దేవుడు, శంకర్ రెడ్డి, మేఘన లను సభ్యులు ఎన్నుకున్నారు. 2028 వరకు వీరంతా సంఘ ప్రతినిధులుగా కొనసాగుతారు. జూడో రాష్ట్ర జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: జాతీయ జూనియర్ జూడో క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. బాలుర జట్టుకు తేజకుమార్, తిరుమల, దిలీప్ కుమార్ రెడ్డి, ఉదయ్ కిరణ్, గోవర్ధన్, గగన్ సాయి, శివ సాయి, రంగస్వామి, బాలికల జట్టుకు ప్రవల్లిక, లక్ష్యా రెడ్డి, వైష్ణవి, అలేఖ్య, కీర్తన, భావన, రిషిత కృష్ణ, కోటేశ్వరి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి ఉత్తరా ఖండ్లోని డెహ్రాడూన్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం అధ్యక్షుడు గణేష్ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి గమిడి శ్రీనివాస్, ఉషారాణి, కోచ్ తేజ, శ్రీను శాప్ కార్యాలయంలో మంగళవారం అభినందించారు. మధ్యకట్టకు మరమ్మతులు ప్రారంభం మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎట్టకేలకు నగరపాలకసంస్థ అధికారులు బుడమేరు మధ్యకట్టలో బుడమేరుకు పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. బుడమేరు వరదల సమయంలో బుడమేరు మధ్యకట్టలో గండి పడింది. బుడమేరులో వరదప్రవాహం గండి ద్వారా ఏలూరు కాలువలోకి ప్రవహించింది. దీంతో రోడ్డు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి తగ్గిన తరువాత తూతూ మంత్రంగా బుడమేరులోని మురుగునీరు ఏలూరు కాలువలోకి రాకుండా కొద్దిపాటి మట్టిని వేసి వదలేశారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ రాకపోకలు నిలిచిపోవటంతో స్థానికులు పడుతున్న అవస్థలు వివరిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఎట్టకేలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. 27న ఉప సర్పంచ్ ఎన్నికలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో ఈనెల 27న ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ పంచాయతీ, వత్సవాయి మండలం మంగొల్లు, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం, విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పంచాయతీల ప్రిసైడింగ్, అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి హాజరై ఓరియంటేషన్ కార్యక్రమంలో సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి జీఎల్ఎల్వీఎన్ రాఘవన్ పాల్గొని ఓరియంటేషన్ను విజయవంతం చేశారన్నారు. -
కల్యాణమే.. వైభోగమే..
కలియుగ దైవం శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై భూలోకానికి వస్తే భక్తులుపరవశులైపోరూ! అటువంటి భక్తిరసమైన సన్నివేశం విజయవాడ లబ్బీపేట శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం సాక్షాత్కరించింది. శ్రీ వారి జన్మతిథి శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీవేంకటేశ్వరా కల్యాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాసుల కల్యాణ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు లబ్బీపేట ప్రధాన వీధులగుండా పంచవాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న ఉత్సవ విగ్రహాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. 50 రకాలైన పూలతోనూ తులసి మాలలతో 100 మంది దంపతులతో పుష్పాభిషేకం చేశారు. కార్యక్రమంలో సేవా ట్రస్ట్ అధ్యక్షుడు పోలిశెట్టి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల శ్రీనివాసరావు, కోశాధికారి గోంట్లా రామ్మోహనరావు పాల్గొన్నారు. – విజయవాడ కల్చరల్ -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
కొండాయపాలెం(పామర్రు): పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో కొండాయ పాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదమద్దాలి శివారు కొండాయపాలెం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మరో లారీకి తాళ్లు కట్టి క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. లారీడ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు మలుపులో లారీ ఆగి ఉండటంతో వేగం వస్తున్న లారీ డ్రైవర్ చూడక ఢీకొట్టాడని తెలుస్తోంది. లారీ డ్రైవర్ తోట్లవల్లూరు మండలం కళాసుమాలపల్లికి చెందిన గుంజ శ్రీనివాసరావుగా గుర్తించారు. బాధితుడిని మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. లారీ ఢీ.. వృద్ధుడి మృతి పాయకాపురం(విజయవాడరూరల్): నున్న పీఎస్ సమీపంలో ప్రకాష్నగర్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న టి.పైడిరాజు (65)ను లారీ ఢీ కొనగా ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానాయక్నగర్కు చెందిన తాలాడి పైడిరాజు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. చేపల మార్కెట్ వద్ద చేపలు కొనుగోలు చేసి వాటిని బాగు చేయించడానికి ప్రకాష్నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ.. అతన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన పైడిరాజు తలపై లారీ ఎక్కడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు టి.శ్రీను ఫిర్యాదుపై పోలీసులు కేసు నమాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు విక్రేతలు ముగ్గురికి అరదండాలు పెనమలూరు: గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పెనమలూరు ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా గంగూరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఆటోలో ముగ్గురు వ్యక్తులు పారిపోబోయారు. పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పారిపోయాడు. పోలీసులు, రెవెన్యూ అధికారుల పంచనామా చేయగా వివరాలు వెల్లడయ్యాయి. కానూరు సనత్నగర్కు చెందిన కొండూరి మణికంఠ(కేటీఎం పండు), యనమలకుదురుకు చెందిన నరేల రామారావు, కొక్కిలిగడ్డ పవన్కుమార్ రాజమండ్రిలో రాజు అనే వ్యక్తి వద్ద 22 కేజీల గంజాయి కొన్నారు. గంజాయిని తరలిస్తుండగా గంగూరులో వాహనాల తనిఖీలో పట్టపడగా పవన్కుమార్ పారిపోయాడు. పట్టుబడిన ఇద్దరి వద్ద 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చగా నెల్లూరు జైలుకు తరలించారు. మరో కేసులో.. యనమలకుదురులో గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. యనమలకుదురు డొంకరోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచరంతో పోలీసులు నిఘా వేయగా కృష్ణలంక తారకరామానగర్కు చెందిన కలింగపట్నం మనోహర్, యనమలకుదురుకు చెందిన మారుబోయిననాగరాజు, ఉసురుమోతు పవన్కల్యాణ్ గంజాయితో పట్టుబడ్డారు. వారి వద్ద రూ.9 వేలు నగదు కూడా స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. -
సర్కారుతో ఢీఎస్సీ!
కదం తొక్కిన నిరుద్యోగులు అవనిగడ్డ వంతెన సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు అవనిగడ్డ: మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని నినదించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ వంతెన సెంటర్లో మంగళవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది అభ్యర్థులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. భారీ ర్యాలీ.. ధర్నా.. అవనిగడ్డ గ్రంథాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం వంతెన సెంటర్లో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మానవహారం నిర్వహించారు. ‘సీఎం చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి, ప్రభుత్వం ఆమోదించిన 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, పది లక్షల మంది డీఎస్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి, తొలి సంతకం చేసిన డీఎస్సీ ఎక్కడ?, చంద్రన్నా.. మెగా డీఎస్సీ ఏదన్నా, జీవో 117ని రద్దు చేయాలి, ప్రశ్నించే పవన్కల్యాణ్ ఎక్కడ?’ అంటూ నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్ ఎక్కడ? ఎన్నికల ముందు సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని, లేదంటే అభ్యర్థుల తరఫున తానే ప్రశ్నిస్తానని చెప్పిన డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ? అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న ప్రశ్నించారు. డీఎస్సీ ఇవ్వక పోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర మనోవేదన పడుతున్నారని, ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్కల్యాణ్ నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. యువతను తప్పుదోవ పట్టించేలా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ నీచమైన రాజకీయాలకు పవన్కల్యాణ్ తెరతీశారని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో రహదారిపై బైఠాయింపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ -
పన్నుల పెంపును నిలిపేయాలి
రౌండ్టేబుల్ సమావేశంలో పలు సంఘాల నేతలు కృష్ణలంక(విజయవాడతూర్పు): ఏప్రిల్ నుంచి ఆస్తి పన్నుతో సహా పన్నుల పెంపును నిలిపి వేయాలని, కేపిటల్ విలువపై ఆస్తి పన్ను లెక్కించడానికి ఉద్దేశించిన సవరణ చట్టం 44/2020ని తక్షణమే రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. విజయవాడ గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏపీ పౌర సమాఖ్య, ట్యాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్యాక్స్పేయర్స్ సంఘ అధ్యక్షుడు వి.సాంబిరెడ్డి అధ్యక్షతన మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఆస్తిపన్నును సమీక్షిస్తామని టీడీపీ వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పన్నుల పెంపుదలను సమీక్షించలేదని, చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని సూచించారు. లేటుగా చెల్లించే వారిపై 24 శాతం పెనాలిటీ వసూలు చేస్తున్నారని, ఇంత ఏ ఆర్థిక సంస్థ వసూలు చేయడం లేదన్నారు. ఆస్తిపన్నును మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రూపాల్లో ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని కోరారు. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను పెరుగుదలను తక్షణమే నిలిపి వేయాలని కోరుతూ సీఎంకు, మున్సిపల్ శాఖా మంత్రికి ఈ నెల మొదట్లోనే లేఖను రాశామన్నారు. 44/2020 చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, కుదరకపోతే చట్టాన్ని రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. పెనాల్టీ లేకుండా మే నెల వరకు చెల్లించడానికి అవకాశం ఇవ్వాలన్నారు. నీటి పన్ను, డ్రైనేజి పన్నులపై 7 శాతం పెంపుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అన్ని అసోసియేషన్లు సీఎంకు, మున్సిపల్ శాఖామంత్రికి లేఖలు రాయాలని, ఇవే డిమాండ్లతో ఏప్రిల్ 9వ తేదీన ధర్నా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. కాలనీ అసోసియేషన్ల సమాఖ్య నాయకులు వెంకటేశ్వరరావు, అన్నె భాస్కరరావు, వి.రామారావు, బెఫీ నాయకుడు ఆర్.అజయ్కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లీజ్.. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): బిజినెస్ లేక అల్లాడుతున్న వ్యాపారవర్గాలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ‘అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి ప్లీజ్!’ అంటూ ఒత్తిడి తీసుకురావడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే పదానికి ఆస్కారం లేదు. ‘కూటమి’ అనధికారికంగా ఇలాంటి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తోందంటూ వ్యాపారవర్గాలు మండిపడుతున్నాయి. వ్యాట్లో ఉన్న విధానాన్ని జీఎస్టీలో అమలు చేయాలనుకోవడం ఏంటని వ్యాపార సంఘాల నేతలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో వాణిజ్య పన్నుల శాఖ ఒకటి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖకు మూడు డివిజన్లలో సుమారు 20 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఆదాయం అధికంగా ఉన్న సర్కిల్ కార్యాలయాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లుకు అధికారులు ఇటీవల మౌఖిక ఆదేశాలిచ్చారు. ‘కూటమి’ పాలనలో జీఎస్టీ తగ్గిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం చివర మాసం కావడంతో సాధ్యమైనంత మేర అధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ పెరిగిందని చెప్పుకోవడానికి కూటమి ఇలాంటి ఎత్తుగడలకు దిగిందని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యాపారాలు లేక జీఎస్టీ పడిపోతే లేని అమ్మకాలను ఎంత చూపించినా ప్రయోజనం ఏమిటంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా జీఎస్టీ పెంచినా వచ్చే నెల అది మళ్లీ భారీగా పడిపోతుంది కదా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘కూటమి’ తీరుతో దిగజారిన వ్యాపారాలు ‘కూటమి’ పాలక విధానాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. పశ్చిమ కృష్ణాలో నిర్మాణరంగానికి అవసరమైన సిమెంట్ ఇతర వస్తువుల అమ్మకాలతో పాటుగా తూర్పు కృష్ణాలో ఆటోమొబైల్ రంగంలోనూ అనుకున్న అమ్మకాలు వృద్ధి లేక రావాల్సిన పన్నులు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వ తీరుతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో వ్యాపారాలు బాగా తగ్గాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో వ్యాపారాలను కొనసాగించే పరిస్థితులు లేవంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమయంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండంటూ అధికారులు కోరటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల నుంచి వ్యతిరేకత కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అడ్వాన్స్ ట్యాక్స్కు వ్యతిరేకంగా ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు లేఖ రాశారు. జీఎస్టీలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదని కానీ దాన్ని అమలు చేయాలని చూడటం వ్యాపారులను ఇబ్బందికి గురి చేయటమేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని చెబుతున్న ప్రభుత్వ విధానానికి సైతం ఇది తూట్లు పొడుస్తుందని ఆయన ఆ లేఖలో చెప్పారు. జిల్లాలోని వ్యాపార వర్గాలు సైతం సీఎం రమేష్ రాసిన లేఖను ఉదహరిస్తూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. లేని నిబంధనలతో తిప్పలు వ్యాపారులపై జీఎస్టీ అధికారుల ఒత్తిడి ఆర్థిక సంవత్సరం ఆఖరు కావడంతో జీఎస్టీ పెంపునకు ఎత్తుగడ వ్యాపారాలు తగ్గలేదని చెప్పుకోవడానికి ‘కూటమి’ తంటాలు ఒకవైపు ప్రభుత్వ తీరుతో జీఎస్టీ పడిపోతుంటే ఆదాయం పెంచాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడిపెడుతున్నారు. జీఎస్టీ పన్నుల విధానంలో అడ్వాన్స్ ట్యాక్స్ అనే నిబంధన లేదు. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఇప్పటికి వ్యాట్ అమలవుతోంది. దీంతో ప్రభుత్వ పెద్దలు మిగిలిన జిల్లాల్లో జీఎస్టీ విధానంలోనూ అమలు చేసి ఈ నెలలో భారీగా ఆదాయాన్ని పెంచాలంటూ ఒత్తిడి తీసుకువస్తోంది. అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెట్టడంతో వారు కూడా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. రిటర్నులు వేయమంటున్నాం అడ్వాన్స్ ట్యాక్స్ కాదు అడ్వాన్స్గా రిటర్నులు వేయమంటున్నాం. మేం ఎక్కడా అధికారికంగా అడ్వాన్స్ ట్యాక్స్పై మాట్లాడటం లేదు. ఈ నెలలో జరిగే వ్యాపారానికి సంబంధించి వ్యాపారులు వచ్చే నెల 11వ తేదీ లోపు అమ్మకాలను ఫైనల్ చేసి, 20వ తేదీ లోపు దానిని ఖరారు చేసి ట్యాక్స్ కడుతుంటారు. ఆర్థిక సంవత్సరం చివర కావటంతో ఈ నెలలోనే రిటర్నులను 31వ తేదీలోపు వేయమంటు న్నాం. అంతేగానీ ఏ వ్యాపారికి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇవ్వలేదు. –షేక్ జహీర్, డెప్యూటీ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ, విజయవాడ డివిజన్–1 -
పది నెలలవుతున్నా..
కూటమి ప్రభుత్వం వచ్చి పదినెలలు అవుతోంది. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు. దానినే అమలు చేయక పోవడం బాధాకరం. డీఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిలక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. – రఘు, గుంటూరు ఇంకెన్నేళ్లు అప్పులు చేయాలి.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. తొలి సంతకం చేస్తే ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ అంటున్నారు. అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అప్పులు చేయమంటారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. – ప్రసాద్, శ్రీకాకుళం -
ప్రయాస!
