Mulugu
-
రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి
గోవిందరావుపేట: ధాన్యం కొనుగోల్లలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆద్వర్యంలో మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. మండల పరిధిలో 20రోజుల నుంచి కురుస్తున్న వడగండ్ల వానలతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని బయటకు తీయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు తీవ్రంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో కొంతమంది రైతులు సన్నధాన్యం పండించగా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వివరించారు. ఈ కార్యక్రమంలో పొదిళ్ల చిట్బిబాబు, తీగల ఆదిరెడ్డి, గొంది రాజేశ్, గుండు రామస్వామి, అంబాల మురళి, సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్రెడ్డి -
‘ఇసుక క్వారీ నిర్వహణపై కలెక్టర్ స్పందించాలి’
మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట కొమురంభీం ఎస్టీ ఇసుక క్వారీ నిర్వహించకపోవడంపై కలెక్టర్ దివాకర తక్షణమే స్పందించాలని ఇసుక క్వారీ సొసైటీ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని రమణక్కపేట ఇసుక క్వారీ వద్ద సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మార్చి 28న రమణక్కపేట 2, గొల్లగూడెం ఇసుక క్వారీల నిర్వహణపై నిర్వహించాల్సిన పెసా గ్రామసభను కలెక్టర్ మౌఖిక ఆదేశాలతో నిలిపి వేయించి నెల రోజులు గడుస్తున్నా తిరిగి గ్రామసభను నిర్వహించకుండా పొంతన లేని కారణాలతో అడ్డు కుంటున్నాడని ఆరోపిస్తూ మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామసభ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని మల్లూరు, చుంచుపల్లి, కత్తిగూడెం గిరిజన సొసైటీ ఇసుక క్వారీలకు గ్రామసభలు నిర్వహించి నెల రోజులు గడుస్తున్నా తమ సొసైటీ క్వారీ నిర్వహణకు ఎందుకు గ్రామసభ నిర్వహించలేదనే విషయంపై కలెక్టర్ తక్షణమే వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. తమ గ్రామంలో గ్రామసభ నిర్వహించేందుకు భూభారతి, అకాల వర్షాలు, పంటనష్టం సర్వే వంటి తదితర కారణాలు చెబుతున్న కలెక్టర్కు కత్తిగూడెం ఇతర సొసైటీలకు గ్రామసభలు నిర్వహించినప్పుడు అవి అడ్డు రాలేదా అని ప్రశ్నించారు. పొంతనలేని సాకులు చెబుతూ ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా కొనసాగితే ఉపాధి కోల్పోయిన ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి పెసా గ్రామసభ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు నాగార్జున్, సందీప్, వసంతరావు, గుమ్మల వీరస్వామి, కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా టాపర్కు ఆర్థిక చేయూత
గోవిందరావుపేట: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచిన డి.కారుణ్యకి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణ అధికారి జయదేవ్ నగదు ప్రోత్సాహాకాన్ని ఆందజేశారు. మండల పరిధిలోని చల్వాయికి చెందిన కారుణ్య గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి జిల్లాలోనే 577మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులతో జిల్లా టాపర్గా నిలిచి జిల్లా పేరుని నిలబెట్టడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచినందుకు కారుణ్యకు శాలువా కప్పి ప్రోత్సాహకంగా రూ.10వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్లకీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
ములుగులో మోడల్ బస్టాండ్
ములుగు: జిల్లాకేంద్రంలో అత్యాధునిక హంగులతో మోడల్ బస్టాండ్ నిర్మాణం పనులు వచ్చే నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఈడీతో మాట్లాడి ప్రతినెలా చేపడుతున్న పనులపై నివేదిక ఇచ్చి పనుల్లో వేగం పెంచాలని సూచించామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో 32గుంటల స్థలంలో రూ.4.81 కోట్ల వ్యయంతో గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్గా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 1989లో నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క చెప్పగానే వెంటనే ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మోడల్ బస్టాండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మంగపేట మండలంలో రూ.50లక్షలతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయన్నారు. ఏటూరునాగారం డివిజన్లో చేపట్టనున్న బస్డిపో పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గట్టమ్మ ఆలయం సమీపంలోని గిరిజన యూనివర్సిటీ, సమీకృత కలెక్టరేట్ భవనం, వైద్య కళాశాలలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మినీ బస్టాండ్ నిర్మిస్తామన్నారు. కలెక్టర్ ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని తెలిపారని, అధికారులు నివేదిక అంచనా ఇస్తే రూ.45లక్షలతో పనులు చేపడతామన్నారు. బీసీలకు 42శాతం అమలుకు కృషి అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు కావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఇప్పటికే ములుగు మున్సిపాలిటీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందని వివరించారు. ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలో ఉన్న కారణంగా రవాణా పరంగా ఆర్టీసీ సేవలు అవసరం అని చెప్పడంతో సీఎం రేవంత్రెడ్డి అడిగినన్ని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి ప్రభాకర్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ ఆలయంలో పూజలు చేసిన మంత్రి పొన్నం ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ నుంచి పార్టీ కార్యకర్తలు భారీ బైక్ర్యాలీ నడుమ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలకు భారీ గజమాలతో సత్కరించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మహర్షీ భగీరథుడి జయంతిని ఉత్సవాల్లో సీతక్క పాల్గొన్నారు. అనంతరం దేవగిరిపట్నం గ్రామంలో బాలబ్రహ్మచారి కిషన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి, నందీశ్వర, ధ్వజస్తంభ, గణపతి, దక్షిణామూర్తి, సుబ్రమణ్యేశ్వర స్వాముల నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆలయాన్ని ఘనంగా ప్రారంభించిన కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు పొన్న ప్రభాకర్ హాజరై పలు సూచనలు చేశారు. లీలాగార్టెన్లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమ్మేళన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆర్టీసీ ఈడీ సల్మాన్రాజ్, డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, ఆర్డీఓ వెంకటేశ్, ఈఈ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్నచందర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తాం.. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
పేదల కోసమే సన్నబియ్యం పంపిణీ
