Narayanpet
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో పాలకులు మారిన పరిపాలన మాత్రం మారలేదని, గతంలో కేసీఆర్ చేసిన తప్పులను రేవంత్ కొనసాగిస్తున్నాడని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజెపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా కొండ సత్యయాదవ్ బుధవారం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరగగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల గారడీతో 6 అబద్ధాలు 66 మోసాలతో అధికారంలోకి వచ్చిందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిగా లేదని, మహాలక్ష్మి, గృహజ్యోతితో మహిళలను మోసం చేశారని, వృద్ధులకు చేయూత అందించలేదని, సొంతిల్లు కలగానే మిగిలి పోయిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డున పడ్డారనీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ దోచుకోవడంలో రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. పదేళ్లు బీఆర్ఎస్ కే.ట్యాక్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లిస్తుందని, ప్రజాస్వామ్యాన్ని పాతర వేశారని ప్రజలు వీరి పాలనలో భూమి, ఇళ్లు కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో చేపట్టిన సంక్షేమ పథకాలను, వక్ఫ్ బోర్డు రద్దుతో ముస్లింలకు నష్టం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ గెలుపునకు పట్టుదలతో కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. నిరంకుశ పాలన తలపిస్తున్న సర్కారు.. కేసీఆర్ హిట్లర్ మాదిరి వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నాడని ప్రజలు భావించి ఆయనను గద్దె దింపితే.. రేవంత్రెడ్డి సైతం అదే తీరులో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 12 యూనివర్సిటీలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు జీవో 21ని రద్దు చేయాలని ప్రజాస్వామ్య భద్రంగా నిరసన వ్యక్తం చేస్తుండగా దౌర్జన్యంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. హెచ్సీయూ భూములను అమ్మడంపై బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందనిన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈక్రమంలోనే చంద్రఘడ్ కు చెందిన గర్భిణి బిడ్డను కోల్పోయిందని వాపోయారు. ఇంత దారుణమైన సంఘటన జరిగిన ప్రభుత్వానికి చలనం లేదన్నారు. వెంటనే సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సవతి తల్లి ప్రేమ విడనాడాలి కొడంగల్, నారాయణపేటను సమాంతరంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని విస్మరించి సవతితల్లి ప్రేమ చూయిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండ సత్తియాదవ్ విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కమల వికాసమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. నాగురావు నామాజీ, రతన్ పాండు రెడ్డి, శ్రీనివాసులు, కొండయ్య, పూనమ్ చాంద్ లాహోటి, రఘువీర్ యాదవ్, రఘురామయ్య గౌడ్, జ్యోతి సాయిబన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలే కాంగ్రెస్ చేస్తుంది.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
దామరగిద్ద: 2024–25 విద్యాసంవత్సరం ఓపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని జెడ్పీ ఉన్నత పాఠశాల జీఎచ్ఎం అశోక్కుమార్, అసిస్టెంట్ కోఆర్డినేటర్ శంభులింగం తెలిపారు. విద్యార్థులు స్థానిక అధ్యయన కేంద్రం (జెడ్పీఉన్నత పాఠశాల)లో సంప్రదించి హాల్టికెట్లు పొందాలని, పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకుకొనసాగుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం కోస్గి రూరల్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్కుమార్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చెన్నారంలో పలు గ్రామాల బీటీ రోడ్లకు భూమి పూజ చేపట్టారు. రూ 9.14 కోట్ల నిధులతో చెన్నారం నుంచి కడంపల్లి, చెన్నారం నుంచి ముక్తిపహడ్ గ్రామల వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, ఇప్పటికే రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. త్వరలో యువతకు సైతం సబ్సిడీపై రుణాలు అందజేయనున్నట్లు వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్రెడ్డి, బెజ్జురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి రూ.465 కోట్లు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 465 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని జితేందర్రెడ్డి నివాసంలో బుధవారం లాక్రోస్ క్రీడాకారులు, రాష్ట్ర సంఘం ప్రతినిధులు ఆయనను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన నిధులతో రాష్ట్రంలో మరుగున పడిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు. యువత మాదక ద్రవ్యాల వైపు మరలకుండా ఏదో ఓ క్రీడలో పాలుపంచుకోవాలని సూచించారు. లాక్రోస్ క్రీడను రాష్ట్రంలో అభివృద్ధి పరిచి గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. లాక్రోస్ క్రీడ అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ముఖ్య క్రీడగా ఉందని, ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుందని లాక్రోస్ ఇండియా టీమ్ కెప్టెన్ అనుదీప్రెడ్డి తెలిపారు. త్వరలో ఆగ్రాలో లా క్రోస్ క్రీడ నేషనల్స్ నిర్వహిస్తున్నారని చెప్పా రు. కార్యక్రమంలో తెలంగాణ లాక్రోస్ అకాడమీ అధ్యక్షుడు భానుచందర్, ప్రధాన కార్యదర్శి శేఖర్, కోచ్, క్రీడాకారులు పాల్గొన్నారు. విచారణ ప్రారంభం నారాయణపేట: అడిషనల్ డీఆర్డీఓపై సెర్ఫ్ ఉద్యోగులు చేసిన ఫిర్యాదుతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ విచారణ కమిటిని నియమించింది. బుధవారం ఆ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సెర్ఫ్ ఉద్యోగులను విచారించారు. వారు తెలిపిన వివరాలను రికార్డు చేసుకున్నారు. అదే విధంగా అడిషనల్ డీఆర్డీఓతో సైతం స్టేట్మెంట్ను తీసుకున్నారు. ఈ నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్కు నివేదిస్తున్నట్లు విచారణ కమిటీ చైర్మన్, ఇంచార్జీ డీడబ్ల్యూఓ జయ తెలిపారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
మరికల్: యాసంగిలో సాగు చేసిన వరిధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆధైరపడొద్దని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మండలంలోని లాల్కోట చౌరస్తాలోని తీలేర్ సింగిల్విండో సొసైటీ వద్ద బుధవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్తో క్వింటాల్కు రూ. 2,820 చెల్లిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, విండో అధ్యక్షుడు రాజేందర్గౌడ్, సూర్యమోహన్రెడ్డి, జయసింహరెడ్డి, కృష్ణయ్య, తిమ్మరెడ్డి, హరీష్, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. 60 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ పోటీలు బాలుర, బాలికల విభాగంలో విడివిడిగా అండర్ –8,10,12,14,16, అండర్–20లలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారికి మెడల్స్ అందజేశారు. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి స్పోర్ట్స్ స్కూల్, ఆర్మీ స్కూల్లలో ప్రవేశానికి ఈ మెడల్స్ ఎంతో ఉపయోగపడతాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, పీఈటీ అక్తర్ ఫాషా, ఆంజనేయులు, భాను ప్రకాష్, పాల్గొన్నారు. -
రజతోత్సవ సభకు తరలిరావాలి
నారాయణపేట: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల 27న నిర్వహించే పార్టీ అవిర్భావ రజోత్సవ సభకు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదలిరావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి పిలునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) పురస్కరించుకొని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు గడప,గడప నుంచి భారీ ఎత్తున గులాబీ దళాన్ని తరలించాలని, రజోత్సవ వేడుకలతో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం రానుందన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు విజయ్సాగర్, వేపూరిరాములు,భగవంతు, చెన్నారెడ్డి, సుదర్శన్రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. నేడు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం గేట్ వద్దనున్న బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉదయం 10గంటలకు కార్యకర్తల సమావేశం నిర్వ హించనున్నట్లు ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షుడు విజయ్సాగర్, వేపూరి రాములు పేర్కొన్నారు. -
బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తపల్లి: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన లంబాడా జాతర గురులోకమా సంద్ బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసి బావాజీ బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించనుండగా.. బుధవారం ఆలయ సమీపంలో ఎస్పీ యోగేష్గౌతమ్తో కలిసి కలెక్టర్ ఆలయ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబందించి అధికారులకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. నోడల్ అదికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వీఐపి మేనెజ్మెంట్ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. దేవాదాయ శాఖ పరంగా ఇప్పటివరకు ఏఏ ఏర్పాట్లు చేశారని ఆరా తీశారు. గతేడాది మాదిరిగానే ఈసారి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, డిప్యూటేషన్పై సిబ్బందిని రప్పిస్తున్నామని ఈఓ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వసతి కల్పించాలని ఆదేశించారు. భక్తులకు కోస్గి, మహబూబ్నగర్ డిపో నుండి అదనంగా మరికొన్ని బస్సులను నడిపిస్తామని డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. బస్సుల పార్కింగ్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. జాతరలో ఒక డాక్టర్ సూపర్వైజర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్తలతో మూడు విడతలుగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్ఓ శైలజ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎక్షైజ్ సీఐ బాలకృష్ణ, తహసిల్దార్ జయరాములు, ఎంపిడీఓ కృష్ణారావ్,ఎంపీఓ రామన్న పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. జాతరలో దొంగతనాలు జరగకుండా మఫ్టీలో పోలీసులను నియమిస్తామని, భక్తుల సౌకర్యార్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తామని, పోలీసు ఔట్పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్కార్డు అడిగారు. మాకు రేషన్కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తాం యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్నగర్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చడమే లక్ష్యం
మరికల్: అన్నిరంగాల్లో వెనకబడిన ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ అన్నారు. మంగళవారం మరికల్కు వచ్చిన ఆయనకు మండల ముదిరాజ్ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ–ఏలోకి ముదిరాజ్లను చేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇందుకు ముదిరాజ్ జాతి చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముదిరాజ్లను బీసీ–ఏలో చేర్చేందుకు బిల్లు పెట్టగా.. అప్పట్లో కొన్ని దుష్టశక్తులు అడ్డు పడటంతో ఆగిపోయిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముదిరాజ్లను బీసీ–ఏలోకి చేర్చేందుకు ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, నారాయణ, పటేల్ శ్రీను, కృష్ణయ్య, రాములు, టంకర శ్రీను, కుర్మన్న, కొండప్ప, నర్సింహులు, సతీష్, సాయితేజ ఉన్నారు. -
మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నిషేధం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్య లు తీసుకోవాలన్నారు. అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా బీడీ, సిగరెట్, మద్యం లాంటివి విద్యార్థులపై ప్రభావం చూపే ఆస్కారం ఉందని.. కళాశాలల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే జిల్లాలోని 109 జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య వివరించారు. అదే విధంగా గంజాయి సాగు, సరఫరాకు సంబంధించి 2022లో మూడు కేసులు, 2024లో మూడు కేసులు నమోదయ్యాయని.. ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నాయన్నారు. ఇకపై జిల్లాలో ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కావడానికి వీలులేకుండా రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిషేధించాలన్నారు. మాదకద్రవ్యాల నిషేధిత జిల్లాగా నారాయణపేటను మార్చాలన్నారు. మళ్లీ నిర్వహించే సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, సైకాలజిస్టు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలోఆర్టీఓ మేఘాగాంధీ, ఎకై ్సజ్ సీఐలు అశోక్ కుమార్, బాలకృష్ణ, ఎస్ఐలు గురవయ్య, ఎల్ఎస్ శిరీష, అటవీశాఖ అధికారి సత్యనారాయణ, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, డీఐఈఓ సుదర్శన్, డీఈఓ గోవిందరాజులు, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారిణి అఖిల ప్రసన్న ఉన్నారు. -
చెరుకు రైతుల ఆందోళన
అమరచింత: బకాయి ఉన్న రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ చెరుకు రైతులు కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్డారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మా ట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో కోతలు పూర్తయినా ఇప్పటి వరకు బకాయి డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించారు. వెంటనే బకాయి డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, కేన్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రరావుకు సమస్యను వివరించగా.. ఆయన ఫ్యాక్టరీ డైరెక్టర్ రవికుమార్తో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
నారాయణపేట: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో గ్రామాల్లోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. గ్రేడ్–ఏ ధాన్యాన్ని రూ. 2,320, సాధారణ గ్రేడ్ ధాన్యాన్ని రూ. 2,300 ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్నరకాలకు క్వింటాల్ రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కె.నర్సింహారెడ్డి, కార్యదర్శి పి.అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
నారాయణపేట: ప్రతి గ్రామంలో మెరుగైన వైద్య సేవలు అందాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రన్ఫర్ హెల్త్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైద్య కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒకే సంవత్సరంలో ఎంబీబీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీని ప్రారంభించామని, త్వరలో మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నందకుమార్ మాట్లాడుతూ.. నారాయణపేట మెడికల్ కాలేజీ పురోగతిలో ఉందని, కళాశాలకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, లైబ్రరీకి అవసరమైన 4 వేల పుస్తకాలను పంపిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త కే పురుషోత్తం రెడ్డి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దాసరి ప్రసాద్రావు, డాక్టర్ విజయ్ సీనియర్ జర్నలిస్టు పంతంగి రాంబాబు,సామాజిక వేత్త కుంభం శివకుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి , రెడ్ క్రాస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, వైద్య నిపుణులు ఆదిత్య, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు. పేదల కడుపునింపేందుకే.. నర్వ: పేదల కడుపునింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండలంలోని లంకాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారు రేణుక ఇంట్లో భోజనం చేశారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులు, అంగన్వాడీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏఓ అఖిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, శ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి,శరణప్ప, బీసం రవికుమార్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ ‘రగడ’..!
పీయూలో జీఓ 21 లొల్లివివరాలు 8లో u●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి పీయూలో లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం. అయినా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టుల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబ ద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పాలమూరు యూనివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవారం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటాయించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కులు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఒక్క సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లోషిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్నట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటా యించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సాధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తున్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్టైం ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొత్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. ఇవి పోను 42 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూలో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్చాన్స్లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి ప్రణాళికలు
మద్దూరు: నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ సమగ్రాభిద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తామని ఎన్సీపీఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఇంజినీర్ మహ్మమద్ సిద్దికి తెలియజేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ కమిషన్ శ్రీకాంత్, మద్దూరు, రెనివట్ల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ మున్సిపాలిటీ మరో 30 ఏళ్ల వరకు సరిపడా ప్రణాళికలు రుపొందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మీమీ గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యత అంశాలను మాకు తెలియజేయాలని కోరారు. దీంతో వారు పలు సూచనలు చేశారు. రెండు నెలల పాటు మున్సిపాలిటీలో తిరిగి సమగ్ర ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేష్, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్, మల్లీకార్జున్, బాబుస్వామి, చంద్రమోహన్, శ్రీనావాస్రెడ్డి, ఆశోక్, య సిన్, చందు, రామక్రిష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సన్న బియ్యంపై నిఘా
నారాయణపేటమంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మరికల్: ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. దీంతో రేషన్దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో బియ్యం పక్కదారి పట్టకుండా, దొడ్డు బియ్యాన్ని కలపకుండా ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్రమాలకు చోటు లేకుండా ప్రక్షాళన చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని రంగంలోకి దింపింది. జిల్లా వ్యాప్తంగా నిరంతరం ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం పట్టుబడుతునే ఉన్నాయి. కొన్ని రేషన్దుకాణాలు అక్రమాలకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. గతానికి బిన్నంగా టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను సమాయత్తం చేసి దుకాణాల్లో అక్రమాలకు తెరపడేలా పౌర సరఫరాల అధికార యంత్రాంగం పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. రేషన్ దుకాణాల చుట్టూ వ్యాపారులు ఇన్నాళ్లు రేషన్ దుకాణాల అడ్డాగా జరిగిన బియ్యం అక్రమ దందాకు సన్నబియ్యం పంపిణీతో అడ్డు పడింది. ఎలాగైన తమ వ్యాపారం కొనసాగించాలనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు జిల్లా వ్యాప్తంగా పాత పద్ధతి ప్రకారం రేషన్దుకాణాల వద్దకు వెళ్లి సన్నబియ్యం ఎలా ఉన్నాయి.. వాటిని ఏమైనా అమ్ముతారా అంటూ ఆరా తీస్తున్నారు. దొడ్డు బియ్యం కంటే కిలోకి రూ.5 ఎక్కువగా ఇస్తామంటూ బేరసారాలు ఆడుతున్నారు. ఇదే ఆశతో కొందరు డీలర్లు డబ్బులు కావాలా, లేక బియ్యం కావాలా అంటూ లబ్ధిదారులను రహస్యంగా అడగటం గమనార్హం. కొందరు అక్రమ బియ్యం వ్యాపారులు లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి కిలో రూ.20కి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లయ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో బియ్యం వ్యాపారుల కదలికపై కన్నేసింది. బియ్యం బాగున్నాయి ప్రభుత్వం రేషన్ ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యం బాగున్నాయి. బువ్వ కూడా పొడి, పొడిగా అవుతోంది. గతంలో దొడ్డురకం బియ్యం బువ్వ మంచిగా ఉండేది కాదు. మార్కెట్లో క్వింటాల్ సన్నబియ్యం రూ.5 వేలకు కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుతం రేషన్లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో సంతోషంగా భోజనం చేస్తున్నాం. – పాపన్న, కిష్టంపల్లి బేరాలు ఆడుతున్నారు లావు బియ్యం కొనుగోలు చేసే వ్యాపారులు సన్నబియ్యం కూడా అమ్ముతారా.. అంటూ ఇటీవల బేరాలు ఆడుతున్నారు. అమ్మేది లేదంటూ చెబుతుండడంతో వెనుదిరుగుతున్నారు. సన్న బియ్యం వండగా.. ఇంట్లో పిల్లలు సైతం బాగుంది అంటున్నారు. అందరి మాదిరిగా తాము కూడా సన్నబువ్వ భోజనం చేయడం ఆనందంగా ఉంది. – భాగ్యమ్మ, మరికల్ పక్కదారి పడితే చర్యలు జిల్లాలో మొత్తం రేషన్ దుకాణాలకు 3,382 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అందించాం. బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు అందేలా చూస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలను పర్యవేక్షణ చేయిస్తున్నాం. అక్రమాలకు పాల్పడినా, లబ్ధిదారులకు సరైన సేవలు అందించకపోయినా డీలర్లపై చర్యలు తప్పవు. – సైదులు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం, నారాయణపేట పక్కదారి పట్టకుండా రేషన్ దుకాణాలపై కన్నేసిన ఎన్ఫోర్స్మెంట్ రోజువారి తనిఖీలు, నివేదికలు సన్నబియ్యంపై ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు -
నిర్వహణకు నిధుల్లేవ్..!
మక్తల్: రైతులకు సాగులో మెళకువలు.. సీజన్ల వారీగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహన సమావేశాలు.. ఇలా నిరంతరం రైతులను అప్రమత్తం చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలను నిర్మించారు. కానీ.. నేడు నిధుల్లేక రైతువేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక్కో దానికి రూ.22 ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా 76 రైతు వేదికలను నిర్మించారు. ఈ వేదికల నిర్వహణ బాధ్యతలను క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించింది. వేదికల నిర్వహణకు ప్రతినెల రూ.9వేల వరకు ఖర్చు అయ్యేది. రైతువేదిక విధిగా శుభ్రం చేయడం, తాగునీటి వసతి, స్టేషనరీ, రైతులకు శిక్షణ, విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెండింగ్లో రూ.2.05 కోట్లు రైతు వేదిక నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో రైతుల శిక్షణ కార్యక్రమాల భారం వ్యవసాయ విస్తరణాధికారులపై పడుతోంది. అయితే, ఏఈఓలు చేతి నుంచి ఖర్చు పెడుతూ నిధులు వచ్చినప్పుడే తీసుకునేవారు. కానీ, దాదాపు 30 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి విడుదల కావడంలేదు. నెల నెల చేతి నుంచే డబ్బులను వెచ్చించాల్సి వస్తుందని పలువురు వ్యవసాయ విస్తరణాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని 76 రైతు వేదికలకు రూ.2.05 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ, ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో ఏఈఓలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతు వేదికకు నెలకు రూ.9వేలు ఖర్చు నెలల తరబడి విడుదల చేయని ప్రభుత్వం ఏఈఓలకు తప్పని నిర్వహణ భారం జిల్లాలో మొత్తం 76 రైతు వేదికలు -
సత్యసాయి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట రూరల్: భగవాన్ శ్రీసత్యసాయి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి సమస్యను గుర్తించి నాడు ఈ ప్రాంతానికి నీరు అందించిన భగవంతుడు సాయి అన్నారు. ఆయన సేవలను మరితం విసృతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలని, ఎండాకాలంలో దాహం తీర్చడం ఎంతో గొప్ప కార్యమని అన్నారు. నీటి వనరులను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం లావణ్య, సేవా సమితి సభ్యులు చిట్టెం మాధవరెడ్డి, మల్లికార్జున్, గోపీనాథ్రావు, శివరాజు, ఆనంద్, బీవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
నారాయణపేట రూరల్: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసమే లక్ష్యంగా పని చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావునామాజీ అన్నారు. పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయలంలో జిల్లా నూతన అధ్యక్షులు సత్యాయాదవ్తో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సంఘ్ పరివార్ ఏర్పాటకు కారకులైన శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్దయాల్, భరతమాత చిత్రపటాలకు పూజలు చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వం కల్గిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు. మోదీ నేతృత్వంలో ఎన్నో హామీలను నెరవేర్చడమే కాకుండా ప్రకటన చేయని ఎన్నో కార్యక్రమాలు చేసి చూచించిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందన్నారు. ప్రపంచ దేశాలకే భారతావని ఒక చుక్కానిలా మారిందన్నారు. రాబోవుస్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం గెలుపు ఎవరు అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో 15 రాష్ట్రాల్లో సొంతంగా, మరో ఐదు చోట్ల మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో తిరిగి పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు గ్రామ స్థాయి కార్యకర్తలు సిద్దం కావాలన్నారు. కార్యక్రమంలో రఘురామయ్యగౌడ్, పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్, మండల అధ్యక్షురాలు జ్యోతి సాయిబన్న, రఘువీర్, వెంకటయ్య, రఘువీర్, కతలప్ప, కృష్ణ, సత్యరఘుపాల్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కోస్గి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి గడపకు పార్టీ అందించిన పథకం వివరించి గ్రామీణస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పలువురు నాయకులు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు పాలెం ప్రశాంత్, కోడంగల్ అసెంబ్లీ కో కన్వీనర్ రాము, జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజయ్య, మాజీ మండల అధ్యక్షుడు సీబీ వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, పార్టీ నాయకులు, బీజేవైఎం నాయకులు బద్రీనాథ్, సంపల్లి శ్రీను, రమేష్, జైపాల్, శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు. -
రహదారులే దిక్కు..!