పచ్చబంగారం(పసుపు) ఈ సారి ప్రకాశిస్తుందన్న ఆశతో రైతన్నలు ఉత్సాహంగా పనులు చేపడుతున్నారు. వాణిజ్య పంటల్లో ఒకటైన పసుపు పంటను కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ వ్యవసాయ సీజన్లో 5,031 ఎకరాల్లోనూ, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లోనూ సాగు చేశారు. కొద్ది రోజులుగా పసుపు ఆకుతీత, దుంప తీత పనులను రైతులు ముమ్మరంగా చేపడుతున్నారు. కల్లాల్లో పసుపు కొమ్ములను రాశులుగా పోసి వంట పనులు చేపడుతున్నారు. సహజంగా పసుపు కొమ్ములను బాండీల్లో పెట్టి ఉడికించి ఆరబెడుతుంటారు. ఈ దఫా అధికశాతం మంది బాయిలర్స్ను వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఎండబెట్టి పసుపు కొమ్ముల నాణ్యత పెంచే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మంచి ధర వస్తే మార్కెట్కు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. – కంకిపాడు ప్రకాశించాలని..ఉడికిన కొమ్ములను కల్లంలో ఆరబెట్టిన దృశ్యం -
చేనేత వస్త్రాలను ఆదరించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలను మంగళవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు. దారి దోపిడీ కేసులో నిందితులకు కఠిన కారాగార శిక్ష గన్నవరం: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చెందిన ఓ వైద్యుడు వద్ద మొగల్రాజపురానికి చెందిన కుక్కల వెంకటేశ్వర్లు కారు డ్రైవర్. గతేడాది ఆగస్టు 26వ తేదీ రాత్రి ఆయన మరదలు వరసైన కొమ్ము శిరోమణితో కలిసి వెంకటేశ్వర్లు బైక్పై ముస్తాబాద వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో రిలయన్స్ గోడౌన్ వద్ద ముగ్గురు వ్యక్తులు వీరి బైక్ను అడ్డుకున్నారు. వీరి వద్ద బంగారు చైన్, ఉంగరంతో పాటు చెవి దిద్దులు, కీప్యాడ్ ఫోన్ను లాక్కుని దుండగులు పరారయ్యారు. ఘటనపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన విజయవాడలోని జక్కంపూడికి చెందిన పాలపర్తి వెంకన్న, నల్లగొండ సురేష్, కుమ్మరిపాలెంకు చెందిన నక్కా గోపిరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 8వ అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజుల జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్ నేతృత్వంలో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. మాధవి వాదనలు వినిపించారు. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు పూర్తిరైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో విజయవాడ రైల్వే డివిజన్ 206.29 ఆర్కేఎం (రూట్ కిలోమీటర్లు) ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్)ను విజయవంతంగా పూర్తిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డివిజన్లోనే కీలకమైన సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్లో ఈ నెల 23న 29.67 ఆర్కేఎం ఏడీఎస్ను విజయవంతంగా పూర్తిచేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 206.29 ఆర్కేఎం సాధించినట్లైంది. దీంతో విజయవాడ–విశాఖపట్నం, విజయవాడ– గూడూరు సెక్షన్న్లలో రద్దీ తగ్గుతుంది. ఏబీఎస్ అనేది రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచు తుంది. ఈ సందర్భంగా డీఆర్ఎం నరేంద్ర అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. -
స్టేడియంపై ఇక ‘శాప్’ పెత్తనమే!
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అజెండాకు మొత్తం 230 అంశాలు రాగా.. అందులో 197 అంశాలను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని 9 అంశాలు, ఆఫీస్ రిమార్కుకు 8, ప్రత్యేక కమిటీల సిఫార్సుకు 6, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తూ 3, ర్యాటిఫై చేస్తూ ఒక అంశం, ముందస్తు అనుమతి లేకుండా అదనపు ఖర్చును 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేయాలని, జాతీయ రహదారి విభాగానికి సిఫార్సు చేయాలని రెండు ప్రతిపాదనలను సభ్యులు తీర్మానించారు. ‘శాప్’ చేతిలోకి ఇందిరాగాంధీ స్టేడియం.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్కు) అప్పగించేందుకు వీఎంసీ కౌన్సిల్ తీర్మానించింది. దీనిపై చర్చ చేయాలని వచ్చిన ప్రతిపాదనపై సభ్యులు మాట్లాడుతూ ఎంతకాలం అజమాయిషీ ఇవ్వాలి ? తిరిగి కార్పొరేషన్కు ఎప్పుడు అప్పగిస్తారు? అనే దానిపై సరైన స్పష్టత లేదని.. దీనిపై నిబంధనలను రూపొందించాలని కమిషనర్కు సూచించారు. కఠినంగా వ్యవహరించొద్దు.. పన్నుల వసూళ్లలో వీఎంసీ రెవెన్యూ సిబ్బంది పన్ను చెల్లింపుదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పన్నులు చెల్లింకపోతే యూజీడీ పైపులైను, తాగునీటి పైపులైన్లు తొలగిస్తున్నారని కార్పొరేటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది ఎన్నికలు, వరదల కారణంగా పన్నుల వసూళ్లలో కాస్త నెమ్మదించిందని, పన్నుల వసూళ్లలో సిబ్బందికి టార్కెట్లు విధించామని కౌన్సిల్కు స్పష్టం చేశారు. దీనిపై కార్పొరేటర్లు స్పందిస్తూ మౌలిక వసతులు కల్పించలేని వీఎంసీ అధికారులు బలవంతంగా కనెక్షన్లను తొలగించటంపై అభ్యంతరం చేయటంతో కమిషనర్ పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రీట్ వెండర్ల కమిటీపై దుమారం నగరంలోని వీధి విక్రయదారుల క్రమబద్ధీకరణకు కౌన్సిల్ ఆధ్వర్యంలో 19 మంది సభ్యులతో కమిషనర్ చైర్మన్గా, పట్టణ ప్రణాళిక విభాగం, ప్రజారోగ్య విభాగం, పీవో యూసీడీ, ట్రాఫిక్ డీసీపీ, బ్యాంకర్, అడ్వకేట్ శాశ్వత సభ్యులుగా వివిధ రకాల వీధి విక్రయదారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఒక ఎన్జీవో, ఒక కమ్యునిటీ ఆర్గనైజర్లు రొటేషన్ విధానంలో కమిటీ ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రతిపాదనపై కార్పొరేటర్లు తొలుత అభ్యంతరం తెలిపారు. కమిటీలో కార్పొరేటర్లందరినీ భాగస్వామ్యం చేయాలని సభకు సూచించారు. ‘సాక్షి’పై అక్కసు.. 15వ డివిజన్లో రామలింగేశ్వర కట్టపై రేయింబవళ్లు ఇసుక లారీలు తిరగటంతో రోడ్డుకింద ఉన్న పైపులైన్లు పగిలిపోతున్నాయని, వాహనాల వేగంతో ఇప్పటికే ముగ్గురు కూడా చనిపోయారని దీనిపై చర్యలు తీసుకోవాలని డెప్యూటీ మేయర్ బెల్లందుర్గ సమస్యపై ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదనలో ‘సాక్షి’ పత్రికలో కూడా వార్త వచ్చిందని ఉండటంతో టీడీపీ కార్పొరేటర్లు చర్చను పక్కదారి పట్టేలా వ్యవహరించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’పై అక్కసుకు వెళ్లగక్కుతూ పత్రికలో వచ్చిన వార్తలు ప్రతిపాదన ఎలా పెడతారని టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పారు. టీడీపీకి ప్రజల సమస్యల కంటే కూడా సాక్షి పత్రికపైనే అక్కసు ఉందని, సమస్య పరిష్కారానికి నియోజకవర్గం స్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని బెల్లం దుర్గ పట్టుబట్టారు. తీర్మానించిన వీఎంసీ కౌన్సిల్ స్ట్రీట్ వెండింగ్ కమిటీకి ఆమోదం ఎద్దడి లేకుండా తాగునీటి సరఫరా చేయాలని నిర్ణయం పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరించొద్దని సూచన తాగునీటి ఎద్దడిపై సుదీర్ఘ చర్చ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్ల నుంచి వచ్చే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, మరమ్మతుల పేరుతో మూడు సర్కిళ్ల పరిధిలో పలు ప్రాంతాల్లో తరచూ నీటి సరఫరా నిలిపేస్తున్నారని సభ్యులు ప్రశ్నించారు. ప్రధానంగా కొండ, శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా అంతంత మాత్రంగా జరుగుతుందని సభ దృష్టికి తీసుకురాగా.. అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు. రిజర్వాయర్ల నీటిమట్టం తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగం ఉందని, ఇప్పుడు అది పనిచేయటంలేదని, పైపులైన్ల రూటుమ్యాపు కూడా అందుబాటులో లేకపోవటంతో ఎక్కడపడితే అక్కడ రోడ్డును తవ్వేసి వదిలేస్తున్నారని కార్పొరేటర్లు వివరించారు. -
కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట: ధర లేదని కోల్డ్ స్టోరీజ్లో నిల్వ చేసుకున్న తమ కష్టమంతా అగ్నికి ఆహుతైందని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. జగ్గయ్యపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మిర్చి కాలి బూడిదైంది. పట్టణంలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో ఏడాదిగా సుమారు 350 మంది రైతులు 35 వేల మిర్చి బస్తాలను నిల్వ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్టోరేజ్ ప్రాంతంలో పొగతో కూడిన మిర్చి ఘాటు రావడంతో స్థానికులు ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, సిమెంట్ కర్మాగారాల నుంచి వచ్చిన ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కోల్డ్ స్టోరేజ్ గోడలను జేసీబీలతో పగలగొట్టి మంటలను అదుపు చేయడానికి యత్నించారు. రూ.5 కోట్ల నష్టం జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు, ఏపీ ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని కర్మాగారం నుంచి సీవో2ను తీసుకువచ్చి ప్రత్యేక పైప్లైన్తో ఏర్పాటు చేయడంతో మంటలు కొంత మేర అదుపులోకి వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రమాదంలో రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ నిల్వ చేసిన రైతుల పేర్లను అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం వరకు దట్టమైన పొగ, మిర్చి ఘాటుతో సమీప గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కారణంతో సమీపంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. 35 వేల మిర్చి బస్తాలు బుగ్గి జగ్గయ్యపేట తొర్రకుంటపాలెంలో ఘటన -
ఎన్టీఆర్ జిల్లా: ఘోర అగ్నిప్రమాదం.. కోల్డ్స్టోరేజ్లో కాలిబూడిదైన మిర్చి
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: జగ్గయ్యపేట పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కోల్డ్ స్టోరేజ్లో మిర్చి బస్తాలు తగలబడిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తొర్రగుంటపాలెంలోని సాయి తిరుమలగిరి అగ్రి ప్రొడక్ట్స్ కోల్డ్ స్టోరేజ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు నలభై వేల మిర్చి బస్తాలు తగలబడినట్లు సమాచారం. నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మిర్చి ఘాటుకు తుమ్ములు, దగ్గులతో పరిసరి గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేమంటున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు మాదిగ
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతికి పంపాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ రూరల్ నల్లకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ అమలు అయ్యేవరకు అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు నిలుపుదల చేయాలని, అలాగే ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆర్డినెన్స్ జారీ చేయటంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఆదూరి నాగమల్లేశ్వరరావు మాదిగ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీష, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్చార్జ్ ముమ్మిడివరపు చిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు స్వాధీనం జగ్గయ్యపేట: తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి. వెంకటేశ్వర్లు సోమవారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ముక్త్యాల గ్రామానికి రాత్రి గస్తీ నిమిత్తం సీఐ వెళ్లారు. అక్కడ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇసుక లారీలు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేశారు. చందర్లపాడు మండలం కాసరబాద నుంచి ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలుతున్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి లారీలను చిల్లకల్లు స్టేషన్కు తరలించినట్లు సీఐ చెప్పారు. -
27న ఇఫ్తార్ విందుకు పక్కా ఏర్పాట్లు
సమన్వయ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 27న ముస్లింలకు విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు హాజరవుతారన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఇఫ్తార్ విందు కార్యక్రమ సన్నద్ధతపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం సజావుగా జరిగేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు. విందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు తాగునీటికి, చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వక్ఫ్బోర్డు సీఈవో షేక్ మహ్మద్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకుబ్ బాషా, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఖాజా మస్తాన్, మైనార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పదవుల్లో 52 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మాజీ డీజీపీ, బీఎస్పీ ఏపీ సమన్వయకర్త డాక్టర్ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ కులగణన చేయాలని జాతీయ స్థాయిలో డిమాండ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందితో కులగణన చేయించిందన్నారు. బిహార్లో జనగణన చేసి బీసీ జనాభా 65 శాతం ఉన్నట్లు తేల్చారన్నారు. దాంతో ఆ రాష్ట్రంలో బీసీలకు 65 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారన్నారు. మన రాష్ట్రంలోనూ బిహార్ తరహాలో జనాభా ప్రాతిపదికన బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీసీల్లో అనేక కులాలకు చట్టసభల్లో నేటికీ ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు.. తమ ప్రభుత్వం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న బీసీల లెక్కలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కేశవరావు బాబు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా విజయవాడకు చెందిన డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ కేశవరావు బాబు మధుమేహం, రక్తపోటుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు తెలుగులో రచనలు చేసి, వైద్య పరిశోధనల్లోనూ తనదైన ముద్ర వేశారు. నగరంలో ఓడీఏ ప్రాజెక్టు వైద్యాధికారిగా, పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా, వీఎంసీ స్కూల్ హెల్త్ ఆఫీసర్గా సేవలు అందించారు. ఐఎంఏ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులవడంతో పలువురు అభినందనలు తెలిపారు. వీఎంసీ ఆర్ఎఫ్వోకు ఉత్తమ సేవా పతకం పటమట(విజయవాడతూర్పు): వీఎంసీలోని అగ్నిమాపక విభాగంలోని రీజనల్ ఫైర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావుకు ఉత్తమ సేవా పతకం లభించింది. తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా 32 ఏళ్లపాటు విశిష్ట సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఏపీ ఫైర్ సర్వీస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. మద్యానికి బానిసైన వ్యక్తి బలవన్మరణం పెనమలూరు: తాడిగడపలో ఓ వ్యక్తి మద్యానికి బానిసగా మారి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప కార్మికనగర్కు చెందిన గరికే గోపి తన తల్లితండ్రులు, సోదరుడు గరికే సాంబశివరావు(25)తో కలిసి ఉంటున్నారు. అందరూ కూలీ పనులు చేస్తారు. కాగా సాంబశివరావు మద్యం, ఇతర దురలవాట్లకు బానిసగా మారటంతో అతని భార్య విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సాంబశివరావు మద్యం అధికంగా తాగుతున్నాడు. అయితే ఆదివారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో సిల్క్ చీరతో మెడకు ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన గోపి చీరకు వేలాడుతున్న సాంబశివరావును రక్షించే యత్నం చేయగా అప్పటికే అతను మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు రైల్వే సిబ్బందికి జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ అందుకున్నారు. సోమవారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో జీఎం భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన గొల్లప్రోలు ఇంజినీరింగ్ సెక్షన్లోని ట్రాక్ మెయింటైనయిర్ ఎల్.వెంకటరమణ, అసిస్టెంట్ లోకోపైలెట్ టింకు యాదవ్, రాజమండ్రి మెకానికల్ విభాగంలోని టెక్నీషియన్–1 వై.యశ్వంత్కుమార్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
రేపు సిద్ధార్థలో ‘ఇన్కెండో–2కే25’
పోస్టర్ను ఆవిష్కరించిన కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కామర్స్ కోర్సు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు తమ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ బుధవారం ఇన్కెండో–2కే25 పేరుతో పాఠ్యాంశాలు, సాంకేతిక అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 2010 నుంచి ఇన్కెండో పేరుతో కామర్స్ విద్యార్థులకు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు క్విజ్, దలాల్ స్ట్రీట్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, యాడ్ మేడ్, డ్యాన్స్ టు ట్రిబ్యూట్, మిస్టర్ అండ్ మిస్ ఇన్కెండో, ఇన్కెండో ప్రీమియర్ లీగ్ వంటి అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, తెనాలిలోని కళాశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కళాశాల కామర్స్ విభాగాధిపతి కోనా నారాయణరావు, కళాశాల డీన్ రాజేష్ సి. జంపాల, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కార్తికేయునికి వెండి వస్తువులు బహూకరణ
మోపిదేవి: స్థానిక మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి చెన్త్నెకు చెందిన బి. రంగరామానుజం రూ. 1,20,000 విలువుగల వెండి వస్తువులు సోమవారం బహూకరించారు. ఉదయం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం 440 గ్రాముల వెండి చటారి, 532 గ్రాముల వెండి వేలాయుధం, 125 గ్రాముల వెండి చిన్నబిందెను స్వామివారికి కానుకగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. అనంతరం దాత లను ఆలయ మర్యాదలతో సత్కరించారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన మాలంపాటి రామకృష్ణయ్య, సీతాలక్ష్మి దంపతులు రూ. లక్ష విరాళంగా సోమవారం సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరు తొలుత స్వామివార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు విరాళాన్ని అందజేశారు. -
30న బాడీబిల్డింగ్ క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ క్రీడాకారులను ఈ నెల 30వ తేదీన ఎంపిక చేస్తామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ నాలుగో తేదీన 13 జిల్లాల మినీ స్టేట్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు భీమవరంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా క్రీడాకారులను ఈ నెల 30వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ సింగ్ నగర్ మనోహర్ జిమ్లో ఎంపిక చేస్తామన్నారు. 55 నుంచి నుంచి 85 కిలోల బరువు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. 165 సెంటీమీటర్ల ఎత్తు లోపు, పైబడిన వారికి రెండు గ్రూపులుగా మోడల్ ఫిజిక్ పోటీలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 86867 71358, 85550 47808 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జీఎస్ఎంసీకి కేంద్ర ప్రభుత్వ ప్రశంసా పత్రంలబ్బీపేట(విజయవాడతూర్పు): రీసెర్చ్ విభాగంలో చేసిన కృషికి గాను విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(జీఎస్ఎంసీ)కు కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ రీసెర్చ్ విభాగం ప్రశంసా పత్రం అందజేసింది. ఈ నెల 20వ తేదీన న్యూడిల్లీలో జరిగిన మెడికల్ కాలేజీస్ రీసెర్చ్ కనెక్ట్–2025 కార్యక్రమంలో ఐసీఎంఆర్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, జాయింట్ సెక్రటరీ రిచా ఖోడా చేతుల మీదుగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్ ఈ ప్రశంసా పత్రం అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 118 మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్లు (ఎంఆర్యూ) ఆ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ఏఆర్యూ నోడల్ అధికారి డాక్టర్ ఎన్.శ్రీదేవి, రీసెర్చ్ సైంటిస్ట్–సీ డాక్టర్ పి.మధుసూదన్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత కృష్ణా జిల్లా లక్ష్యంచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను ఆయన సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. హ్యూమన్ రైట్స్ కన్వీనర్ లక్ష్మీఉష మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం కారణంగా కొత్త జబ్బులు వస్తున్నా యని ఆందోళన వ్యక్తంచేశారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గోవాడ ప్రశాంతి, డాక్టర్ గౌతమ్, రేవతి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులకు భరోసా కల్పిస్తాం విజయవాడలీగల్: వినియోగదారుల హక్కు లకు రక్షణ, భరోసా కల్పించేందుకు కృషిచేస్తా మని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో అదనపు వినియోగదారుల కమిషన్ బెంచిని నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఇదొక మంచి వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో వినియోగదారుల ఫోరంలో 1,33,736 కేసులు నమోదవగా చాలా వరకు పరిష్కారం లభించిందన్నారు. వచ్చే జూన్ నుంచి పాఠశాలల్లో, కళాశాలల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్జూమర్ క్లబ్లు ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్, విజయవాడ వినియోగదారుల అదనపు బెంచ్ ఫోరం చైర్మన్ సీహెచ్.కిషోర్, సభ్యులు కె.శశికళ, బీబీఏ ప్రెసిడెంట్ చంద్ర మౌళి, సెక్రటరీ అరిగల శివరామప్రసాద్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, బీబీఏ మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఆర్పీల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి
ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నందు పనిచేస్తున్న ఆర్పీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం (సీఐటీయూ)డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మెప్మా ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో ఆర్పీలకు మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని, వేతనాలకు పనికి ముడిపెట్టకుండా గ్రేడింగ్ విధానం రద్దుచేసి పదివేల రూపాయల వేతనం ప్రభుత్వమే చెల్లించాలి వంటి డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో ఆర్పీలు పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం మెప్మా అధికారులు ఆర్పీల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముజఫర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
ఉపాధిలో అవినీతి మేట్లు
జి.కొండూరు: కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. దోచుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు నియమించుకున్న ఆ పార్టీ సానుభూతిపరులు చేస్తున్న అక్రమాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలకు ఇచ్చే కూలీల వేతనాల్లో అక్రమాలకు పాల్పడిన 24 మంది మేట్లపై సోమవారం వేటుపడింది. ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ 24 మంది మేట్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన వారే కావడం గమనార్హం. వారంతా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్తో కుమ్మకై ్క రైతులకు అందాల్సిన వేతన నగదు రూ.25 లక్షల వరకు స్వాహా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహా పర్వంపై అధికారులు విచారణ చేపట్టారు. అక్రమం జరిగింది ఇలా... చండ్రగూడెం గ్రామ పంచాయతీలో రైతులు కొన్నేళ్లుగా మల్లెతోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి మల్లెలు విజయవాడ, హైదరాబాద్ వరకు ఎగుమతి అవుతాయి. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మల్లెతోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన 43 మంది రైతులు మల్లెసాగుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 43 మంది రైతులు 19.40 ఎకరాల్లో 31,040 మల్లె మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటడానికి అవసరమైన కూలీలతో గుంతలు తవ్విస్తారు. ఒక్కొక్క గుంతకు రూ.35 చొప్పున ఉపాధి పథకం కింద వేతనం ఇస్తారు. ఇది కాక రైతులకు ఏడాదికి తోటల నిర్వహణ కింద వంద రోజుల పని దినాలను సైతం కల్పిస్తారు. గుంతలు తవ్వేందుకు రైతులు ఉపాధి కూలీలను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో జాబ్కార్డు ఉండి తమకు అనుకూలంగా ఉన్న గ్రామస్తులను మేట్లు ఎంచు కొని వారి పేర్లను పని చేయకుండానే గుంతలు తవ్విన వారి జాబితాలో చేర్చారు. ఆ తరువాత వారి పేరిట వచ్చిన వేతన నగదును వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఈ క్రమంలో వేతన నగదు రాని గ్రామానికి చెందిన రైతులు కొందరు ఉపాధి హామీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో మేట్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రైతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇదే కాకుండా గ్రామంలో రైతులు అందరినీ విచారణ జరిపిన తర్వాత పక్కదారి పట్టిన నగదును మేటల్ నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముందుగా గ్రామానికి చెందిన 24 మంది మేట్లు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించారు. రూ.25 లక్షల స్వాహా చేశారని అంచనా పక్కదారి పట్టిన నగదు రూ.లక్ష వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే అంత తక్కువ నగదు పక్కదారి పట్టినప్పుడు 24 మంది మేట్లను, ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మల్లె తోటలే కాకుండా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సాగవుతున్న ప్రతి ఉద్యాన పంటల కూలీల వేతనాల్లో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అప్పటికే సాగులో ఉన్న ఉద్యాన పంటలకు కూడా ఆర్థిక సాయం ఇప్పిస్తామంటూ మేట్లు రైతులతో దరఖాస్తులు చేయించి, ఆయా పంటల సాగుకు వేతనాల రూపంలో వచ్చే నగదును కూడా నొక్కేశారని ఆరోపణలు వస్తు న్నాయి. ఇవే కాకుండా గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో సైతం పనిలోకి రాని కూలీల పేర్లు కూడా నమోదు చేసి ఆ నగదును నొక్కేశారని తెలుస్తోంది. మొత్తంగా గ్రామ పంచాయతీ నుంచి రూ.25 లక్షల వరకు మేట్లు దోచారని సమాచారం. ఈ నగదును వాటాలు పంచుకునే విషయమై మేట్ల మధ్య తేడాలు రావడంతో అక్రమ దందా బయటకు పొక్కిందని సమాచారం. రైతులకు అందాల్సిన వేతన నగదును దోచిన మేట్లు చండ్రగూడెంలో రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన వైనం వేతనాల అక్రమాలపై విచారణ జరుపుతున్న అధికారులు 24 మంది మేట్లు విధుల నుంచి తొలగింపు ఈ మేట్లు అందరూ టీడీపీ సానుభూతిపరులే.. మేట్లను తొలగించాం చండ్రగూడెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మల్లె తోటల్లో గుంతల తవ్వకంలో అవకతవకలపై 24 మంది మేట్లను తొలగించాం. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపునకు ప్రాజెక్టు డైరెక్టర్కు నివేదిక ఇచ్చాం. ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు తేలింది. గ్రామంలో రైతులు అందరినీ విచారించి పక్కదారి పట్టిన నగదును మేట్ల నుంచి రికవరీ చేస్తాం. – వెంకటేశ్వరరావు, ఏపీఓ, మైలవరం -
సమస్యలపై సానుకూలంగా స్పందించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అర్జీదారుల సమస్య లపై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో సమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికా రులపై ఉందన్నారు. అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండకూడదని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమైన అర్జీదారుల సంతృప్తి స్థాయిని ఐవీఆర్ఎస్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకుంటా రని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ వేయాలన్నారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ అర్జీలే అధికం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజల నుంచి 133 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికం 41 అర్జీలు అందాయి. శాఖల వారీగా పోలీస్ 21, మునిసిపల్ 17, పంచాయతీ రాజ్ 11, డీఆర్డీఏ ఆరు, ఉపాధి కల్పన ఆరు, సర్వే ఐదు, సహకార సంఘం నాలుగు, పౌరసరఫరాలు మూడు చొప్పున అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు ఏపీసీపీడీసీఎల్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయం, వాణిజ్య పనులు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, నైపుణ్య అభివృద్ధి, మార్కెటింగ్, బీసీ కార్పొరేషన్, మత్స్యశాఖ, విద్య, ఖజానా శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ/వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు పీజీఆర్ఎస్కు 133 అర్జీలు -
క్షయపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించా లని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో టీబీ ముక్తి పథకం ద్వారా గుర్తించిన పంచాయతీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిర్వహించే వైద్య పరీక్షల్లో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే ఆ సమాచారాన్ని జిల్లా క్షయ నివారణ అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నందిగామ మండలం తొర్రగుడిపాడు, వత్సవాయి మండలం ఇందుగపల్లి, జి.కొండూరు మండలం చిన నందిగామ, చందర్లపాడు మండలం ఏటూరు గ్రామా లను జిల్లాలో క్షయ లేని గ్రామాలుగా గుర్తించామన్నారు. ఈ ఏడాది ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, నందిగామ మండలం పల్లగిరి పంచాయతీలు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ అధికారులు, వైద్యాధికారులు సమష్టి కృషితో నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ జె.ఉషారాణి, డీఎంహెచ్ఓ సుహాసిని, డీఎంఓ డాక్టర్ మోతిబాబు, డెప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
మధ్యవర్తిత్వ శిక్షణ ప్రారంభం
విజయవాడలీగల్: స్థానిక కోర్టు కాంప్లెక్స్లో సోమవారం న్యాయవాదుల కోసం మధ్యవర్తిత్వ శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ మీడియేషన్లో 40 గంటల పాటు శిక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయని న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. తమిళనాడుకు చెందిన సీనియర్ ట్రైనీ ఎస్.అరుణాచలం, ఢిల్లీకి చెందిన రేణు అగర్వాల్ శిక్షణ ఇవ్వనున్నారు. న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ కె.వి.కృష్ణయ్య, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల పరీక్షకు 343 మంది గైర్హాజరు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి సోమవారం జరిగిన మ్యాథ్స్ పేపరుకు 343 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 168 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సోమవారం 28,122 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 27,779 మంది హాజరయ్యారు. హాజరు 98.78 శాతంగా అధికారులు ప్రకటించారు. పాఠశాల విద్యా జోన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి. నాగమణి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గవర్నరుపేట, సత్యనారాయణపురం, జక్కంపూడి, గాంధీనగర్, అజిత్సింగ్నగర్ తదితర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు 114 కేంద్రాలను తనిఖీ చేశాయి. -
ఏపీ పోలీస్ శాఖలో కీలక పరిణామం..
విజయవాడ: ఏపీ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సీఐడీ చీఫ్ గా ఉన్న వినీత్ బ్రిజ్ లాల్ డిప్యూటేషన్ పై సీఆర్పీఎఫ్ ఐజీగా వెళ్లనున్నారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజలాల్ కేంద్ర సర్వీస్ లకు రిలీవ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లపాటు కేంద్ర సర్వీస్ లో ఉండనున్నారు వినీత్ బ్రిజ్ లాల్.ప్రస్తుతం ఏపీలో సీఐడీ చీప్ తో పాటు కాకినాడ పోర్టు రేషన్ బియ్యం సిట్ కి చీఫ్ గా ఉన్నారు వినీత్ బ్రిజ్ లాల్. ముక్కుసూటి అధికారిగా గుర్తింపు ఉన్న వినీత్.. కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని రెడ్ బుక్ అక్రమ కేసులపై వినీత్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుండి వెళ్లిపోవానలి నిర్ణయించుకున్న వినీత్.. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వినీత్ కు డిప్యూటేషన్ పై సీఆర్పీఎష్ ఐజీగా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతి లభించింది. -
26న వైఎస్సార్ సీపీ ఇఫ్తార్ విందు
పటమట(విజయవాడతూర్పు): రంజాన్ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నామని, ముస్లింలకు జగన్ మాత్రమే అండగా నిలబడ్డారని, పదవులు ఇవ్వటం నుంచి పథకాలు అమలు చేసే వరకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత జగన్కే దక్కుతుందని పేర్కొన్నారు. ముస్లిం పక్షపాతి వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ ముస్లింలకు జగన్ చేసిన మేలు మర్చిపోలేనిదన్నారు. ముస్లింల పక్షపాతిగా వైఎస్సార్ సీపీ ఎంతో న్యాయం చేసిందని, జగన్ సారధ్యంలోనే ముస్లింలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని కొనియాడారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆసిఫ్ మాట్లాడుతూ ముస్లిం ఉన్నత స్థానాలలో స్థిర పడే విధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి జగన్ కూడా తన వంతు సహాయం చేశారని, తండ్రి బాటలో హజ్ యాత్రకు వెళ్లేవారికి అన్ని సౌకర్యాలు, రాయితీలు కల్పించారని పేర్కొన్నారు. ద్రోహులు కూటమి నేతలు.. పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ మొండి తోక జగన్ మోహనరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలందరికీ మంచి జరిగిందని, కుటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేస్తోందన్నారు. పార్టీ నేత పోతిన మహేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ముస్లింల ద్రోహులని, ముస్లింలకు మంచి జరగటం వారికి ఇష్టం ఉండదన్నారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి, వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మునీర్ అహ్మద్ షేక్లతోపాటు పలువురు కార్పొరేటర్లు రాష్ట్ర జిల్లాస్థాయి పార్టీ నేతలు పాల్గొన్నారు హాజరుకానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపంలో ఏర్పాట్లు వివరాలు వెల్లడించిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
గంగమ్మ ఒడికి ఆలివ్ రిడ్లే
● సముద్రబాట పట్టిన తాబేళ్ల పిల్లలు కోడూరు: బుల్లి బుల్లి తాబేళ్ల పిల్లలు బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రుడి ఒడిలోకి చేరాయి. హంసలదీవి సాగరతీరంలోని పాలకాయతిప్ప సంతానోత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన 300 తాబేళ్ల పిల్లలను మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి సిబ్బందితో కలిసి ఆదివారం సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్రం కలుష్యాన్ని తగ్గించే అరుదైన ఆలీవ్ రిడ్లే జాతి తాబేళ్ల పిల్లలను కేంద్రంలో నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర పెంచుతారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వేల తాబేళ్ల గుడ్లను సేకరించినట్లు అటవీ రేంజర్ శ్రీసాయి తెలిపారు. మే నెలాఖరు లోపు సుమారు ఐదు వేల పిల్లలను సముద్ర బాట పట్టించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. బగళాముఖి సేవలోహైకోర్టు న్యాయమూర్తి చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు. -
గంగాభవానీ అమ్మవారిని తాకిన సూర్యకిరణాలు
కోడూరు: భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న కోడూరు గంగాభవానీ అమ్మవారి మూలమూర్తిని ఆదివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6.47గంటల సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న అమ్మవారి శిలపై పడ్డాయి. అమ్మవారి శిలకు ఇత్తడి తొడుగు కూడా ఉండడంతో ఆ కిరణాల వెలుగుల మధ్య అమ్మవారు ప్రకాశించారు. గతంలో ఎన్నడూ ఇలా నేరుగా అమ్మవారిపై సూర్యకిరణాలు పడలేదని, తొలిసారి అమ్మవారి శిలను సూర్యకిరణాలు తాకాయని ఆలయ ప్రధానార్చకుడు కోమ్మూరి శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దరఖాస్తు గడువు పెంపు చిలకలపూడి(మచిలీపట్నం): బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ కులాల వారికి స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 25వ తేదీ మంగళవారం వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ కె.శంకరరావు ఆదివారం తెలిపారు. ఈ–బీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్కు సంబంధించిన లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా సబ్సిడీ మంజూ రు చేసేందుకు దరఖాస్తుదారులు ఏపీవోబీఎంఎంఎస్ ద్వారా పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ గడువు 20వ తేదీ వరకు పొడిగించారన్నారు. కాపు కార్పొరేషన్కు సంబంధించి వయో పరిమితిని 21 నుంచి 60 ఏళ్లుగా నిర్ణయించారన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ‘సబ్కా కృష్ణా’ నూతన కార్యవర్గం ఎన్నిక పటమట(విజయవాడ తూర్పు): ేస్టట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ(సబ్కా కృష్ణా) 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఆదివారం లబ్బీపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో కృష్ణా జిల్లా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడిగా కలిదిండి కృష్ణం రాజు, కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా మండ వ సాయి, కార్యదర్శిగా లింగం రవికిరణ్, ఉపాధ్యక్షుడిగా కోటిరెడ్డి, మురళీధర్ ఎన్నికయ్యారు. ట్రెజరర్గా వెంకటేశ్వర రాజు, జాయింట్ సెక్రటరీలుగా రవికుమార్, సురేష్ కుమార్, భూపతి రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పూర్ణ, శ్రీధర్, వీరబ్రహ్మం, శ్రీనివాసరెడ్డి, శేషగిరి రావు, శ్రీనివాసరావు, హరికృష్ణలు ఎన్నికవ్వగా అడ్వైజర్లుగా సకలారెడ్డి, రత్నారావు, అమర్ బాబు, సుధీర్ ఎన్నికయ్యారు. గ్రంథాలయ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గుమ్మా పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, కృష్ణాజిల్లా శాఖ అధ్యక్షుడిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కార్యదర్శిగా కె.బి.ఎన్.కళాశాల గ్రంథపాలకుడు వై. శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం బెంజిసర్కిల్ వద్ద ఉన్న సర్వోత్తమ భవనంలో జిల్లా శాఖ అధ్యక్షుడు వేములపల్లి కేశవరావు అధ్యక్షతన జరిగింది. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బల్రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లైబ్రేరియన్ టి. సాంబశివరావు ఉపాధ్యక్షుడిగా, కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి పి.అజయ్ కుమార్ సహాయ కార్యదర్శిగా, మరో ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రంథాలయరంగ పరిస్థితులపై సభ్యులు చర్చించి, పలు అంశాలపై తీర్మానించారు. -
నిబంధనల మేరకు ఖైదీలకు సదుపాయాలు
గన్నవరం: స్థానిక సబ్జైలును ఆదివారం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి అరుణసారిక, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కేవీ రామకృష్ణ సందర్శించారు. సబ్జైలులో ఖైదీల వివరాలను, వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్జైలులోని వంటిగది, ఖైదీల కోసం సిద్ధం చేసిన ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం జిల్లా జడ్జి అరుణసారిక మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఖైదీలకు సదుపాయలను కల్పించాలని చెప్పారు. ఖైదీల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. కొత్త భవన సముదాయం నిర్మించాలి.. అనంతరం జిల్లా జడ్జిని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గారపాటి రవికుమార్, రామకూరి ప్రకాశరావు నేతృత్వంలో నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. శిథిలావస్థకు చేరుకున్న పాత భవనం స్థానంలో కోర్టుల కొత్త సముదాయం నిర్మించాలని కోరారు. అనంతరం అరుణసారికను బార్ అసోసియేషన్ కార్యవర్గం సత్కరించింది. ఉపాధ్యక్షుడు ఎల్. వేణుబాబు, కోశాధికారి ఆర్. విమల్కుమార్, మహిళా ప్రతినిధి భాగీరథీ పలువురు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి అరుణసారిక -
గీత.. కన్నీటి గాథ!