భూపాలపల్లి రూరల్: పేదోడి కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని మహిళా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో ఆమె పర్యటించారు. పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్డుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతినగర్ కాలనీలో పేద దళితుల ఇంట్లో కాలనీవాసులతో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి మహిళలకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు -
‘గాలికుంటు’ నివారణే లక్ష్యం
34బృందాలు వైద్యాధికారులు పారా వెటర్నరీ సిబ్బంది గోపాల మిత్రలుములుగు రూరల్: గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత టీకాలను పంపిణీ చేస్తున్నాయి. పశువుల సంరక్షణకు ప్రభుత్వాలు ఏడాదికి రెండుసార్లు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తున్నాయి. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గాలికుంటు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పశువులకు వచ్చే వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగాల్లో గాలికుంటు వ్యాధి వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పది మండలాల్లో ఉచిత టీకా స్పెషల్ డ్రైవ్లో భాగంగా 34 బృందాలు ఏర్పాటు చేశారు. 1.08 లక్షల పశువులకు ఉచిత టీకాలు అందిచాల్సి ఉండగా ఇప్పటి వరకు 38,880 పశువులకు టీకాలు వేశారు. వ్యాధి లక్షణాలు.. గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకి గేదెలు, ఆవులు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో బక్కచిక్కి పోతాయి. పశువులకు రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం భారిన పడి నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలో వ్యాధి ముదిరిపోతుంది. పశువులు మేత, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నివారణకు చికిత్స ఇలా.. వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టలను పొటాషియం పర్మాంగనేట్ లేదా సైలెన్ వాటర్తో శుభ్రం చేయాలి. రెండోసారి వ్యాధి సోకకుండా యాంటీబయాటిక్ మందులను, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులను వాడాలి. గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకం కావడంతో అలసత్వం వహిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన పశువులకు.. గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో ఉంచకుండా వేరుగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం చేయాలి. వారానికి ఒక సారి కొట్టంలో సున్నం చల్లి క్రిమీ కీటకాల నివారణ చర్యలు పాటించాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాత వినియోగించాలి. వ్యాధిసోకిన పశువులు మృతి చెందితే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి. టీకాలను సద్వినియోగం చేసుకోవాలి పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయిస్తే పశుసంరక్షణ బాగుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందించాలి. గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ చేపడుతున్నాం. ముందుగా రైతులకు సమాచారం అందిస్తున్నాం. – కొమురయ్య, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి 252313 -
రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని అన్ని గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అధికారులకు సూచించారు. జీఎం బొగ్గు ఉత్పత్తి, ఉత్పదాకతపై జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్లు, షిప్ట్ ఇన్చార్జ్లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఎస్డీఎల్ యంత్రాల పనిగంటలు పెంచి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులకు తప్పనిసరిగా ఇన్సెంటివ్ రావాలంటే నిర్దేశించిన టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చూడాలన్నారు. కార్మికులు 22రోజులకు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, ప్రాజెక్ట్ అధికారులు, ఏజెంట్లు భిక్షమయ్య, వెంకటరమణ, అధికార ప్రతినిధి మారుతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు సింగరేణి ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి అభినందించి ప్రోత్సాహక బహుమతులను అందించారు. 548మార్కులు సాఽధించిన ఎం.ఆశ్రితతో పాటు 500పై మార్కులు సాధించిన విద్యార్థులకు జీఎం కార్యాలయంలో శనివారం ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కవీంద్ర, పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, అధికారులు రాజు, శ్రావణ్కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వేదికపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే శ్రీహరి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అధికారులు రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డిల పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష -
వైద్యసేవలు విస్తరించాలి
ములుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి గర్భిణులు, చిన్నారులకు అందించే వ్యాధినిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ, సంక్రమిత, అసంక్రమిత వైద్య సేవలను గ్రామాల్లో విస్తరింపజేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని శాఖ కార్యాలయం నుంచి ఎంఎల్హెచ్పీలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడారు. హెల్త్ మేళా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో వ్యవసాయ, ఉపాధిహామీ కూలీలు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాన్సర్ స్క్రీనింగ్, లైన్ లిస్టులను పీహెచ్సీల వారిగా కో ఆర్డినేట్ చేసుకొని జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి అందించాలని సూచించారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమాలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 100శాతం పూర్తి చేయాలన్నారు. వ్యాధి టీకాలు వేసిన అనంతరం ఆరోగ్య పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పవన్కుమార్, డెమో సంపత్, ఎన్సీడీ కో ఆర్డినేటర్ వెంకట్రెడ్డి, డీడీఎం ప్రవీణ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ గోపాల్రావు -
ఆట వస్తువుల పంపిణీ
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని నార్లాపూర్ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలోని పాఠశాలల చిన్నారులకు హైదరాబాద్కు చెందిన యూత్ అసెంబ్లీ సంస్థ సభ్యులు శనివారం ఆట వస్తువులను పంపిణీ చేశారు. గూడెంలోని పాఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడంతో స్పందించిన యూత్ అసెంబ్లీ ఎన్జీఎం సంస్థ వారు పాఠశాలను సందర్శించి గొత్తికోయ చిన్నారులకు ఆటవస్తువులు క్యారమ్బోర్డుతో పాటు తాగునీటి కోసం వాటర్ వీల్స్ క్యా న్లు, టీవీ అందజేశారు. ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు చిన్నారులతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్ వెంకటాపురం(ఎం): భూభారతి చట్టం అమలుకు మండలంలోని రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెల్తుర్లపల్లిలో ఆర్డీఓ వెంకటేశ్ శనివారం ఫీల్డ్ విజిట్ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తు చేసిన ప్రతీ రైతుకు చెందిన భూమిని పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు
వాజేడు: ప్రాణాలను బలి తీసుకునే డ్రగ్స్కు బానిసలుగా మారొద్దని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని చిన్న గొళ్లగూడెం గ్రామంలో పోలీసులు శనివారం డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లాంటివి సేకరించినా, అక్రమంగా విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్తో పట్టు బడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్సై తెలిపారు. కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్ వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో సాయుధ బలగాలు 12 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు సుమారు వెయ్యిమంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కర్రిగుట్టలను కేంద్ర బలగాలు చుట్టు ముట్టాయి. ఆ గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందు పాతరలను తొలగించుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కాగా 12వ రోజు శనివారం కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ఇద్దరు జావాన్లు వడదెబ్బకు గురికావటంతో వారిని వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. మలేరియా జ్వర నిర్ధారణ పరీక్షలు వాజేడు: మలేరియా జ్వరాల నిర్ధారణ పరీక్షలను పేరూరు వైద్య సిబ్బంది కడేకల్ గ్రామంలో శనివారం నిర్వహించారు. పేరూరు వైద్యాధికారి రాహిల్ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా ఈ పరీక్షలను చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వలస కూలీల మూలంగా మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందులో భాగంగా మలేరియా లేని మండలంగా మార్చడం కోసం ముందస్తుగా పరీక్షలను నిర్వహించి మందులను ఇస్తున్నట్లు వైద్యాధికారి రాహిల్ తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, తిరుపతి, శ్రీదేవి, శారద, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్లతో నీటి సరఫరా వెంకటాపురం(కె): చెలిమ నీరే తాగునీరు శీర్షికన సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామాన్ని అధికారులు సందర్శించారు. పర్శికగూడెం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందకు పంచాయతీ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వెంకటసతీష్, గ్రిడ్ ఏఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు ములుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఇసుక ర్యాంపుల యజమానులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదని మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్రయూత్ కాంగ్రెస్ కార్యదర్శి సూర్య శనివారం ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ లారీలను నిలిపి సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని తెలిపారు. అలాంటి ఇసుకక్వారీల యజ మానులపై చర్యలు తీసుకోవడానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ర్యాంపుల రద్దుకు మద్దతిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆయా మండలాల నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు. లారీలను రోడ్లపై ఆపడం ద్వారా వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రజాశ్రేయస్సే మంత్రి సీతక్క లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వివరించారు. -
సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ దివాకర ములుగు: ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణుల సందర్శనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీష్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు పలు దేశాలకు చెందిన సుందరీమణులు ఈ నెల 14న వెంకటాపురం(ఎం) మండలంలోని యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారని, హైదరాబాద్ నుంచి సుందరీమణులు నేరుగా రామప్ప హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారన్నారు. పోలీస్ శాఖ తరఫున బందోబస్తు నిర్వహించాలని సూచించారు. హరిత కాకతీయ నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ విశిష్టను సుందరీమణులకు వివరించాలని గైడ్లను ఆదేశించారు. ఫొటోషూట్, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఈనెల 8 తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహా స్వామి కల్యాణ బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి
ములుగు: ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంభందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్మిట్టిల్తో కలిసి భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరాఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావులు పాల్గొన్నారు. అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. ఈదురుగాలులతో రూ.55లక్షల నష్టంవెంకటాపురం(ఎం): ఆకాలవర్షంతో పాటు ఈదురుగాలులకు రూ.55 లక్షల నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వెల్తుర్లపల్లిలో ఈదురుగాలులతో విరిగిన విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెల్తుర్లపల్లితో పాటు రేగొండ, గణపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 351 స్తంభాలు నేలకొరిగాయన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రాజచౌహాన్, భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్నాయక్, జీఎం సురేందర్, ములుగు డీఈ నాగేశ్వర్రావు, డీఈలు పాపిరెడ్డి, సదా నందం తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకోవెంకటాపురం(ఎం): ఆకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండలంలోని పాపయ్యపల్లి రహదారిపై నర్సాపూర్, సింగరకుంటపల్లి, పాపయ్యపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోనే తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేశారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్ రాస్తారోకో వ ద్దకు చేరుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కా ర్యక్రమంలో మూడు గ్రామాలకు చెందిన సు మారు 200మంది రైతులు పాల్గొన్నారు. 