వివరాలు 8లో uనర్వ: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు (కల్లం పట్టాలు) ఎంతో అవసరం. వ్యవసాయ పొలాలు, ఇళ్ల వద్ద ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా టార్పాలిన్లు కావాల్సిందే. అలాంటి వీటిని ఐదేళ్ల క్రితం వరకు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 50శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించేది. ఆ తర్వాత టార్పాలిన్ల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటులో అధిక ధరలకు టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి సైతం ప్రోత్సాహం కరువైంది. ఫలితంగా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రహదారులపై పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబోత వంటి పనులు చేపడుతున్నారు. గతేడాది కురిసిన అకాల వర్షాలకు చాలా మంది రైతుల ధాన్యం తడిసిపోవడంతో నష్టపోయారు. ప్రస్తుతం యాసంగిలో సాగుచేసిన వరిపంట చేతికిరావడంతో కోతలు ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నా ధాన్యం ఆరబెట్టేందుకు టార్పాలిన్లు లేకపోవడంతో రహదారులే దిక్కుగా మారాయి. అయితే రహదారులపై ధాన్యం ఆరబోతతో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. అకాల వర్షాలతో ఇబ్బందులు.. జిల్లాలో వరికోతలు చేపట్టిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఎక్కువ శాతం రహదారులనే కల్లాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల సాయంత్రం కాగానే అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యంతో పాటు మిరప, ఇతర పంటలు తడిసిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని, ఇతర పంటలను ఆరబెట్టుకోవాలంటే టార్పాలిన్లు ఎంతో అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ల పంపిణీని పునఃప్రారంభించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లావ్యాప్తంగా యాసంగిలో 1.51 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దాదాపు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి సన్నాలకు ప్రభుత్వం బోనస్ రూ.500 ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఇటీవల అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. దీంతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సుమారు 100కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంట నూర్పిళ్లు, ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు సబ్సిడీపై రైతులకు అందని టార్పాలిన్లు ఐదేళ్లుగా మూలనపడిన పథకం కల్లాల నిర్మాణాలకు సైతం ప్రోత్సాహం కరువు -
ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని మూసాపేట మండలంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం నాయకుడు ఘన్సిరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, తహసీల్దార్ల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసాపేట తహసీల్దార్ రాజునాయక్, కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రికార్డ్ అసిస్టెంట్పైన అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడిన ఇసుక మాఫియా నాయకుడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి సంఘటనలు జరిగితే విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోని తొలగించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, టీజీఓ జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టీజీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, దేవేందర్, చైతన్య, సుదర్శన్రెడ్డి, రవికుమార్, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ సొసైటీ భవన్లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కల్పించబడిన చట్టబద్ధ హక్కులను హరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక కర్షక ఫాసిస్ట్ విధానాలపై మే రెండో వారంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను చిన్న చూపు చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. -
సమసమాజ దార్శనికుడు జగ్జీవన్రాం
నారాయణపేట: సమసమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్రాం అని.. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహనీయుడు జగ్జీవన్రాం అని కొనియాడారు. ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ స్వయం పాలనలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలీ కమ్యూనికేషన్ శాఖల్లో విశేష సేవలు అందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. అంటరానితనం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా అందరూ పనిచేసినప్పుడే బాబు జగ్జీవన్రాంకు ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, డీఏఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై డీఎం సైదులు, దళిత సంఘాల నాయకులు మహేశ్, శరణప్ప, రమేశ్, వెంకటేశ్, సత్యనారాయణ, సూర్యకాంత్, గడ్డం కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందులు పడుతున్నాం..
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీ పై అందించే టార్పాలిన్ల పంపిణీ నిలిచిపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నాం. మాములు సంచులతో తయారు చేసిన పట్టాలను వినియోగించుకుంటున్నాం. వీటిని రోజుకు రూ. 30 చొప్పున అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. టార్పాలిన్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించాలి. – మగ్ధుంఅలీ రైతు, కల్వాల్ పథకం నిలిచిపోయింది.. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు సబ్సిడీపై ఇచ్చే టార్పాలిన్ల పథకం కొన్నేళ్ల క్రితం నిలిచిపోయింది. రైతులు తమ పొలాల్లో కల్లాలు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాల నిర్మాణాలు చేపట్టారు. రైతులు రహదారులపై పంట నూర్పిళ్లు చేయకుండా కల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. – జాన్ సుధాకర్, డీఏఓ ● -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తల్ మండలం జక్లేర్లోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి పేద కుటుంబం కడుపునిండా భోజనం తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కాగా, జక్లేర్లోని వాటర్ట్యాంకు వద్ద ఉన్న వరిపంటకు మిషన్ భగీరథ నీటిని అక్రమంగా వాడుకుంటుండటంతో తాగునీటి కొరత నెలకొందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీఓ రమేశ్కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్టా సురేశ్, గురురాజారావు, రవికుమార్, గోవర్ధన్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
రామయ్య కల్యాణ వేడుకకు ముస్తాబు
మక్తల్: శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు మక్తల్ రాంలీలా మైదానాన్ని ముస్తాబు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగు పూలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. కల్యాణ వేడుకకు హాజరయ్యే భక్తుల కోసం వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో కల్యాణ వేడుక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో లక్ష్మీహయగ్రీవ హోమం ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో శ్రీలక్ష్మీ హ యగ్రీవ హోమం, చతుస్థానార్చన వంటి ప్రత్యే క పూజా కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన, గరుడపట గ్రామోత్సవం, ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం చిన్నచింతకుంట: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం వండించి భోజనం చేశారు. జైబాపు, జైబీమ్, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతాదయాకర్రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సీఎం రేవంత్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యంగ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్కుమార్రెడ్డి, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, మదనాపూరం, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప, అప్పంపల్లి సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, నాయకులు వట్టేం శివ, రవికుమార్గౌడ్ ఉన్నారు. రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మహబూబ్నగర్ రూరల్: జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, మహబూబ్నగర్ అర్బన్, రూరల్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఏర్పడిన ఆరు రేషన్ డీలర్ భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆర్డీఓ నవీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగులు 18–40 ఏళ్ల మధ్య వయసు గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ పని దినాలలో సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అయితే రిజర్వేషన్ల ప్రకారం చూస్తే హన్వాడ మండలం గొండ్యాల–2 బీసీ–ఈ, చిన్నదర్పల్లి బీసీ–ఈ, కౌకుంట్ల మండలం అప్పంపల్లి బీసీ, మహబూబ్నగర్ అర్బన్ మండలం అస్లాంఖాన్ స్ట్రీట్ ఓసీ, మహబూబ్నగర్ రూరల్ మండలం ఫతేపూర్ఎస్టీ, మిడ్జిల్ మండలం సింగందొడ్డి ఓసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అప్పక్పల్లిలో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన దేవమ్మ ఇంటి నిర్మాణ పను ల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామానికి చెంది న షమీ బేగం, ఆశాబేగం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధన్వాడలో రూఫ్ లెవెల్ వరకు నిర్మా ణం పూర్తయిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను కలెక్టర్ పరిశీలించారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. వంద రోజులపాటు ‘ఉపాధి’ కల్పించాలి.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారని.. రోజుకు ఎంత కూలి పడుతుందని ఆరా తీశారు. వచ్చిన డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా? లేక బీపీఎం బ్రాంచ్ పోస్ట్మాస్టర్ వద్ద తీసుకుంటున్నారా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కూలీలు తమకు ఇంతవరకు కూలి డబ్బులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు. పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటుచేసిన టెంట్, నీటి వసతిని చూశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సుదర్శన్, సాయి ప్రకాశ్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి నారాయణపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. కేంద్రాల్లో దొడ్డు రకం, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సివిల్ సప్లై డీఎం సైదులు పాల్గొన్నారు. -
సీతమ్మకు కీలక పదవి
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్రెడ్డి ● మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ● దయాకర్రెడ్డి కుటుంబానికి పెద్దపీట నారాయణపేట: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కొత్తకోట దయాకర్రెడ్డి కుటుంబానికి పదవి వరించింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 45 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీతా దయాకర్రెడ్డి హైదరాబాద్లో బాధ్యతలు స్వీకరించారు. చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్లపాటు బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కొనసాగనున్నారు. సీతా దయాకర్రెడ్డికి కీలక పదవి రావడంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దయాకర్రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మక్తల్ టికెట్ ఆశించిన సమయంలో భరోసా.. దయాకర్రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్దఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. సీతమ్మ, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు సీతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కాంగ్రెస్ టికెట్ మక్తల్ నియోజకవర్గం నుంచి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి టికెట్ ఇస్తూ.. గెలిపించుకొని రావాలని, భవిష్యత్లో కీలక పదవి అప్పగిస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఎలాంటి రాజకీయ తప్పిదాలు జరగకుండా వాకిటి శ్రీహరి గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్టానం దృష్టిలో పడ్డారు. టీడీపీని వీడుతూ కంటతడి.. సుదీర్ఘకాలం దయాకర్రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే 2022లో వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపించడంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే 2023 జూన్లో దయాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. దయాకర్రెడ్డి అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. రాజకీయ పరిణమాలతో రేవంత్రెడ్డి సమక్షంలో సీతమ్మ కాంగ్రెస్ గూటికి చేరారు. రాజకీయరంగ ప్రస్థానం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో కొత్తకోట దయాకర్రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జెడ్పీటీసీగా విజయం సాధించిన ఆమె.. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పడిన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీచేసి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్రెడ్డిపై 19,034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఆల వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఆమె పరాజయం పొందారు. 2023 సెప్టెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో సీతా దయాకర్రెడ్డి హస్తం గూటికి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి భార్యాభర్తలిద్దరూ కలిసి అసెంబ్లీలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. విద్యాభ్యాసం.. కుటుంబ నేపథ్యం సీతాదయాకర్ రెడ్డి 1961 అక్టోబర్ 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లో జన్మించారు. ఆర్బీవీఆర్ఆర్ కళాశాలలో ఇంటర్ (1977–79), బీఏ (1979–82) పూర్తిచేశారు. 1982–84లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చదివారు. 1984 ఫిబ్రవరి 3న కొత్తకోట దయాకర్ రెడ్డితో సీతాదయాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సిద్ధార్థ, కార్తీక్) ఉన్నారు. -
నిఘానేత్రాల వినియోగంలో మొదటి స్థానం
అమరచింత: సీసీ కెమెరాలను వినియోగించి నేరాలను ఛేదించడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నిఘా నేత్రాల ఏర్పాటుపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందున్నామని డీజీపీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మస్తీపురం గ్రామంలో ఐజీ రమేశ్రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం.రమేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని.. ఆపద సమయంలో డయల్ 100కు ఫిర్యాదు చేయాలని, దీన్ని మించిన నంబర్ మరోటి లేదని చెప్పారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఐజీ రమేష్రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అక్రమ రవాణాకు అడ్డుకట్టు.. జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో పోలీస్ అవుట్పోస్టు ఏర్పాటుతో అంతర్రాష్ట్ర అక్రమ రవాణాను నియంత్రించే అవకాశం ఉందని డీఐజీ డా. జితేందర్ అన్నారు. శుక్రవారం రూ.1.50 లక్షలతో నిర్మించే పోలీస్ అవుట్పోస్టు భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. ప్రాజెక్టు భద్రతతో పాటు పరిసరాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని వివరించారు. అనంతరం పోలీస్ అవుట్పోస్టు స్థలంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మల్టీజోన్ –11 ఐజీపి సత్యనారాయణ, జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్ పాల్గొన్నారు. -
పేదల ఆరోగ్య సంరక్షణకే సన్నబియ్యం
నర్వ: పేదల ఆరోగ్య సంరక్షణ కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వాల్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నయ్యసాగర్, జగన్మోహన్రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శరణప్ప, జగదీశ్వర్రెడ్డి, సుధాకర్రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు. 8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 16, 20 బాలబాలికలకు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులను సంప్రదించాలని సూచించారు. ప్రతి గ్రామానికిరోడ్డు సౌకర్యం కోస్గి: ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్ అన్నారు. శుక్రవారం గుండుమాల్ మండలంలో బ్రిడ్జీల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్డీఎఫ్ నుంచి మంజూరైన రూ. 7కోట్లతో గుండుమాల్–పగిడియాల్ మార్గంలో, రూ. 8.5 కోట్లతో ముదిరెడ్డిపల్లి–పగిడియాల్ మార్గంలో బ్రిడ్జీలు నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టి, త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్రావు, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్, ఏఈ అంజిరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్రెడ్డి, జహీర్ పాల్గొన్నారు. అల్పాహారం పరిశీలన మద్దూరు: హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.. ఏ సమయానికి పాఠశాలకు చేరుకుంటుందనే వివరాలను హెచ్ఎం సవితను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఎస్ఎల్టీఏ డైరీని అడిషనల్ కలెక్టర్కు ఉపాధ్యాయులు అందించారు. ఉల్లి క్వింటాల్ రూ.1,200 మక్తల్: పట్టణంలోని మార్కెట్యార్డుకు శుక్రవారం ఆరు క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 1,200, కనిష్టంగా రూ. 900 ధర పలికింది. ఈ ప్రాంతంలో పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా, మక్తల్ మార్కెట్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించొద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అప్పక్పల్లిలో గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన దేవమ్మ ఇంటి నిర్మాణ పను ల పురోగతిని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించా రు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అదే గ్రామానికి చెంది న షమీ బేగం, ఆశాబేగం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధన్వాడలో రూఫ్ లెవెల్ వరకు నిర్మా ణం పూర్తయిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను కలెక్టర్ పరిశీలించారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. వంద రోజులపాటు ‘ఉపాధి’ కల్పించాలి.. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వంద రోజులపాటు పనులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నారాయణపేట మండలం అప్పక్పల్లిలో ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారని.. రోజుకు ఎంత కూలి పడుతుందని ఆరా తీశారు. వచ్చిన డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా? లేక బీపీఎం బ్రాంచ్ పోస్ట్మాస్టర్ వద్ద తీసుకుంటున్నారా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. కొందరు కూలీలు తమకు ఇంతవరకు కూలి డబ్బులు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఏపీఓను ఆదేశించారు. పని ప్రదేశంలో కూలీలకు ఏర్పాటుచేసిన టెంట్, నీటి వసతిని చూశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సుదర్శన్, సాయి ప్రకాశ్ తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి నారాయణపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. కేంద్రాల్లో దొడ్డు రకం, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, అవసరమైనన్ని గన్ని బస్తాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ట్యాబ్, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, సివిల్ సప్లై డీఎం సైదులు పాల్గొన్నారు. -
‘ఆఫీసుకు వచ్చి మీ అందరిని లోపల వేసి తంతా..’
పాలమూరు: మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టిశేఖర్ ఇటీవల రెవెన్యూ ఉద్యోగితో ఫోన్లో మాట్లాడిన తిట్ల దండకం ఆడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారం క్రితం నిజాలాపూర్లో సీసీరోడ్లు వేయడానికి ట్రాక్టర్లతో స్థానిక పెద్దవాగు నుంచి ఇసుకను తరలించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ద్వారా అనుమతి పొందారు. 10 ట్రిప్పులకు అనుమతి ఉండటంతో సమయం దాటిపోయిన తర్వాత అదే గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి చందు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను ఆపాడు. గ్రామస్తులు పార్టీ మండల అధ్యక్షుడు శెట్టిశేఖర్కు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో ఆయన చందుకు ఫోన్ చేసి తిట్టాడు. వాహనాలను ఆపడానికి నువ్వెవరు అంటూ బూతు పురాణం అందుకున్నాడు. అంతటితో ఆగకుండా నౌకరి చేయాలనుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు. ‘తహసీల్దార్ ఆఫీసుకు వచ్చి మీ అందరిని లోపల వేసి తంతా..’ అంటూ తిట్టిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై మండల అధికారులు రాజీ చేశారని తెలిసింది. తాజాగా ఆడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తహసీల్దార్ రాజును ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. రెవెన్యూ ఉద్యోగిపై కాంగ్రెస్ నాయకుడి తిట్ల దండకం సోషల్ మీడియాలో వైరల్ -
మాటలతో.. వేధింపులు!
నారాయణపేట: జిల్లా సెర్ప్ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ‘‘అడిషనల్ డీఆర్డీఓ వ్యంగ్యంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతాడు.. పని త్వరగా చెయ్.. పని చేయనింకా రాదా.. ఏం నేర్చుకున్నారంటూ.. సారూ సైకోలా వ్యవహరిస్తాడు.. సాధిస్తాడు అంతే..’’ అంటూ ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న ‘మహిళా ఉద్యోగుల హడల్’.. ‘అసలేం జరుగుతోంది..’ అనే వార్తా కథనాలతో డీఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లో సైతం చర్చానీయాంశంగా మారింది. ఈ కథనాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని డీఆర్డీఓ కార్యాలయాల్లో మహిళలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఒక పట్టు పట్టాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆరా.. ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డికి సెర్ప్ ఉద్యోగులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అడిషనల్ డీఆర్డీఓ వ్యవహార తీరుపై స్థానిక ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. మహిళా ఉద్యోగినులు, సెర్ఫ్ ఉద్యోగులతో వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. తగు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు, నిర్వాహణ, అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నియామకంపై ఇటు డీఆర్డీఓ ఉన్నతాఽధికారులు, అటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ఒక దశలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డీపీఎంకు లీవ్ లెటర్.. అధికారులకు ఎవరికై నా సెలవు కావాలంటే ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ సమర్పించి అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడిషనల్ డీఆర్డీఓపై వస్తున్న ఆరోపణలతో ఉన్నతాధికారులకు ముఖం చూయించలేకపోతున్నారు. గురువారం అడిషనల్ కలెక్టర్ను కలిసేందుకు ఆయన ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక చేసేదిలేక వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒక రోజు లీవ్ పెడుతున్నట్లు లెటర్ రాసి.. డీఆర్డీఓ కార్యాలయంలోని ఓ డీపీఎంకు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే.. శనివారం బాబు జగ్జీవన్రాం జయంతి, ఆదివారం రెండు రోజులు ప్రభు త్వ సెలవులు ఉండటంతో సోమవారం చూసుకుందామంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా, డీపీఓ ఆ లీవ్ లెటర్ను డీఆర్డీఓకు అందజేసేందుకు వెళ్లగా.. ఆ లెటర్ మీకు ఇస్తే మీ వద్ద పెట్టుకోండి.. అంతా అతడి ఇష్టమేనా అంటూ అటెండెన్స్ రిజిస్ట్రర్లో అటు సీఎల్.. ఇటు అబ్సెంట్ వేయకుండా డాస్ (–) పెట్టినట్లు తెలిసింది. సెర్ప్ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ఇదే మాట.. అడిషనల్ కలెక్టర్ను కలిసేందుకు వెళ్తే నో అపాయిమెంట్ డీపీఎంకు లీవ్ లేటర్ ఇచ్చి వెళ్లిపోయిన అడిషనల్ డీఆర్డీఓ -
అసలేం జరుగుతోంది..?
నారాయణపేట: అడిషనల్ డీఆర్డీఓ వ్యవహరశైలి.. ఆయన పనితీరు.. మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు రావడం.. మొత్తంగా జిల్లా కేంద్రంలోని డీఆర్డీఓ కార్యాలయంలో అసలేం జరుగుతుంది అంటూ.. ఇటు ప్రభుత్వ యంత్రాంగం, సెర్ఫ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర శాఖ.. అటు ఇంటెలిజెన్స్ శాఖ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈమేరకు చర్యలు తీసుకోవాలంటూ సెర్ఫ్ ఉద్యోగులు డీఆర్డీఓ పీడీ మొగులప్పతోపాటు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి ఫిర్యాదు చేయగా.. పూర్తి వివరాలతో ‘మహిళా ఉద్యోగులు హడల్’ అనే శీర్షికన ‘సాక్షిశ్రీలో బుధవారం కథనం ప్రచురితమవగా జిల్లాలో సంచలనంగా మారింది. అడిషనల్ డీఆర్డీఓను జిల్లా నుంచి పంపించాలని మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారకులను కోరారు. అన్ని కోణాల్లో ఆరా.. అడిషనల్ డీఆర్డీఓ తీరుపై ఇంటిజెన్స్ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సదరు అధికారి నారాయణపేట డీఆర్డీఓ కార్యాలయంలో అడిషనల్ డీఆర్డీఓగా విధుల్లో చేరినప్పటి నుంచి ఇంత వరకు ఎంత మంది మహిళా ఉద్యోగులను వేధించారు, ఆయన వేధింపులకు ఎవరైనా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డారా అనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు అవినీతి అక్రమాలకు తావిచ్చారనే కోణంలో సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇతడిపై సెర్ఫ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నేతలు సైతం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ అధికారి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిపై పూర్తి వివరాలను తమకు పంపించాలని.. ఎట్టి పరిస్థితుల్లో అతడిని వదులొద్దని.. ఇంతకుముందే సిరిసిల్లలో జరిగిన ఘటనలే ఉదాహరణగా ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. వేధింపులు భరించలేం.. ఇదిలాఉండగా, పలువురు సెర్ఫ్ మహిళా ఉద్యోగినులు గురువారం ‘సాక్షి’ తో మాట్లాడుతూ.. ఆయన వేధింపులను మాటల్లో చెప్పలేమంటూ మనోవేదన చెందారు. నారాయణపేట ఎంఎంఎస్లో విధులు నిర్వర్తించిన ఓ మహిళ ఉద్యోగిని.. మీ భర్త అక్కడ ఉంటారు, ఒంటరిగా ఉండి మీరేంచేస్తారంటూ పలు మార్లు వేధించారని కన్నీరు మున్నీరైంది. అలాగే, గూగూల్ మీట్లో ఉద్యోగినులతో మాట్లాడే మాటలు.. మా నోటితో చెప్పలేమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే ఓ మహిళా ఉద్యోగినిని తోటి ఉద్యోగి బైక్పై ఎక్కించుకొని రాగా.. అది చూసిన సదరు అధికారి జుగుప్సాకరమైన మాటలు అన్నాడని సమాచారం. ఆ వెంటనే సదరు మహిళ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మీ అంతు చూస్తా అంటూ గొంతెత్తడంతో అధికారి మిన్నకుండా పోయాడని తెలిసింది. మరో విషయానికి వస్తే.. నేను ఆ మేడమ్తో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్లూ.. అంటూ ఓ దివ్యాంగ ఉద్యోగిని తరచూ బయటికి పంపిస్తూ వేధింపులకు గురిచేసేవాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్ డీఆర్డీఓ తీరుపైఇంటెలిజెన్స్ ఆరా సెర్ఫ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నేతలు విచారణ అద్దె కారు పేరిట బిల్లులు వసూలు చేస్తున్న వైనం వేధింపులు భరించలేమని మహిళా ఉద్యోగినులు ఆందోళన అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు -
పిడుగు పడి ఇద్దరు కూలీలు..