జి.కొండూరు: గ్రామీణ ప్రాంతాలలో ఫామ్ వైన్గా పిలుచుకునే తాటికల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తాటికల్లును తీస్తూ ప్రజలకు అందిస్తున్న గౌడన్నలు ఆ వృత్తిని వదిలేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల ఆదరణ కరువై ఆర్థికంగా ఎదుగుదల లేక.. ఆరోగ్యం సహకరించక, తాటిచెట్లు ఎక్కలేక ఒక్కొక్కరిగా వెనకడుగు వేస్తున్నారు. తాము దశాబ్దాలుగా పడిన కష్టాలు భవిష్యత్తులో తమ కుటుంబాలు పడకూడదనే ఆలోచనతో పిల్ల లను చదివించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు పంపుతున్నారు. ప్రస్తుతం నలభై ఏళ్లు పైబడిన వారు గౌడ సామాజిక వర్గంలో ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలు తాటికల్లు గురించి పుస్తకాలలో చదువుకోవాల్సి వచ్చేలా ఉంది. బెల్టు షాపులతో కల్లుకు కాటు.. గతంలో తాటికల్లు లీటరు రూ.60 నుంచి రూ.100 వరకు ప్రాంతాల వారీగా డిమాండ్ను బట్టి విక్రయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా బెల్టుషాపులను తెరిచి మద్యం విక్రయించడంతో పాటు మద్యం రూ.99కి క్వార్టర్ను అందుబాటులోకి తీసుకురావడంతో కల్లుకు డిమాండ్ తగ్గింది. తక్కువ ధర ఎక్కువ కిక్కు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యానికి మేలు చేసే కల్లును వదిలేసి మద్యం వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో గీతకార్మికులు తాటి చెట్ల నుంచి తీసిన కల్లును తాగేవాళ్లు లేక పారబోస్తున్నారు. ఒక్క ఆదివారం మినహా మిగతా రోజుల్లో కల్లు విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు. మితం హితమే.. తాటికల్లు అనేక పోషకాలతో నిండి ఉంటుందని, తాజా కల్లుని మితంగా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోటాషియంతో పాటు విటమిన్లు బీ,సీ,ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. అదే సమయంలో కల్లుని అతిగా తాగినా, నిల్వ ఉంచి పులిసిన కల్లుని తాగినా ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని కల్లుగీత కార్మికులు ఒక్కొక్కరిగా వృత్తిని వదిలేస్తున్న గౌడన్నలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 12వేల మంది కల్లుగీత కార్మికులు బెల్టు షాపులతో తీరని నష్టం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 20257నేడు కలెక్టరేట్లో ‘పీజీఆర్ఎస్’ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కిక్కిరిసిన కార్తికేయుని ఆలయం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం కోలాహలంగా మారింది. నాగపుట్ట, నాగ మల్లి వృక్షం వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఇసుక.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎలాంటి నిబంధనలు వారికి వర్తించడం లేదు. తమకు నగదు చెల్లిస్తే చాలు ఎంతైనా లోడ్ చేసేస్తామంటూ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిల్లు కావాలంటే రూ. 10వేలు, బిల్లు వద్దనుకుంటే రూ. 8వేలు చెల్లిస్తేచాలట.. 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకూ లోడ్ చేసేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీలకు లారీలు రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతూ కాలం గడుపుతున్నారు. తోట్లవల్లూరు మీదుగా రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా ఇఫ్తార్ సహరి (సోమ) (మంగళ) విజయవాడ 6.24 4.50 మచిలీపట్నం 6.23 4.49అదే పంథా..న్యూస్రీల్ -
ఆగని కూటమి నేతల దోపిడీ పర్వం
కృష్ణాజిల్లాలో ఇసుకదందా జోరుగా సాగుతోంది. కూటమి నాయకుల కనుసన్నల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రజాప్రతినిధుల అండతో వారి అనుచరగణం అధికారమే పరమావధిగా క్వారీల్లో ఇసుకను దోచేస్తూ భారీగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతమైన కంకిపాడు మండలం మద్దూరు, తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, నార్తువల్లూరు, ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవుల్లో ఇసుక తవ్వకాలు గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగు తున్నాయి. గతంలో ఇచ్చిన అనుమతులు ఫిబ్రవరి 6తో ముగియటంతో అధికారులు అదే రీచ్లకు రెన్యువల్ చేసి జూలై 14 వరకు అనుమతులు మంజూరు చేశారు. కూటమి ఎమ్మెల్యేల అండదండలతో ఆయా రీచ్లలో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రి, పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. ఇరవై టన్నుల లోడుతో వెళ్లాల్సిన లారీలు నలభై టన్నులు పైగా ఇసుకను రవాణా చేస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయి. ఇసుక లారీల రవాణాతో రోడ్లు దుమ్మెత్తిపోతున్నాయి. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఆయా క్వారీల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కంచికచర్ల: ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణానది, మునేరు, వైరా ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుకను తెలుగుతమ్ముళ్లు నిత్యం దోచుకుంటున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా రీచ్ల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాద ఇసుక రీచ్లో బిల్లులు లేకుండా ఒక్కో లారీకి రూ.10వేలు చెల్లిస్తే చాలు లోడింగ్ ఎంతైనా ఇసుక నింపుతాం అంటూ నిర్వాహకులు ఓపెన్ ఆఫర్ చేస్తున్నారు. ఇలా రోజుకు రూ. 10లక్షల ఆదాయం దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. తెలంగాణాకు అక్రమ రవాణా.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు అక్కడ మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం, వైరా రూ.45వేల నుంచి రూ. 60వేలు వరకు డిమాండ్ ఉంది. అదే హైద్రాబాద్లో రూ. 90 వేల నుంచి రూ.1లక్ష వరకు ధర ఉంటుంది. అధికారపార్టీకి చెందిన ఎంపీతో పాటు, టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్ర సరిహద్దులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 14 లారీలను అధికారులు పట్టుకున్నారు. అయినా ఇసుక దందా ఆగటంలేదు. కంచికచర్ల మండలం కీసర మునేరు ఉపనది నుంచి టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పగటి పూట ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలో ఓ దేవాలయం సమీపంలో డంపింగ్ చేసి రాత్రి సమయంలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అటువైపు కనీసం రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు. నందిగామ మండలం మాగల్లు, పెనుగంచిప్రోలు మండలం శనగపాడు, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు, చిట్యాల, మునేరు నుంచి కూటమి నేతలు ఇసుకను తవ్వి ఇతర రాష్ట్రాలకు లారీలతో తరలిస్తున్నారు. కృష్ణమ్మకు గర్భశోకం.. కృష్ణానది మధ్యలో ఇసుక తవ్వకాలు భారీగా జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో అధికారుల అనుమతులు లేకుండా కూటమి నాయకులు భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నదీ గర్భంలో ఇసుకను తవ్వకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నదీ గర్భంలో డ్రెడ్జింగ్ యంత్రాలు వినియోగించి ఇసుకను తవ్వేస్తున్నారు. అయినప్పటికీ ఇల్లు నిర్మించుకునే అసలైన లబ్ధిదారులకు ఇసుక దొరకటం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కృష్ణా, ఎన్జీఆర్ జిల్లాల్లో దోచుకో.. పంచుకో.. ఉచితం మాటున భారీగా ఆదాయార్జన ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కనుసన్నల్లో అంతా! స్థానిక అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకూ వాటాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న అక్రమ ఇసుక పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు -
రక్త నిల్వల కొరత!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రాణాధారమైన రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ఏ బ్లడ్ బ్యాంక్కు వెళ్లినా నో స్టాక్, నో బ్లడ్ అన్న సమాధానమే. జిల్లాలో రక్త నిల్వల కొరత ఎదురవుతోంది. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నో స్టాక్.. నో బ్లడ్జిల్లాలో తొమ్మిది బ్లడ్ బ్యాంకుల పరిధిలో 2023– 24లో మొత్తం 19,550 యూనిట్ల రక్తసేకరణ జరిగింది. 2024– 25 ఫిబ్రవరి నెల వరకు 12,845 యూనిట్లు మాత్రమే సేకరణ చేశారు. ఏటా మే, జూన్ నెలల్లో రక్తం కొరత అధికంగా ఉంటోంది. అయితే ఈ ఏడాది మార్చిలోనే ‘కొరత’ ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి బ్లడ్ బ్యాంక్ రోజుకు 5 నుంచి 15 యూనిట్ల వరకూ రోగులకు రక్తం అందిస్తుంటాయి. ప్రధానంగా రక్తం నిల్వచేసే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో నో స్టాక్.. నో బ్లడ్ అన్న సమాధానం ఎదురవుతోంది. శనివారం వరకు రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకులో కేవలం మూడు యూనిట్లు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20 యూనిట్లు, కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సింగిల్ యూనిట్లు, మరికొన్ని చోట్ల నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిరాశే..రక్తం కొరత ప్రభావం.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా పడుతోంది. తలసేమియా వంటి రోగులు రక్తదాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. బ్లడ్ కోసం ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. గర్భిణులు, యాక్సిడెంట్స్లో గాయాల పాలైన వారు రక్తం కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. వేసవిలో ఇబ్బందే..రోగుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రకాల శస్త్రచికిత్సలను వేసవిలోనే నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు కూడా రక్తం యూనిట్లు నిల్వల అవసరం మరింత పెరుగుతోంది. సాధారణంగా రక్తం సేకరణకు కళాశాలలు, పలు సంస్థల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వాటి నిర్వహణ ఊసే లేదు. రానున్నది వేసవి కావడంతో ప్రజలు రక్తదానం చేయడానికి విముఖత చూపుతారు. కళాశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. ఇలాంటి కారణాలతో రక్త నిల్వలు తగ్గిపోతాయి. దీంతో సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు వైద్యులు అంటున్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి..ప్రముఖల జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాన సేకరణను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. రక్తం నిల్వల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రక్తదాతలూ.. రండి ఏటా వేసవిలో సమస్య ఈ ఏడాది మార్చిలోనే నిల్వలు తగ్గడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం అన్ని చర్యలు తీసుకుంటున్నాం గడిచిన కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత అధికం కావడం, విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో రక్త సేకరణ తగ్గింది. రోగుల అవసరం మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిల్వలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. –హనుమంతయ్య, మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, మచిలీపట్నం -
భాష, సంస్కృతి వికాసానికి కృషి
విజయవాడ కల్చరల్: భాష, సంస్కృతి వికాసానికి కవులు, రచయితలు కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గజల్ చారిటబుల్ సంస్థ, సేవ్ టెంపుల్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ఆదివారం ఉగాది వేడుకలు, కవి పండితులకు సత్కారం, జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలన్నారు. న్యాయవాది వేముల హజరత్తయ్య మాట్లాడుతూ గజల్ సాహిత్యానికి చేసిన సేవలను వివరించారు. గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ 2026లో గుంటూరులో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తునట్లు తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ స్వీయ గజల్ను గానం చేశారు. వివిధ రంగాలకు చెందిన గోళ్ళ నారాయణరావు, డోగిపర్తి శంకరావు,చలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పరామర్శకు వెళ్తూ అనంతలోకాలకు.. తిరువూరు రూరల్/దమ్మపేట: పరామర్శకు వెళ్తున్న తల్లీకుమారులను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డారు. ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లీకుమారులు అరిసెపల్లి సరస్వతి(66), అరిసెపల్లి కృష్ణ(49). సరస్వతి సోదరుడి కుమారుడు అనారోగ్యం బారిన పడ్డాడు. వారిని పరామర్శించడానికి తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకుమారులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సాయికిషోర్రెడ్డి తెలిపారు. ముష్టికుంట్లలో విషాదఛాయలు తల్లీకుమారుల మృతితో ముష్టికుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు కృష్ణ గ్రామంలో నాయీ బ్రాహ్మణ వృత్తితో పాటు, బ్యాండ్ మేళం ట్రూప్లో పని చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతని కుమారుడు ప్రైవేట్ ఉద్యోగి. కుమార్తెకు వివాహమైంది. కృష్ణ మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయామని భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. సరస్వతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంట పని చేస్తుంటుంది. 70 ఏళ్ల భర్త వేలాద్రికి చేదోడుగా ఉంటుంది. మరో కుమారుడు మల్లేశ్వరరావు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఒకేసారి ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. -
జెడ్పీటీసీ సభ్యురాలి భర్త రమేష్కు రిమాండ్
కంచికచర్ల(నందిగామ): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతి భర్త వేల్పుల రమేష్ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సాయంత్రం నందిగామలోని జడ్జి ఎదుట రమేష్తో పాటు తలమాల మరియమ్మ, గారపాటి ఆంధ్రియను పోలీసులు హాజరు పరిచారు. వారికి జడ్జి 14రోజుల రిమాండ్ విధించారని ఎస్ఐ బోనగిరి రాజు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి మొదటి భార్య కుమార్తె వాణికి కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన సుధీర్తో 2009లో వివాహమైంది. వాణి, సుధీర్కు ముగ్గురు సంతానం. ఈ ఏడాది ఫిబ్రవరి 23న సుధీర్ ప్రమాదవశాత్తు కాలుజారి నేలబావిలో పడి మరణించాడు. సుధీర్ కర్మకాండలకు జోజి వచ్చారు. అప్పుడు వాణి అత్త తలమాల మరియమ్మ, కుల పెద్ద గారపాటి ఆంధ్రియ, వేల్పుల రమేష్ అతని ఆస్తిలో వాణికి అరెకరం పొలం రాయాలని కోరారు. పెద్దల మాట విన్న జోజి కుమార్తె వాణికి అర ఎకరం పొలం స్వాధీన అగ్రిమెంట్ చేశాడు. అయితే తన పేరుతో ఉన్న పొలాన్ని కుమార్తె వాణికి రాయాలని పెద్దలు బలవంతం చేశారని, భయంతో పొలాన్ని స్వాధీన అగ్రిమెంట్ చేశానని కంచికచర్ల పీఎస్లో నాలుగు రోజుల క్రితం జోజి ఫిర్యాదు చేశాడు. వాణి అత్త మరియమ్మ, కులపెద్ద గారపాటి ఆంద్రియ, వేల్పుల రమేష్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని నందిగామలోని జడ్జి ఎదుట హాజరుపర్చామని రిమాండ్ విఽధించారని ఎస్ఐ తెలిపారు. ఆదివారం ఉదయం అరెస్ట్ రమేష్తోపాటు మరియమ్మ, ఆంధ్రియకు రిమాండ్ -
ప్రజాక్షేత్రంలో ‘కూటమి’ విఫలం
దేవినేని అవినాష్గుణదల(విజయవాడ తూర్పు): ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను నేతలు, కార్యకర్తలు నిలదీయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, వియ్యపు అమర్నాఽథ్, తంగిరాల రామిరెడ్డి, భీమిశెట్టి ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కృష్ణా సీనియర్స్ రగ్బీ జట్ల ఎంపిక
నున్న(విజయవాడరూరల్): ఉమ్మడి కృష్ణా జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పురుషులు, మహిళల జిల్లా రగ్బీ జట్ల ఎంపికలు జరిగాయి. వీటిలో 25 మంది బాలురు, 20 మంది బాలికలు పాల్గొన్నారని కార్యదర్శి ఎన్.చంద్రకళ తెలిపారు. పురుషుల జట్టుకు జి.బిళ్లహరి, సీహెచ్ మోహనవంశీ, ఎం.లక్ష్మీనారాయణ, (విజయవాడ), వై.జిక్రిరెడ్డి (జూనియర్ కళాశాల,పాయకాపురం), కె.రాహుల్(ధనేకుల), నున్న వికాస్కు చెందిన పి.సాయి ధనుష్, యు.వెంకట రమణ, ఎండి ఫిరోజ్ జిలానీ,ఎం. లక్ష్మణస్వామి (సంగమూడి), పి.రవినాగ శంకర్లు ఎంపికయ్యారు. మహిళల జట్టుకు ఉంగుటూరుకు చెందిన వై.నందిని, ఎస్.కీర్తన, ఒ.సుధారాణి, కె.నందిని, జి.గంగా భవాని, (హనుమాన్ జంక్షన్), విజయవాడకు చెందిన వి.గీతశ్రీ, బి.నిహారిక, సీహెచ్ జాహ్నవి. డి.చిన్ని నున్న కు చెందిన ఎ.గౌతమి, పి.జెస్సికా ఎంపికయ్యారు. -
అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి నూతన కార్యవర్గం