15వరకు టెన్త్ సప్లిమెంటరీ ఫీజు గడువు భూపాలపల్లి అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, రీ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● మంత్రి ధనసరి సీతక్క ములుగు: వైకల్యమనేది కేవలం శరీరానికి మాత్రమేనని మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల శాఖల మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ అధికారిణి శిరీష అధ్యక్షతన మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల పరిధిలోని బళ్ల సంజయ్, నాగయ్య, కృష్ణ, కందికట్ల సాంబయ్య (నలుగురికి)లకు రూ.2లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఉద్యోగాలు, ఉపాధికి ఏ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించిందన్నారు. కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకంలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ శాలినీ మిశ్రా మాట్లాడుతూ మంత్రి సీతక్క చొరవతో ఈ ఉపకరణాలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తదితరులున్నారు. చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలివిద్యార్థులు విద్యతో పాటు సంస్కారం నేర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. పదో తరగతిలో ఎనిమిదో స్థానంలో నిలవడం సంతోషయమే అయినప్పటికీ రానున్న పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, ఆర్డీఓ వెంకటేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, ఎస్ఓ రాజు కుమార్ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గోన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఎదురౌవుతున్న సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ (ఏటూరునాగారం) పీఓ చిత్రమిశ్రా అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటివరకు ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలలో చేపట్టిన పనుల వివరాలను సేకరించి నివేదిక రూపంలో అందించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఈఈ వీరభద్రం, డీడీ పోచం, అధికారులు పాల్గొన్నారు. -
సివిల్ సప్లయీస్కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడా పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్టైమ్లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
ఘనంగా మేడే
కోర్టు ఆదేశాలు బేఖాతర్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటాయి. రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది.– 8లోuములుగు/ ములుగు రూరల్: జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జెండాలను ఆవిష్కరించారు. కార్మికులు 8గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసిన పోరాటంతో మే 1న కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు పలువురు నాయకులు వివరించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. 44కార్మి క చట్టాలను నాలుగు కోడ్లకు కుదించి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. -
అంగన్వాడీలకు సెలవులు ప్రకటించడం హర్షణీయం
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం హర్షణీయమని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యానియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ అన్నారు. ఈ మేరకు గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సీతక్కను శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడం ఐసీడీఎస్ చరిత్రలో మొదటి సారి అని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, మినీ అంగన్వాడీ టీచర్లకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సునీత, మంగ, శశికళ, రాజేందర్, సమ్మక్క, పద్మారాణి, భాగ్యలక్ష్మి, సరిత, రుక్మిణి, జమున, తదితరులు పాల్గొన్నారు.కార్మిక చట్టాల ఫలాలు అందరికీ అందాలిభూపాలపల్లి అర్బన్: కార్మిక చట్టాల ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే మేడే లక్ష్యం నెరవేరినట్లని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్, కాకతీయ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే ఉత్సవాల్లో జడ్జి పాల్గొని మాట్లాడారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత పెన్షన్ చాలా ముఖ్యమైనవన్నారు. ఈ ఫలాలు అందరికీ అందాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్రావు, న్యాయవాదులు ప్రియాంక, కార్మిక సంఘాల నాయకులు సాయిలు, రమేష్, మహేందర్, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.ప్రధాన అర్చకుడి ఉద్యోగ విరమణకాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ ఽబుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన దేవస్థానంలో పలు హోదాల్లో అర్చక వృత్తిలో కొనసాగారు. గురువారం ఉద్యోగ విరమణ పొందిన దంపతులను ఈఓ శనిగెల మహేష్, అర్చక బృందం,సిబ్బంది, పలువురు నాయకులు సన్మానించారు.సద్వినియోగం చేసుకోవాలిమొగుళ్లపల్లి: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు అన్నారు. మండలంలోని వేములపల్లి గ్రామంలో గురువారం కబడ్డీ కోచింగ్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని క్రీడలలో మెళకువలు నేర్చుకోవాలని కోరారు. ఈ శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోచ్ మహేశ్, కేల్ ఇండియా కోచ్ శ్రీనివాస్, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్పలిమెల: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు గురువారం ముగిశాయి. క్రీడల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, మహారాష్ట్ర గచ్చిరోలి క్రీడాకారులతో పాటు, ములుగు, భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్ జట్టు మొదటి విజేతగా నిలిచింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి జట్టు ద్వితీయ స్థానంలో నిలువగా.. భూపాలపల్లి జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా గుమ్మలకొండ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. -
కృషితో ఫలితం
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలివిద్యార్ధులను అభినందిస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకరములుగు: మనం చేసే కృషితోనే ఏదైనా సాధించవచ్చు అనేది జిల్లా విద్యార్థులు నిరూపించారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రం స్థాయిలో జిల్లా 13వ స్థానంలో నిలవగా ఈ సారి 8వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 9మండలాల్లో 3,134 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,060 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 97.64గా ఉత్తీర్ణత శాతం నమోదయింది. సెప్టెంబర్ నుంచి ప్రత్యేక ప్రణాళిక మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర చొరవతో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టారు. రోజువారీగా లీజర్ క్లాసుల్లో సబ్జెక్టుల వారీగా రివిజన్ తీసుకొని విద్యార్థుల ప్రతిభను గుర్తించారు. పాఠశాల వారీగా విద్యార్థులను ఏ, బీ, సీ కేటగిరీలుగా గుర్తించారు. సీ కేటగిరిలో 200మంది విద్యార్థులు ఉన్నట్లుగా గమనించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. మొదట వీరికి బిట్స్, చిన్న చిన్న ప్రశ్నలు వంటి వాటిపై పరీక్ష నిర్వహించి వారిలో ఉన్న చురుకుదనాన్ని గమనించారు. దీంతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, తహసీల్దార్ ఎంఈఓలు నిత్యం పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. విద్యార్థుల మనోగతాన్ని తీసుకొని