అచ్చంపేట: పదర గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన 10 మంది కూలీలు పదర గ్రామానికి చెందిన రైతు పోగుల వినోద్ పొలంలో వేరుశనగ పంట తీసేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కూలీలు కొంత మంది చెట్ల కింద తలదాచుకోగా.. చెట్ల కింద పిడుగులు పడుతాయనే ఉద్దేశంతో వర్షంలోనే ఒకే దగ్గర నిల్చున్న సుంకరి సైదమ్మ(45), గాజుల వీరమ్మ(55), సుంకరి లక్ష్మమ్మలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో సైదమ్మ, వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను వెంటనే పదర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కోడోనిపల్లిలో విషాధచాయలు అలుముకున్నాయి. పదర ఎస్ఐ సర్దామ్, ఆర్ఐ శేఖర్ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. గేదెలు మేపుతుండగా.. మానవపాడు: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన సంఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చంద్రశేఖర్నగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ చిన్న వెంకటేశ్వర్లు(41) గేదెలను మేపేందుకు గురువారం వెళ్లాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా అదే సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వర్లుకు భార్య లక్ష్మీదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ చంద్రకాంత్ను సంప్రదించగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. బుడమొర్సులో మరొకరు.. శాంతినగర్: వడ్డేపల్లి మండలంలోని బుడమర్సు గ్రామానికి చెందిన మాదిగ రాజు, తిమ్మక్కల చిన్న కుమారుడు మహేంద్ర(21) గురువారం గేదెలు మేపడానికి తుంగభద్ర నదీతీరానికి వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు మహేంద్ర సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా మహేంద్ర రాకపోవడంతో కుంటుంబ సభ్యులు తుంగభద్ర నదితీరానికి వెళ్లి చూడగా విగతజీవుడై కనిపించడంతో బోరున విలపించారు. -
అద్దె కార్ల పేరుతో అక్రమాలు
అడిషనల్ డీఆర్డీఓ విధి నిర్వహణకు ఓ అద్దె కారును తీసుకొని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణ చేసేందుకు ప్రభుత్వం నెలకు రూ.33 వేలు చెల్లిస్తోంది. కాగా సదరు అధికారి మాత్రం జిల్లాలోని డీపీఎంల కారుల్లో తిరుగుతూ.. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి కారు పేరిట నెలకు రూ. 33 వేలు బిల్లులు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే గతేడాది నుంచి వాహనం బిల్లు చెల్లించాలని ఉన్నతాధికారులకు కోరగా ఇటీవల ఏడాదికి సంబంధించిన బిల్లు చెక్ రేడీ అయినట్లు తెలుస్తోంది. అడిషనల్ పీడీపై ఫిర్యాదు రావడంతో ఆ బిల్లు సైతం ఆగినట్లు సమాచారం. -
నాగర్కర్నూల్ కలెక్టరేట్కు బాంబు బెదిరింపు
● తనిఖీ చేసి.. ఫేక్ మెసేజ్ అని తేల్చినపోలీసులు నాగర్కర్నూల్: జిల్లా కలెక్టరేట్కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేగింది. గురు వారం ఉదయం 7:24 గంటలకు జిల్లా కలెక్టర్ మెయిల్కు ఈడీ బేస్డ్ పైప్ బాంబ్తో సాయంత్రం 3.20 గంటలకు కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని మెసేజ్ వచ్చింది. ప్రతి రోజు ఉద్యోగులు వచ్చిన వెంటనే కలెక్టర్కు వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం సర్వసాధారణం. కాగా గురువారం వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్ను గమనించిన సెక్షన్ ఉద్యోగులు విషయాన్ని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఏఓ ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు ఎస్పీ రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్యలు బాంబ్స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ మెసేజ్గా పోలీసులు తేల్చారు. అయితే ముప్పల లక్ష్మణ్రావు పేరుతో వచ్చిన ఈ మెసే జ్ చివరి అల్లాహూ అక్బర్ అని రాయడం గమ నార్హం. బాంబు బెదిరింపు రావడంతో ఉద్యోగులు సైతం బయటికి వెళ్లిపోయారు. ఇది ఫేక్ మెసేజ్ అని, మెయిల్ ఐడీ ఐపీ అడ్రస్ కోసం ఐటీ సిబ్బంది ద్వారా విచారణ చేస్తున్నామనిడీఎస్పీ శ్రీనివాసులు వివరించారు. -
సూరాపూర్లో మరో రైతు..
లింగాల: నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని సూరాపూర్కు చెందిన రైతు దేశ పర్వతాలు(40) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి గురువారం తెల్లవారుజామున పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే బోరు మోటార్ ఆన్ చేసే సమయంలో స్టార్టర్ దగ్గర తేలి ఉన్న వైరు తగిలి షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. పర్వతాలుకు భార్య చిట్టెమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
బోరు మోటారు సరిచేస్తుండగా ఇద్దరు యువ రైతులు..
అచ్చంపేట రూరల్: వ్యవసాయ పొలంలోని పాంపాండ్లో ఉన్న బోరు మోటారును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువరైతులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చేదురుబావితండాకు చెందిన కాట్రావత్ లోక అలియాస్ లోకేష్(30) తన వ్యవసాయ పొలంలో (పాంపాండ్) బోరు మోటారు రెండు రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో సమీప పొలంలోని ముడావత్ కుమార్(28) విషయం చెప్పి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాయంగా తీసుకెళ్లాడు. బోరు మోటారు సరి చేస్తుండగా.. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు యువ రైతులు పొలం వద్ద మృతి చెందిన సంఘటన ఎవరికీ తెలియలేదు. బుధవారం సాయంత్రం అయినా ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు.. అర్ధరాత్రి వరకు ఇద్దరికి ఫోన్ చేయగా రింగ్ అయినప్పటికీ ఎత్తలేదు. దీంతో కుటుంబసభ్యులు, తండావాసులు తండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లోకేష్ పొలం వద్ద ఓ చెట్టు కింద బైక్ను గమనించారు. అక్కడికి వెళ్లిన కొందరు ఫోన్ చేయగా పాంపాండ్ వద్ద సెల్ఫోన్ రింగ్ కాగా అక్కడికి వెళ్లి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పాంపాండ్ నుంచి ఇద్దరి మృతదేహాలను తండాకు తరలించారు. ఈ ఘటనపై లోక తండ్రి హన్యా ఫిర్యాదు మేరకు సిద్దాపూర్ ఎస్ఐ పవన్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోకకు భార్య సరితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే కుమార్కు భార్య వినోజితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాధిత కుటుం సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయలి
నారాయణపేట: ఇది సీఎం జిల్లా.. అధికారులంతా సమన్వయంతో పని చేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో నిర్వాహకులు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, సన్నాలకు బదులు దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సంబంధిత శాఖల అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో, రూల్స్, గైడ్ లైన్న్స్ ను అందరూ అమలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం వడ్లు దొడ్డు రకం వడ్లు వేర్వేరు కౌంటర్లలో కొనుగోలు చేసి, వేరు వేరు రిజిస్టర్ లలో నమోదు చేయాలని తెలిపారు. కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, తేమను కోలిచే యంత్రాలు, రిజిస్టర్లు, ముఖ్యంగా ట్యాబ్ లను సిద్ధం చేసుకోవాలన్నారు.కేంద్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వడ్లు కొనుగోలు చేయాలని ఆమె పునరుద్ఘాటించారు. గతేడాది ట్రాన్స్పోర్ట్ పరంగా సమస్యలు ఎదురైనట్లు తన దృష్టికి వచ్చిందని, ఈసారి అలాంటి సమస్యలు ఏమి లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు ఆమె సూచించారు. డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.500 బోనస్ ను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే తేమశాతం పరిశీలించిన త ర్వాత నిర్వాహకులు గన్ని బ్యాగులను ఇస్తారని, అ క్కడే తూకాలు చేయిస్తారని చెప్పారు. డీఏఓ జాన్ సుధాకర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్టీఓ మేఘా గాంధీ, డీఆర్డీఓ మొగులప్ప తమ తమ శాఖలకు సంబంధించిన విషయాల గురించి వివరించారు. ఆర్డీఓ రామచందర్ నాయక్, డీసీఓ శంకరా చారి,డీఎంఓ బాలామణి, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికి ‘రాజీవ్ యువ వికాసం’ రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా జిల్లాలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. మండలాల వారీగా ఇప్పటివరకు ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయని అడి గి తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏ ఏ దశల్లో ఉన్నాయని హౌసింగ్ అధికారులతో ఆరా తీశారు. వరి ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
‘యువ వికాసం’ దరఖాస్తుల గడువు పొడిగింపు
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వర్ తెలిపారు. బుధవారం ఎంపీడీవో, తహసీల్దార్ లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబందిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం నప్సిడీ పై 50 వేల యూనిట్, రూ.లక్ష యూనిట్ 90 శాతం సబ్సిడీతో, రూ.2 లక్షల యూనిట్ 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ యూనిట్ లను యువకులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చిన్న నీటి పారుదల రంగంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి 200 శాతం నబ్సిడీ, ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్షా 50 వేల లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.2లక్షల లోపు ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారునిపేరు లేని పక్షంలో మాత్రమే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. లబ్దిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు యూనిట్ గ్రౌండింగ్, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన పై శిక్షణ అందిస్తామని, ఆసక్తిగల యువతి, యువకులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. టెలీకాన్ఫెరెన్స్ లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ కలీల్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఎంఏ రషీద్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, గీత కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడ ని ఆయన కొనియాడారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగలాయిలు, శిస్తుల రూ పంలో పన్నుల వసూళ్ల పేరుతో ప్రజలను పీడి స్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి అబ్దుల్ ఖలీల్, డిపిఆర్ఓ రషీద్, గౌడ సంఘం నాయకులు సతీష్గౌడ్ గురునాథ్గౌడ్ శ్యాంసుందర్గౌడ్, చంద్రశేఖర్గౌడ్, శేఖర్గౌడ్, లక్ష్మణ్ గౌడ్, శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం
మక్తల్: పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని రథంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అటు నుంచి ఆలయం వరకు వేలాదిగా భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం సాంఘికశాస్త్రం పరీక్ష జరిగింది. దీంతో మొత్తం పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా చివరి రోజు 7635 రెగ్యులర్ విద్యార్థులకుగాను 7617 మంది హాజరయ్యారు. 18 మంది గైర్వాజరయ్యారు. ప్రైవేట్ విభాగంలో మొత్తం నలుగురు విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు. డీఈఓ గోవిందరాజులు, ఎనిమిది మంది స్టేట్ అబ్జర్వర్లు, ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చూస్తాం నాగర్కర్నూల్ క్రైం: ఉర్కొండ మండలం ఊర్కొండపేటలో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సభ్యసమాజం తలదించుకునే విధంగా మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి పలు సెక్షన్ల కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలను ఎవరు సహకరించరని.. నిందితులను సమాజం బహిష్కరణ చేస్తుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలతో పాటు ట్యాంక్బండ్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పోలీసు నిఘా, పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్సింగ్, విజయ్కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాద ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
ఓటరు నమోదు సులభతరం
నారాయణపేటగురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో uకోస్గి: నూతన ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేది నుంచి ఎన్నికల సంఘం ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడంతో 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతీ యువకుల నుంచి నూతన ఓటరు నమోదుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఓటరు జాబితాను సిద్ధం చేసినప్పటికి మరోమారు నూతనంగా నమోదు చేసుకునే వారికి సైతం జాబితాలో చోటు కల్పిస్తారు. ఏటా నాలుగుసార్లు అవకాశం గతంలో ప్రతియేటా జనవరి నెలలో కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులు తీసుకునేవారు. కేవలం జనవరి నెలలోనే నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టేవారు. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ప్రతియేటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో నాలుగుసార్లు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం ఇస్తున్నారు. మరోమారు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం రావడంతోపాటు ఇదే ఏడాది నుంచి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనుండటంతో గ్రామాల్లో రాజకీయ నాయకులు తమ అనుకూల ఓటు బ్యాంకు పెంచుకునేందుకు నూతన ఓటర్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అధికారులు సైతం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అఖిల పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం విదివిధానాలను వివరించనున్నారు. నమోదు ప్రక్రియ ఇలా.. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు బూతుస్థాయి అధికారి (బీఎల్ఓ) వద్ద లేదా నేరుగా ఆన్లైన్లో పూర్తి వివరాలతో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారి వివరాలు సంబందిత అధికారి మరోమారు పరిశీలించి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ఆన్లైన్లోనే ఆమోదం తెలుపుతారు. ఇందుకు సంబందించి నమోదు, ఆమోదం, తిరస్కరణ తదితర వివరాలు నేరుగా దరఖాస్తుదారుని ఫోన్కు సమాచారం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో ఉండే ఓటర్లు తమ ఓటును తమ గ్రామాలకు బదిలీ చేసుకునే అవకాశం సైతం కల్పించారు. జిల్లాలోమహిళా ఓటర్లే అధికం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 13 మండలాల పరిధిలో మొత్తం 3,99,048 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,95,475 మంది పురుషులు, 2,03,569 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరోమారు నూతన ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వడంతో మహిళ ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు నిండిన యువతియువకులు తమ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల మేరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు నూతన ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటిందనే విషయాన్ని గుర్తించి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీఎల్ఓల ద్వారా గాని, ఆన్లైన్లో గాని తమ వివరాలు నమోదు చేసుకుంటే ఓటర్లుగా ధృవీకరించి ఓటరు జాబితాలో నమోదు చేస్తాం. – రామచందర్, ఈఆర్ఓ, నారాయణపేట ఇక నుంచి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో నమోదుకు అవకాశం గతంలో జనవరిలో ఒక్కసారే నమోదు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 1 నుంచి అమలు జిల్లాలో మొత్తం ఓటర్లు 3.99 లక్షల మంది -
మార్కెట్ నిర్మించాలి..
కొల్లాపూర్లో మామిడి సాగుచేసే రైతులు వేల సంఖ్య లో ఉన్నారు. ప్రభు త్వం రైతులను పట్టించుకోవాలి. మామిడి మార్కెట్ ఏర్పాటుచేస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిర్మించడం లేదు. ప్రైవేటు మార్కెట్లలోనే రైతులు పంట అమ్ముకుంటున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధు లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలచంద్రయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి మార్కెట్ నిర్మాణం మార్కెటింగ్ శాఖ పరిధిలోనిద. మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు మార్కెట్లకు వెళ్తున్న విషయాలను కూడా తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ ● -
మామిడి రైతుకు.. మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్లో మార్కెట్ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్లో మార్కెట్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు. కొల్లాపూర్లో కలగా మారిన మార్కెట్ నిర్మాణం పండ్ల విక్రయాలకు రైతులకు తప్పని అవస్థలు ప్రైవేటు వ్యాపారుల సిండికేట్తో నష్టాలు మామిడి మార్కెట్ ఏర్పాటుతోనే రైతులకు మేలు -
సన్న బియ్యం పంపిణీ షురూ..
నారాయణపేట: జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులు అందరికీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న పేదలకు సన్న బియ్యం ఇస్తామని ఇటీవల చెప్పగా.. నేటి నుంచి (మంగళవారం) నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చు ట్టింది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో సివి ల్ సప్లయ్ అధికారులు సైదులు, బాలరాజు ప్రణాళిక బద్దంగా జిల్లాలోని రేషన్ దుకణాలకు సన్న బియ్యం చేరేవిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముందస్తుగా డీలర్లకు సమావేశం చేరవేసి గత మూడు రోజులుగా వస్తున్న సన్న బియ్యం కోటాను ప్రతి రేషన్ దుకాణానికి చేరేలా చొరవ తీసుకున్నా రు. ప్రతినెలా ఒకటో తేదీకి ముందే దుకాణాలకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో తగినన్ని బియ్యం నిల్వ లు లేకపోవడంతో.. ప్రతినెలా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో ఈసారి జిల్లాలోని జిల్లాలోని మొత్తం 301 రేషన్ దుకాణాల్లో 1,44,472 రేషన్కార్డు లబ్ధిదారులకు బియ్యం కోటా 3,382 ఎంటీఎస్ను ఏప్రిల్ నెలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో ప్రారంభం జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టడంతో మంగళవారం నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికాకరెడ్డి ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్దలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్లో ప్రారంభించారు. జిల్లాలోని అన్ని రేషన్ నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. పక్కదారి పట్టకుండా చర్యలు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యాన్ని చాలాచోట్ల రేషన్ డీలర్లే లబ్ధిదారులకు బియ్యం బదులు నగదు చెల్లించి.. అదే బియ్యాన్ని మిల్లర్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఈమేరకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి జిల్లాలో మొత్తం 1.44 లక్షల రేషన్కార్డులు ఏప్రిల్ బియ్యం కోటా 3,382 ఎంటీఎస్ -
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు
మక్తల్: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేస్తుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని 6వ నంబర్ డీలర్ షాపులో సన్న బియ్యం పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే పేదలకు రేషన్కార్డులు అందజేయనున్నట్లు, ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బాలక్రిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, గణేష్కుమార్, కమిషనర్ శంకర్నాయక్, డిప్యూటి తహసీల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. భూములు లాక్కోవడమే సర్కార్ లక్ష్యమా? నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో జనాల వద్దకు వెళితే ఎదురుదెబ్బలు తగలాయని.. ఇప్పుడు మూగ జీవాలు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారని, భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నట్లుగా హెచ్సీయూ ఘటన స్పష్టం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్సీయూ భూములను కాపాడుకునేందుకు వందల మంది విద్యార్థులు ముందుకెళ్తుంటే ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగాని ఒక అధికారి కానీ యూనివర్సిటీ కి వెళ్లి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాల్సింది పోయి అక్రమంగా రాత్రికి రాత్రే వందల సంఖ్యలో వాహనాలతో భూములను చదును చేసే పనులకు శ్రీకారం చుట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇదే యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి క్రీడలు ఆడిన రేవంత్ రెడ్డికి అప్పుడే ఆ భూములపై కన్ను పడిందని, ఆ విషయం 15 నెలల తర్వాత స్పష్టం అవుతుందని తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పేర్కొన్నారు. నేడు ఉల్లి బహిరంగ వేలం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు వచ్చాయి. తిరిగి బుధవారం లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం, మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
జాతీయ ఖోఖో పోటీలకు ‘కర్ని’ విద్యార్థిని
మక్తల్: మండలంలోని కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శశిరేఖ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ బి.రూప మంగళవారం తెలిపారు. ఈ నెల 2నుంచి 5వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో శశిరేఖ పోల్గొంటుందని పేర్కొన్నారు. మూడుసార్లు రాష్ట్రస్థాయి టోర్నీల్లో విద్యార్థిని విజయం సాధించినట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జట్టు విజయానికి కృషిచేయాలని ఆకాంక్షించారు. ● జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ టెక్నికల్ అఫిషియల్గా కర్ని పాఠశాల పీఈటీ బి.రూప ఎంపికై నట్లు జీహెచ్ఎం వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న శశిరేఖ, పీఈటీ రూపను గ్రామస్తులు అభినందించారు. -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి, దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్గౌడ్తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నారు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి, డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా ● వీడియోలు, ఫొటలతో బెదిరించి డబ్బుల వసూళ్లు ● తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ● ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా పెట్రోలింగ్ పెంచుతాం: ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్స్టేషన్కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అయితే.. రికార్డే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు దళారులను ఆశ్రయించొద్దు జిల్లాలో ఈ నెల మొదటి లేదా రెండో వారంలో ధా న్యం కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించేలా చర్య లు చేపడుతున్నాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. ధాన్యంలో తేమ శాతం 17 శాతానికి మించకుండా చూసుకోవాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలి. – రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ, మహబూబ్నగర్ -
23 గజాలు రెండు అంతస్తుల భవనం
హనుమకొండ: సొంత ఇంటి కల నెరవేరాలంటే.. అందుకు తగిన స్థలం ఉండాలి. కనీసం 100 గజాల జాగా లేకపోతే సౌకర్యవంతమైన ఇల్లు కట్టలేం. కానీ ఓ వ్యక్తి 23 గజాల స్థలంలోనే రెండతస్తుల ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల (Parakala) పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఫార్మసీ ఉద్యోగి కాపర్తి రాజు తల్లి భారతమ్మ పెంకుటింట్లో నివాసం ఉండేది. కాగా రాజు కుమారుడు దత్తు అదే స్థలంలో తన నానమ్మ కోసం సొంత ప్లాన్తో రూ.7 లక్షలు ఖర్చు పెట్టి, 23 గజాల స్థలంలోనే రెండు అంతస్తుల ఇల్లు నిర్మించాడు. గ్రౌండ్ఫ్లోర్లో పార్కింగ్, స్టోర్ రూం, మొదటి అంతస్తులో వంటగది, డైనింగ్ హాల్, రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూంతో బెడ్రూమ్ నిర్మాణం చేసి స్థానికులనే కాక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపడేలా చేశాడు. సెంచరీ బనానా సెలబ్రేషన్నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని గొర్లోనిబాయి గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు సోమవారంతో 100 సంవత్సరాలు నిండాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా ఐదుగురు కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సుఖ్దేవ్తోపాటు పుట్టింటికి వచ్చిన ఆమె ముగ్గురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను భారంగా చూసే ఈ రోజుల్లో అమ్మకు వందేళ్ల పండుగ నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈమె వంశాంకురంగా 65 మంది ఉండటం విశేషం. -
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగ యువతకు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వర్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పథకంపై వీసీ నిర్వహించారు. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందుతారని, అర్హుల నుంచి ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రూ.50వేల లోపు రుణం వంద శాతం మాఫీ, రూ.లక్ష లోపు రుణం 90 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని, రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారని తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు ప్రకటనలు ఇచ్చామని, గ్రామీణ స్థాయిలో ఈ పథకానికి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. వీసీలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ కలీల్, శామిమ్ సుల్తానా ఉర్దూ గ్రేడ్ టు అధికారి తదితరులు పాల్గొన్నారు. -
అడవిలోకి రాకముందే..
హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. అందరి సహకారంతో.. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి● -
భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్
నారాయణపేట/మక్తల్: జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్)ను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. చిన్నా పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈద్గాల వద్ద మతపెద్దలు ముస్లింలు ప్ర త్యేక ప్రార్థనలు చేయించారు. జీవితాంతం సుఖసంతోషాలతో మెలగాలని అల్లాను ప్రార్థించారు. ప్రముఖుల శుభాకాంక్షలు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ, భీష్మ స్వరాజ్ ఫౌండేషన్చైర్మన్ రాజ్కుమార్రెడ్డి ముస్లింలకు శుభాకాక్షంలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, సుధాకర్, డీఎస్పీ లింగయ్య బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, పలువురి ఇళ్లకు వెళ్లి అప్యాయంగా పలకరించారు. ● మక్తల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు పట్టణంలోని ఈద్గా దగ్గరకు వెళ్లి ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి ఈద్గా వద్దకు చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు. ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం -
ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
నారాయణపేటమంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో uమరికల్: యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలకు రావడంతో అధికారులు ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు చేపట్టారు. ఓవైపు ఆకాల వర్షాల భయం పట్టుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోత వేసిన పంటలను త్వరగా ప్రభుత్వం కొనుగోలు చేట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో యాసంగి కింద 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ముందుగా సాగు చేసిన కృష్ణా, మక్తల్ మండలంతోపాటు పలుచోట్ల ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా, మక్తల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించారు. 1.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో యాసంగి సీజన్కు సంబందించి 1.07 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి, మరో 28 వేల ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశారు. మొత్తం ధాన్యం దిగుబడి దాదాపు 3 లక్షల టన్నులకుపైగా వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఏకంగా సన్నరకం వరి ధాన్యమే 2.50 లక్షల టున్నులకు పైగా వస్తుందని భావిస్తున్నారు. మిగితా దొడ్డురకం 50 వేల టున్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 3 వేల టన్నుల ధాన్యం రైతులు విత్తనం కోసం, మరో 30 వేల టన్నుల వరకు ధాన్యం అవసరం కోసం నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. మిగతా 2.70 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మగా మిగిలినవి ప్రైవేట్ వర్తకులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వెంటాడుతున్న అకాల వర్షాల భయం గత వేసవితో పోలిస్తే ప్రస్తుత వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ముందుగానే ఆకాల వర్షాలు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలుచోట్ల ఉరుములు, మెరువులతో కూడిన వర్షాలు కురువడంతో జిల్లాలో కోస్గి, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో 6,650 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిళ్లింది. దీంతో రైతుల్లో ఆకాల వర్షాల భయం, ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది సైతం ధాన్యం కోతకు వచ్చే సమయం కొనుగోళ్ల సమయంలోనూ వర్షాలు పడటంతో పెద్దఎత్తున ధాన్యం తడిచి రైతులు నష్టపోయారు. ప్రతి సీజన్లోనూ దాదాపు వంద కొనుగోలు కేంద్రాలకు పైగా ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నారు. ప్రస్తుతం వరికోతలు ప్రారంభం కావడంతో అవసరం ఉన్న మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రత్యేకంగా కోనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభిస్తాం జిల్లా వ్యాప్తంగా 102 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వరికోతలు ప్రారంభమైన కోస్గి, మక్తల్ మండలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశాం. 1.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. మరో వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – సైదులు, సివిల్ సప్లయ్ సరఫరాల శాఖ డీఎం, నారాయణపేటజిల్లాలో 102 కొనుగోలుకేంద్రాల ఏర్పాటుకు చర్యలు 1.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం ప్రారంభమైన వరికోతలు కృష్ణా, మక్తల్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
ప్లాస్టిక్కు చెక్
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు మన్ననూరు, దోమలపెంట చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి -
శక్తిపీఠంలో ‘ఉగాది’ పురస్కారాలు
నారాయణపేట: జిల్లాలోని శక్తి పీఠం ఆధ్వర్యంలో సామాజిక, ఆధ్యాత్మిక సేవకులకుగాను పలువురికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆదివారం ఉగాది పండుగ నేపథ్యంలో శక్తిపీఠం వ్యవస్థాపకుడు డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, పచ్చడి ప్రసాద వితరణ చేశారు. శక్తిపీఠం జీవన సాఫల్య పురస్కారం లయన్ నారాయణ బట్టడ్, బ్రహ్మశ్రీ నారాయణబట్ పూజారి కృష్ణ క్షేత్ర పురోహితులు, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్రెడ్డి, శక్తి ఫౌండేషన్ చైర్మన్ చింతనపల్లి శివప్రసాద్రెడ్డి, డాక్టర్ ప్రసాద్శెట్టి, శ్రీ అనంత శయనస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కులకర్ణి శ్రీపాదరావుకు పురస్కారాలను అందజేసి సన్మానించారు. అలాగే, ఉగాదిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆలేరు నరసింహచార్య ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి పల్లెసేవ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్యుడు రఘు ప్రేమ్ జోషి పంచాంగ శ్రవణం చేశారు. రాశి ఫలాలను విశ్వావసు నామ సంవత్సర విశేషాలను వివరించారు. -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
నారాయణపేట రూరల్/ దామరగిద్ద: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానినికి తోడ్పాటు అందిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్లొ నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాంతం నుంచి క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి, యువకులు పాల్గొన్నారు. కనకరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు మండలంలోని దామరగిద్ద, అన్నసాగర్ గ్రామాల్లో జరిగిన కనకరాయ, పోతురాజు జాతరలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామాల్లో జరిగే జాతర ఉత్సవాలు భక్తుల్లో ఐక్యతను చాటుకుంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు, మార్కెట్ కమిటి చైర్మన్ శివారెడ్డి. విండో అద్యక్షుడు ఈదప్ప, బాల్రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రామరెడ్డి, రఘు, మాణిక్యప్ప, నర్సింహా, ఖాజా, వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది ఒక్క రోజే!
నారాయణపేట: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు నేటితో ముగియనుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 34,690 రాగా 32,147 ఉన్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 22,881 దరఖాస్తులు, 140 జీపీల్లో 11,809 దరఖాస్తులు, రూ.10 వేలు చెల్లించిన వెంచర్లు 403 ఉన్నాయి. ఇందులో నిషేధిత జాబితాలో మూడు మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దరఖాస్తుదారులకు సమాచారం ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఈ 30 రోజుల్లో 4,142 దరఖాస్తులు పెమెంట్ చేయించగలిగారు. జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.25 కోట్లు అదాయం వస్తుందని లక్ష్యం నిర్దేశించగా.. రూ.10.16 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా వ్యాప్తంగా 403 వెంచర్లు ఉండగా నాలుగు వెంచర్లు పూర్తి స్థాయిలో ఆమోదం పొందాయి. నేటితో ముగియనున్న‘ఎల్ఆర్ఎస్’ రాయితీ గడువు జిల్లాలో 34,690 దరఖాస్తుల్లో 32,147 ఆమోదం ఆదాయ లక్ష్యం రూ.25 కోట్లు.. వచ్చింది 10.16 కోట్లు సద్వినియోగం చేసుకోవాలి అనధికార లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీతో చెల్లించాలి. ఒక్క రోజే మిగిలింది. జిల్లాలోని రియల్టర్లు, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు పెంపుపై ఇంకా తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదు. – కిరణ్కుమార్, టీపీఓ, నారాయణపేట -
ఊరూరా ఉగాది వేడుకలు
కోస్గి: తెలుగువారి నూతన సంవత్సర ఉగాది వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. తొలి పండుగ కావడంతో ఇళ్లకు మామిడి తోరణాలు కట్టి, షడ్రుచులతో తయారు చేసిన పచ్చడిని పంపిణీ చేస్తూ ఒకరికిఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారంలో భాగంగా ఉగాది రోజున రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇళ్లలో పిండివంటలు చేసి గ్రామ దేవతలకు నైవేధ్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలతోపాటు కోస్గిలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర శివసాయి అయ్యప్ప ఆలయాల్లో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం నూతన సంవత్సరం సందర్భంగా పలు గ్రామాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోస్గిలో వైధిక తసోనిధి జ్యోతిష్యరత్న రుద్రాక్షాల మఠం అమరలింగ స్వామి, చెన్నారంలో విశ్వనాథ స్వామి ఆధ్వర్యంలోనూ ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణ కార్యక్రమంలో ఈ ఏడాది రాజకీయాలు, సామాజిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యాపారం, వర్షాలు, ప్రకృతి వైపరిత్యాలను పురోహితులు వివరించారు. పేర్ల ఆధారంగా 12 రాశుల వారి ప్రత్యేక ఫలితాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన, చేయకూడని పనులను, ఆదాయ, వ్యయాలను శాస్త్రోక్తంగా వివరించారు. నవ నాయకుల ఫలితాలు, వాటి ప్రభావం తెలియజేశారు. కోస్గిలని కర్ణకోట ఆంజనేయ స్వామి ఆలయ దగ్గర హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు. ఇదే క్రమంలో గుండుమాల్, బిజ్జారం, హన్మాన్పల్లి గ్రామాల్లో యువకులు పచ్చడి వితరణ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణాలు పొలం పనులకు శ్రీకారం చుట్టిన రైతులు -
స్వర్ణాభరణాలంకరణలో వేంకటేశ్వరుడు
మహబూబ్నగర్ రూరల్: స్వర్ణాభరణాలంకరణలో మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ధగధగా మెరిసిపోతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తుండగా.. ప్రతి ఏడాది ఉగాది పండుగ రోజు స్వామివారిని స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. శ్రీరామ నవమి వరకు స్వామివారికి ఈ అలంకరణ ఉంటుంది. దీంతో వారం రోజుల పాటు స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు.రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణఅడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలిచిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజలందరిపై కురుమూర్తిస్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం ఉగాది పండగను పురస్కరించుకొని జెడ్పీ మాజీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్రెడ్డి, సీతాదయాకర్రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా కురుమూర్తిస్వామిని దర్శించుకొని.. అనంతరం ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవింద్కుమార్రెడ్డి, కురుమూర్తిస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, దేవరకద్ర, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రశాంత్కుమార్, కథలప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలు జరిగేనా..?
‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్కు అనుమతులు ఒక్కో మోటారు సామర్థ్యం 145 మెగావాట్లు పాలమూరు ప్రాజెక్టు పంప్హౌజ్లో ఏర్పాటుచేసే మోటార్లు 9 మోటార్ల బిగింపు పూర్తి.. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్ సరఫరా, చార్జింగ్ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ● పంప్హౌజ్లో కొనసాగుతున్న పనులు ● పూర్తికాని విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం ● గతేడాది అక్టోబర్ నుంచి వాయిదా పడుతున్న వైనం ● వచ్చే నెలలో తప్పనిసరిగాచేపడతామంటున్న అధికారులు కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్హౌజ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది. 4 టీఎంసీలకు అవకాశం.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిసారిస్తేనే.. పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది. తగ్గుతున్న నీటి నిల్వలు.. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్వాటర్ ఫుల్గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్వాటర్ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు ఈ సీజన్లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా 4 టీఎంసీలు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు తుది దశకు పనులు.. ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్ వర్క్స్, డెలివరీ మెయిన్స్ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
నారాయణపేట రూరల్/ దామరగిద్ద: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానినికి తోడ్పాటు అందిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్లొ నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం ఆదివారం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాంతం నుంచి క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని కోరారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి, యువకులు పాల్గొన్నారు. కనకరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు మండలంలోని దామరగిద్ద, అన్నసాగర్ గ్రామాల్లో జరిగిన కనకరాయ, పోతురాజు జాతరలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామాల్లో జరిగే జాతర ఉత్సవాలు భక్తుల్లో ఐక్యతను చాటుకుంటాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు, మార్కెట్ కమిటి చైర్మన్ శివారెడ్డి. విండో అద్యక్షుడు ఈదప్ప, బాల్రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రామరెడ్డి, రఘు, మాణిక్యప్ప, నర్సింహా, ఖాజా, వెంకటప్ప, తదితరులు పాల్గొన్నారు. -
లైన్ క్లియర్..!
పేట –కొడంగల్ ఎత్తిపోతలకి 560 ఎకరాల భూ సర్వే పూర్తి ● రైతులను ఒప్పించడంలో ఎమ్మెల్యేలు సఫలం ● మొదట్లో అడ్డంకులు, అభ్యంతరాలు, నిరసనలు ● సీఎం భరోసాతో రైతుల హర్షం ● పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడంతో అన్నదాతల్లో అయోమయం నారాయణపేట: సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వేను ఎట్టకేలకు పూర్తి చేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల బృందం, ఇరిగేషన్ అధికారుల బృందం చకచక పూర్తి చేశారు. నష్ట పరిహారం విషయంలో రైతుల్లో ఎన్నో అనుమానాలు ఉండడం.. పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తేనే భూసర్వేకు ఒప్పుకుంటామంటూ పలుమార్లు పనులను అడ్డుకున్నారు. సీఎం మాటతో రైతుల్లో ఆశలు సీఎం రేవంత్రెడ్డి ఫిబ్రవరి 21న నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ఈ ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. అలాగే, ఈ ప్రాజెక్టుతో జిల్లా అంత సస్యశ్యామలం అవుతుందని ప్రాజెక్టుకు అవసరమయ్యే భూ సేకరణకు సహకరించాలని, భూములు కోల్పోయే రైతులకు ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం అందిస్తామని తెలిపారు. ఎకరాకి రూ. 10 నుంచి 20 లక్షలు ఇచ్చే అవకాశం ఉంటే తను చొరవ తీసుకొని ఇప్పించే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో రైతులు భూసర్వే విషయంలో ఆందోళన చేయకుండా సహకరించడంతో ముందుకు సాగింది. నష్టపరిహారంపై అయోమయం ఇదిలాఉండగా, ప్రాజెక్టు నిర్మాణంలో తాము విలువైన భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. భూ పరిహారం ఎంత ఇస్తారనేది ఇటు ఎమ్మెల్యేలు.. అటు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇది వరకు 2013 భూ చట్టం ప్రకారం భూ నష్టపరిహారం ఏవిధంగా ఇచ్చారో అదేవిధంగా ఇస్తారంటూ అధికారులు చెబుతుండగా.. అప్పటి భూ ధరలు వేరు, ఇప్పటి ధరలు వేరు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎకరాకు సీఎం చెప్పిన మాట ప్రకారం వస్తే తప్పా సరిపోదంటూ రైతులు బహిరంగంగానే చెబుతున్నారు. భూ పరిహారమెంత అనేది అధికారులు, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. నోటిఫికేషన్తో భూ సేకరణ ఈ ఎత్తిపోతల పథకం కింద కావాల్సిన భూముల సర్వే పూర్తి అయింది. రైతులు అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భూ సేకరణకు సంబంధించి సర్వే నంబర్లతో కూడిన భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తాం. రైతులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నష్ట పరిహరం అందజేస్తాం. – రాంచందర్ నాయక్, ఆర్డీఓ, నారాయణపేట -
వసతుల కల్పనపై దృష్టి..
యూనివర్సిటీలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రస్తుతం అవసరమైన నిధులు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఇంజినీరింగ్, లా కళాశాలల భవనాల నిర్మాణం కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ రెండు కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు, ఒక అకామిక్ బ్లాక్ను నిర్మించనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ కోసం రూ.11 కోట్లతో రీసెర్చ్ఫెసిలిటీ భవనం, విద్యార్థులను అథ్లెటిక్స్ ప్రోత్సహించేందుకు సింథెటిక్ ట్రాక్, సందర్శకుల కోసం గ్యాలరీ నిర్మిస్తున్నారు. త్వరలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
నష్టపరిహారంపై తగిన చర్యలు తీసుకోవాలి
నారాయణపేట: ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్గా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. డీఎస్పి లింగయ్య ఈ ఏడాదిలో 7 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం అందించడంలో బడ్జెట్ కారణంగా ఆలస్యం జరుగుతుందని సి సెక్షన్ అధికారిని అఖిల ప్రసన్న కలెక్టర్కి తెలిపారు. బడ్జెట్ వచ్చిన వెంటనే రెండు వారాలకోసారి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు కిష్ట్యా నాయక్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని కలెక్టర్కు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే బుడగ జంగాల సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ మక్తల్లోని 5వ వార్డు పరిధిలో 70 మంది దాకా ఉన్న బుడగ జంగాల పిల్లల కోసం అక్కడి సమీపంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈమేరకు కలెక్టర్ మండలాల వారీగా బుడగ జంగాల కుటుంబాల వివరాలు సేకరించి ఆయా మండలాల తహసీల్దార్లకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు ఉమాపతి, ఖలీల్,జాన్ సుధాకర్, సౌభాగ్యలక్ష్మి, జయ, సుధాకర్ రెడ్డి, శత్రునాయక్ పాల్గొన్నారు. ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ సహజం ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ డిప్యూటీ సీఈవో జ్యోతి పదవీ విరమణ శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కలెక్టర్ ఆమె చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. గద్వాలలో తాము విద్యాభ్యాసం చేశామని, జ్యోతి అక్క తన కంటే ఒక ఏడాది సీనియర్ అని, ఎంతో కష్టపడి జెడ్పీ సీఈవో స్థాయికి వెళ్లిందన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్లు వనజ, బండారు భాస్కర్, కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలకి్ష్మ్, డీఆర్డీఓ మొగులప్ప, సిపిఓ యోగానంద్, డీఏఓ జాన్ సుధాకర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధు లు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటా యించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలి కలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువు లు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ● -
రైతులను ఒప్పించడంలో సఫలం
నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టుకు కావాల్సిన భూ సేకరణలో రాజకీయం చేయకుండా పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం ఫర్నీకరెడ్డి రైతులను సముదాయిస్తూ.. ఒప్పించి, మెప్పించి భూ సర్వేను పూర్తి చేయించడలో సఫలీకృతులయ్యారు. మక్తల్ మండలంలోని కాట్రెవ్పల్లి, యర్నాగన్పల్లి శివారులో, ఊట్కూర్ మండలంలోని బాపూర్లో రైతులు అడ్డుకోవడంతో వారి దగ్గరకు మక్తల్ ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి వారిని మాట్లాడారు. రైతులకు భూ పరిహరం విషయంలో తగిన న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. అదే విధంగా దామరగిద్ద మండలంలోని వత్తుగుండ్ల తండాకు చెందిన రైతులు నిరసన బాట పట్టకముందే డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి వారి వద్దకు వెళ్లి ప్రాజెక్టుపై పూర్తిగా అవగాహన కల్పించారు. జాజాపూర్, నారాయణపేట, దామరగిద్ద మండలంలోని రైతులను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఒప్పించి ఈ ప్రాంత రైతుల కల నేరవేరబోతుందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. -
డిజిటల్ మార్కెటింగ్పై అవగాహన
నారాయణపేట: చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, మాస్టర్ వీవర్లకు డిజిటల్ మార్కెటింగ్పైన కలెక్టరేట్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చేనేత జోళీ శాఖ అధికారి దీప్తి వారి టీమ్ ఈమేరకు అవగాహన కల్పించారు. డిజిటల్ మార్కెటింగ్లో సేల్స్ ఏవిధంగా చేయాలి అనే దానిపై క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో జేడీ ఇందుమతి, ఆర్డీడీ పద్మ, ఓఎస్డి రాతన్ కుమార్, సహయ అభివృద్ధి అధికారి రాజేశ్, టెస్కో వారి టీం, సహాయ సంచాలకు, చేనేత, జౌళి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.‘కొడంగల్’ ఎత్తిపోతల పనుల పరిశీలనమక్తల్: కొడంగల్ – నారాయణపేట ఎత్తపోతల పనుల్లో భాగంగా చేపడుతున్న పంప్హౌజ్ పనుల నాణ్యతను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ, ఎస్ఈ శ్రీధర్, ఈడీ రమేష్ పరిశీలించారు. శుక్రవారం కాట్రేశపల్లి నుంచి నారాయణపేట మండంలోని పెరపళ్ల వరకు పనులు పర్యవేక్షించారు. వారి వెంట ఏఈ సూర్య, డిఈ రాఘవ,ఏఈఈ నాగశివ, తదితరులు పాల్గొన్నారు.చింతపండు క్వింటాల్ రూ.7,350నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం చింతపండు గరిష్టంగా రూ.7,350, కనిష్టంగా రూ.4,250 ధర పలికింది. పెసర గరిష్టంగా రూ.7,575, కనిష్టంగా రూ.7,506, వేరుశనగ గరిష్టంగా రూ.5,520, కనిష్టంగా రూ.4,550, జొన్నలు గరిష్టంగా రూ.4,425, కనిష్టంగా రూ.2,555, అలసందలు గరిష్టంగా రూ.6,851, కనిష్టంగా రూ.6,769, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,236, కనిష్టంగా రూ.7,123, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,429, కనిష్టంగా రూ.6,550 ధరలు పలికాయి.మార్కెట్కు మూడు రోజులు సెలవుస్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ఉంటాయని మార్కెట్ కార్యదర్శి భారతి ఒక ప్రకటనలో తెలిపారు. 29 శనివారం అమావాస్య, 30న ఆదివారం, ఏప్రిల్ 1న రంజాన్ను పండుగ సందర్భంగా సెలవు ఉందని, వ్యాపారస్తులు, రైతులు గమనించాలని కోరారు. -
తైబజార్ వేలం.. సిండికేట్
మద్దూరు: మద్దూరు పట్టణంలో ప్రతి గురువారం నిర్వహించే సంతబజారు, పశువుల సంత వేలం శుక్రవారం మద్దూరు శివారులోని రైతు వేదిక వద్ద కొనసాగింది. వేలం పాటదారులు కుమ్మకై మున్సిపాలిటీ అదాయానికి గండి కొట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం కంటే రూ.2,000 నుంచి రూ. 3,500 అదనంగా పాటపాడి దక్కించుకున్నారు. ఇదంతా రైతు వేదిక పరిసరాల్లోనే జరుగుతున్నా.. అధికారులు మిన్నకుండిపోయారు. వేలం పాటదారులు 22 మంది కుమ్మకై ్క సంతబజారును గుంతల జీడీ వెంకట్రాములు రూ.16.28 లక్షలకు, పశువుల సంతను బండి నాగేందర్గౌడ్ రూ.20.31 లక్షలకు దక్కించుకున్నారు. దీంతో వేలం పాటలో పాల్గొన్న వారికి దాదాపు 9 వేల నుంచి 10 వేల వరకు గుడ్విల్ అందజేసినట్లు సమాచారం. ఈ వేలం నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రామునాయక్, తదిరులు పాల్గొన్నారు. సంతబజారును మార్చాలి ప్రస్తుతం నిర్వహించే సంత బజారు ఇరుకు సందుల్లో కొనసాగుతుండగా.. పాత మద్దూరులోని ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే పాతబస్టాండ్, పాత బ్యాంకు నుంచి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా సంత బజారు నడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంతను గతంలో నిర్వహించే స్థలానికి మార్చాలని, సంత బజారులో, పశువుల సంతలో వ్యాపారస్తులకు కొను గోలు దారులకు కనీస వసతులైన మంచినీటి సౌక ర్యం, మూత్రశాలలు, పశువుల సంతలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషన్కు వినతి పత్రం అందజేశారు.. మున్సిపల్ ఆదాయానికి గండి -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
కోస్గి: ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మండలంలోని చంద్రవంచ గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో మోడల్ విలేజ్గా ఎంపికై న చంద్రవంచ గ్రామానికి 193 ఇళ్లు మంజూరయ్యాయని, 70 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 6 పునాది స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లకు సంబందించి బిల్లులు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. పునాది స్థాయిలో ఉన్న ఇళ్ల ఫొటోలను ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయించారు. మిగిలిన లబ్దిదారులు సైతం ఇళ్ళ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సునిత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువర్దన్రెడ్డితోపాటు పలువురు లబ్దిదారులు ఉన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించండి కోస్గి రూరల్: మున్సిపాలిటీ పరిదిలోని వార్ఢులు, గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా కలెక్టర్ రూ.30 లక్షలను మంజూరు చేశారని తెలిపారు. నీటిసమస్య ఉన్న ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయడం, లేదా మరమ్మతు చేయించడం, పైప్లైన్ లీకేజీలను సరిచేయడం, వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సప్లై చేయడం వంటివి చేపట్టాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చే తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ నాగరాజు , ఏఈ జ్ఞానేశ్వర్రెడ్డి , వర్క్ఇన్స్పేక్టర్ బాలరాం ఉన్నారు. -
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
కోస్గి: ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తూ అమలుచేస్తున్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. 336 గజాల ప్లాటుకు ఏకంగా రూ.104 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు విధించటంతో సదరు ప్లాటు యజమాని బిక్కమొహం వేశాడు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భోగారం (Bogaram) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాటు క్రమబద్ధీకరణ (Land Regularisation) కోసం గతంలో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నాడు.గురువారం తన ప్లాటుకు సంబంధించిన ఫీజు వివరాలు తెలుసుకునేందుకు కోస్గిలోని ఓ ఆన్లైన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే 336.9 గజాల ప్లాటుకు రూ.104,35,19,683 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో చూపడంతో అవాక్కయ్యాడు. ఆన్లైన్లో చూపిన వివరాల మేరకు 336.9 గజాల ప్లాటుకు సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన మార్కెట్ విలువ (Market Value) రూ. 2,21,22,016 కుగాను రెగ్యులరైజ్ చార్జీలు రూ.1,12,676,14 ఉండగా.. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీ రూ.104.34 కోట్లు చూపించారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీధర్ను వివరణ కోరగా.. సదరు ప్లాటు యజమాని వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఆ ప్లాటుకు తగ్గిన ఎల్ఆర్ఎస్ రుసుము!జడ్చర్ల: జడ్చర్లలోని ఓ ప్లాటుకు ఎల్ఆర్ఎస్ రుసుము రూ.27.33 కోట్లుగా నిర్ణయించటంపై గురువారం మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సంబంధిత దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించి సరిచేశారు. కిష్టారెడ్డి నగర్లోని సర్వే నంబర్ 108లో కె.ఝాన్సీకి చెందిన 200 చదరపు గజాల ప్లాటుకు ఎల్ఆర్ఎస్ ఫీజు (LRS Fee) ఏకంగా రూ.27,33,42,785గా నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవటంతో అధికారులు తప్పును సరిదిద్దారు. ఆ ప్లాటుకు రూ.30,034లను ఎల్ఆర్ఎస్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే తప్పుగా చూపిన ప్లాటు విస్తీర్ణాన్ని కూడా సరిచేశారు.హైదరాబాద్లో స్పందన అంతంతే.. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది.చదవండి: సజ్జనార్కు మరో కీలక బాధ్యత? -
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి
నారాయణపేట: విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్ ఫంక్షన్ హల్లో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నైపుణ్యాల ప్రదర్శన వేదిక విద్యా కదంబం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతున్న మౌలిక భాషా గణిత సామార్థ్యాల సాధన కార్యక్రమాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ పరిశీలించారు. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన విద్యార్థులతోపాటు మౌఖిక గణిత ప్రదర్శన చేసిన వారిని అభినందించారు. ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలను ఈ విధంగా ఘనమైన ముగింపు కార్యక్రమం చేయడం బాగుందని, ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం మరింత మెరుగ్గా పనిచేయాలన్నారు. విద్యాశాఖ పట్ల ప్రత్యేక దృష్టి ఉన్న కారణంగానే మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగుతుందని, ఇలాంటి మరెన్నో వినూత్న కార్యక్రమలు జిల్లా విద్యాశాఖ నుంచి చేయాలని, అందుకోసం తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించుటకు ప్రవేశపెట్టిన యంగ్ ఆరేటర్స్ కార్యక్రమం ఆరంభంలో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, బాలల దినోత్సవం రోజు నిర్వహించిన కార్యక్రమం ద్వారా కొంత మెరుగుపడినట్లు, నేడు ఒక స్థాయి మేరకు ఫలితాలు సాధించిందని, ఉపాధ్యాయలలో కొంత కొత్తదనం కనిపించిందని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, సహకరిస్తున్న అలోకిత్ ఫౌండేషన్ సభ్యులైన సాయి ప్రమోద్, యదునందన్ తదితరులను ఆమె అభినందించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి కలెక్టర్ వీక్షించారు. డీఈఓ గోవింద రాజులు, ఏఎంఓ విద్యాసాగర్ ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. కోస్గి రోడ్డు విస్తరణ పనులు వేగవంతం జిల్లాలోని కోస్గి మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు విస్తరణ లో మిగిలిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. కోస్గి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థల సేకరణకు వచ్చిన అభ్యంతరాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన గడువు 60 రోజులకు మరో వారం రోజులే గడువు ఉందని అంతలోపు అభ్యంతరాలను క్లియర్ చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీవో రామచందర్ నాయక్, ఆర్ అండ్ బి డి ఈ రాములు,కొస్గి తహసిల్దార్ బక్క శ్రీనివాస్, కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు. గడువులోగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. రూ.5 కోట్ల నిధులతో జిల్లా కేంద్ర సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి కలెక్టర్ సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించి, నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్తో పాటు డిఆర్డిఏ మొగులప్ప, అడిషనల్ డిఆర్డిఏ అంజయ్య, పీ ఆర్ ఈఈ హీర్యా నాయక్, ఏ. ఈ ధర్మరాజు పాల్గొన్నారు. -
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ రాజ్కుమార్, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సంధ్యరాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు భద్రతకే ఔట్పోస్టు ఏర్పాటు
అమరచింత: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రత దృష్ట్యా పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గురువారం ప్రాజెక్టు వద్ద పోలీస్ ఔట్పోస్ట్తో పాటు గెస్ట్హౌజ్ నిర్మాణానికి గురువారం పీజేపీ నందిమళ్ల డివిజన్ క్యాంపు ఏఈతో కలిసి ఎస్పీ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీటి నిర్మాణాలకు నాలుగు ఎకరాల స్థలంతో పాటు సుమారు రూ.కోటి అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని.. త్వరలోనే ఔట్పోస్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని పంటపొలాల్లో పట్టుకున్న భారీ మొసలిని జూరాల బ్యాక్వాటర్లో వదలడాన్ని ఆయన పరిశీలించారు. వివాదాస్పద స్థలం పరిశీలన.. మండల కేంద్రంలోని నాగులకుంటలో ఉన్న 13.08 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గురువారం ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించారు. నాగులకుంటలో వర్షపునీరు నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్. ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు ఉన్నారు. రూ.కోటితో ప్రతిపాదనలు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ -
మెడికల్ కళాశాలకుఅంబులెన్స్ అందజేత
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలను, జిల్లాస్పత్రికి వేణిరావు ఫౌండేషన్ వారు అంబులెన్స్ను గురువారం అందజేశారు. వేణిరావు ఫౌండేషన్ అధినేత రత్న చేతుల మీదుగా హైదరాబాద్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి అంబులెన్స్కు సంబంధించిన తాళాలు అందజేశారు. రామన్పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని.. గురువారం 1,017 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 71 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాలకు తపాలా సేవలు లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తపాలా శాఖ సేవలను విస్తరిస్తున్నట్లు వనపర్తి డివిజన్ ఎస్పీఓ భూమన్న అన్నారు. మండలంలోని రాయవరం గ్రామ పంచాయతీకి నూతనంగా మంజూరైన బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాయవరంలో బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారన్నారు. ఈ బ్రాంచి పోస్టాఫీసు పరిధిలోకి కొత్తచెర్వుతండా, పాతరాయవరం, వడ్డెబక్కనగూడెం గ్రామాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాయవరంతోపాటు ఇతర గ్రామాల వారు అంబట్పల్లి పోస్టాఫీసుకు వెళ్తూ ఇబ్బందులకు గురయ్యేవారని, ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టాఫీసు ద్వారా ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల డబ్బులు, ఇతరత్రా సేవలు ప్రజలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు సృజన్నాయక్, రవికుమార్, ప్రసాద్, రవికుమార్, బ్రాంచి పోస్టాఫీస్ ఇన్చార్జ్ బాలాజీనాయక్, నాయకులు మల్లయ్య, తిరుపతిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,646 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 6,646, కనిష్టంగా రూ. 5,222 ధరలు లభించాయి. అదే విధంగా కందులు గరిష్టంగా రూ. 6,001, కనిష్టంగా రూ. 5,000, మొక్కజొన్న గరిష్టంగా రూ. 2,281, కనిష్టంగా రూ. 1,827, జొన్నలు గరిష్టంగా రూ. 4,377, కనిష్టంగా రూ. 4,089, ఆముదాలు గరిష్టంగా రూ. 6,329, కనిష్టంగా రూ. 6,270, మినుములు రూ. 7,316, రాగులు గరిష్టంగా రూ. 3,077, కనిష్టంగా రూ. 2,207 ధరలు వచ్చాయి. ● దేవరకద్ర మార్కెట్యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ. 2,039, కనిష్టంగా రూ. 1,909 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 6,000 ధరలు వచ్చాయి. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్కు దాదాపు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
మరమ్మతు..!