విజయవాడ కల్చరల్: అమరావతి బ్రాహ్మణ సేవా సంఘానికి 2025–2026, 2026–2027 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సేవా సంఘం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకట దశరథ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సంస్థ అధ్యక్షుడిగా కామర్స్ విజయభార్గవ రాజేష్, కాశీభట్ల సూర్యనారాయణ శాస్త్రి ఉపాధ్యక్షుడు, కోశాధికారి అనుముల సోమశేఖర్, సీతారాంబాబు, ఈసీ సభ్యులుగా డాక్టర్ యడ్లపాటి శేషసాయి, భమిడిపాటి గణపతి, దత్తా ప్రసాద్,కుందేటి రత్నకుమార్, కావూరి సూర్యనారాయణమూర్తిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అర్జిత సేవల్లో ఉభయదాతలు తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. అంతరాలయ రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్లో వేచి ఉన్న భక్తులను ముఖ మండప దర్శనానికి అనుమతించారు. భక్తులకు అమ్మవారి బంగారు వాకిలి దర్శనం కల్పించడంతో త్వరిత గతిన అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా.. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డులో దేవస్థానం భక్తులకు మంచినీటిని సరఫరా చేసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శనం పూర్తయిన భక్తులకు దేవస్థానం ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు, ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. కిటకిటలాడిన క్యూ సర్వ దర్శనానికి రెండు గంటలు -
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
ఆదాయంలో విజయవాడ డివిజన్ రికార్డు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇంకా 11 రోజులు ఉండగానే విజయవాడ రైల్వే డివిజన్ రూ.5,638 కోట్ల ఆదాయం సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. అందులో సరకు రవాణా ద్వారా రూ.4,092.21 కోట్ల ఆదాయంతో రవాణాలోనే సుస్థిరమైన వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,625 కోట్ల స్థూల ఆదాయం రాగా, అందులో సరకు రవాణా ద్వారా రూ.4,032 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు డివిజన్ స్థూల ఆదాయం రూ.5,638 కోట్లు కాగా, అందులో 72.6 శాతం భాగం సరుకు రవాణా ద్వారా రూ.40,98 కోట్లు, 23.78 శాతం ప్రయాణికుల ఆదాయంతో రూ.1,342 కోట్లు, 1.9 శాతంతో ఇతర కోచింగ్ సేవలు (పార్శిల్, టికెట్ తనీఖీలు) ద్వారా రూ.109 కోట్లు, 1.6 శాతం ఇతర మార్గాల ద్వారా రూ.89 కోట్లు ఆదాయం సమకూర్చుకుంది. ఆదాయంలో డివిజన్ వృద్ధి సాధించడం పట్ల సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మలను డీఆర్ఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,638 కోట్ల స్థూల ఆదాయం 72.6 శాతం సరకు రవాణా ఆదాయం -
ఇచ్చింది గోరంత
నష్టం కొండంత...జి.కొండూరు: గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టించింది. ఈ వరదలతో ఇటు మైలవరం నియోజకవర్గంతో పాటు విజయవాడ రూరల్ మండలాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వందలాది మూగజీవాలు, ప్రజలు ప్రాణాలు కోల్పోగా వందల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వరదలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అప్పట్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ఈ క్రమంలో బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమవైపున కొండపల్లి శాంతినగర్కు సమీపంలో పడిన మూడు భారీ గండ్ల వలనే విజయవాడ పరిసర ప్రాంతాలు రోజుల తరబడి వరద ముంపులోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించి బుడమేరు ప్రక్షాళన చేస్తామంటూ మీడియా ముందు ఊదరగొట్టారు. ఆ తర్వాత బుడమేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లతో మొదటి దశ ప్రణాళిక అంటూ ఆర్భాటంగా ప్రకటించి తదనంతరం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ క్రమంలో బుడమేరు ఆధునికీకరణ, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పూడ్చిన ప్రదేశంలో లీకేజీల వలన వరద ప్రవాహంపై ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. ‘సాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ సైతం ఇటీవల హెడ్ రెగ్యులేటర్ను, గండ్లు పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రెగ్యులేటర్ మరమ్మతులు, గండ్లు పడిన ప్రదేశంలో లైనింగ్ పనులకు గానూ రూ.39.77 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామంటూ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నిధులపై ప్రభుత్వం శుక్రవారం జీఓని విడుదల చేసింది. చేయాల్సింది కొండంత... బుడమేరుకు వచ్చిన వరద ఉధృతితో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువన అంటే బుడమేరు ప్రారంభం వరకు 42 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు కాల్వకు 80కి పైగా గండ్లు పడ్డాయి. వీటిని అధికారులు 65 పనులుగా నిర్ధారించి రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఈ గండ్లను శాశ్వతంగా పూడ్చడంతో పాటు ఆక్రమణలు తొలగించి బుడమేరుకు ఇరువైపులా కట్టలు బలోపేతం చేయాల్సి ఉంది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపు కట్టకు మూడు గండ్లు, కుడి వైపు కట్టకి ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. ఈ గండ్లను అప్పట్లో తాత్కాలికంగా పూడ్చారు. ఈ 11.90 కిలోమీటర్ల డైవర్షన్ కెనాల్ను 37,555 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచుతూ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కేవలం అర కిలోమీటరు లైనింగ్ పనులకు మాత్రమే నిధులు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు 13.25 కిలోమీటర్ల మేర ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని బుడమేరులో 202 ఎకరాలకు గానూ 70 ఎకరాల వరకు ఆక్రమణల చెరలో ఉన్న బుడమేరుకు ఆక్రమణలు తొలగించి మోక్షం కలిగించాల్సి ఉంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర బుడమేరుకు ఇరువైపులా గట్లను బలోపేతం చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మైలవరం నియోజకవర్గంలోని పులివాగు, కోతులవాగుతో పాటు పలు వాగులకు పడిన గండ్లు, ఎన్ఎస్పీ కాల్వలు, 32 చెరువులకు పడిన గండ్లకు శాశ్వతంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటికి గానూ రూ.30 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ పనులకు నిధులు విడుదల చేయలేదు. ఈ పనులను చేపట్టకపోతే వచ్చే వర్షాకాలంలో పది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనా విజయవాడను మరోసారి వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొంటే మరో ఉప్పెనను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రక్షాళనకు రూ.500 కోట్లు అంటూ రూ.39.77 కోట్లకు జీఓ విడుదల హెడ్ రెగ్యులేటర్కు ఎగువ బుడమేరు గండ్లకు విడుదల కాని నిధులు డైవర్షన్ కెనాల్ పూర్తి ఆధునికీకరణ ప్రశ్నార్థకమే వచ్చే ఏడాదీ వరద ముంపు తప్పదని ప్రజల ఆందోళన నిధుల విడుదల ఇలా... ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం రూ.180 లక్షలను కేటాయించారు. డైవర్షన్ కెనాల్కు ఇరువైపులా కొండపల్లి శాంతినగర్ సమీపంలో పడిన గండ్ల వద్ద 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు అర కిలోమీటరు లైనింగ్ పనులకు గానూ రూ.3,797 లక్షలను కేటాయించారు. మొత్తంగా ఈ పనులకు రూ.39.77 కోట్లను కేటాయించి చేతులు దులుపుకొన్నారు. -
ట్రాఫిక్ డీసీపీ నాయుడుకి మహోన్నత సేవా పథకం
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకానికి ట్రాఫిక్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎం.కృష్ణమూర్తి నాయుడు ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో సమర్థంగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలు అందించినందుకు గాను 2025వ సంవత్సరానికి మహోన్నత సేవా పథకానికి ఎంపికయ్యారు. 1989లో కృష్ణమూర్తి నాయుడు ఎస్ఐగా సర్వీస్ ప్రారంభించి అంచెలంచెలుగా డీసీపీ స్థాయి హోదాకు ఎదిగారు. సేవా పథకానికి ఎంపికై న కృష్ణమూర్తి నాయుడుని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో పీ4 జిల్లా స్థాయి పోటీలుమధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం పేదరిక నిర్మూలన అనే అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ మేకింగ్ జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని తమలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శాంతకుమారి, డాక్టర్ అజయ్ బాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పీఎల్ దాస్, డాక్టర్ భాను ప్రసాద్ వ్యవహరించారు. సుబ్రహ్మణ్యుని సన్నిధిలోసీఐఎస్ఎఫ్ బృందం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని కొల్కత(వెస్ట్ బెంగాల్) సీఐఎస్ఎఫ్ బృందం శుక్రవారం దర్శించుకుంది. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఆలయ సిబ్బందితో కలసి స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్ట లో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు విరూప్ శర్మ స్వామివారికి అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. కొల్కత నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేపట్టిన సీఐఎస్ఎఫ్ బృందానికి ఆలయ అధికారి మధుసూదనరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. నీరు అత్యంత విలువైన వనరు గుడివాడటౌన్: ప్రపంచంలో అత్యంత విలువైన వనరు నీరు అని 11వ అదనపు జిల్లా జడ్జి జి.సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. నీటి వాడకంలో మార్పులను ప్రేరేపించడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. శనివారం జరగనున్న ప్రపంచ నీటి దినోత్సవంను ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నీటి నిల్వలు పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటిని సంరక్షించాలని, నీటి వినియోగంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నీటిని వృథా చేయకుండా ఉండటం, పరిశుభ్రమైన నీటిని తాగడం ప్రతి ఒక్కరి హక్కు అని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గేలా, నీటిలో ప్రమాదకరమైన రసాయనాల విడుదల అరికట్టేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పర్వతాలు, అడవులు, చిత్తడి నేలలు, నదులు, జలాశయాలు, సరస్సులు వంటి నీటి సంబంధిత పర్యావరణ వ్యవస్థను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. -
దొడ్డదేవరపాడులో
నీటికి కటకట గాంధీనగర్( విజయవాడ సెంట్రల్): భౌగోళికంగా ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణమ్మ, మరో వైపు కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవహిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎన్టీఆర్ జిల్లాలో తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. కృష్ణానది చెంతనే ఉన్నా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలో సగభాగానికి కూడా కృష్ణానది నీరు సరఫరా కావడం లేదు. జిల్లాలోకి ప్రవహించే ఉపనదులు వైరా, కట్టలేరు, మున్నేరులలో నీటి జాడ కనిపించడం లేదు. మున్నేరు పూర్తిగా ఎండిపోగా... కట్టలేరు, వైరా యేరుల్లో నీటి చారికలు కనిపిస్తున్నాయి. దీంతో ఉపనదులపై నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు ఆశించిన స్థాయిలో రక్షిత నీరు అందించ లేకపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ప్రమాణాలు పాటించకపోయినప్పటికీ ప్రజలు వేరే గతి లేక ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేసి తాగవలసి వస్తోంది. మార్చి నెలలోనే నీటి కష్టాలు మొదలు కావడంతో ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చుక్క నీరు కానరాని కట్టలేరు తిరువూరు నియోజకవర్గం నుంచే కట్టలేరు ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం కట్టలేరులో నీరు లేదు. కట్టలేరు ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. కానీ కట్టలేరులో నీరు లేకపోవడంతో మోటార్లు దెబ్బతింటున్నాయి. నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలంలోని ఊటుకూరు, కొణిజర్ల, పెనుగొలను గ్రామాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా తాగేందుకు అనువుగా ఉండవు. ఇక్కడకు పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు సరఫరా కావడం లేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని అందిస్తున్నారు. వేసవి మరింత ముదిరే నాటికి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి ఎద్దడి లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో కట్టలేరు పక్కనే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి సరిపడా తాగునీరు సరఫరా జరగడం లేదు. వి.అన్నవరం వద్ద వైరా యేరులో మోటార్లు ఏర్పాటు చేసిన నీటిని అందిస్తున్నారు. అవి చాలకపోవడంతో స్థానికంగా ఏర్పాటు చేసిన మోటరు ద్వారా నీటిని ట్యాంకుకు ఎక్కించి సరఫరా చేస్తున్నారు. వీటిలో లవణ శాతం అధికంగా ఉండడం వాడకానికి కూడా వినియోగించే పరిస్థితి లేదు. కట్టలేరు ఒడ్డునే ఉన్న ఈ గ్రామానికి రాబోయే రెండు మూడు నెలలు నీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి వీరులపాడు నుంచి తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ జనాభా అవసరాలకు సరిపోవడం లేదు. కంచికచర్ల మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కృష్ణా నది ఒడ్డు వెంబడి నీరు లేకపోవడంతో మోటార్లు ఆడే పరిస్థితి లేదు. మున్నేరు వైరా ఏరు కలిసే చోట ఉన్న కీసర, పెండ్యాల గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎస్.అమరవరం, మోగులూరు గ్రామాల్లో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో కొన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో నీరు లేకపోవడం, లీకేజీల కారణంగా సక్రమంగా సరఫరా జరగడం లేదు. విజయవాడ నగరంలో ఊర్మిళానగర్లో పాయకాపురం తదితర ప్రాంతాల్లో రంగుమారిన నీరు వస్తోందని ప్రజలు చెబుతున్నారు. సరిగా శుద్ధి చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా సరైన ప్రమాణాలు పాటించని ఆర్వో ప్లాంట్ల నీటినే కొనుగోలు చేయాల్సి వస్తోంది. వారానికో రోజు తాగునీరు చెవిటికల్లు పైలెట్ ప్రాజెక్టు ద్వారా మా గ్రామానికి వారానికి ఒక రోజు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. తాగునీటికి ఇబ్బందిగా ఉంది. మార్చిలోనే పరిస్థితి ఈ తీరుగా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. సరిపడా తాగునీటిని అందించాలి. –జల్లి కార్ల్మార్క్స్, జుజ్జూరు నాలుగైదు రోజులకోసారి మంచినీరు మా ఊరు మున్నేరు ఒడ్డునే ఉంది. మున్నేరు ఎండిపోయింది. మాకు నాలుగైదు రోజులకోసారి మంచినీరు వస్తోంది. మేం కూలి పనులకు వెళ్లేవాళ్లం. మంచినీళ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు తాగునీటి ఇబ్బందులను తొలగించాలి. –కోలగట్ల సత్యవతి, కీసర ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతిపంపులు ఉన్నాయి. వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రయివేట్ ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి. ఇవే ప్రజలకు ప్రధాన తాగునీటి వనరు. వేసవి ప్రారంభమై నెల రోజులు కావడంతో గ్రామాల గొంతెండుతోంది. నీటి ఎద్దడి ముంచుకొస్తుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అవి కూడా అరకొరగా వస్తున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు దశాబ్దాల కిందట నిర్మించడం, అప్పట్లో వేసిన పైపులైన్లకు లీకులు ఏర్పడడంతో నీరు వృథా అవుతోంది. లీకేజీల కారణంగా రక్షిత మంచినీరు సరఫరా కావడం లేదు. దీనికి తోడు జనాభా పెరుగుదల, నీటి వాడకం పెరగడంతో పథకాలు తాగునీటి అవసరాలు తీర్చలేకపోతున్నాయి. గొంతెండుతున్న పల్లెలు ముంచుకొస్తున్న నీటి ఎద్దడి ఎండిపోయిన ఉప నదులు కృష్ణానది చెంతనే నీటి కష్టాలు రెండు రోజులకోసారి తాగునీటి సరఫరా -
సమీకృత నీటి కుంటల ఏర్పాటుకు ప్రోత్సహించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొలా ల్లో సమీకృత నీటికుంటలు ఏర్పాటు చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. వర్షాకాలం నాటికి కుంటలు ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వర్చువల్గా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టరేట్ నుంచి అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ నీటి కుంటల్లో చేపలు పెంచుతూ, కుంట గట్లపై కూరగాయల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం కూడా పొందవచ్చన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి, పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమా వేశంలో డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్య కుమారి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
నైపుణ్యాల పెంపునకు క్రీడలు దోహదం