వారి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ చూపారు. సైన్స్, గణితంలో ఫెయిల్ సి కేటగిరిలోని 200 మందిని గుర్తించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 40 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వారిలో కొంతమేర ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సహించారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా 74మంది ఫెయిలయ్యారు. ఇందులో ఎక్కువ శాతం సైన్స్లో 39 మంది, గణితంలో 30 మంది, తెలుగులో 10 మంది, సాంఘిక శాస్త్రంలో ఇద్దరు, ఇంగ్లిషులో ఒకరు ఫెయిలయ్యారు. ముఖ్యంగా గణితం సబ్జెక్టు పరీక్ష పేపర్ తప్పుగా వచ్చిందని విద్యార్థులు ఉపాధ్యాయులకు చెబుతున్నారు. ఫెయిల్ అయిన వారిని పాఠశాలకు రప్పించుకొని సప్లమెంటరీ పరీక్షల ద్వారా మరింత ఉత్తమ ఫలితాలు రాబట్టేలా విద్యాశాఖ తరఫున కసరత్తు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 8వ స్థానంలో నిలవడం సంతోషకరం రాష్ట్ర స్థాయిలో జిల్లా గతేడాది 95.65శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. ఈసారి 97.64శాతంతో 8వ స్థానంలో నిలవడం సంతోషకరం. ఫెయిల్ అయిన విద్యార్థులను ప్రోత్సహించి సప్లమెంటరీలో పాస్ అయ్యేలా ప్రణాళిక రూపొందించాం. ఈ విషయాన్ని ఎంఈఓలు, హెచ్ఎంలకు ఉపాధ్యాయులకు తెలియజేస్తాం. – పాణిని, డీఈఓన్యూస్రీల్గతేడాది కంటే ‘పది’లో మెరుగైన ఫలితాలు రాష్ట్రంలో జిల్లాకు 8వ స్థానం అత్యధికంగా సైన్స్లో 39, గణితంలో 30మంది విద్యార్థులు ఫెయిల్ -
కులగణనను కేంద్రం ఆమోదించడం సంతోషం
● డీసీసీ అధ్యక్షుడు అశోక్ ములుగు: రాహుల్గాంధీ సూచనల మేరకు కేంద్రం ప్రభుత్వం కులగణనను దేశ వ్యాప్తంగా అమలు చేయడాన్ని ఆమోదించడం సంతోషకరమని డీసీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణను తొలిసారిగా అమలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్రెడ్డి, ఇర్సవడ్ల వెంకన్న, బీసీ సెల్ అధ్యక్షుడు రవియాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ఖాన్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మావిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
వెంకటాపురం(కె)/వాజేడు: కేంద్ర, రారష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలుపుదల చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తాటి నాగరాజు అన్నారు. మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కర్రిగుట్టను నిలుపుదల చేసి ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం బోదెబోయిన సురేశ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్ మాట్లాడుతూ కర్రిగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గుట్టల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పేరుతో కూంబింగ్ కొనసాగిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో కట్టం నర్సింహరావు, చిక్కుడు రజనీకుమార్, ఉయిక జగన్, మడప పగిడయ్య, పీర్ల మల్లిఖార్జునరావు, శ్యామల వెంకటేశ్వర్లు, బొగ్గుల సమ్మయ్య, కణితి శేషు, సోడి సారయ్య, శ్యామల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తీరని నష్టం
ఈ ఫొటోలోని రైతు పేరు అలుగం సమ్మయ్య. చల్వాయి గ్రామం. గౌరారం శివారులోని 5 ఎకరాల్లో 962 వరంగల్ వరి రకం పంట సాగు చేశాడు. బుధవారం రాత్రి 9గంటలకు వచ్చిన గాలివాన బీభత్సానికి పంట మొత్తం నేలవాలింది. దీంతో పంటసాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో కూర్చోని కన్నీటి పర్యంతం అయ్యాడు.● కోతకొచ్చిన సుమారు 500 ఎకరాల్లో నేలవాలిన వరి ● కన్నీటిపర్యంతం అవుతున్న అన్నదాతలు ● ఆదుకోవాలని వేడుకోలుములుగు/గోవిందరావుపేట: అకాల వర్షాలతో అన్నదాతలు అష్టకష్టాల పాలవుతున్నారు. జిల్లాలో బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం, కురిసిన అకాల వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. పలుచోట్ల ధాన్యం గింజలు రాలిపోయాయి. ధాన్యం రాశులు తడిసిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కల్లాల్లో తడిసిన ధాన్యం ములుగులో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9:30గంటల వరకు గాలివాన బీభత్సానికి ధాన్యం రాశులపై పరదాలు కొట్టుకపోయాయి. పలుచోట్ల టార్పాలిన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం ధాన్యం ఆరుతుందని కప్పిన పరదాలను తొలగించిన రైతులు చదును క్రమంలో మళ్లీ ఒక్కసారిగా కురిసిన వర్షంతో పూర్తిగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడుతూ కనిపించారు. స్పందించిన మంత్రి సీతక్క రైతులు అధైర్యపడకూడదని శుక్రవారం నుంచి హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మిల్లులకు ధాన్యం తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ములుగు మండలంలో 26.4ఎంఎం, వెంకటాపురం(ఎం) మండలంలో22.8 ఎంఎం, ఎస్ఎస్ తాడ్వాయిలో 9.6 ఎంఎం, గోవిందరావుపేటలో 9.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే భారీ గాలి దుమారానికి ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం రాత్రి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం కొన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు 10గంటల తర్వాత మళ్లీ కోత విధించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. రాత్రి 7:50గంటలకు ములుగు పట్టణంలోని అన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేశారు. సుమారు 500ఎకరాల్లో నేలవాలిన వరి గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, గోవిందరావుపేట, పస్రా, దుంపెల్లిగూడెం, లక్ష్మీపురం, కర్లపల్లి, మొద్దులగూడెం గ్రామాల్లో 20రోజుల నుంచి 5, 6రోజులకొకసారి కురుస్తున్న అకాల వర్షాలకు వరిధాన్యం రాలిపోయి మొలకెత్తుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలు కొన్ని చోట్ల కోసినా అవి కాస్త కాంటాలు కాక వివిధ రకాల కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల వ్యాప్తంగా సుమారుగా 500ఎకరాల్లో వరి పంట నేలవాలింది. అకాల వర్షాలు ఇలాగే కురిస్తే ధాన్యం రాలిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చేతికొచ్చిన పంట నష్టపోయాం.. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట అకాల వర్షానికి పంట దెబ్బతింది. మా గోస ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. కౌలుకు తీసుకుని పంట సాగు చేశాను. చేతికి అందివచ్చి న పంట నేలవాలిపోయింది. దాన్ని ఎలా కోయించాలో అర్ధం కావడం లేదు. – సూరపనేని నాని, రైతు, చల్వాయి70శాతం ధాన్యం నేలరాలింది.. ఆరుగాలం కష్టపడి 6 ఎకరాల్లో వరి పంట పండించాను. 24గంటలు పంటను రక్షించుకున్నాను. అకాల వర్షాలు గాలిదుమారానికి రేపు కోయాల్సిన వరి ధాన్యం 70శాతం నేలరాలింది. దీంతో తీవ్రంగా పంట నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యనే శరణ్యం. – కొన్నె అశోక్, రైతు, చల్వాయి -
కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడ?
ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రె గుట్టలను భద్రతా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయి. మావోయిస్టుల కోసం అన్నివైపులా నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. ఆపరేషన్ కగార్లో భాగంగా పది రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కర్రెగుట్టలలో 20వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కర్రెగుట్టలో పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్లో 10 వేల మంది సిబ్బంది భాగం అవుతారని సమాచారం. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్స్ నెలకొల్పారు. అలాగే.. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ చేరుకోగా.. భారీగా ఆయుధాలలను తరలించారు. కర్రేగుట్టలోని దోబి కొండ నీలం సారాయి కొండలను పూర్తిగా సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పది రోజుల్లో మావోయిస్టుల జాడ లభ్యం కాకపోవడం గమనార్హం. ఒకవైపు కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నాయి. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెబుతున్నాయి. ఈ క్రమంలో.. మావోయిస్టులు స్థావరాల నుండి బయటకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాయి. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
● వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్.దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు పెట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్దార్సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతులు ఆందోళన చెందొద్దు
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్రావు, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో హనుమకొండ జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపాలని అధికారులను ఆదేశించా రు. యాసంగి సీజన్లో జిల్లా రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులను నిలిపి వేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్ధార్సింగ్ పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ ఉద్యోగులకు సహజం
ములుగు: ఉద్యోగ విరమణ ప్రతీ ఉద్యోగికి సహజం అని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లక్ష్మారెడ్డి, పీసీఆర్ ఏఎస్సై రవీందర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఖాజామోయినుద్దీన్, ఏటూరునాగారం హెడ్ కానిస్టేబుల్ రామారావులు సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో నలుగురిని శాలువాలతో సన్మానించిన ఎస్పీ వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని తెలిపారు. ఇప్పటికై నా కుటుంబంతో ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నలువాల రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ వెంకట్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి ములుగు: మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు సాధు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నిర్వహించిన జనరల్బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాధ్యమైనంత వరకు నూతన సొసైటీలను ఏర్పాటు చేయడంతో పాటు సభ్యులకు సభ్యత్వాలు ఇప్పిస్తానని తెలిపారు. సహకార సంఘాలకు నూతన భవనాల మంజూరుకు పాటు పడుతానని వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణించిన సభ్యుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించేలా చూస్తానని తెలిపారు. వచ్చే సీజన్లో సాధ్యమైనంత వరకు జులై, ఆగస్టు మాసాల్లో చేపపిల్లలను వదిలేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానని వివరించారు. ఈదురు గాలులు.. భారీ వర్షం ములుగు: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి తడిసిపోయింది. కొంత మంది రైతులు అందుబాటులో ఉండి టార్పాలిన్లు కప్పి ఉంచగా మిగతా రైతులు అచేతనంగా ఉండి పోయారు. తెల్లారితే గాని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, కోతకు సిద్ధంగా ఉన్న వరి పరిస్థితులు తెలిసే అవకాశం ఉంది. -
ఆపరేషన్ కగార్ సక్సెస్.. కర్రెగుట్టలపై జాతీయ జెండా
ములుగు, సాక్షి: తొమ్మిది రోజులపాటు కొనసాగిన ఆపరేషన్ కగార్లో భద్రతా బలగాలు మావోయిస్టులపై పైచేయి సాధించాయి. కర్రెగుట్టలపై మొత్తానికి పట్టు సాధించాయి. బుధవారం సాయుధ బలగాలు గుట్టలపై జాతీయ జెండాను ఎగరేశాయి. అంతేకాదు.. త్వరలో అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా 10 వేలకు పైగా సాయుధ బలగాల సిబ్బందితో కర్రెలగుట్టను చుట్టుముట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో కూంబింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మరణించిన సంగతీ తెలిసిందే.డీఆర్జీ బస్తర్ ఫైటర్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు ఈ కూంబింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాయ్పూర్ నుంచి ఆపరేషన్ను పర్యవేక్షించిన ఐబీ చీఫ్ ఇవాళ నేరుగా కర్రెలగుట్టకు చేరుకున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆపరేషన్లో పాల్గొన్న టీం మొత్తాన్ని వెనక్కి రప్పించి.. అక్కడికి కొత్త టీంను మోహరింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సీఆర్పీఎఫ్ అక్కడ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయనుంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్లకు ఉపయోగపడేలా ఈ బేస్ ఉండనున్నట్లు సమాచారం. -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
ములుగు రూరల్: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1నుంచి 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్కు విన్నవించగా ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడానికి పరిశీలన చేస్తుందన్నారు. పోషన్ పక్వాడలో మంత్రి సీతక్కకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి అందించగా సెలవులు ఇస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. పాత పద్ధతిలో 15 రోజలు టీచర్, 15 రోజులు ఆయాలు విధులు నిర్వహించేలా సర్క్యూలర్ జారీ చేశారని వివరించారు. ఎండల తీవ్రత కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు, గర్భిణులు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. అనంతరం మంత్రి సీతక్కతో యూనియన్ నాయకులు ఫోన్లో మాట్లాడారు. వేసవి సెలవుల విషయంలో యూనియన్ నాయకులు చర్చలకు రావాలని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్వాడీలు సమ్మక్క, సరిత, జమునారాణి, ధనలక్ష్మీ, అరుంధతి, పార్వతీ, సూరమ్మ పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా -
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు
● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్తో ముందుకెళ్లొచ్చు ● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ ● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్ల డైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకున్నా దరిమిలా...పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితునిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్లు రాలేదని కొందరు...మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చ డం వల్ల పిల్లల మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు. -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాంఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ●న్యూస్రీల్ -