‘జూరాల’కురూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది రంధ్రాలు... మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్ వేసవిలో పనులు చేపట్టేందుకు అధికారుల సన్నాహాలు -
కవిత్వం ఉగాది పచ్చడిలా ఉండాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కవి కవిత్వం చెబితే ఉగాది పచ్చడిలా తీపి, చేదు, పులుపు, వగరు కలగలిసి ఉండాలని జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వి.మనోహర్రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం స్థానిక పారిశ్రామికవాడలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి కప్పి చెబితే కవిత్వం అవుతుందని, విప్పి చెబితే విమర్శ అవుతుందన్నారు. పచ్చడి తాగితే తెలుగు సంవత్సరాది, మద్యం తాగితే ఇంగ్లిష్ సంవత్సరాది అని చమత్కరించారు. ముఖ్యంగా కవిత్వం నిగూఢ అర్థానిచ్చేదిగా ఉండాలని, హృదయాలను తెరిచే కవాటంలా కావాలన్నారు. కాగా, సుమారు 25 మంది కవులు తమ కవితలు వినిపించగా ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాలమూరు సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, విద్యావేత్త, కవి కె.లక్ష్మణ్గౌడ్, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, కార్యదర్శి నస్కంటి నాగభూషణం, సభ్యులు ఎ.రాజసింహుడు, తైలం బాలక్రిష్ణ, కవులు ప్రొద్దుటూరి ఎల్లారెడ్డి, ఖాజామైనొద్దీన్, సూర్యనారాయణ, పులి జమున, రావూరి వనజ తదితరులు పాల్గొన్నారు. -
2 కిలోమీటర్లు నడిచి వెళ్తాం
మా గ్రామంలో రేషన్ షాపు లేదు. ప్రతి నెల రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామానికి వెళ్తాం. ఒక్కోసారి వెళ్లినా బంద్ ఉంటుంది. మా గ్రామస్తులకు సరైన సమాచారం అందడంలేదు. బియ్యం తీసుకురావాలంటే లబ్ధిదారులు ఆ రోజు పని మానుకోవాల్సిందే. – లక్ష్మణ్, మాజీ సర్పంచ్ అంకేన్పల్లి షాపు మంజూరు చేయాలి మక్తల్ మున్సిపాలిటీ పరిదిలోని కొత్తగార్లపల్లిలో రేషన్ దుకాణం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి రేషన్షాపు మంజూరు చేయాలి. కూలీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తాము రేషన్ సరుకుల కోసం ప్రతి నెల అవస్థలు పడుతున్నాం. – మల్లమ్మ, కొత్తగార్లపల్లి, ఊట్కూర్ మండలం అనుమతి రావాల్సి ఉంది జిల్లాలోని పలు గ్రామాల నుంచి రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఫిర్యాదులు అందుతున్నాయి. దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ప్రతి రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, నారాయణపేట ● -
రేషన్.. పరేషాన్
చౌకధర దుకాణాలు లేని గ్రామాల్లో లబ్ధిదారుల ఇక్కట్లు మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రతి నెలా చౌకధర దుకాణాల ద్వారా ఉచితంగా బియ్య పంపిణీ చేస్తున్నాయి. సొంత గ్రామాల్లో చౌకధర దుకాణాలు లేని లబ్ధిదారులు ప్రతి నెల పొరుగూరికి వెళ్లి బియ్యం తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 11 మండలాలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 1.52 లక్షల లబ్ధిదారుల కోసం 298 రేషన్ దుకాణాలను మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేశారు. సుమారు 80 గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేవు. దీంతో రెండు మూడు గ్రామాల లబ్ధిదారులకు కలిపి వేరు ప్రాంతంలో రేషన్ దుకాణం కేటాయించారు. దీంతో వారంతా నిత్యం కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో కొందరు.. కాలినడకన మరికొందరు వెళ్లి బరువు మోస్తూ ఇక్కట్లు అనుభవిస్తున్నారు. సన్న బియ్యంపై ఆశలు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొనడంతో లబ్ధిదారులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నా.. దూర భారంపై ఆందోళన చెందుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని తాము ఉదయాన్నే కూలి పనులు, పొలం పనులకు వెళ్తామని, రేషన్దుకాణం మరో గ్రామంలో ఉంటుందని, సన్న బియ్యం ఇచ్చే సమయంలో సమాచారం అందక తమకు అందుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. మక్తల్ మండలంలో 39 గ్రామ పంచాయతీలు ఉండగా 14 గ్రామాలకు మాత్రం రేషన్ షాపులు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుర్లపల్లి, సామాన్పల్లి,ఏర్నాగాన్పల్లి, ఏర్సాన్పల్లి, ఉప్పర్పల్లి, గార్లపల్లి, వనాయికుంట, బోందల్కుంట, తిర్మలాపూర్, మాదన్పల్లి, అకేన్పల్లి, దాదాన్పల్లి, గడ్డంపల్లితో పాటు మరి గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేక పొరుగున ఉన్న గ్రామాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసి ఇబ్బందులను తీర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లాలో మొత్తం 80 గ్రామాల్లో రేషన్ షాపులు ఏర్పాటుచేయని వైనం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి పడిగాపులు సన్న బియ్యం అందుతాయా లేదా అని ఆందోళన -
‘ఉపాధి’ పని ప్రదేశాల్లో టెంట్ల ఏర్పాటు
మరికల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాల్లో ఎండల నుంచి కూలీల రక్షణార్థం అధికారులు టెంట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. వేసవి ఎండల నేపథ్యంలో నిలువ నీడ లేక, కనీస వసతులు కరువై కూలీలు ఇబ్బందులు పడుతుండగా ‘ఉపాధి కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి ఉపాధి హామీ అధి కారులు మరికల్లో ఎంపీడీఓ కొండన్న, ఏపీఎం పావని, ఏపీఓ ఊషన్న ఉపాధి కూలీల పని ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేయించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు జరు గుతున్న ప్రాంతాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఎండలకు తాళలేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలిపి ఇస్తున్నామని, ఎండల నుంచి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.22 మంది విద్యార్థుల గైర్హాజరునారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా బుధవారం పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,635 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 7,617మంది హాజరయ్యారు. 22మంది విద్యార్థులు గైర్హారయ్యారు. డీఈఓ గోవిందరాజులు ఏడు పరీక్ష కేంద్రాలను, ప్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 6 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లోప్రసవాల సంఖ్య పెంచాలిఊట్కూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా గర్భవతులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ సౌభాగ్యలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె ఊట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి మౌలిక వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. డాక్టర్ సంతోషి, వైధ్య సిబ్బంది విజయ్కుమార్, రాజశ్రీ, శైలజ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకంకోస్గి రూరల్: నవసమాజ నిర్మాణంతోపాటు దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో యువతా యువ ఉత్సావం–2025 కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులగా హాజరై మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను వెలికితీయడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాడానికి ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పలువురు విద్యార్థులు డ్రామాటిక్స్, క్రీడలు ,వక్తత్వం , సృజానాత్మక ప్రదర్శనలు మొదలైనవి చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోటానాయక్, ఏకే స్పోర్ట్స్ అకాడమీ నుంచి అంజీయాదవ్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
గడువు పొడిగించాలి
ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉంది. కానీ, కేవలం ఉత్తర్వులు ఇచ్చి రెండు రోజుల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో ఆసక్తి, అర్హత ఉన్నా రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం దరఖాస్తు గడువు పెంచి అర్హత ఉన్న రైతులకు అవకాశం కల్పించాలి. – వెంకట్రాములు, రైతు సంఘం అధ్యక్షుడు రైతులకు ఎంతో ప్రయోజనం ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. జిల్లాకు కేటాయించిన యూనిట్లకు సంబంధించి మండలాల వారీగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. మండలాల వారీగా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన రైతులకు యాంత్రీకరణ సామగ్రి అందజేస్తాం. దరఖాస్తు తేదీ పొడగింపు ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్ణీత గడువు వరకు వచ్చిన దరఖాస్తులు తీసుకున్నాం. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి ● -
లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి
నారాయణపేట: యాసంగి 2024 –25కు గాను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వరి కొనుగోళ్ళు – కేంద్రాల ఏర్పాట్లపై ఆమె సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సారి సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ పెంచిందని, దీంతో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కాగా జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు అదనపు కలెక్టర్ బేన్షాలం కలెక్టర్కు తెలిపారు. అయితే ఏప్రిల్ రెండో వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఐకెపి, సింగిల్ విండో, మెప్మా ద్వారా జిల్లాలో దాదాపు 102 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల ద్వారా లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను అనుకూలమైన ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని, ధాన్యం సేకరణకు అవసరమైన తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్ఫాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచుకోవాలని, ఇంకా అవరమైన వాటి కోసం ఇండెంట్లు పెట్టి తెప్పించుకోవాలని ఆమె సూచించారు. సమీక్షలో ఆర్డీఓ రామచంద్ర నాయక్, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్,సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, అధికారులు బాల్ రాజ్, మేఘా గాంధీ, అంజయ్య, సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ రోడ్ సేఫ్టీ సమావేశంలో ఎస్పీ యోగేష్గౌతమ్తో కలిసి కలెక్టర్ గత జనవరి 7న జరిగిన రోడ్ సేఫ్టీ మీటింగ్లో చర్చించిన అంశాలు, చేపట్టిన పనులు శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమష్టిగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమాలు, బ్లాక్స్పాట్ల గుర్తింపు, ప్రధాన రహదారులపై ఉన్న పాఠశాలలు, కళాశాలల వద్ద బారికేడ్స్ ఏర్పాటుపై ఎస్పీ వివరించారు. నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోడ్ సేఫ్టీ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. నిబంధనల మేరకులే అవుట్లకు అనుమతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లే –అవుట్లకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ లేఔట్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల అనుమతుల జారీ విషయంలో అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. మూడు లేఅవుట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారుల నుంచి క్లియరెన్స్ అడిగారు. -
చివరి విడతకు కొనసాగుతున్న నీటి విడుదల
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం వరక నీటి మట్టం 17 అడుగులకు చేరింది. వానాకాలం ముగిసిన తరువాత డిసెంబర్లో యాసంగి సీజన్ నీటిని వదలక ముందు ప్రాజెక్టు నీటి మట్టం 31.6 అడుగులు వద్ద ఉండగా.. డిసెంబర్ 25 నుంచి విడతల వారీగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తూ వచ్చారు. ఈనెల 21వ తేదీ చివరి విడత నీటిని విడుదల ప్రారంభించగా.. 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు కింద వేసిన వరి పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. పాత ఆయకట్టు కింద ఉన్న వరి పంటలకే నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. ఐదు విడతలు కలిపి ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి 14.6 అడుగుల నీటిని యాసంగి పంటలకు వినియోగించారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్ మాట్లాడుతూ యాసంగి సీజన్లో ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం నీటిని విడుదల చేశామని, ఈనెల 30వ తేదీన ఐదో విడత గడువు ముగుస్తుందని, 31 నుంచి నీటి విడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 17 అడుగులకు నీటి మట్టం పడిపోయిందని, ఉన్న నీటిని వేసవిలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. -
గడువు లేక.. లబ్ధి పొందక!
కోస్గి: రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఇవ్వడంతో అర్హులైన రైతులు ఎంతోమంది పథకానికి దూరమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇక రెండు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక.. అందులోనూ కేవలం మహిళా రైతులే అర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.రెండు రోజులు.. 132 దరఖాస్తులుఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పథకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అర్హులైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 132 మంది దరఖాస్తు చేసుకున్నారు.నిబంధనలతో ఇబ్బందులు..ట్రాక్టర్కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్సీ మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభు త్వం నిబంధనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయశాఖలో యాంత్రీకరణ పథ కాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి జిల్లాల వారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని 13 మండలాలకు సంబందించి 310 యూనిట్లు కేటాయించి, రూ.73.85 లక్షలు మంజూరు చేస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అధికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ ఫామ్ మెకలైజేషన్ పథకం కింద ఎంపికై న రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. -
పోరాటాలతోనే హక్కుల సాధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోగలుగుతామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్, ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ తీశారు. అనంతరం బోయపల్లిగేట్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సంఘం మూడో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధనికుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. భవ న నిర్మాణ కార్మికులకు కనీస పింఛను రూ. ఆరు వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ, బీఓసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ నాయకులు సి.వెంకటేశ్, పి.అరుణ్కుమార్, దేవదానం, కె.రవి, కిరణ్ పాల్గొన్నారు. -
పేదల బియ్యం పక్కదారి..!
నర్వ: చౌకధర దుకాణాల్లో పేదలకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ కార్డుదారుల నుంచి బియ్యం సేకరణతో మొదలుకుని రైస్మిల్లులకు తరలింపు వరకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా సాగుతోంది. కరోనా కాలం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం వరకు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. తర్వాత దొడ్డు బియ్యం రావడంతో ఎక్కువగా వినియోగం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో కిలో బియ్యాన్ని రూ. 12 నుంచి రూ. 15 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఒక చోట చేరుస్తుండగా.. ఏజెంట్ల ద్వారా వ్యాపారులు కొంటున్నారు. దాడులు జరుగుతున్నా.. జిల్లాలో కొన్ని రోజులుగా టాస్క్ఫోర్స్, మండల పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఇందులో ఎక్కువగా వనపర్తి జిల్లా అమరచింత, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి నర్వ మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బి య్యం పోలీసుల పెట్రోలింగ్లో పట్టుబడుతున్నా యి. రేషన్ బియ్యం అక్రఓమ రవాణాకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. కొందరు మిల్లర్లు రేషన్ బియ్యం దందానే తమ ఆదాయ వనరుగా ఎంచుకున్నారని తెలుస్తోంది. జిల్లాలో జోరుగాసాగుతున్న అక్రమ దందా ● నేరుగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు ● కిలోకు రూ. 15 వరకు చెల్లిస్తున్న ఏజెంట్లు ● కేసుల నమోదుకే పరిమితమవుతున్న అధికారులు రూ.లక్షల్లో అక్రమార్జన.. బియ్యం వ్యాపారులు ఏజెంట్ల ద్వారా లబ్ధిదారులతో కిలోకు రూ.15కు రేషన్ బియ్యం కొనుగోలు చేసి.. మిల్లర్లకు రూ. 25కి పైగా విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్మిల్లులో పాలిషింగ్ చేపట్టి సన్నబియ్యంగా బహిరంగ మార్కెట్లు, హాస్టళ్లు, హోటళ్లకు కిలో రూ. 43 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు, గుర్మిటకల్, బెంగళూరు, మహారాష్ట్రలోని ముంబాయి, తమిళనాడు రాష్ట్రం చైన్నెలలో ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా మార్కెటింగ్ చేపట్టిన మిల్లర్లు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. -
డామిట్.. కథ అడ్డంతిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
రూ.12.32 లక్షలకు పేట తైబజార్ వేలం
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో మంగళవారం తైబజార్కు బహిరంగ వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను జరిగిన వేలంలో పట్టణానికి చెందిన బండి గణేశ్ రూ. 12.32 లక్షలకు దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. అదే విధంగా మాంసం వ్యర్థాల సేకరణకు వేలం నిర్వహించగా.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం తిమ్మాపూర్కు చెందిన బాలరాముడు రూ. 4.80లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.7,677 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పెసర క్వింటాల్ గరిష్టంగా రూ. 7,677, కనిష్టంగా రూ. 7,557 ధర పలికింది. వేరుశనగ గరిష్టంగా రూ. 5,810, కనిష్టంగా రూ. 4,420, జొన్నలు గరిష్టంగా రూ. 4,752, కనిష్టంగా రూ. 3,405, అలసందలు గరిష్టంగా రూ. 7,069, కనిష్టంగా రూ. 5,325, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,211, కనిష్టంగా రూ. 7,166, తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,489, కనిష్టంగా రూ. 6,609 ధరలు వచ్చాయి. వేరుశనగ క్వింటా రూ.6,411 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధ వారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిపాయల బహిరంగ వేలం ప్రారంభం అవుతుంది. నవోదయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రేపు మెగా జాబ్ మేళా బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 33 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలెం వెంకన్న హుండీ లెక్కింపు బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ జిల్లా శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా హుండీలో రూ.3,17,864 నగదు, 35 గ్రాముల బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారని ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మనుసాని విష్ణుమూర్తి తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు, అర్చకులు జయంత్, శుక్ల, చక్రపాణి, మాజీ ధర్మకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు అలంపూర్లో.. అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆశావర్కర్ల నిర్బంధం దారుణం
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులతో నిర్బంధించడం దారుణమని తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. పోలీసులచే ఆశావర్కర్లను అరెస్టు చేయించిన మాత్రాన తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆశావర్కర్ల ఆందోళనకు వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిర్మల, లక్ష్మి, శివమ్మ, నర్సమ్మ, రాధిక, మహేశ్వరి, నాగమణి, నర్మద పాల్గొన్నారు. -
వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి
నారాయణపేట: వ్యాపార రంగంలో మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మంగళవారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. అందులో భాగంగా మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు, రైస్మిల్లులు, సోలార్ పవర్ ప్లాంట్స్ మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇది జిల్లా మహిళలు సాధించిన గొప్ప విజయమన్నారు. అదే విధంగా ఇంకా ఏదైనా వినూత్నంగా ఆలోచించి వ్యాపార పరంగా జిల్లా మహిళా సమాఖ్య మరో ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. కాగా, మక్తల్లోనూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని ఉందని.. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రభుత్వ స్థలం ఉందని మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్.. జిల్లాలో రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మంచిదే అని.. కానీ హైవే పక్కన స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని చెప్పారు. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం వివరాలను తెప్పించుకుంటానని తెలిపారు. సూపర్ మార్కెట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ప్రైవేటు స్కూల్ ఏర్పాటు, మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం లాంటి వ్యాపారాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, అడిషనల్ డీఆర్డీఓ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నారాయణపేట: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం స్టేజీ దగ్గరలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటుచేసిన జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి మండలాల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్కు సంబంధించి ఉపాధి సృష్టించిన నివేదిక, కార్మిక సమీకరణ, గ్రామాల వారీగా లేబర్ నివేదిక, సగటు వేతన రేటు, 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలు, సకాలంలో చెల్లింపుపై ఆయా సిబ్బందితో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా అలసత్వం వహిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఒక్కో గ్రామంలో కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే ఉపాధి పనులకు రావడం ఏమిటని ప్రశ్నించారు. కొరవడిన పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణ కొరవడిందని, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరూ సరిగ్గా పనిచేయడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు మహబూబ్నగర్ నుంచి వస్తున్నారో, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో అంతా తెలుసని, మంగళవారం నుంచి ఉదయం 7 గంటల వరకు గ్రామాలలో ఉండి ఉపాధి పనులకు కూలీలను అధిక సంఖ్యలో తీసుకువెళ్లి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిగతా జిల్లాలలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్ పనులు బాగా జరుగుతున్నాయని, కానీ మన జిల్లాలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలలో ఉపాధి హామీ పనులలో ప్రగతి ఏమీ లేదని చెప్పారు. ఎందుకింత నిర్లిప్తత ఉందని నిలదీశారు. ఉపాధి హామీ లాంటి పెద్ద పథకాన్ని వెనుకబడిన మన జిల్లాలో ఉపయోగించుకోకపోతే ఎలా ? అని, వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే చర్యలు తప్పక ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మాట్లాడారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించగా 903 కేసులు నమోదు కాగా వాటిలో 185 టార్గెట్ ఉన్నాయన్నారు. అందులో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. టీబీ వ్యాధిని అంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. పనితీరు మెరుగు పర్చుకొని కూలీల సంఖ్య పెంచాలి లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేయాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..