విజయవాడస్పోర్ట్స్: సంకల్పం, లక్ష్యాలను నిర్దేశించే నైపుణ్యాన్ని పెంచుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటక్చర్ ఇనిస్టిట్యూట్(ఎస్పీఏ) డైరెక్టర్ రమేష్ శ్రీకొండ అన్నారు. ఎస్పీఏ జాతీయ క్రీడా పోటీలు విజయవాడలోని ఎస్పీఏ ఇనిస్టిట్యూట్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా జ్యోతి వెలిగించి ఈ పోటీలను రమేష్ శ్రీకొండ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదల, స్నేహభావం ప్రాముఖ్యతను క్రీడలు తెలియజేస్తాయన్నారు. క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో క్రీడాకారులు ముందు వరసలో ఉంటారని తెలిపారు. చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ జాతీయ పోటీల్లో ఢిల్లీ, భోపాల్, విజయవాడ ఇనిస్టిట్యూట్ల విద్యార్థినీ విద్యార్థులు ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో తలపడతారని వివరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రోఫీలను రమేష్ శ్రీకొండ ఆవిష్కరించారు. ఇనిస్టిట్యూట్ రిజిస్ట్రార్ కె.ఉమామహేశ్వరరావు, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఎస్.వి.కృష్ణకుమార్, ఆర్కిటెక్చర్ హెచ్వోడీ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్పోర్ట్స్ కమిటీ సభ్యురాలు డి.జగత్కుమారి, ప్లానింగ్ హెచ్వోడీ ప్రశాంత్వర్థన్ పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ ఎస్పీఏ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ క్రీడలు -
గ్రామీణ వైద్యులపై దుష్ప్రచారాలు తగదు
హనుమాన్జంక్షన్ రూరల్: దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, స్వయం ఉపాధి పొందుతున్న ఆర్ఎంపీ, పీఎంపీలపై అవాస్తవాలను దుష్ప్రచారం చేస్తున్నారని కృష్ణాజిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.వెంకట రాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నూజివీడు రోడ్డులోని పౌల్ట్రీ ఫ్మార్మర్స్ వెల్ఫేర్ సిండికేట్ హాల్లో హనుమాన్జంక్షన్ ఏరియా గ్రామీణ వైద్యుల సమావేశం శుక్రవారం జరిగింది. అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాజు, రాంబాబు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్ అధికంగా వాడుతున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించి జీవనోపాధి పొందుతున్న ఆర్ఎంపీల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే తలంపు మంచిది కాదన్నారు. దీనిపై మరింత విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు అనంతపురంలో ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకు ముందుగా ప్రభ హాస్పిటల్ (ఏలూరు) ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్ల వైద్య నిపుణడు డాక్టర్ సునీల్ సందీప్ ఆర్ఎంపీలకు పలు ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన కల్పించారు. సంఘం జిల్లా కోశాధికారి రంగారావు, హనుమాన్జంక్షన్ ఏరియా అధ్యక్షుడు కె.నరసింహారావు, కార్యదర్శి కోటా చైతన్య, కోశాధికారి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ వృత్తి పవిత్రమైంది
గన్నవరం రూరల్: నర్సింగ్ వృత్తి పవిత్రమైనదని, ఒత్తిడిని జయించి నర్సింగ్ వృత్తిలో రాణించాలని ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల సూచించారు. మండలంలోని చిన అవుటపల్లి డాక్టర్ సి. శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ అండ్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి నర్సింగ్ కాన్ఫరెన్స్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన వర్క్ షాప్ను ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ అసాధారణ ఒత్తిడి ఉద్యోగ జీవితంలో ప్రభావితం చేయరాదన్నారు. సెల్ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో మానవ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, బాధ్యతాయుత వృత్తిలో ఉన్న నర్సులు వీటికి దూరంగా ఉండాలన్నారు. ఒత్తిడిని జయించేందుకు మార్గాలను వివరించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ నర్సులు చిరునవ్వుతో సేవలందించాలన్నారు. రోగులను నిరంతరం కనిపెట్టుకుని ఉండేది నర్సులేనన్నారు. రాష్ట్రంలోని 18 నర్సింగ్ కళాశాలల నుంచి విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వర్క్ షాప్నకు హాజరయ్యారు. రిసోర్స్ స్పీకర్స్గా సిస్టర్ ఫ్లోరెన్స్, కోటేశ్వరమ్మ, ప్రిన్సిపాల్ జె.వందన, డాక్టర్ ఝాన్సీ రాణి వ్యవహరించారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి.నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ సీవీ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ భీమేశ్వర్, నర్సింగ్ కళాశాల కన్వీనర్ వి.శశికళ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ సుశీల -
నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువ లీకేజీల పూడ్చివేతలో అధికారులు నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కొండపల్లి శాంతినగర్ వద్ద శుక్రవారం లీకేజీలతో ఏర్పడిన గుంత లో ప్రమాదవశాత్తూ పడి బలుసుపాటి కుమార్(14)అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కవులూరు గ్రామానికి చెందిన బలుసుపాటి పద్మారావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. రిక్షా తొక్కి కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు బిడ్డలను స్థానిక జెడ్పీ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం టెన్త్క్లాస్ పరీక్షలకు హాజరవుతుండగా, రెండో కుమారుడు బలుసుపాటి కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల సమీపంలో ఉన్న లీకేజీ గుంతల వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అల్లారుముద్దుగా పెంచి పోషించుకున్న కుమారుడు కళ్లముందు నిర్జీవంగా ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పాపం ఎవరిది? గత ఆగష్టు, సెప్టెంబర్లలో వచ్చిన వర్షాలతో కొండపల్లి వద్ద బుడమేరు కట్టలకు భారీస్థాయి గండ్లు పడి విజయవాడలో అనేక ప్రాంతాలను నీటితో ముంచెత్తింది. గండ్లను తాత్కాలికంగా పూడ్చి పని అయిపోయినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే పూడ్చిన గండ్లు వద్ద అనతి కాలంలో లీకేజీలు ఏర్పడి రైతులు పంటపొలాల్లో నీరు ప్రవహించి భారీస్థాయి గుంతలు ఏర్పడ్డాయి. వీటిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూడ్చక పోవడంతో ఆ గుంతలో పడిన విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది. బుడమేరు లీకేజీ గుంతలో పడి బాలుడు మృతి -
సమన్వయంతో మాదకద్రవ్యాల కట్టడి
విజయవాడస్పోర్ట్స్: అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్–గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసు అధికారులకు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల ఆట కట్టించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్య వినియోగ సమస్యను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం, నార్కోటిక్ సెల్ వంటివి పని చేస్తున్నాయని, త్వరలో సరికొత్త ప్రణాళికతో కమిషనరేట్లో మాదక ద్రవ్య వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో ఈ వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. మొదట అలవాటు.. తర్వాత బానిస.. జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ డ్రగ్స్ తరచూ వినియోగించే వారి మెదడులోని రివార్డుపాత్వే అనే భాగం సిగ్నల్ ఇవ్వడం ద్వారా తరచూ వాటికి అలవాటు పడి చివరిగా బానిసలు అవుతున్నారని వివరించారు. ఈ డ్రగ్స్ వినియోగం శరీరంలోని ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు, కళ్లు తదితర అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. క్యాన్సర్, లుకేమియా వంటి వ్యాధుల బారిన పడతారని హెచ్చరించారు. ప్రస్తుతం పాత గవర్నమెంట్ హాస్పిటల్లో సైక్రియాటిక్ విభాగంలో డీ అడిక్షన్పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డాక్టర్ కల్యాణి మాట్లాడుతూ ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు నమోదు చేసేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్ పర్సన్ ఉమారాజ్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు, ఏసీపీలు ఉమామహేశ్వరరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు. వర్క్షాప్కు హాజరైన అధికారులు, సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు -
నాణ్యమైన రెవెన్యూ సేవలే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సూచించారు. విజయవాడ గవర్నర్పేట రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో శుక్రవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో రెవెన్యూ సేవల పంపిణీపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలకు శిక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, సీసీఎల్ఏ జి.జయలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించడంతోపాటు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం తదితరాలపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే ఆరు నెలల సమయం చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా జాప్యం లేకుండా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, డేటా నమోదులో కచ్చితత్వానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ల్యాండ్ ఎన్ క్రోచ్ మెంట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కచ్చితంగా అమలు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేపర్ లెస్, స్మార్ట్ గవర్నన్స్ అందించాలన్నారు. రీసర్వేపై సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల డైరెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇనామ్, ఎస్టేట్, పీవోటీ చట్టాలపై విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసింహం, రికార్డ్ ఆఫ్ రైట్స్, భూ ఆక్రమణలు, ల్యాండ్ గ్రాబింగ్పై విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.రామయ్య శిక్షణ ఇవ్వగా.. వెబ్ల్యాండ్ సంబంధిత అంశాలపై ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.రచన వివరించారు. వివిధ సందేహాలను నివృత్తి చేశారు. శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా -
హ్యాండ్బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20వ తేదీన విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. తూర్పు గోదావరి జిల్లా రన్నర్ ట్రోఫీని అందుకుంది. మూడో స్థానం కోసం కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించి తృతీయ బహుమతిని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎన్.వంశీకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రన్నరప్గా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాకు మూడో స్థానం -
విజేతలుగా గుంటూరు, విజయవాడ ఉద్యోగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో జరిగిన ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ 45 ప్లస్ డబుల్స్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు డివిజన్ల ఉద్యోగులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 20న జరిగిన ఫైనల్స్లో విజయవాడ డివిజన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో టెక్నీషియన్ సంపత్కుమార్, గుంటూరులోని అమరావతి బెంచ్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్ చాంపియన్స్గా నిలిచారు. హారాహోరీగా జరిగిన ఫైనల్లో ఖమ్మంకు చెందిన వెంకటేశ్వరరావు, పాల్వంచ నుంచి భాస్కరరావులతో వారు పోటీపడి విజేతలుగా గెలిచారు. -
సీఎం చంద్రబాబుకు ఉగాది పచ్చడి పంపుతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపబోతున్నట్లు వలంటీర్ల అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ హనుమాన్ పేట సీపీఐ కార్యాలయంలో వలంటీర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తింటూ.. వలంటీర్లకు తీపి కబురు చెబుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నెలకు రూ. 5వేలు ఎలా సరిపోతాయి? పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలకు అనుగుణంగా రూ. 10వేలు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో అనేక సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తర్వాత 10 నెలలు గడుస్తున్నా వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మార్చి 30 ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపాలని పిలుపునిచ్చారు. వలంటీర్లు పంపిన పచ్చడి తిని వలంటీర్లకు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు మమత, షైని, నరేష్, కల్యాణ్, శివ పార్వతి, స్వప్న, దమ్ము రమేష్ పాల్గొన్నారు. ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
ప్రజా క్షేమం, నగరాభివృద్ధే అజెండా
పటమట(విజయవాడతూర్పు): ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో వీఎంసీ బడ్జెట్ 2024–25కి సంబంధించి చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇవి.. ● రూ.40.9 కోట్లతో 47.46కి.మీ. మేర సీసీ రోడ్లు, రూ.6.80కోట్లతో 4.33 కి.మీ. మేర బీటీ రోడ్లు వేశామని మేయర్ చెప్పారు. ● 15వ ఆర్థిక సంఘం నిధులతో 24.91కి. మీ. మేర రూ.17 కోట్లను ఆమోదించి కొండ ప్రాంతంలో మెట్లు, ల్యాండింగ్, ర్యాంప్ వంటి పనుల కోసం రూ. 2.95 కోట్లను వెచ్చించామన్నారు. ● 40వ డివిజన్లో 1500 లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ను రూ. 3.30 కోట్లతో నిర్మించామని, వేసవిలో తాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 46వ డివిజన్లో 500లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ 90% పనులు పూర్తి చేశామన్నారు. ● 30వ డివిజన్లో దావు బుచ్చయ్య కాలనీలో రూ.1.5 కోట్లతో 4.5 కిలోమీటర్ల నూతన పైప్ లైన్ వేశామని, రూ.3.29 కోట్లతో 3 కి.మీ. పైప్ లైన్ పనులు చేపట్టామని చెప్పారు. ● రూ.14.16 కోట్లతో 3 నియోజకవర్గాలు డ్రెయినేజీలను నిర్మించామని, రూ.1.9కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ 33.54 కి.మీ నిర్మాణ పనులు చేపట్టామని, రూ. 6కోట్లతో విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామన్నారు. ● రూ.17.4కోట్లతో 3.20 మీటర్ల పొడవుతో రైల్వే అండర్ బ్రిడ్జిని మధురానగర్లో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ● మూడు నియోజకవర్గాల పరిధిలోని రూ.3 కోట్లతో పార్కులు, కెనాల్ సుందరీకరణ చేశారని, నగరంలోని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన 12 వేల టన్నుల చెత్తని తొలగించామన్నారు. ఆదాయం రూ. 168.8కోట్లు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 163.8 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చిందని మేయర్ తెలిపారు. ఆస్తి పన్నులు 109.23 కోట్ల ఆస్తి పన్ను ఈ ఏడాది వసూలు అయిందని, ఖాళీ స్థలాల పన్ను రూ.9.80 కోట్లు, రూ.18.46 కోట్లు నీటి పన్ను వసూలు అయిందన్నారు. సీవేజ్ చార్జీలు రూ. 18కోట్లు వచ్చాయని, రూ.6.59 కోట్లు వాటర్ మీటర్ చార్జీలు వసూలు అయ్యాయన్నారు. పట్టణ ప్రణాళికలో 1216 దరఖాస్తులు రాగా వాటి ద్వారా వీఎంసీకి రూ.56.13 కోట్లు, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) 2020లో భాగంగా రూ. 26.25 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కారుణ్య నియామకం ద్వారా 10 మందికి ఉద్యోగాలు కల్పించామని, పార్కులు, షాపులు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, ఆడిటోరియం, కర్మల భవన్ నుంచి రూ.19.20 కోట్లు వీఎంసీకి సమకూరాయన్నారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి నేడు వీఎంసీ బడ్జెట్ సమావేశం విజయవాడ నగరపాలక సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్పై శనివారం కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఎంసీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. -
గుడులు, గోవులకూ రక్షణ కరువు
మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో గుడులు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వినాయక ఆలయాన్ని వీఎంసీ అధికారులు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులు పొక్లయినర్లతో కూల్చివేసిన ఆలయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోసియేషన్ సభ్యులకు కనీస సమాచారం అందించకుండా.. అప్పటికప్పుడు రెండు పొక్లయినర్లతో కూల్చివేయటం ఏమిటని ప్రశ్నించారు. గత ఏడాది కాలంగా ట్రెండ్ సెట్లో ఆలయ నిర్మిస్తామని.. అభ్యంతరాలు ఉంటే ప్రాథమిక దశలోనే ఎందుకు నిలుపుదల చేయలేదని ప్రశ్నించారు. పైగా గర్భగుడిలోకి జేసీబీలను పంపించటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి అద్దం పడుతోందన్నారు. కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పారు. కూల్చివేతల పరంపర.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మధురానగర్ కాలువగట్టుపై 40 ఏళ్ల నాటి నాగేంద్రస్వామి పుట్టని తొలగించటంతో పాటు దుర్గాదేవి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, శ్రీకృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గోశాలను కూడా దౌర్జన్యంగా కూల్చివేశారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. గతంలోనూ హిందూ దేవాలయాలపై దాడులు, కూల్చివేతలు అత్యధికంగా జరిగినది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలోనేనని మల్లాది విష్ణు విమర్శించారు. కృష్ణా పుష్కరాల సమయంలోనూ నగరంలో 23 దేవాలయాలను కూల్చివేసిన చరిత్ర చంద్రబాబుదని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పునర్నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు మార్తి చంద్రమౌళి, సామంతకూరి దుర్గారావు, డి.దుర్గారావు, పవన్ రెడ్డి, నగరి ప్రసాద్, ఓంకార్ రెడ్డి, చైతన్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు. వినాయక ఆలయం కూల్చివేత దారుణం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు -
గణపతి ఆలయం కూల్చివేత.. కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, విజయవాడ: దేవి నగర్ ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ కామన్ సైట్లో స్థానికులు నిర్మించుకుంటున్న గణపతి ఆలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిర్మాణం పూర్తవుతున్న సమయంలో బుల్డోజర్లతో కూల్చేశారు. వీఎంసీ కూల్చి వేసిన గణపతి ఆలయాన్ని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, వీఎంసీ అధికారులపై మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని కాపాడతామంటూ కూటమి నేతలు వేషాలేస్తున్నారని.. కూటమి పాలనలో దేవుడికే రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో వైకుంఠద్వార దర్శనం క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోయాయి’’ అని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆలయాల కూల్చివేతలే. గతంలో విజయవాడలో ఆలయాలను కూల్చివేశారు. ఇటీవల కాశీనాయన ఆశ్రమాన్ని, జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాలను కూల్చివేశారు. హిందూధర్మం అని వేషాలేసుకునే పవన్ కల్యాణ్కు తన పోర్టుపోలియోలో ఏం జరుగుతుందో తెలియదా?. నిన్న కాక మొన్న వివినరసరాజు వీధిలో గోశాలను కూల్చేశారు. ఈ రోజుకీ గోవులు ఎండలో మాడిపోతున్నాయి.ట్రెండ్ సెట్ గేటెడ్ కమ్యూనిటీ స్థానికులు ఏడాది క్రితం ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రారంభ దశలో అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడెలా కూల్చుతారు. ఆలయ గర్భగుడిని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎవరి ఆదేశాల మేరకు వీఎంసీ అధికారులు గణపతి ఆలయాన్ని కూల్చివేశారు. కూల్చివేతలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్’ నుంచి మినహాయించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకోవాలి
పెనమలూరు: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, వివిధ రాయితీలు పొందటానికి ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్లో వారు పేర్లు నమోదు చేసుకోవాలని కృష్ణా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్.వెంకట్రావు సూచించారు. కానూరు ఆటోనగర్ క్లస్టర్ భవనంలో గురువారం ఉద్యం రిజిస్ట్రేషన్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీఎం వెంకట్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమల వృద్ధిలో భాగంగా ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సెక్టార్ అభివృద్ధికి చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రుణ సదుపాయం లబ్ధిపొందాలంటే ఉద్యం రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. పారి శ్రామికవేత్తలు, వ్యాపారులు తమ యూనిట్లకు సంబంధించి ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ క్లస్టర్ ఎండీ అన్నే శివనాగేశ్వరరావు, డైరెక్టర్లు, పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. -
డ్వాక్రా రుణాల పేరుతో మోసపోయిన మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో డ్వాక్రా రుణాల పేరుతో తమను ఆర్పీ, సీఓ మోసగించారని పలువురు మహిళలు ఆరోపించారు. వారి కథనం మేరకు.. టేకోవర్ గ్రూప్స్ ఉన్నాయని, వాటిలో చేరి రూ.2 లక్షలు పొదుపు చేస్తే బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని వైఎస్సార్ కాలనీకి చెందిన పది మంది మహిళలను రిసోర్స్ పర్సన్ బూదాల రాణి, కమ్యూనిటీ రాజేష్ నమ్మించారు. వారి వద్ద పొదుపు రూపంలో రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కట్టించారు. అనంతరం ఆ మహిళల వద్ద ఉన్న బ్యాంకు డాక్యుమెంట్లను రాణి, రాజేష్ తీసుకుని వాటిపై ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. లోన్ వచ్చే సమయానికి డబ్బు కట్టిన మహిళలను తప్పించి, లోన్ కింద వచ్చిన మొత్తాని వారిద్దరూ వాడేసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అదేమని అడిగితే ‘మీ డాక్యుమెంట్లతో లోన్ కోసం పెట్టాం కాబట్టి రూ.లక్షకు రూ.5 వేల కమీషన్ ఇస్తామని, తీసుకుని సైలెంట్గా ఉండాలని అంటు న్నారని పేర్కొన్నారు. బ్యాంక్ రుణంగా ఇచ్చిన రూ.20 లక్షలు, తాము రూ.2 లక్షల చొప్పున చెల్లించిన పొదుపు సొమ్ము ఇవ్వకుండా రిసోర్సు పర్సన్ రాణి, కమ్యూనిటీ ఆర్గనైజర్ రాజేష్ మోసం చేశారని బాధిత మహిళలు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని పలువురు మహిళలు గురువారం సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. -
అదనపు పనులు చేయలేం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాధవి, సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీఎంహెచ్ల పరిధిలో పనిచేయడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒకే సమయంలో వేర్వేరు శాఖల పనులతో పనిభారం పెరిగిందన్నారు. పనిభారం తగ్గించాలని ఉన్నతాధికారులను కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అదనపు పనులు చేయించవద్దని వైద్య ఆరోగ్యశాఖ జారీ చేస్తున్న ఉత్తర్వులను క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఏవీ నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో గ్రామ, వార్డు సచివాలయాల హెల్త్ సెక్రటరీలు -
పోలవరం బిల్లుకు సవరణ చేయించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా నిధుల విషయంలో కేంద్ర బడ్జెట్లో పెట్టిన బిల్లుకు తక్షణమే సవరణ చేయించాలని రాష్ట్ర ఎంపీలను ప్రత్యేక హోదా విభ జన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. లేకపోతే శాశ్వతంగా నష్టపోతా మని ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్పేట బాలో త్సవ భవన్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిత్రం పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లకు ఆమోదం పొందితే మొన్న జరిగిన బడ్జెట్లో రూ.30 వేల కోట్లకు కుదించడమే కాకుండా 150 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 135 అడుగులకు పరిమితం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సాధన సమితి ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ పి.మధు, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, కాంగ్రెస్కిసాన్ సెల్ నేత కిరణ్కుమార్రెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం నేత ప్రొఫెసర్ విశ్వనాథం, సాధన సమితి సంయుక్త కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. -
మచిలీపట్నం చేరుకున్న సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ
చిలకలపూడి(మచిలీపట్నం): దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళమైన కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకుంది. జెడ్పీ కన్వెన్షన్ హాలులో అడిషనల్ ఎస్పీ సి.సత్యనారాయణ ఈ సైకిల్ ర్యాలీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అభినందన సభలో బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సీఐఎఫ్ డెప్యూటీ కమాండెంట్లు హ్రిషబ్, ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఐఎస్ఎఫ్ను స్థాపించి ఈ నెల పదో తేదీ నాటికి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురక్షిత తీరం – సమృద్ధి భారత్’ పేరుతో ఆరు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీర ప్రాంతంలో దేశ భద్రత, సమైఖ్యతను పెంపొందించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ఏడో తేదీన పశ్చిమబెంగాల్లోని బఖ్ఖలి నుంచి 60 మంది సభ్యులతో తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర ప్రాంతం గుండా ఈ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస్, శిఖర్ లోహియా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మైలవరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మైలవరం మండలం వెల్వడం అడ్డ రోడ్డు వద్ద జరిగింది. జి.కొండూరుకు చెందిన భార్యాభర్తలు లంకా కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై ఆగిరిపల్లిలోని తమ మామిడి తోటలను చూసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జి.కొండూరు బయలుదేరారు. మైలవరం మండలం వెల్వడం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో కోటేశ్వరమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందింది. వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేక తల్లడిల్లాడు. -
సామూహిక లైంగిక దాడి కేసును ఛేదించిన పోలీసులు
గన్నవరం: బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను ఆత్కూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్స్టేషన్లో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సమక్షంలో నిందితులను అరెస్ట్ చూపించారు. అనంతరం ఎస్పీ కేసు వివరాలను మీడి యాకు వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక తమ ఇంటి పక్కనే ఉండే కుటుంబంతో సన్నిహితంగా మెలిగేది. ఈ నెల తొమ్మిదిన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో జరిగిన అమ్మవారి జాతరకు సదరు కుటుంబంతో పాటు బాలిక కూడా వచ్చింది. ఈ నెల 13వ తేదీ రాత్రి ఆ బాలిక కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఓ ఆటో డ్రైవర్ ద్వారా బాలిక మాచవరం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు ఆమె తల్లిదండ్రుల సమక్షంలో బాలికను తీసుకొచ్చి పెద్ద ఆవుటపల్లిలోని బంధువుల ఇంటికి పంపించారు. అనంతరం కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఉమెన్ ఎస్ఐ నేతృత్వంలో విచారణ జరపగా సామూహిక లైంగికదాడి విషయం బయటపడింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ బాలికను ఆమె స్వగ్రామంలో దింపుతామని వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు నమ్మబలికారు. అనంతరం ఆ బాలికను వేర్వేరు ప్రాంతాలకు మార్చుతూ యువకులు ఆమైపె సామూహిక లైంగిక దాడికి పాల్పొడ్డారని విచారణలో తేలింది. ఆ బాలిక నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు రేప్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వీరపనేనిగూడెంనకు చెందిన బాణవతు లక్ష్మణజితేంద్రకుమార్నాయక్, పగడాల హర్షవర్ధన్ను అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువకులను పట్టుకోవాల్సి ఉందని, వారిలో మైనర్లు ఉన్నారని పోలీ సులు తెలిపారు. కేసు దర్యాప్తులో చాకచాక్యంగా వ్యవహరించిన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, సీఐ కె.వి.వి.ఎన్.సత్యనారాయణ, ఆత్కూరు ఎస్ఐ చావా సురేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, గన్నవరం ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
చిన్నారుల సంక్షేమానికే ‘మిషన్ వాత్సల్య’
జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు స్థాయి కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో మిషన్ వాత్సల్య–శిశు సంక్షేమ, రక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేక కమిటీలు.. కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాలు తదితరాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్గా గ్రామ, వార్డుస్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. డివిజన్ స్థాయిలో కమిటీలకు వర్క్షాప్లు నిర్వహించాలని.. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో శిశు మద్దతు కార్యకలాపాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తదితరాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవల సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈవో వై.కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా శిశు సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, ఏసీపీ కె.లతాకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి కేఎస్ శిరోమణి పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్’ నుంచి మినహాయించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే పని.. రెండు బిల్లులు
అవనిగడ్డ: నిధులులేక ఎన్నో సంవత్సరాల నుంచి పలు చోట్ల పంట కాలువల్లో పూడికతీత పనులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవనిగడ్డలో మాత్రం ఒకే పంట కాలువకు రెండు రకాల బిల్లులతో పనులు జరుగుతున్నాయి. ఒక పక్క యంత్రాలతో కాంట్రాక్టర్ పంటకాలువ పూడిక తీత పనులు చేపట్టారు. మరో వైపు అదే కాలువలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఒకే పనిని రెండు రకాలుగా చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా పనులు అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 పంట కాలువల్లో పూడికతీత పనులను రూ.39.90 లక్షలకు విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆరు రోజుల నుంచి యంత్రాలతో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా అవనిగడ్డ మండల పరిధిలోని అశ్వరావుపాలెం – మందపాకల పంటకాలువ పూడిక తీతను రెండు రోజుల క్రితం క్రితం చివరి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇదే కాలువకు మొదలులో నాలుగు రోజుల నుంచి రోజుకు 50 నుంచి 60 మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ పంటకాలువకు సంబంధించి ఇప్పటి వరకూ ఉపాధి కూలీలు రూ.80 వేలు విలువగల పనులు పూర్తి చేశారు. ఈ కాలువకు సంబంధించి ఎవరు ఎన్నిచోట్ల పనులు చేసినా కాంట్రాక్టర్కు కేటా యించిన నిధులు మాత్రం ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చోట్ల డ్రెయిన్లు, పంట బోదెలకు సంవత్సరాల తరబడి పూడికతీయలేదు. దీంతో కొద్దిపాటి వర్షాలకు సైతం డ్రెయిన్లు పొంగి పంటపొలాలను ముంచెత్తడం దివి సీమలో పరిపాటిగా మారింది. గత ఏడాది ఖరీప్లో కురిసిన భారీ వర్షాలకు ఆరు మండలాల్లో 23 వేల ఎకరాలు వరిపంట ముంపునకు గురైన విషయం విదితమే. అవసరమైన చోట పనులు చేయకుండా ఒకే కాలువకు రెండు విధాలుగా పనులు చేయిస్తూ ప్రజాధనం వృథా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకేపనికి రెండు విధాలా ప్రజాధనం వృథా అవుతుంటే ఏమి చేస్తున్నారని కొంత మంది రైతులు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై ఇరిగేషన్ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. అశ్వరావుపాలెం – మందపాకల కాలువకు ఉపాధి కూలీలు పనులు చేస్తున్న విషయం తనకు తెలియదన్నారు. రేపటి నుంచి పనులు ఆపేస్తామని చెప్పారు. ఏపీఓ రవి కుమార్ని వివరణ కోరగా.. ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకే కూలీలతో ఉపాఽధి పనులు చేపట్టామని చెప్పడం గమనార్హం. ఎగువ నుంచి యంత్రాలతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ దిగువ నుంచి ఉపాధి హామీ పథకంకూలీలతో జరుగుతున్న పనులు ఒకే కాలువకు రెండు విధాలా పనులపై విస్మయం ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శలు -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ ప్రక్రియకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ నెల మొదటి తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ప్రధాన సబ్జెక్ట్ల పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 17 నుంచి మూల్యాంకనం ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గురువారం నుంచి అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు. జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలు.. ఎన్టీఆర్ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి సుమారుగా 4,08,565 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే అరకొరగా మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 17వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో తాజాగా గురువారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. దఫదఫాలుగా అధ్యాపకులు.. జిల్లాలో జరుగుతున్న మూల్యాంకనం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 450 మంది అధ్యాపకులు గురువారం నాటికి అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 13, తెలుగు–6, ఇంగ్లిష్–21, హిందీ–1, మ్యాథ్స్–40, సివిక్స్–6 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూృట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరికొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగనున్న స్పాట్ వాల్యూయేషన్ జిల్లాకు చేరుకున్న 4,08,565 పేపర్లు రిపోర్ట్ చేసిన 450 మంది అధ్యాపకులు మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. అధ్యాపకులను స్పాట్కు పంపించాలి.. స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. విధులు కేటాయించిన అధ్యాపకులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. – సీఎస్ఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