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలలు వీచే అవకాశం ఉంది.ఉల్లాస్, న్యూఇండియా లిట్రసీ అమలుచేయాలి ● కలెక్టర్ దివాకర ములుగు: ఉల్లాస్, న్యూ ఇండియా లిట్రసీ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాలలో సభ్యులుగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారి వివరాలను సేకరించి విద్యాశాఖకు అందించాలని సూచించారు. స్వచ్ఛందంగా వలంటీర్లను ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, డీఈఓ పాణిని, వైద్యశాఖ అధికారి గోపాల్రావు, డీడబ్ల్యూఓ శిరీష, డీపీఓ ఒంటేరు దేవరాజ్, ఇంటర్మీడియట్ జిల్లా అధికారి చంద్రకళ, అడల్ట్ ఎడ్యూకేషన్ నోడల్ అధికారి వేణుగోపాల్, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా బాధ్యులు అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. దర్యాప్తును ముమ్మరం చేయాలి ములుగు: దొంగతనాలు, ఆర్థిక నేరాలపై నమోదయ్యే కేసుల వివరాలను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేయాలని పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శాఖ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి తగిన విధంగా వివరాలను సేకరించి సమర్పించాలన్నారు. వేసవి కాలంలో ఉద్యోగులు, సామాన్య ప్రజలు సెలవులపై బయటికి వెళ్లే సమయంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపై జరిగే నేరాలపై వీలైనంత వరకు సమాచారం సేకరించాలని ఆదేశించారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, ఎస్బీ సీఐ శంకర్, సీఐలు శ్రీనివాస్, కుమార్, రవీందర్, ఎస్సైలు సతీశ్, కమలాకర్, శ్రీకాంత్రెడ్డి, తాజుద్దీన్, టీవీఆర్ సూరి, రాజ్కుమార్, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
త్వరలోనే కీమో, రేడియోథెరపీ వైద్యసేవలు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు కానున్న క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా బాధితులకు వైద్యం అందించడానికి కీమో, రేడియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్లో పీహెచ్సీ వైద్యులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎంఎల్హెచ్పీలు, ఆర్బీఎస్కే వైద్యులు, సూపర్వైజర్లతో అసంక్రమిత వ్యాధులపై శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపాల్రావు మాట్లాడుతూ అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా లక్షణాలు బయటపడకుండా మరణాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. మే 1నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ వరకు నాలుగవ విడత స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అంగన్ వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీలు భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీల పరిధిలోని సబ్సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలపత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ పరిశీలకుడు సత్యేంద్రనాథ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్స్ రణధీర్, పవన్కుమార్, చంద్రకాంత్, డెమో సంపత్, ఎన్సీడీ కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/మంగపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి, గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పాఠశాల భవనాలకు పేయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. పరిశుభ్రత, విద్యుత్ సమస్యలు, డార్మెంటరీ మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొండ్యాల, లక్ష్మీపూర్, వాగొడ్డుగూడెం, రమణక్కపేట గ్రామాల్లో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను పరిశీలించి నాణ్యతతో చేపట్టాలని, సైడ్ బర్మ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశాంత్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ రాము, ఎన్హెచ్ఎం హెల్త్ ప్రాజెక్ట్ మేనేజర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
‘సీతక్కను విమర్శించే స్థాయి నాగజ్యోతికి లేదు’
గోవిందరావుపేట: రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతికి లేదని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడే నాగజ్యోతి కావాలనే మంత్రి సీతక్కను విమర్శిస్తుందని తెలిపారు. అలా విమర్శలు చేస్తే పెద్ద నాయకురాలిగా గుర్తింపు వస్తుందనే భ్రమలో ఉందని విమర్శించారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాగజ్యోతికి రాజకీయ భిక్ష పెట్టింది సీతక్కనే అని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఐదేళ్లు జెడ్పీ వైస్చైర్పర్సన్, చైర్పర్సన్ పదవుల్లో ఉండి జిల్లాలో ఏమి అభివృద్ధి పనులు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీతక్క గురించి మాట్లాడే అర్హత నాగజ్యోతికి లేదని, ఇంకోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా నాయకురాలు సూదిరెడ్డి జయమ్మ, గుండెబోయిన నాగలక్ష్మీ, చొప్పదండి వసంత, తోకల అహల్య, ల్యాగల అనిత, గురుకు మేరీల, గోపిదాసు వజ్రమ్మ, మిరియాల సోమలక్ష్మీ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ‘వజ్ర’తో అడవుల పరిరక్షణ ఏటూరునాగారం: జిల్లాలోని అడవులు, వన్యప్రాణి ప్రాంతాల్లో వజ్ర వాహనంతో పరిరక్షణ, పర్యవేక్షణ చేయనున్నట్లు సీసీఎఫ్ ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారి అటవీశాఖ సౌత్ రేంజ్పరిధిలో వజ్ర వాహనాన్ని ఆయన మంగళవారం జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాహనానికి వజ్రగా పేరు నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనం నేషనల్ హైవేపై గస్తీ తిరుగుతూ అటవీ పరిరక్షణకు పాటు పడుతుందన్నారు. ఎవరైనా అటవీ సంరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చిన్న నేరాలకు అప్పటికప్పుడు రూ.25వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పెద్ద నేరాలకు కేసు నమోదైతే 14ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. వన్యప్రాణాలు, అడవులను రక్షించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్డీఓ రమేష్, ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్, సౌత్ రేంజ్ ఎస్ఎఫ్ఓలు, ఎఫ్బీఓలు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. కంటిచూపు ముఖ్యం వాజేడు: ప్రతీఒక్కరికి కంటి చూపు ముఖ్యమని ఆర్బీఎస్కే వైద్యాధికారి నవీన్, ఆప్తాల్మిక్ తిరుపతిరావు అన్నారు. మండల పరిధిలోని చండ్రుపట్లలో మంగళవారం ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సూచన మేరకు కంటివైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 55మందికి పరీక్షలను చేశారు. రోగులకు దగ్గర, దూరపు చూపు మందగించినట్లు గుర్తించి అందుకు తగ్గ సూచనలను చేశారు. కంటి లోపల కేటరాక్ట్ ఉందా లేదా అని పరీక్షించారు. ఇతర సమస్యలను పరీక్షించి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే ఏఎన్ఎం విజయ, ఆరోగ్య కార్యకర్త తిరుపతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ వెంకటాపురం(కె): మండల పరిధిలోని సూరవీడు సమీపంలోని మిర్చి తోటల్లో పనిచేస్తున్న కూలీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది కూలీలకు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళ కేంద్రంలో 84 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారిలో 21 మంది మహిళల వద్ద రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ములుగు ఏరియా వైద్య శాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహరెడ్డి, పవన్, వినయ్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ జాబితా క్రాస్ చెక్
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. ఎంపిక చేసిన జాబితాను మళ్లీ క్రాస్ చెక్ చేస్తున్నారు.మనకెప్పుడు క్రికెట్ ‘వైభవం’.. చిన్న వయస్సులోనే వైభవ్ ఐపీఎల్ సెంచరీ కొట్టడంతో డీఎస్ఏలో శిక్షణ పొందుతున్న పలువురు యువ క్రికెటర్లను ‘సాక్షి’ పలకరించింది.– IIలోuరిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి... పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. – డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు -
దాతలిచ్చిన భూమి మాకే కేటాయించాలి..