మద్దూరు: రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురిసి కృష్ణానది పరవళ్లు తొక్కినా కూడా.. తాజాగా నదీ పరివాహక ప్రాంతం వారు సాగునీటి, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో కృతిమ కరువు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. మద్దూరులో సోమవారం విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి కోస్గి సభలో మార్చి 31 వరకు రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమచేస్తానని చెప్పారని, ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు వారికే మాత్రమే డబ్బులు పడ్డాయని, మిగితా వారికి ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం వల్లే నియోజకవర్గంలో తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చేదని, దానిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. హామీల మేరకు వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సలీం, రామకృష్ణ, గోపాల్, మహిపాల్, నరేష్, నర్సింహా, రాములు, మహేందర్, చంద్రశేఖర్, జగదీశ్వర్, బాల్చందర్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ నాయకుడు సలీం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
సారా కట్టడికి కదిలిన ఎకై ్సజ్ అధికారులు
కోస్గి: సారా కట్టడికి ఎకై ్సజ్ అధికారులు నడుం బిగించారు. సోమవారం పలు తండాల్లో దాడులు నిర్వహించారు. జిల్లాలో ఇటీవల సారా విక్రయాలు పెరగడం, యువత మత్తుకు బానిస అవుతుండడంపై ‘మళ్లీ గుడుంబా..’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమవగా ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని పలు తండాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా తయారీకి వినియోగించే 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడినట్లు ఎకై ్సజ్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎకై ్సజ్ ఎస్ఐ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కుమ్మరికుంట తండా, బీమ్లా తండా, సుభ్యా నాయక్తండా, సారంగరావుపల్లి శివారులో సారా స్థావరాలపై దాడులు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడగా నలుగురిని అరెస్టు చేసి గుండుమాల్ తహసీల్దార్ భాస్కర్ స్వామి ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు. పట్టుబడిన వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఎక్కడైన సారా తయారు చేసినట్లు గుర్తించిన, సారా అమ్ముతూ పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ పురుషోత్తంరెడ్డితోపాటు సిబ్బంది హరీష్, దయాకర్, కృష్ణ, రవి, విమల తదితరులు పాల్గొన్నారు. పలు తండాల్లో దాడులు.. 100 లీటర్ల బెల్లం ఊట పట్టివేత నలుగురి అరెస్టు.. తహసీల్దార్ ఎదుట బైండోవర్ -
ఇంటి నుంచే తాగునీరు..
పనిచేసే ప్రదేశంలో వసతుల్లేక నీళ్ల సీసాలు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. ఎండలో పనిచేసే సమయంలో కాస్త ఉపసమనం పొందడం కోసం కనీసం గుడారాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. చెట్ల కిందకు వెళ్లాల్సినా పరిస్థితి ఉంది. పనుల దగర గాయలైతే ప్రాథమిక కిట్లు అందుబాటులో లేవు. – పద్మమ్మ, ఉపాధి కూలి సామగ్రి ఇవ్వలేదు కూలీ పనులకు వెళ్తున్న తమకు గత 12 ఏళ్ల నుంచి గడ్డపారలు, పారాలు ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి వాటిని కొనుగోలు చేసి పనులకు వెళ్తున్నాం. ఈ విషయాన్ని ఏటా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు సామగ్రి అందజేయాలి. – మొగులప్ప, ఉపాధి కూలి జాగ్రత్తలు తీసుకుంటున్నాం పని ప్రదేశాల్లో కూలీలకు ఎండల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైన వైద్య సామగ్రిని ఆయా మండలాల పరిధిలోని పీహెచ్సీలకు నివేదించి తెప్పించుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. టెంట్లు, గడ్డపారలు ఇతర సామగ్రి ప్రభుత్వం నుంచి రావాల్సింది. – మొగులప్ప, డీఆర్డీఓ ● -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నారాయణపేట: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదులు అందజేశారు. మొత్తం ఆరు ఫిర్యాదులను ఎస్పీ నేరుగా స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయా సీఐలు, ఎస్ఐలకు ఫోన్లో సూచించారు. క్రికెట్ బెట్టింగ్లకుపాల్పడితే కఠిన చర్యలు నారాయణపేట: ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడటం జరుగుతుందని.. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్లు నిర్వహించే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని, క్రికెట్ బెట్టింగ్స్ అనేవి చట్టారిత్యా నేరమని అట్టి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వినోదం కొరకు ఆడే ఆటను వినోదంగానే చూడాలని, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విశిష్ట సేవలకుపురస్కారాలు నారాయణపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి నారాయణపేట ఆర్టీసీ మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు డీఎం లావణ్య, ఏడీసీ భాగ్యమ్మ, కండక్టర్లు రేణుక, రాజమణికి విశిష్ట మహిళా ప్రతిభా అవార్డులను అందించారు. రవాణా సేవల్లో వారు చేస్తున్న కృషిని ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో చంద్ర నాయక్, బాలయ్య, నారాయణ, లాలు నాయ క్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, హిందీ ప్రచార సమితి సెక్రటరీ ఏకే రాజు పాల్గొన్నారు. 27న పశువుల సంత, తైబజార్లకు టెండర్లు కోస్గి: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 27న గురువారం పశువుల సంత, తైబజార్లకు బహిరంగ వేలం ద్వారా టెండర్లు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి వేలంపాట నిర్వహించి అత్యధిక ధర పాడిన వారికి ఒక సంవత్సర కాలానికి టెండరు అందజేస్తామని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనదల్చిన అభ్యర్థులు పశువుల సంతకు రూ.2 లక్షలు, తైబజార్కు రూ.లక్ష మున్సిపల్ కమిషనర్, కోస్గి పేరున డీడీ తీసి ఒక రోజు ముందుగానే ఈ నెల 26న సాయంత్రం 4 గంటల వరకు అందజేయలని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలసందలు క్వింటాల్ రూ.7,229 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటాల్కు గరిష్టంగా రూ.7,229, కనిష్టంగా రూ.5,359 ధర పలికింది. అలాగే, శనగలు గరిష్టం, కనిష్టంగా రూ.5,655, పెసర గరిష్టం ,కనిష్టంగా రూ.7,580, వేరుశనగ గరిష్టం 5,240, కనిష్టం రూ.4,720, జొన్నలు గరిష్టం రూ.4,719, కనిష్టం రూ.2,810, ఎర్ర కందులు గరిష్టం రూ.7,189, కనిష్టం రూ.6,521, తెల్ల కందులు గరిష్టం రూ.7,481, కనిష్టంగా రూ.7,229 ధర పలికింది. -
‘ఉపాధి’ కష్టాలు..!
వివరాలు 8లో uమండుటెండలో కూలీల అవస్థలు మరికల్: మార్చి ప్రారంభం నుంచే బానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసే కూలీల పరిస్థితి దారుణంగా మారింది. పైగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, నీడ కూడా కరువైంది. అత్యవసర మెడికల్ కిట్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పనులు చేస్తున్న కూలీలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎండలు ముదిరి తమ ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తంలో జాబ్ కార్డులు 1,11,421 ఉండగా ప్రతి ఏడాది 60 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం 11 మండలాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాగా 12,347 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వసతుల్లేక ఇబ్బందులు ప్రస్తుతం పాం పాండ్స్, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏడేళ్ల నుంచి వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. ఏడేళ్ల కింద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారు టెంట్లు ఇచ్చారు. మళ్లీ వాటిని వెనక్కి తీసుకున్నారు. గతంలో మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్ఎస్ ప్యాకెట్, బ్యాండెడ్, దూది, అయోడిన్ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉపాధి పనులే ఆధారం జిల్లాలో ప్రస్తుతం కూలీలకు వ్యవసాయ పనులేమి లేవు. దాదాపు అందరూ ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. ఎండల తీవ్రత మూలంగా పనులకు వెళ్లేందుకు పలువురు జంకుతున్నారు. దూరం ఎక్కువగా ఉండటం, నీడ, తాగునీటి వసతి ఏర్పాట్లు చేయకపోతుండటం లాంటి కారణాలతో పనులకు వెళ్తే ప్రాణాలకే ముప్పన్న భావనతో కొందరు కూలీలు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన వారు సైతం పనులకు వెళ్లడంలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. అధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామం నుంచి నిత్యం కనీసం 26 మంది కూలీలైన పనులకు రావాలి. రెండు వారాలుగా కూలీల సంఖ్యను పరిశీలిస్తే అంతకంతకు పెరుగుతూ వస్తోంది. పని ప్రదేశాల్లో కానరాని కనీస సౌకర్యాలు ప్రథమ చికిత్స కిట్ల జాడ కరువు జిల్లాలో మొత్తం 1,11,421 జాబ్ కార్డులు -
‘జై సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నారాయణపేట: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో చేపట్టే పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు కదం తొక్కాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, జిల్లా ఇన్చార్జ్ ధారాసింగ్నాయక్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్.. జై సమిధాన్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయి సన్నాహక సమావేశ ఏర్పాట్లు మండల స్థాయిలో జరిగేలా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షత వహించాలన్నారు. అలాగే గ్రామాల పాదయాత్ర జాబితా రూట్ ప్లాన్ ప్రోగ్రామ్స్ ప్రారంభం, ముగింపు తేదీలను ఖరారు చేయాలన్నారు. ఏ గ్రామంలో మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే అంశాలపై ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు. మార్చి 28 కంటే ముందు పూర్తి చేయాలన్నారు. తదనుగుణంగా జిల్లా మండల స్థాయి ప్రణాళికబద్ధమైన సమావేశాలకు పీపీటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. పాదయాత్రకు గ్రామంలోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ప్రజలకు తెలియజేయడానికి, జనాన్ని సమీకరించడానికి డప్పు చాటింపు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు ప్రసన్నా రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. -
భగత్సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
యాసంగితో పోలిస్తే పెరిగిన సాగు, ఎండిన పంటనష్టం వివరాలు.. (ఎకరాల్లో)జిల్లా గత యాసంగిలో ప్రస్తుత పూర్తిగా ఎండిన యాసంగిలో పంట (అంచనా..) మహబూబ్నగర్ 1,12,000 1,25,000 20,000 నాగర్కర్నూల్ 1,16,577 80,772 2,000 జోగుళాంబ గద్వాల 44,379 69,694 6,000 వనపర్తి 90,123 1,40,000 5,000 నారాయణపేట 1,13,000 1,28,000 3,000 ● వనపర్తి జిల్లాలో ఈ యాసంగిలో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాకు జూరాల, భీమా, కేఎల్ఐ సాగు నీరు తగ్గడం.. భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో వనపర్తి, ఖిల్లాఘణపురం, పాన్గల్ మండలాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల మేర పంట ఎండిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే జిల్లావ్యాప్తంగా ఐదు వేల ఎకరాల వరకు వరి ఎండినట్లు తెలుస్తోంది. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీరందక కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, గువ్వలదిన్నే, పాతపాలెం, ఉమిత్యాల, నందిన్నె, ధరూర్ మండలంలోని అల్లాపాడు, కోతులగిద్దె, కొత్తపాలెం, గట్టు మండలంలోని పెంచికలపాడు, మాచర్ల, ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి గ్రామాల్లో సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. అధికారులు మాత్రం 250 ఎకరాల్లో మాత్రమే పంట ఎండిపోయినట్లు చెబుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో 175 ఎకరాల్లో వరి, 72 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల మేర కంది, ఇతర పంటలు.. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 205 ఎకరాల్లో వరి ఎండినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ రెండు జిల్లాలు కలిపి నీరందక సుమారు నాలుగు వేల ఎకరాల మేర పంట ఎండినట్లు తెలుస్తోంది. నారాయణపేట: ప్రజా పోరాటాల ద్వారానే ప్రజలకు దోపిడీ పీడనల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జీ వెంకట్రామిరెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిపిఎం, డివైఎఫ్ఐ ,ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా అమల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి లౌకిక భావాలతో విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సంఘటితం చేసి పోరాడారని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర వక్రీకరణలు, విభజన, విద్వేష రాజకీయాలతో బ్రిటీష్ వారిని మించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నేడు భగత్ సింగ్ ఆశయాలకు బిన్నంగా పాలన నడిపించడమే కాకుండా మళ్లీ భగత్సింగ్ వారసులం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్య విస్తృత ప్రజా ఉద్యమాల ద్వారా స్వాతంత్రోద్యమ కాంక్షను పెంచారని అన్నారు. ప్రజా పోరాటాలు వ్యక్తితో ప్రారంభమై ఒక వ్యక్తితో ముగిసేవి కాదని సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న శ్రమ దోపిడి పీడనలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధాల దోపిడీ పీడన నుండి మానవజాతి సామాజిక వ్యవస్థను నెలకొల్పడమే అంతిమ లక్ష్యంగా జీవితాంతం పోరాడిన భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజల పక్షాన చివరిదాకా నిలిచి సీపీఎం పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గోపాల్, బాల్ రామ్, అంజిలయ్య గౌడ్, పుంజనూరు ఆంజనేయులు,మహేష్ కుమార్ గౌడ్, కార్మిక, విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు మహ్మద్ అలీ, బాలు, పవన్ జోషి, అశోక్, దస్తప్ప, నర్సింహ, రాములు, పాల్గొన్నారు మార్గదర్శి భగత్సింగ్ నారాయణపేట ఎడ్యుకేషన్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం తృణపాయంగా వదిలేసిన ధీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అని, వారు దేశ యువతకు మార్గదర్శులని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్ అన్నారు. పీడీఎస్యూ, పీవైఎల్, యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాశీనాథ్, సాయికుమార్, గౌస్ మారుతి, వెంకటేష్, రాము, సాగర్, ప్రేమ్రాజ్, కృష్ణ, నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు.●ఆశలు.. ఆవిరి -
ఎల్ఆర్ఎస్ @ 920
నారాయణపేట: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 34,396లో 17,303 ఆమోదం పొందాయి. మూడు మున్సిపాలిటీల్లో 21,384 దరఖాస్తులు రాగా..140 జీపీల్లో 13,012, రూ.10 వేలు చెల్లించిన వెంచర్లు 403 ఉన్నాయి. ఇందులో నిషేధిత జాబితాలో మూడు మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను అధికారులు గుర్తించారు. ఈనెలాఖరు వరకు ఎస్ఆర్ఎస్ చేయించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. కాగా వీరిలో 920 మంది మాత్రమే స్పందించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎల్ఆర్ఎస్ రుసుంలో తప్పిదాలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ రూపొందించింది. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిటిజన్ లాగిన్లు ఇచ్చారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన సిటిజన్ లాగిన్ఫై అవగాహన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా ఫీజులు వేయాలి. ఆన్లైన్లో వచ్చిందే ఫీజు అంటున్నారే తప్పా.. ఏ దానికి ఎంత అని వివరించలేకపోతున్నారు. సిస్టమ్లో వచ్చిందే కరెక్టు.. ఆ సిస్టమేంటో చెప్పాలంటే చెప్పాలేకపోతున్నారు. రాయితీ ఇచ్చినా స్పందన అంతంతే 34,396 దరఖాస్తులకు 17,303 ఆమోదం రూ.25 కోట్ల లక్ష్యానికి వచ్చింది రూ.1.65 కోట్లే.. మిగిలింది 8 రోజులే..రాయితీతో మేలు అనధికార లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీతో చెల్లించాలి. మిగిలింది 8 రోజులు మాత్రమే. ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లాలోని రియల్టర్లు, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – కిరణ్కుమార్, టీపీఓ, నారాయణపేట అంతా ఆన్లైన్లోనే.. 2020 కంటే ముందు 10 శాతం రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఎంతెంత ఫీజు వసూలు చేయాలని అంతా ఆన్లైన్లో చూపుతోంది. రూ.వెయ్యి కట్టిన వారు ఎల్ఆర్ఎస్తో పాటు రిజిస్ట్రేషన్ సైతం చేసుకోవచ్చు. – రాంజీ, సబ్రిజిస్ట్రార్, నారాయణపేట స్పందన కరువు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చినా దరఖాస్తు దారుల నుంచి స్పందన కరువైంది. బల్దియా పరిధిలో నామమాత్రంగానే ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయించుకోవాలని బల్దియా అధికారులు ప్రచారం చేస్తున్నా అంతంతే కనిపిస్తోంది. ఇక గ్రామీణప్రాంతాల్లో మరింత దారుణంగా ఉంది. -
కందులు క్వింటా రూ.6,821
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,821, కనిష్టంగా రూ.5,659 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,889, కనిష్టంగా రూ.6,680, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,280, కనిష్టంగా రూ.2,027, జొన్నలు గరిష్టంగా రూ.4,527, కనిష్టంగా రూ.4,027, ఆముదాలు గరిష్టంగా రూ.6,345, కనిష్టంగా రూ.6,225 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,011 ఒకే ధర నమోదైంది. ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు రూ.1,962గా ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడం వల్ల లావాదేవీలు తక్కువగా జరిగాయి. ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సింథటిక్ మ్యాట్లు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడాశాఖకు శనివారం కబడ్డీ సింథటిక్ మ్యాట్లు చేరాయి. 35ఎంఎం సైజు గల 300 మ్యాట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఒక కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ కబడ్డీ సింథటిక్ మ్యాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ సింథటిక్ ట్రాక్లు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి కృషితో జిల్లాకు కబడ్డీ సింథటిక్ మ్యాట్లు వచ్చినట్లు తెలిపారు. కబడ్డీ మ్యాట్పై ప్రాక్టీస్ చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. -
బాధితులకు అండగా సైబర్ వారియర్స్
నారాయణపేట: సైబర్ బాధితులకు సైబర్ వారియర్స్ అండగా ఉండాలని సైబర్ క్రైం ఇన్చార్జ్ సీఐ గోపాల్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ వారియర్స్కు నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్న తీరు, నమోదైన కేసుల్లో జప్తు చేసిన నగదు, పోగొట్టుకున్న నగదు బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ బాధితులు తమ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930, డయల్ 100కి గాని, ఎన్సీఆర్బీ పోర్టల్లోగాని ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ బాధితులకు గోల్డెన్ అవర్ ఉంటుందని.. ఆ సమయంలోగా 1930కి సమాచారం ఇస్తే నగదు బదిలీ కాకుండా చేయడం, బాధితులకు అందించడం జరుగుతుందని చెప్పారు. సైబర్ బాధితులకు డబ్బులు త్వరగా ఇప్పించేందుకు కొత్త పద్ధతిని వారికి తెలియజేశారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు సైబర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఎస్ఐ శ్రావణ్కుమార్, ఐటీ కోర్ రమేశ్, జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల సైబర్ వారియర్స్, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
నారాయణపేట: నీటిని సృష్టించలేమని.. భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా భూగ ర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలకు నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూగర్భ జలాల వెలికితీత నియమాలు, సంరక్షణ, స్థిరమైన నీటి నిర్వహణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిత్య జీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని.. గృహ, వ్యవసాయ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు మితిమీరి నీటిని వినియోగించడం భూగర్భ జలమట్టం తగ్గిపోవడానికి కారణమన్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతి ఏటా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. గార్డెన్, గ్రీనరీ పెంపునకు కృషి చేసిన అధికారులకు అవార్డు అందించనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి భూగర్భ జలాల ప్రాధాన్యత, భూగర్భ, ఉపరితల జలాల వెలికితీత, జల సంరక్షణ, వృక్షాల రక్షణ, టీజీ వాల్టా చట్టం 2002 గురించి వివరించారు. భూగర్భ జలవనరులశాఖ డీడీ రమాదేవి నీటి నిర్వహణ, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ జలవనరుల దినోత్సవం–2025 బుక్లెట్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
● డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు మమ్మురం ● అతి క్లిష్టమైన ప్రదేశంలో మట్టి, రాళ్లు, బురద తొలగింపు ● గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం 29 రోజులుగా గాలింపు ● ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు – అచ్చంపేట – వివరాలు 8లో.. -