ఉద్యమంలా ప్రకృతి వ్యవసాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రకృతి వ్యవసాయం – ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై సమన్వయ సమావేశం గురువారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన పురుగు మందులు, ఎరువులు మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రావణాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లోనూ రైతులకు సాయపడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలని, శాసీ్త్రయ ఆధారాలతో అపోహలను తొలగించాలని కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రకృతి సాగు దిశగా నడిపించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ర్యాలీలు, పొలం సందర్శనలు, ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్న రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ (జెడ్బీఎన్ఎఫ్) విధానాలు నేలసారం తగ్గకుండా పంటకు సత్తువనిస్తాయని, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని వివరించారు. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులనూ తట్టుకునే సామర్థ్యం ఈ విధానాల పంటలకు ఉంటుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూతతో నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ బేర్, దానిమ్మ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలు 19 రకాల ఉద్యాన పంటలను చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుదిశగా నడిపించాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ రంగ వృద్ధిని ఆరు శాతం నుంచి 15 శాతానికి తీసుకెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగుతో ముందుకెళ్తున్న రైతులు వెంకట గురుప్రసాద్ (నున్న), శ్రీనివాస్రెడ్డి (రెడ్డిగూడెం)ని కలెక్టర్ సత్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి పి.ఎం.సుభాని, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ కార్యాచరణ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025 ఇఫ్తార్ సహరి (శుక్ర ) (శని) విజయవాడ 6.23 4.53 మచిలీపట్నం 6.22 4.51బందరు చేరిన సైకిల్ ర్యాలీ దేశంలో అత్యున్నత భద్రతను అందించే కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం మచిలీపట్నం చేరుకుంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుడివాడకు చెందిన సుంకర బాలాంబ కుటుంబం రూ. 2,00,116 విరాళాన్ని అందజేసింది. –8లోuఈవీఎం గోడౌన్కు పటిష్ట భద్రత భవానీపురం(విజయవాడపఽశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్స్ ఉన్న గోడౌన్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోగల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ఈవీఎం, వీవీప్యాట్లు భద్రపరిచన గోడౌన్ను అధికారులు, రాజకీయ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, వై. రామయ్య (టీడీపీ), ఎం. వినోద్ కుమార్ (బీఎస్పీ), తరుణ్ కాకాని (బీజేపీ), వై ఏసుదాసు (ఐఎన్సీ) పాల్గొన్నారు. విజయవాడ డివిజన్కు ప్రతిష్టాత్మక అవార్డు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రోజువారీ విధుల్లో అధికార భాషను అమలు పరచడంలో విశేష కృషి చేసినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన ‘రఘువీర్ చాల్ వైజయంతి’ షీల్డ్ను విజయవాడ డివిజన్ సాధించింది. గురువారం న్యూఢిల్లీలోని రైల్భవన్లో జరిగిన అధికార భాష అమలు కమిటీ సమావేశంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, డివిజన్ రాజభాష అధికారి ఎం.కె.నాగరాజుతో కలసి రైల్వేబోర్డు చైర్మన్ సతిష్కుమార్ చేతుల మీదుగా షీల్డ్ను అందుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ రాజభాష అమలులో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు రావటం డివిజన్కే గర్వకారణమన్నారు. డివిజన్ సాధించిన విజయంతో పాటుగా గుంటుపల్లిలోని రాయపాడు వ్యాగన్ వర్కుషాపునకు రాజభాష అమలులో ‘ఆదర్శ కార్ఖానా’గా గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. 31వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 2024–25 ధాన్యం సేకరణ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తారని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ గురువారం తెలిపారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని ఇంకా విక్రయించాల్సిన వారు ఉంటే సంబంధిత కేంద్రాలకు వెళ్లి విక్రయించుకోవాలని ఆమె సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 70,718 రైతుల నుంచి రూ. 1,333.43 కోట్ల విలువ కలిగిన 5,83,117 టన్నులు ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధు మూర్తిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి వినతిప్రతం అందజేశామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే మంజూరు చేసే లా ప్రభుత్వంతో చర్చలు జరిపి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడా లని, వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చిన విధంగా జీఓ 77ను రద్దుచేసి పీజీ విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు. ఏబీవీపీ జాతీయ సమితి సభ్యుడు యాచంద్ర, పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్కుమార్ రెడ్డి, సురేంద్ర, పరిషత్ సభ్యులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు మునేరు ఊహించని విధంగా ఉప్పొంగి.. రైతులను దారుణంగా ముంచేసింది. దాదాపు 3.50 లక్షల కూసెక్కుల మేర వరద ప్రవాహం రావడంతో భారీగా ఇసుక మేటలు వేసింది. భూములు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. మునేరు పరిధిలోని కాలువలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. అంతేకాక 212 మైనర్ ఇరిగేషన్ చెరువులకూ గండ్లు పడి ధ్వంసం అయ్యా యి. ఇందులో ప్రధానంగా మునేరు పక్కన ఉన్న తువ్వకాలువకు 40 చోట్ల వరకు గండ్లు పడి నాశనమైంది. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేములనర్వ వద్ద నాలుగు, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద ఒక పెద్ద గండి పడింది. వీటికి శాశ్వత ప్రాతిపదికన గండ్లు పూడ్చలేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. అన్నదాతల ఆందోళన.. తెలంగాణ నుంచి వచ్చే మునేరు 240 కిలోమీటర్ల మేర ప్రవహించి ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. వత్సవాయి మండలం పోలంపల్లి నుంచి ప్రారంభమయ్యే మునేరు ప్రాజెక్టు పరిధిలో మెయిన్కాలువ ఉంది. ఇది వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరం.. పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతాల, పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, నందిగామ మండలం సోమవరం వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 22,000 ఎకరాలకు పైగా సాగు ఉంది. దీనికి పడిన గండ్లు తాత్కాలికంగా పూడ్చారు తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయలేదు. ఇక తువ్వ కాలువ వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు నుంచి పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వరకూ ప్రవహిస్తుంది. తువ్వకాలువ(పెనుగంచిప్రో లు) బ్రాంచ్ కింద సుమారు 3 వేల ఎకరాల వరకు సాగవుతోంది. కాలువకు వేమవరం, ఆళ్లూరుపాడు వద్ద పెద్ద గండ్లు పడ్డాయి. ఆయా చోట్ల తాత్కాలికంగా పూడ్చారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేయ లేదు. దీంతో మళ్లీ వరద వస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. రెండు సీజన్లు కోల్పోయిన రైతులు.. గండ్లు పడటంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు విలువైన పంట కోల్పోయారు. అంతేకాక పొలాల్లో ఇసుక మేట వేయటం, భూములు కోతకు గురి కావటం, మోటార్లు, బోర్లు పాడవడంతో రైతులు దారుణంగా నష్టపోయారు. అయితే వరదలు పోయి ఆరు నెలలు అవుతున్నా గండ్లు పూడ్చటంపై అధికారులు దృష్టి పెట్టటం లేదు. దీంతో ఖరీఫ్తో పాటు రబీ సాగు కూడా రైతులు కోల్పోయారు. కొద్ది మంది రైతులు మాత్రం పొలాలను సొంత డబ్బు ఖర్చు పెట్టి రబీ సాగు చేశారు. నేటికీ చాలా పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. అరకొరగా నష్టపరిహారం.. ● వరదలకు వత్సవాయి మండలం ఆళ్లూరుపాడు, వేమవరంలో సుమారు 200 ఎకరాల్లో పంట పాడవగా 100 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● పెనుగంచిప్రోలు మండలంలో 3097 ఎకరాల్లో వరి పంట నాశనమైంది. అందులో 300 ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ● ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు మాత్రం నామమాత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇసుక మేటకు, కోతకు గురైన భూములకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సీజన్లో పనులు చేయకపోతే, వర్షాకాలంలో మునేరుకు వరద వస్తే కడగండ్లు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ● ప్రభుత్వం మాత్రం గండ్లు పూడ్చటానికి కేవలం ప్రతిపాదనలు సిద్ధం చేసిన, నిధులు మంజూరు చేయలేదు. దీంతో గండ్లు పూడ్చడంపై సందిగ్ధత నెలకొంది. మునేరు మెయిన్ కాలువకు పడిన గండి(ఫైల్)● మునేరుకు వచ్చిన భారీ వర్షాలకు 70చోట్ల గండ్లు పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ.7కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.43.02 కోట్లు, మొత్తం రూ.50.02 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ● మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించి 212 చోట్ల గండ్లు పడగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.656కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.38.62 కోట్లు, మొత్తం రూ.53.276కోట్లు అవుతాయని ప్రతిపాదనలు రూపొందించారు. ● మునేరు, చెరువులకు కలిపి మొత్తం 282 గండ్లకు రూ.103.296కోట్లు నిధులు అవసరమని అంచనాలు రూపొందించారు. ● అయితే అక్కడక్కడ తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. శాశ్వత పనులకు ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. చర్లపల్లి–కన్యాకుమారి మధ్య వారాంతపు ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్థం సమ్మర్ వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి–కన్యాకుమారి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక రైలు(07230) ప్రతి బుధవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి రాత్రి 9.50 గంటలకు బయలుదేరి రెండో రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు కన్యాకుమారి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. అలాగే కన్యాకుమారి–చర్లపల్లి రైలు(07229) ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 ప్రతి శుక్రవారం నడపనున్నట్టు వివరించారు. ఈ రైలు కన్యాకుమారి స్టేషన్ నుంచి తెల్లవారు జామున 5.15 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 11.40 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుందని వెల్లడించారు. నాగాయలంక: ఆలీవ్ రిడ్లే తాబేళ్ల ప్రాణహాని కలిగించే చర్యలకు పాల్పడవద్దని పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది గురువారం తీరగ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. మండలంలోని ఎదురుమొండి, గుల్లలమోద, ఏటిమొగ, దీనదయాళపురం గ్రామాల్లో వివిధ అంశాలపై విస్త్రృత ప్రచారం, హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల వేటలో మత్స్యకారులు వాటికి ప్రాణహాని కలిగించే నిషేధిత వలలు(టేకు వల, మూడు పొరల వల వంటివి) ఉపయోగించకూడదని చెప్పారు. అలాగే వేట సమయంలో వలల్లో చిక్కిన తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో వదిలిపెట్టాలని సూచించారు. మైరెన్ పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల పెద్దలు, మత్స్యకారులు పాల్గొన్నారు. నాగాయలంక మండలం ఏటిమొగ వద్ద స్థానికులకు అవగాహన కల్పిస్తున్న మైరెన్ పోలీసులు7న్యూస్రీల్ గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు 70 చోట్ల గండ్లు 212 మైనర్ చెరువులకు నష్టం 25వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ప్రశ్నార్థకం పలు ప్రాంతాల్లో మేటలు వేసిన ఇసుక, కోతకు గురైన భూమి ఇప్పటి వరకు పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపాదనలు ఇలా.. మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ.. స్పాట్ వాల్యూయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. గ్రామాల్లో పాలకాయతిప్ప కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది అవగాహన -
కృష్ణా జిల్లాలో జనసేన దౌర్జన్యం.. దుకాణాలు కూల్చివేత
సాక్షి, కృష్ణాజిల్లా: ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో జనసేన నేతల కక్ష సాధింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై ఘంటసాల మండలం పార్టీ జనసేన అధ్యక్షుడు పవన్ కుమార్ దాష్టీకానికి పాల్పడ్డాడు. మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పవన్ కుమార్.. అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ సానుభూతి పరుల దుకాణాలు తొలగించారు. సామాన్లు తీసుకుంటామన్నా వినకుండా జేసీబీలు తెచ్చి దుకాణాలను కూల్చివేయించారు. కరకట్ట రహదారికి ఆనుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు.కేవలం వైఎస్సార్సీపీ సానుభూతి పరులు అనే కారణంతో రెండు దుకాణాలను మాత్రమే తొలగించిన అధికారులు.. విలువైన సామాగ్రి ధ్వంసం చేశారు. దుకాణాలను కూల్చిన ప్రదేశాన్ని ఫెన్సింగ్ వేసి జనసేన నాయకులు ఆక్రమించుకున్నారు. జనసేన నాయకులపై బాధిత మహిళలు మండిపడ్డారు. ఐదేళ్లుగా ఇక్కడే పాక ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని.. డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారం చేసుకుంటున్నామని.. సామాన్లు తీసుకుంటామన్నా అధికారులు ఒప్పుకోలేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలమని కూడా చూడకుండా మాపై జనసేన నాయకుడు పవన్ కుమార్ దౌర్జన్యం చేశారని.. కాళ్లమీద పడి వేడుకున్నా కనికరించలేదని బాధితులు వాపోయారు. లక్షల విలువైన మా సామాన్లను ధ్వంసం చేసేశారు. వైఎస్సార్సీపీ వాళ్లను బతకనివ్వమని బెదిరిస్తున్నారు. ఆడవాళ్ల మీదకు వెళ్లమని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ చెబుతున్నాడా? అంటూ బాధిత మహిళలు ప్రశ్నించారు. -
ఆటోలో బ్యాగ్ను మర్చిపోయిన మహిళ
గంటలో రికవరీ చేసిన పోలీసులు పాయకాపురం(విజయవాడరూరల్): బంగా రపు వస్తువులున్న బ్యాగ్ను ఓ మహిళ ఆటోలో మర్చిపోయింది. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన నున్న పోలీసులు గంట వ్యవధిలోనే ఆ బంగారం వస్తువులున్న బ్యాగ్ను రికవరీ చేసి, బాధితురాలికి అందజేసిన ఘటన బుధవారం జరిగింది. సుందరయ్య నగర్కు చెందిన ఐలూరి ప్రసన్న అనే మహిళ విజయవాడ ఆర్టీసీ బస్టాండు వద్ద పరిమళ పాపారావు ఆటో ఎక్కింది. బంగారం వస్తువులున్న బ్యాగ్ను మర్చిపోయి ఇంట్లోకి వెళ్లింది. కొద్దిసేపటికి ఆటోలో బ్యాగ్ మర్చిపోయినట్టు గుర్తు తెచ్చుకున్న ఆమె నున్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీఐ పి.కృష్ణమోహన్ ఆదేశాల మేరకు క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆటోని గుర్తించారు. అందులో చూడగా బంగారపు వస్తువులున్న బ్యాగ్ యథావిధిగా ఉంది. ఆ బ్యాగ్ను తిరిగి బాధితురాలికి సీఐ అందజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
గూడూరు: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గూడూరుకు చెందిన లంకపల్లి నరసింహారావు(64) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పొలం వెళ్లి వస్తుండగా గూడూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తలకు, కాలికి బలమైన గాయాలవ్వడంతో వెంటనే మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.