ముగ్గురు వైద్యుల మూకుమ్మడి రాజీనామా
కోస్గి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ అధికారి వ్యవహరిస్తున్న తీరుకు విసుగుచెంది ముగ్గురు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు పంపడంతో పాటు మూడురోజులుగా విధులకు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నెల 19న చోటు చేసుకున్న రాజీనామాల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి మల్లికార్జున్ సూపరింటెండెంట్గా ఉండగా డా. అనుదీప్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. డీఎంఓలుగా డా. తరుణ్, డా. రహీం, డా. లోకేష్ , గైనిక్ వైద్యురాలిగా డా. శ్వేత, చిన్నపిల్లల వైద్యులుగా డా. వెంకటేష్ విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యుడు రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తారు. ముగ్గురు డీఎంఓలు విడతల వారీగా 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారు. వీరంతా కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. కొంతకాలంగా డా. అనుదీప్కు, మిగిలిన వైద్యులకు విధులు, ఆస్పత్రి నిర్వహణ విషయంలో సఖ్యత లేకపోవడంతో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు డా. రహీం రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా తెల్లవారుజామున ఆస్పత్రిలోనే భోజనం చేసి పడుకున్నారు. ఉదయం ఆస్పత్రి అరగంట ఆలస్యంగా విధులకు రాగా.. రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుదీప్కు ఫిర్యాదు చేశారు. దీంతో డా. రహీంను రోగుల ముందే ధూషించగా మనస్థాపానికి గురయ్యాడు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వ్యవహారశైలితో విసుగుచెంది డా. రహీం, డా. తరుణ్, డా. లోకేష్ తాము విధులు నిర్వర్తించలేమని ఈ నెల 19న తమ వృత్తులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా అధికారులఆదేశాలు అమలు చేశా.. ఆస్పత్రిలో పనిచేసే ముగ్గురు వైద్యులు రాజీనామా చేసిన విషయం వాస్తవమే. జిల్లా ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు కొంత కఠినంగా వ్యవహరించి రోగులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. రోజురోజుకు రోగుల సంఖ్య పెరగడంతో మెరుగైన సేవల కోసం వైద్యులపై ఒత్తిడి ఉంటుంది. విధుల ని ర్వహణలో సమయపాలన విషయంలో తప్ప వైద్యులతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడ వలు లేవు. ఈ విషయం జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – డా. అనుదీప్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, కోస్గి సూపరింటెండెంట్ వ్యవహారశైలేకారణమా? -
మూతబడ్డ సారా తయారీ కేంద్రాలు
కోస్గి: జిల్లాలో సారా విక్రయాలు, మత్తుకు బానిసలవుతున్న యువతపై శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మళ్లీ గుడుంబా..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అటు సారా తయారీదారులు, ఇటు ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పుర పరిధిలోని నాగుసాన్పల్లి గుట్టల ప్రాంతంలో ఉన్న సారా తయారీ కేంద్రాన్ని మూసివేసి సామగ్రిని అక్కడ నుంచి తరలించారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఒకరు తయారీదారులకు సమాచారం ఇవ్వడంతో కేంద్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సారంగరావుపల్లితండా, అమ్లికుంట్లతండా, కొత్తపల్లి మండలంలోని లక్ష్మీనాయక్తండా, తుపాకితండాతో పాటు పలుచోట్ల సారా బట్టీలు మూసివేశారు. ఓ అధికారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఓ ప్రముఖ హోల్సెల్ వ్యాపారి పెద్ద మొత్తంలో నిల్వ చేసిన బెల్లాన్ని శనివారం రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు స్పందించి సారా తయారీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
‘కాడ’ పనులు వేగిరం చేయాలి
నారాయణపేట: కాడ కింద మంజూరైన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో చేపట్టాల్సిన పనులపై నారాయణపేట, వికారాబాద్ జిల్లాల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కోస్గి, మద్దూర్ మండలాల్లో చేపట్టాల్సిన పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్దూరు నుంచి లింగాల్చేడ్ వరకు డబుల్రోడ్డు నిర్మాణం, నారాయణపేట నుంచి మద్దూర్ వరకు రహదారి విస్తరణ, కోటకొండ నుంచి మద్దూరు, రావుల్పల్లి నుంచి మద్దూరు వరకు బీటీ రోడ్ల నిర్మాణాలు ఏయే దశలో ఉన్నాయని ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుండుమల్, కొత్తపల్లిలో మండల కాంప్లెక్స్ పనులు ప్రారంభమయ్యాయా లేదా అని సంబంధితశాఖ అధికారులతో ఆరా తీశారు. ఆయా మండలాలలో సబ్స్టేషన్లు, రహదారి విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై విద్యుత్శాఖ అధికారులతో చర్చించారు. మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో అర్హులను గుర్తించి గృహజ్యోతి అమలు చేయాలని ఆదేశించారు. కోస్గి పుర పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ, అంతర్గత రహదారుల నిర్మాణాల గురించి ఆరా తీశారు. సమీక్షలో పంచాయతీరాజ్శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్నాయక్, ఈఈ శ్రీధర్రెడ్డి, డీఈ రాములు, విద్యుత్శాఖ డీఈ నర్సింహారెడ్డి, పీఆర్, ఆర్అండ్బీ ఏఈలు, టీజీఎంఐడీసీ అధికారి పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలి
నారాయణపేట: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థా నంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్గా శిక్షణ పూర్తిచేసుకొని వెళ్తున్న గరిమా నరుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకొని పూలమాల, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆలిండియా స్థాయిలో 39వ ర్యాంకు సాధించిన గరిమా నరుల ట్రైనీ కలెక్టర్గా.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లాకు రావడం, ఇక్కడ పని చేయడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగ పడుతుందని, ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా..జిల్లాను మరవద్దని కలెక్టర్ కోరారు. ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో కలెక్టర్ తనకు ఎన్నో విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారని, అదనపు కలెక్టర్లు తమ తమ శాఖల పరిధిలోని వివిధ అంశాలపై తనకు క్లుప్తంగా వివరించి మద్దతుగా నిలిచారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మొదటి రోజు 22 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7613 మంది విద్యార్థులకుగాను 7591 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 22మంది గైర్హాజరయ్యారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్లు, ఆరు కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
నారాయణపేట: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి 20వ తేదీ వరకు నూతన ఓటరు నమోదుకు నారాయణపేట నియోజకవర్గంలో 1,294 దరఖాస్తులు రాగా 1,068 విచారణ పూర్తి చేశారని, చిరునామా మార్పునకు 1529 దరకాస్తులు రాగా.. 1359 విచారణ పూర్తయ్యాయని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్ తెలిపారు. అలాగే మక్తల్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు 1690 దరఖాస్తులు వచ్చాయని 1269విచారణ పూరయ్యాని, చిరునామా మార్పు కోసం 1908 దరఖాస్తులు రాగా, 1625 విచారణ పూర్తి అయ్యాయన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా తయారుకు రిటర్నింగ్ అధికారి ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఎజెంట్లను నియమించి జాబితా అందచేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, రెండు ఓట్లున్న ఓటర్లను తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల ద్వారా సరైన ఓటరు వివరాలను అందించేందుకు ముందుకు రావాలని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, డిటీ బాల్ రాజ్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అఖిల ప్రసన్న, రాణి దేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి, వినోద్, సలీం, వెంకట్రాంరెడ్డి, అశోక్, అజయ్, వెౌకటేశ్, తాహిర్ పాషా తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ మండలంలోని దంతెన్పల్లిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. అలాగే కోస్గిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ చర్చించారు. 22 మంది వేసిన రిట్ పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల కు పరిష్కారం చూపాలన్నారు. భూసేకరణ పనులు, కోస్గి రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 94400 46567
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మితో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం ఇవీ కేంద్రాలు.. 1. ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్ 2. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం 3. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట 4. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగుళూరు 5. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్ 6. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ 7. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. రేపటి వరకు అవకాశం.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. దరఖాస్తు విధానం.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. -
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కరిద్దాం
నారాయణపేట: జిల్లాలో మే 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో జడ్జి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మార్చి 8న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 9825 కేసులు పరిష్కరించి జిల్లా రాష్ట్రంలోనే 13వ ర్యాంకు స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషిచేసిన పోలీసులు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లను అభినందించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండాలోని అంశాలను నాన్ బెయిల్ వారెంట్ కేసులను, చార్జిషీట్, ఎన్ఐ యాక్ట్ పెండింగ్లో ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా అధిక కేసులని పరిష్కరించేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో సినియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జుడ్గే ఫరహీన్ బేగం కోస్గి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్ కుమార్, బాలప్ప, ఆర్డీవో ఆఫీసర్, డిఫెన్స్ కౌన్సిల్స్ కె లక్ష్మి పతి గౌడ్, నాగేశ్వరి, మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జొన్నలు క్వింటాల్ రూ.4,800 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జొన్నలు క్వింటాలుకు గరిష్టంగా రూ.4,800, కనిష్టంగా రూ.3,050 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,857, వేరుశనగ గరిష్టం, కనిష్టంగా రూ.4,350, అలసందలు గరిష్టం రూ.7,219, కనిష్టం రూ.7,106, ఎర్ర కందులు గరిష్టం రూ.7,416, కనిష్టంగా రూ.6,609 ధరలు పలికాయి. వేరుశనగ @ రూ.6,691 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శక్రవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,691, కనిష్టంగా రూ.5,611 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,935, కనిష్టంగా రూ.5,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,291, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,011, కనిష్టంగా రూ.3,817 ధరలు పలికాయి. -
పరీక్ష కేంద్రాల వద్ద144 సెక్షన్ అమలు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – యోగేష్ గౌతమ్, ఎస్పీ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి ఐడీ కార్డులు ఇచ్చాం. ఐడీ కార్డు లేని వారికి పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు. విద్యార్థులు ఓఎమ్మార్ షీట్ నింపడంలో ఏవైనా పొరపాటు జరిగితే ఇన్విజిలేటర్లను సంప్రదించాలి. గైర్హాజరైన విద్యార్థుల హాల్టికెట్ నంబర్లను ఇన్విజిలేటర్లు సరిచూసుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – గోవిందరాజులు, డీఈఓ ● -
ఆయిల్పాం తోటల సాగుతో అధిక లాభాలు
తాడూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లో భాగమైన ఆయిల్పాం తోటలతోపాటు వివిధ రకాల పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవన శాఖ ఆయిల్పాం తోటల సలహాదారు, శాస్త్రవేత్త బీఎన్ రావు అన్నారు. గురువారం మండలంలోని మేడిపూర్లో రైతు వెంకట్రెడ్డి సాగు చేసిన ఆయిల్పాం తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులకు సూచనలు,సలహాలు ఇచ్చారు. అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రధానంగా వేసవిలో లేత ఆయిల్పాం తోటల్లో నీరు, ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు. బిందు సేద్యం ద్వారా నీటితోపాటు ఎరువులను అందించాలని సూచించారు. సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పాం తోటలను సాగుచేయాలన్నారు. మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలుగా కూరగాయలు, బొప్పాయి, అరటి, పప్పుధాన్యలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయవచ్చన్నారు. 2020– 21 సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్న ఆయిల్పాం తోటల దిగుబడులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దశలో తీసుకోవాల్సిన పురుగుల యాజమాన్యం, ఎరువుల మోతాదు, ఆడ, మగ పూల గుత్తులను తొలగించే విధానం రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 94400 46567
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మితో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
నారాయణపేట/కోస్గి రూరల్: నేరాలను నియంత్రించడంతో పాటు, నిందితులను గుర్తించడంలోనూ సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం కోస్గి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కమ్యూనిటీ వైర్లెస్ సీసీ కెమెరాలను కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఈ సీసీకెమెరాలను జిల్లాతోపాటు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశామని, అసాంఘిక కార్యక్రమాలు, నేరాల నియంత్రణతోపాటు శాంతి భద్రతలు కాపాడవచ్చాన్నారు. రోడ్డు ప్రమాదాలు , దోంగతనాలు తదితర సంఘటనలో సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, కడా చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, సిఐ సైదులుతోపాటు రఘువర్దన్రెడ్డి, సీసీ కెమెరాల దాత ప్రదీప్ పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిస్తాయని, పోలీసులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఆడాలని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం సాయంత్రం జిల్లా పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటుచేయగా..ఎస్పీ ప్రారంభించారు. -
అట్టడుగున నాలుగు జిల్లాలు
నారాయణపేటశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు IIలో uసాక్షి, నాగర్కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్నగర్లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్గా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్లాస్టిక్ ఫ్రీగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా కొనసాగుతోంది. వన్యప్రాణులు, అటవీప్రాంత సంరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించగలిగారు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారి వెంబడి సేకరించిన మొత్తం 34 వేల కేజీల ప్లాస్టిక్ను తుక్కుగూడలో రీసైక్లింగ్ ప్రాసెస్ను నిర్వహించారు. అలాగే 16 మంది స్థానిక చెంచు మహిళల ఆధ్వర్యంలో పర్యావరణ హిత బ్యాగ్లు, ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
దామరగిద్ద: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలించి నిల్వ ఉన్న మందులు, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిష్టర్లను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కుటుంబ తగాదాలతో చెవికి గాయమై చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వివాహిత మహిళతో కలెక్టర్ మాట్లాడి బాధిత మహిళకు న్యాయ సహాయం చేయాలని అక్కడే ఉన్న సఖి కేంద్రం నిర్వాహకురాలికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, తహాసీల్దార్ జలీల్, ఎంపీడీఓ సాయిలక్ష్మి, వైద్యురాలు సిబ్బంది పాల్గొన్నారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు నిర్దేశించిన లక్ష్యాన్ని గుడువు లోగా పూర్తి చేయడంతో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ పూర్తిగా విఫలమయ్యాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్ బ్యాంక్ లింకేజీలో వంద శాతం టార్గెట్ను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, మండలంలో 94 శాతం పెండింగ్ ఉండటంతో ఏఈపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాది హామీ పథకంలో కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి పొందేలా చూడాలని, కొన్ని గ్రామాల్లో కేవలం పది మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నారని అన్నారు. ఎంపీడీఓగా మండలంలో ఏం చేస్తున్నారని ఎంపీడీఓ సాయిలక్ష్మిని నిలదీశారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశాని హాజరు కాని టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఆర్డీఓ అంజయ్య, డీపీఎం జయన్న, ఏపీఎం నర్సిములు తహసీల్దార్ జలీల్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ సైన్స్ వేదికకు శివారెడ్డి ఎంపిక నారాయణపేట: జపాన్ ప్రభుత్వం నిర్వహించే సకురా సైన్స్ ఉన్నత పాఠశాల ప్రోగ్రాంకు దేశం నుంచి 54 మంది విద్యార్థుల ఆవిష్కరణలు ఎంపిక కాగా.. అందులో జిల్లాలోని దామరగిద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి శివారెడ్డి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అభినందించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో విద్యార్థి ఏ.శివారెడ్డి, గైడ్ టీచర్ జరీనా, ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులును కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరులా సన్మానించారు. విద్యార్థుల వినూత్నఆలోచనలను ప్రోత్సహించాలి విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టేలా వినూత్న ప్రయోగాలు, వారి అభిరుచికి తగినట్లు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అటల్ కింకరింగ్ ల్యాబ్ను ఆమె పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
సమయపాలన పాటించకపోతే ఎలా..?
మాగనూర్: పాఠశాల విధులకు ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోతే ఎలా అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. గురువారం మండలంలోని కేజీబీవీని ఉదయాన్నే ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సమయం దాటిపోయినా ఉపాధ్యాయులతో పాటు ఎస్ఓ రాధిక పాఠశాలకు రాకపోవడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాను వచ్చిన తర్వాత కూడా రాకపోవడం ఏమిటిని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణ కొరవడిందని పీఈటీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విషయాలను ఒక నోట్బుక్లో రాసిపెట్టాలని సిబ్బందికి సూచించారు. వారంలోగా మళ్లీ పాఠశాల తనిఖీకి వస్తానని, ఈ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, మూత్రశాలలలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కేజీబీవీ ఎస్ఓ, ఉపాధ్యాయులపైఎమ్మెల్యే ఆగ్రహం -
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
నారాయణపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం మొత్తం 3,803 మంది విద్యార్థులకుగాను 3724 మంది పరీక్షలకు హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. అలాగే, జనరల్ విద్యార్థులు 3,335 మందికిగాను 3,277 మంది, ఒకేషనల్లో 468 మందికిగాను 447 మంది హాజరయ్యారు. బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ బీసీ సహకార ఆర్థికసంస్థ ఆధ్వర్యంలో జిల్లా లోని బీసీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 38 రోజులు శిక్షణ ఉంటుందని, ఉచిత భోజనంతో పాటు వసతి కల్పించనున్న ట్లు పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 8వ తరగతి పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు కలెక్టరేట్లోని రెండవ అంతస్తులోని రూం నంబర్ 205 బీసీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఇతర వివరాలను బీసీ అభివృద్ధి శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ డీడీ బాబు గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. చేనేత, డిజైనింగ్ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పోచంపల్లి, గద్వాల చీరలు, నారాయణపేట చీరలు, డర్రీస్, జనరల్ వైరెటీస్ రంగాల్లో నైపుణ్యం ఉండాలని సూచించారు. వీవింగ్ కేటగిరి, డిజైనింగ్ కేటగిరిలో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ డీడీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు
పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. -
నల్లమల పర్యాటకంపై దృష్టి..
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. -
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
నారాయణపేట రూరల్: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కేంద్రాలకు చేరుకోవాలని.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలపాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. ఈ నెల 21నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని.. గత పరీక్షలతో పోలిస్తే ఈ సారి కొంత మార్పులు జరిగాయని.. జీపీఏ బదులు మార్కులు ప్రకటించే అవకాశం ఉందని.. పరీక్ష నిర్వహణలో సైతం ఓఎంఆర్ షీట్తో పాటు సమాధాన పత్రానికి బదులు 24 పేజీల బుక్లెట్ అందుబాటులోకి తీసుకురానున్నారని వివరించారు. ఇక పరీక్ష కేంద్రాల ఎంపిక, అవసరమైన సౌకర్యాలు, పరీక్ష పత్రాలు చేర్చడం తదితర అంశాలపై బుధవారం డీఈఓ గోవిందరాజు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతి ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. భౌతిక, జీవశాస్త్రం పేపర్ గంటన్నర మాత్రమే ఉంటుంది. పరీక్ష హాల్లోకి గంట ముందే విద్యార్థులను అనుమతిస్తాం. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షకు ముందే విద్యార్థుల సమాచారం ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు. గతంలో 11 పరీక్షలు ఉండేవి. ఈ సారి కేవలం ఏడు పరీక్షలు మాత్రమే ఉండనున్నాయి. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా శిక్షణ ఇచ్చాం.. ఈ పరీక్షల నిర్వహణ ప్రతీ టీచర్కు సవాల్గా మారింది. పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సిలబస్ పూర్తి అయిన వెంటనే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతో పాటు రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్, ఫ్రీ ఫైనల్ పరీక్షలను రాయించి తప్పులను సరిచేసుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. వందశాతం ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు (జీపీఏ) సాధనకు కృషిచేస్తున్నాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసి వారి స్థాయికి తగ్గట్లు విషయ పరిజ్ఞానాన్ని అందించాం. చివరగా విద్యార్థులు ఇప్పటి వరకు చదివిన అంశాలనే నివృత్తి చేసుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఒక రోజు ముందుగానే వచ్చి చూసుకోవడం మంచిది. పరీక్షకు వచ్చే ముందు అల్పాహారం తీసుకోవాలి. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఇవ్వకుంటే చర్యలు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్’ అనే వెబ్సైట్ ద్వారా తమ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెచ్ఎం సంతకం లేకుండానే పరీక్షకు నేరుగా హాజరు కావచ్చు. విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబందించి ఏమైన ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియచేయాలనుకుంటే సెల్ నం.9502051806 కు సమాచారం ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము. పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు జిల్లాలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు హాల్టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ గోవిందరాజులు -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజల భద్రతపై భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసులు పెండింగ్లో లేకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ నూతన సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలనిఅన్నారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, సిఐ లు శివ శంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్, రమేష్, రాము, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, కృష్ణం రాజు, సునిత పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలోని మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ జ్యోతి అధికారులను అదేశించారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామాల్లో వేసివిలో నీటి ఎద్దడి తదితర ఆంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా చూడాలని అధికారులకు అదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై పూర్తి అవగాహన కల్పించి నిర్మాణం ఎంత వరకు జరిగితే అంత బిల్లులు వస్తాయని వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాంచందర్, ఎంపీడీఓ నర్సింహారెడ్డి, కృష్ణరావ్, ఎంపీఓ రామన్న, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నల్లకుసుమలు క్వింటాల్ రూ.4,109 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి. మెనూ అమలు తప్పనిసరి దామరగిద్ద: గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలోని భవనంలో కొససాగుతున్న దామరగిద్ద ఎస్సీ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సమక్షంలో విద్యార్థుల సంఖ్య, మెస్ రిజిస్టర్లు, భోజన వసతిని పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారని ఆరా తీస్తూ స్టడీ అవర్స్ను పరిశీలించారు. పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు 549 మంది విద్యార్థులు ఉంటున్నారని ప్రిన్సిపల్ వివరించారు. అయితే, మెయిన్గేట్, హెడ్లైట్ లేకపోవడంతోపాటు గదుల కొరత పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ను విద్యార్థులు కోరారు. -
మనోధైర్యంతో ముందుకు సాగాలి
నారాయణపేట: దివ్యాంగ విద్యార్థులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని వారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తాయని.. వారిలో గల సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి వెలికి తీస్తే వారు చాలా ప్రతిభా వంతులుగా మారుతారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలిమ్ కో) సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలని అన్నారు. భవిత సెంటర్లలో వారానికి ఒకసారి ఫిజియోథెరపీ సేవలు అందిస్తారని దీనిని దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు. మనోధైర్యంతో వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాలలో స్థిరపడ్డారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఓపిక, సహనంతో పెంచి పెద్ద చేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వారికి వచ్చేటటువంటి ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందేలా తగు చర్యలు తీసుకొని వారిని సరిగ్గా పోషించాలని సూచించారు. వినికిడి యంత్రాలు, వీలైచైర్స్ గత ఆగస్టు 24న నిర్వహించిన అసెస్మెంట్ క్యాంపులో నుండి 85 మంది విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలకు కొలతలు తీసుకుని రూ.లక్షల విలువైన ఉపకరణాలను కలెక్టర్ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగిందని సీఎం ఓ రాజేందర్ తెలిపారు. కాలిపర్స్, వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, సిపి చైర్స్, ఎంఆర్ కిట్స్ మరియు రొలేటర్స్ దివ్యాంగులకు అందించారు. అనంతరం డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో చదివే విద్యార్థులకు ఎన్టైటిల్మెంట్స్ స్టైఫండ్ ఎస్కార్ట్ అలవెన్సు రీడర్ అలవెన్న్స్ ఇస్తున్నామని, భవిత సెంటర్లలో ఫిజియోథెరపీ క్యాంపు, స్పీచ్ థెరపీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, విద్యా శాఖ అధికారి నాగార్జునరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, అలీంకో సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు శిక్షణ తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నారాయణపేట: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో హౌసింగ్, డీఆర్డీఓ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీఓ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. వాటి గ్రౌండింగ్ వివరాలపై కలెక్టర్ ఆరా తీయగా.. ఇప్పటి వరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలుపెట్టి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ సమీక్షిస్తూ.. మహిళా సంఘాల సభ్యులకు సోలార్ పవర్ ప్లాంట్లు, బస్సులు, న్యూ ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల మంజూరు వివరాలను డీఆర్డీఓ మొగులప్పతో తెలుసుకున్నారు. అయితే బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే జిల్లా ర్యాంకు 32వ స్థానంలో ఉండటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఏపీఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. అదే విధంగా 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు స్కూల్ యూనిఫాం కుట్టే ప్రక్రియపై కలెక్టర్ చర్చించారు. 2024–25లో జరిగిన పొరపాట్లు, లోటుపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. డీఆర్డీఓ, విద్యాశాఖ అధికారు లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు గడువులోగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వివరాలను ఈఈ హీర్యానాయక్తో కలెక్టర్ తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, బాబుజీ జాతర, ఆస్తిపన్ను వసూలు, ఎల్ఆర్ఎస్, ఈజీఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్ఓ డా.సౌభాగ్యలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు, జీసీడీఓ నర్మద, డీపీఓ సుధాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ ఉన్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఏఐకేఎస్ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో భూ సంరక్షణ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం న్యాయబద్ధంగా రైతుల నుంచి భూములు సేకరించకుండా.. పోలీసులను పెట్టి భూ సేకరణ చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, సొంత జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించి భూమికి బదులు భూమి ఇవ్వాలని.. లేదా బహిరంగ మార్కెట్ రేటుకు మూడింతలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటామని తెలిపారు. సదస్సులో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్ కుమార్, రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, గోపాల్, అంజిలయ్య, మశ్చందర్, రాజు, కేశవ్గౌడు, నారాయణ, సాయికుమార్, నర్సింహులుగౌడ్, లక్ష్మీకాంత్, అరుణ్ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 92మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్/కోస్గి రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,997 మంది విద్యార్థులకు గాను 3,905 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,447 మందికి గాను 3,375 మంది, ఒకేషనల్ విభాగంలో 550 మందికి గాను 530 మంది హాజరై పరీక్షలు రాయగా.. 92 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ సుదర్శన్రావు తెలిపారు. ● జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలతో పాటు కోస్గి ప్రభుత్వ కళాశాల, ప్రజ్ఞ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను డీఐఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరీశీలించారు. డీఐఈఓ వెంట పరీక్షల విభాగం అదికారులు ప్రతాప్రెడ్డి, పరశురాం, పరేష్, ఈశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బెట్టింగ్లకు దూరంగా ఉండాలి : ఎస్పీ
నారాయణపేట: యువత బెట్టింగ్, గేమ్ యాప్లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడినా, ఆన్లైన్లో గేమ్స్ ఆడినా, ఎవరైనా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో చాలా మంది అవగాహన లోపంతో అక్రమ యాప్లతో మోసపోతున్నారని తెలిపారు. మోసపూరిత ప్రకటనలను నమ్మి ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టడం, గ్రేమ్స్ ఆడటంవల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్లు చాలా ప్రమాదకరమైనవని.. వీటిలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫార్మర్లు వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో వ్యసనం పెరుగుతుందన్నారు. వీటి కట్టడికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు, యువత అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి కార్యకలాపాలపై డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దరఖాస్తు చేసుకోండి నారాయణపేట ఎడ్యుకేషన్: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఖాజా బహ్రుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి కృష్ణా: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మండలంలోని ముడుమాల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముడుమాల్ గ్రామంలోని నిలువురాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయో.. అదే విధంగా పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ నిజాముద్దీన్, కాంప్లెక్స్ హెచ్ఎం గణేశ్సింగ్, ఏఎంఓ విద్యాసాగర్, రిటైర్డ్ జీహెచ్ఎం రాఘవేంద్రరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికతనుఅలవర్చుకోవాలి మాగనూర్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని నేరడగంలో శ్రీపశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల విరక్తమఠం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామి వారిని ఎంపీ దర్శించుకున్నారు. మఠం ఆవరణలో మహిళలకు ఒడినింపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభించడంతో పాటు అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. మఠం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అలసందలు @ రూ.7,156 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్ గరిష్టంగా రూ. 7,156, కనిష్టంగా రూ. 7,073 ధరలు వచ్చాయి. పెసర గరిష్టంగా రూ. 7,620, కనిష్టంగా రూ. 7,440, వేరుశనగ గరిష్టంగా రూ. 5,200, కనిష్టంగా రూ. 4,524, జొన్నలు గరిష్టంగా రూ. 4,705, కనిష్టంగా రూ. 2,816, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,263, కనిష్టంగా రూ.6వేలు, తెల్లకందులు రూ. 7,411 ధరలు వచ్చాయి. -
స్వయం ఉపాధికి ఊతం
నర్వ: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీపై అందించే రుణాల కోసం నిరుద్యోగ యువత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరు ప్రక్రియ అటకెక్కడంతో యువతీ యువకులకు స్వయం ఉపాధి కరువైంది. కొందరికి ప్రైవేటు ఉద్యోగాలు సైతం లేక తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్థిక స్వాలంబన దిశగా.. నిరుద్యోగ యువత ఆర్థిక స్వాలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు రాయితీపై రుణాలు అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మంజూరు చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభమైంది. అర్హులైన యువత https///tgobmmsnew.cgg. gov.in పోర్టల్లో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్జీదారులు తమ యూనిట్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలి. సంబంధిత కార్పొరేషన్తో పాటు కలెక్టర్ పర్యవేక్షణలో మండలస్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తారు. అర్హుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2017–18 నుంచి జిల్లాలో ఇలా.. ● జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరం బీసీ కార్పొరేషన్ రుణాల కోసం యువత దరఖాస్తు చేసుకోగా.. రూ. 50వేల సబ్సిడీ ఉన్న పథకాలను మాత్రమే అధికారులు గ్రౌండింగ్ చేశారు. రూ.లక్ష, రూ. 2లక్షల రుణాలను మంజూరు చేయలేదు. 2018–19, 2019– 20, 2020–21లో ఒక దరఖాస్తుదారుడికి కూడా పైసా రుణం అందలేదు. ● 2017–18లో సబ్సిడీ రుణాల కోసం ఎస్టీ నిరుద్యోగ యువత 584 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 543 మందికి రుణాలు మంజూరయ్యాయి. మొత్తం 96.91 శాతం అచీవ్మెంట్ సాధించారు. ఇదే ఏడాది గిరిజనల కోసం రూ. 440లక్షలు మంజూరు కాగా.. ఇందులో 220 మందికి రూ.407.50 లక్షలు అందాయి. 92.61 శాతం అచీవ్మెంట్ సాధించారు. 2018–19, 2019–20 సంవత్సరాల్లో ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో 697 మందికి రూ. 927.28 లక్షలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం మండలాల వారీగా అర్హుల నుంచి అకౌంట్లు సేకరించారు. ● జిల్లాలో మైనార్టీ యువత పరిస్థితి దారుణంగా ఉంది. కార్పొరేషన్ పరిధిలో వారికి ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు మంజూరు కాలేదు. పేరుకే కార్పొరేషన్ ఉందని.. ఎలాంటి రుణాలు అందవని మైనార్టీ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై టైరు పంక్చర్ దుకాణాలు, పండ్ల దుకాణాలు, పాన్ డబ్బాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పథకం ద్వారా ప్రయోజనాలు.. ఒక్కో లబ్ధిదారుకు రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 3లక్షల వరకు ఆర్థికసాయం అందించనున్నారు. రూ.లక్షకు 80శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మిగతా 20 శాతం బ్యాంకు ద్వారా రుణం అందజేస్తారు. రూ. 2లక్షలకు 70 శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు రుణం మంజూరు చేస్తారు. రూ. 3లక్షలకు 50 శాతం బ్యాంకు రుణం అందించనున్నారు. ఈ ఆర్థికసాయంతో చిరువ్యాపారాలు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. రుణాల మంజూరులో జాప్యం గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరులో జాప్యం జరగడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురయ్యారు. అయితే వరుస ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాల మంజూరు ఉంటుందనుకున్నారు. అయితే ముందస్తు ఎన్నికల తర్వాత పంచాయతీ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్, మున్సిపోల్స్ ఇలా వరుస ఎన్నికలతో అర్థాంతరంగా రుణాలకు బ్రేక్ పడింది. ఇలా అన్ని ఎన్నికలు పూర్తయినా నేటికీ ఎలాంటి రుణాలు మంజూరు కాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘రాజీవ్ యువ వికాసం’తో సబ్సిడీపై రుణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు అవకాశం కొన్నేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అర్హుల ఎంపిక విధానంపై స్పష్టత కరువు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు జారీ కాలేదు. ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రం ప్రారంభమయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అర్హులైన వారికి రుణాల మంజూరు ఉంటుంది. – అబ్దుల్ ఖలీల్, జిల్లా బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు ● గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం ● తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. ● పెండింగ్ పనులు పూర్తయితేనేపాలమూరు సస్యశ్యామలం ● నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈసారైనా పరుగులు పెట్టేనా? ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ● కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. ● రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు దశాబ్దాలుగా.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2005 లో చేపట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.231.36 కోట్లు అవసరం. వీటిని విడుదల చేస్తే రెండేళ్లలో పెండింగ్ పనులు పూర్తయ్యి నడిగడ్డలో కొత్తగా 58 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ర్యాలంపాడుకు మరమ్మతు.. నెట్టెంపాడు ప్రాజెక్టులో గుండెకాయగా చెప్పుకొనే ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో 4 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి. దీని మరమ్మతుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేసి సుమారు రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. దీని మరమ్మతుకు అవసరమైన నిధుల కేటాయింపుపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. ● రెండేళ్ల కిందట రూ.581 కోట్లతో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కింద కేటీదొడ్డి, గట్టు మండలాల్లో కొత్తగా 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 40 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.285.19 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ● ఆర్డీఎస్ ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసి 87,500 ఎకరాలకు అందించేలా రూ.1,197.77 కోట్లతో ఎనిమిదేళ్ల కింద తుమ్మిళ్ల లిఫ్టు చేపట్టారు. ఇందులో రూ.629.26 కోట్ల పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ది అదే దారి.. కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. సంగంబండ సైతం.. 2003లో మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ దగ్గర కాల్వ పనులు ప్రారంభించారు. 2004లో జలయజ్ఞం భీమా ఫేజ్–1, ఫేజ్–2లకు జీఓ నం.166 విడుదల చేయగా రూ.1,426 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కాల్వల పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో.. 2017లో మళ్లీ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల కింద పనులు దాదాపు 90 శాతం పూర్తి చేశారు. అయితే పొలాలకు సాగునీరందించేందుకు పిల్ల కాల్వలు పూర్తి కాకపోవడంతో మెయిన్ కెనాళ్ల ద్వారా చెరువులు నింపుతున్నారు. -
తల్లిదండ్రులు దైవంతో సమానం
మద్దూరు: సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదని, వారిని పూజిస్తే దేవుడిని పూజించినట్లే అని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని పెదిరిపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పూజించే పాదపూజ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ బెన్షాలం, ట్రైనీ కలెక్టర్ గరిమానరులు, డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువతో కూడిన విద్యతో పాటు, ఇలాంటి సామాజిక సృమ ఉన్న కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. నేటి తరం యువతలో తల్లిదండ్రులను చులకనగా చూసే భావన పెరిగిపోయిందని, దాన్ని నివారించడానికే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల హెచ్ఎం బాలకిష్టప్ప తెలిపారు. ఉన్నత పాఠశాల దశకు వచ్చే వరకు విద్యార్థులు తల్లీదండ్రుల మాటలను పట్టించుకోకపోవడం, మేము పెద్దవాళ్లమనే భావన ఏర్పడుతుందని, దీన్ని నివారించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాలలోని 247 విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులచే పాదపూజ కార్యక్రమాన్ని యోగా గురువు రమేష్, గాయాకుడు చింతరంజన్దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లీదండ్రుల పాదాలకు అభిషేకం, పూలమాలతో అలంకరించి శాస్త్రోతంగా పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అహుతులను అలరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, శబరి, స్వప్న, రవీందర్రెడ్డి, రవీందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
మాగనూర్: వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ.. అంగరంగ వైభవంగా పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల రథోత్సవం సాగింది. మండలంలోని నేరడగంలో సోమవారం ఉదయం నుంచి మఠంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలలో ప్రధాన ఘటమైన స్వామివారి రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. మఠంలో ప్రత్యేక పూజలు ఆనంతరం సిద్ధలింగ మహాస్వాముల వారి విగ్రహాన్ని పురోహితుల వేదమంత్రాలు.. భక్తుల శరణుఘోష.. కాగడాల నడుమ రథంపై ఉంచారు. అనంతరం తేరును ముందుకు లాగారు. ఘనంగా సామూహిక వివహాలు.. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం మఠం ఆవరణలో సామూహిక వివాహాలు నిర్వహించారు. మొత్తం 14 జంటలకు వివాహాలు జరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు. నేరడగంలో రథాన్ని ముందుకు లాగుతున్న భక్తులు పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాములకు ప్రత్యేక పూజలు నేరడగంలో కనులపండుగగా సామూహిక వివాహాలు -
చిల్డ్రన్ హోం తనిఖీ
నారాయణపేట: పట్టణంలోని బారంబావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్ హోంను సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. హాజరు పట్టిక, వసతులను పరిశీలించడంతోపాటు హోంలో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ డైలీ వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ పనితీరు, సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అనేదానిపై వివరాలు సేకరించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత వాళ్లలా వారిని చూసుకోవాలని సిబ్బందిని జడ్జి ఆదేశించారు. భగత్సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలి నారాయణపేట ఎడ్యుకేషన్: దేశాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థకు, మతోన్మాదం, కులతత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యు వతరం, ప్రజలు భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా భగత్సింగ్ వర్ధంతి సభలను నిర్వహించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో భగత్సింగ్ 94వ వర్ధంతి వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. భారత ఉపఖండంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటీష్ సామ్రాజ్యవాద చేతిలో ఉరి తీయబడి దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణ పాయంగా వదిలేశారన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చూస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ ఉపాధ్యక్షుడు సలీం, మారుతి, గౌస్, శ్రీకాంత్, రాము, విష్ణు, గణేశ్, రాహుల్, మహేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 30 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, బెంషాలం, ఆర్డీఓ రాంచంద పాల్గొన్నారు పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా సీఐలు, ఎస్ఐలకు ఫోన్లో సూచించారు. ఒకవేళ ఫిర్యాదు పెండింగ్లో ఉంటే వాటికి సంబంధించిన సమాచారం ఫిర్యాదు దారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. -
రోడ్డుపై వదిలేస్తున్నారు
మక్తల్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం దుర్గందభరితంగా మారుతున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పైన చెత్త అలాగే వదిలేసి వెళ్తున్నారు. వెంటనే చెత్తను తొలగించాలి. – నాగప్ప, మక్తల్ దుర్వాసన భరించలేకున్నాం.. పట్టణంలో సేకరించిన చెత్తను మా పొలంల గుండా తీసుకెళ్లి ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడంతో చెత్త కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వస్తోంది. పొలాలకు వెళ్లాలంటేనే వాసనకు భరించలేక పోతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డు నిర్మించి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. – నర్సిములు, సమీప పొలం రైతు, కోస్గి ● -
కొరవడిన చెత్త‘శుద్ధి’
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఉన్నా చెత్తపై చిత్తశుద్ధి అంతంతగానే కనిపిస్తోంది. కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ప్రతి పల్లె, పట్టణాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి వాహనాల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నప్పటికీ మున్సిపాలిటీల్లో మాత్రం నేటికి డంపింగ్ యార్డులు లేకపోవడంతో పట్టణ శివార్లలో పాడుబడ్డ బావులు, ప్రధాన రోడ్ల వెంట చెత్తను వేస్తున్నారు. దీంతో చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో చెత్త సేకరణ చేపడుతున్నప్పటికీ ఆటోలో తడి,పొడి చెత్తను వేర్వేరు వేయాలని రాసి పెట్టారు. కానీ జనం తడి,పొడి చెత్తను ఒకే దానిలో వేస్తుండడం, నేరుగా ఆటోలో తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసేందుకు అక్కడి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. వీలిన గ్రామాలు చెత్తమయం మక్తల్ మున్సిపాలిటీలో తిర్మలాపూర్, చందాపూర్ విలీనమయ్యాయి. మక్తల్ పట్టణంలో సేకరించిన చెత్తను నగర శివారులోని కానాపూర్కు వెళ్లే రహదారిలో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. తిర్మలాపూర్, చందపూర్లో సేకరించిన చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. వీలిన గ్రామాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల జనం వాపోతున్నారు. మద్దూర్, కోస్గిలో కానరానిసేంద్రియ ఎరువుల తయారీ పేట, మక్తల్లో తడి, పొడి చెత్త వేర్వేరు చేసేందుకు నానా అవస్థలు దుర్గందభరింతగా డంపింగ్ యార్డులు పట్టించుకోని అధికారులు, సిబ్బంది -
చెత్త కాల్చేస్తున్నారు..
కోస్గి పట్టణంతో పాటు వీలిన గ్రామాలైన పోతిరెడ్డిపల్లి, సంపల్లి, మల్రెడ్డిపల్లి, మాసాయపల్లి నుంచి రోజూ చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డు కోసం పట్టణ శివారులో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి రూ.40 లక్షల నిధులు సైతం కేటాయించారు. ఈమేరకు టెండర్లు వేసి నెలలు గడుస్తున్నా నేటికి డంపింగ్ యార్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. అదే స్థలంలో రోజు చెత్తను డంపింగ్ చేస్తున్నారు. వారం పది రోజులకు ఒకసారి చెత్తకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగతోపాటు చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని జనం వాపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డి డంపింగ్ యార్డుపై దృష్టి సారించి రాష్ట్రంలోనే నంబర్ వన్ డంపింగ్యార్డును నిర్మించి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
సేకరణలో నిర్లక్ష్యం
మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ రోజు విడిచి రోజు చేస్తున్నారు. ఒక ట్రాక్టరు ఒక మినీ ఆటో ద్వారా చెత్త సేకరణ చేస్తూ డంపింగ్ యార్డు స్థలానికి చేర్చుతున్నారు. రేణివట్లలో ఒక ట్రాక్టర్ ద్వారా ప్రధాన రహదారి వెంబడి చెత్తను సేకరిస్తూ చెత్తను కాలుస్తున్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడం గగనం అయిపోయింది. మద్దూర్లోని ఎస్సీ బాలుర హాస్టల్ దగ్గర రోడ్డుపైనే చెత్తను వేస్తున్నారు. కాపు గేరి, అమరగడ్డ, మీదిగిరి తదితర ప్రాంతాల్లో చెత్త తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్కులకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 (ఎస్సీ 2, ఎస్టీ 2, బీసీ 5, ఓసీ 1) సీట్లు కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపా టు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళా శాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుదాం..
మక్తల్/మాగనూరు/ఊట్కూర్: మక్తల్ నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు.. ఊట్కూర్ పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా.. నేరడగంలో పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం సమీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మంత్రి మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్ మండలాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు. ముందుగా జక్లేర్ గ్రామంలోని పురాతనమైన శివాలయాన్ని సందర్శించారు. శివరాత్రి సమయంలో శివస్వాములు మాలధారణ, సేద తీరేందుకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మంత్రి అన్నారు. ● మాగనూర్ మండలంలోని నేరడగం శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం బ్రహ్మోత్సవాల్లో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. సిద్ధలింగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అడుగంటిపోతున్న విలువలను పునరుద్ధరించడానికి ఈ మఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం వీటి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. రూ.50 లక్షలు అన్నదాన కార్యక్రమానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నిరంతరం నీరు ఉండే ఈ సంగంబండ ప్రాజెక్టుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో శ్రీమన్ మహారాజా నిరంజన జగద్గురు ఫకిర దింగాలెస్వర మహాస్వాములు, బిజ్వార్ ఆదిత్య పరాశ్రీ, నియోజక వర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గురుమిట్కల్ ఎంఎల్ఏ కందుకూరు శరణ్గౌడా, పంచమ సిద్ధలింగ మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. ● ఊట్కూరు మండలంలోని పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వక ఆలయాన్ని మంత్రి, ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పులిమామిడి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందించారు. -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
నారాయణపేట: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీష్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం తగ్గలేదని, దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి మద్దతుగా వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. స్పీకర్కు క్షమాపణ చెప్పాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ మాజీ మంత్రిని, బీఆర్ఎస్ నాయకులను తిరగనియ్యకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కోట్ల మధుసూదన్రెడ్డి, మహేష్, సతీష్ గౌడ్, రమేష్,సూర్యకాంత్, రాజేష్, శరణప్ప, మహిముద్ ఖురేషి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడి అధిగమిస్తేనే విజయం
నారాయణపేటపదో తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల సూచనలు సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025● దస్తూరిపై దృష్టి పెడితే అదనపు మార్కులు ● పంచ సూత్రాలు పాటిస్తే.. ఆందోళన అక్కర్లేదు ● 21 నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం నారాయణపేట రూరల్: ఈనెల 21 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది. పంచ సూత్రాలు పాటిద్దాం ఉపాధ్యాయులు ఇలా చేయాలి.. విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి. విద్యార్థులతో చేయకూడనివి.. విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు. వైద్యులతో కౌన్సెలింగ్ పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి. ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి. దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి. అందమైన చేతి రాతతో.. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి. ఆటంకంగా నీటి ఊట ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్య లకు నీటి ఊట ఆటంకం మారుతోంది.వివరాలు 8లో u -
హక్కులపై అవగాహన ఉండాలి
నారాయణపేట: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పనిసరి అని, ఏదైనా ఒక వస్తువు కొని, ఆ వస్తువు నకిలీ లేదా నాసీరకం అయితే ఆ వస్తువుని అమ్మిన వ్యాపారి పై లేదా ఉత్పత్తిదారులపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు. డీఏఓ జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని అన్నారు. ఫోరం సభ్యుడు అశోక్, హజమ్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే వరకు అందరూ వినియోగదారులే అవుతారని, కల్తీ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బంగారం నుంచి మొదలుకొని పాలిథిన్ కవర్ వరకు ప్రతీ వస్తువుకు అది మంచిదా? లేక నకిలీదా అని తెలిపేందుకు హాల్ మార్క్, ఐఎస్ఐ లాంటి గుర్తులు ఉంటాయని, వాటిని చూసిన తర్వాతే మనం కొనుగోలు చేయాలని వారు సూచించారు. సమావేశంలో పలువురు ఫోరం సభ్యులు, రేషన్ డీలర్లు వినియోగదారుల హక్కుల చట్టం తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిని కలెక్టర్కు నివేదించడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల్రాజ్ తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి
నారాయణపేట రూరల్: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజు సూచించారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీచర్లు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నిర్వహణపై వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశలో టెన్త్ గేమ్ చేజర్ అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒత్తిడికి గురికాకుండా యోగ, ధ్యానం చేయాలన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ సరిపడా నిద్ర పోవాలన్నారు. సందేహాలను నివృత్తి చేసుకొని భయం లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను, ఇతర పరికరాలను కేంద్రంలోకి తీసుకొని వెళ్లరాదని సూచించారు. కార్యక్రమంలో హెచ్ ఎం భారతి, డీఎస్ఓ భాను ప్రకాష్, ఎండిఎం ఇంచార్జ్ యాదయ్య శెట్టి పాల్గొన్నారు.