గతంలో సాధన హైస్కూల్ సమీపంలో గట్టంపల్లి గ్రామం ఉండేది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో బూడిదయ్యింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రేమ్నగర్లోని 1076, 1078 సర్వే నంబర్లలో దాతలు ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5గుంటల చొప్పున కేటాయించింది. మాతాతలు ఇళ్లుకట్టుకున్నారు. తదనంతరం కూలిపోవడంతో మాతో పాటు మరో ఐదు కుటుంబాలకు చెందిన దళితులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. ఆ ప్రదేశంలో ప్రస్తుతం రామ చంద్రారెడ్డి అనే వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి ఇళ్లు లేకపోయినా తన కుమారుల పేరుమీద ఇళ్లు ఉన్నట్లుగా సృష్టించుకున్నారు. ఇది తమ భూమి అని చెప్పినా పట్టించుకోవడం లేదు. గ్రామస్తులను విచారిస్తే స్థలం తమదేనని చెప్తారు. గ్రామ పంచాయతీని ఆశ్రయిస్తే ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేద దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి. – కాకి సతీష్, ప్రేమ్నగర్, ములుగు -
గిరిజన దర్బార్లో వినతులు ఇలా..
ఏజెన్సీలో గిరిజన సొసైటీలను ఏర్పాటు చేయాలని, వలలు, తెప్పలు గిరిజన మత్స్యకారులకు అందజేయాలని నాయకులు సిద్ధబోయిన సురేందర్, ఆలం భాస్కర్ విన్నవించారు. ఏజెన్సీలోనిసొసైటీలకు బడ్జెట్ కేటాయించాలన్నారు. గిరిజన మత్స్యకారులకు చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని, చేపలపెంపకం కోసం ఐటీడీఏ ద్వారా ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు. మంగపేట మండలం రమణక్కపేటలో పడిగ సంధ్య తన భర్త శ్రీకాంత్ పేరు మీద ఉన్న పట్టా భూమిని వేరేవాళ్ల మీదకు మార్చుకొని భూమిని లాక్కున్నారని తెలిపారు. గంగారం మండలం దుబ్బగూడెంకు చెందిన ప్రశాంత్, ఇతరుల ఎంఎస్ఎంఈ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘మంత్రుల మతి భ్రమించింది’
ములుగు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వచ్చిన జనం, పార్టీ అధినేత ప్రసంగం చూసి రాష్ట్ర మంత్రుల మతి భ్రమించిందని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్మ రమేష్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేనప్పుడు ఉలికిపాటు ఎందుకని మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. మంత్రి సీతక్క ఎలాంటి అభివృద్ధి చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. పెద్దపెద్ద కాన్వాయ్లో తిరిగితే మహిళల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రాసమల్ల సురేందర్, మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మెరుగు సంతోష్, విజయ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేయాలి
ములుగు: మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని అదివాసీ, గిరిజన, దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాయల్ప్లాజాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మావోయిస్టు పార్టీలతో వెంటనే శాంతి చర్చలు జరపాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ–ఛత్తీస్గఢ్ పరిసరాల్లోని కర్రిగుట్టలపై మావోయిస్టులు ఉన్నారనే నెపంతో సాయుధబలగాలు బాంబులతో దాడి చేయడం వెంటనే మానుకోవాలని కోరారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాల చర్యల కారణంగా నిరాయుధులైన ఆదివాసీ గిరిజన మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా ప్రజలు భయానక జీవితాన్ని గడుపుతున్నారన్నారు. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన సంఘటనపై యావత్ ప్రపంచం స్పందించిన సమయంలో కర్రిగుట్టల విధ్వంసాన్ని కేంద్రం నేరుగా చేపట్టడాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను వెనక్కి రప్పించుకుని మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు రేపు ములుగు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు మెమోరాండం అందించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో తుండుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, గోర్సభ జాతీయ అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్, సోమ రాంమూర్తి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్, గోర్ సభ రాష్ట్ర అధ్యక్షుడు మంగిలాల్, ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, మేడారం ట్రస్టుబోర్డు తాత్కాలిక చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్
వెంకటాపురం(కె): తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా దట్టమైన కర్రిగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడంతో పాటు ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకుసాగుతున్నాయి. మావోయిస్టుల స్థావరాలను కనుగొనే క్రమంలో ఒక్కో అడుగును జాగ్రత్తగా ముందుకు వేస్తున్నాయి. అయితే ప్రతిరోజూ తుపాకుల మోతలు, బాంబుల చప్పుళ్లు వస్తున్నాయనే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
అర్హుల ఎంపిక త్వరగా పూర్తిచేయాలి
ములుగు: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మండల స్థాయి వెరిఫికేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతీ మండలంలో నలుగురు అధికారులను నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పాటు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు సమర్పించిన వివరాలు రాష్ట్రస్థాయిలో పరిశీలనలో ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలిపారు. అయితే లబ్ధిదారులకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే రిమార్క్స్ కాలంలో నమోదు చేయాలని సూచించారు. గడువులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలు, అసలు ఇళ్లులేని వారిని అర్హులుగా ఎంపిక చేయాలని తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మూడు కేటగిరిల్లో విభజించినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఎల్ 1 కేటగిరిలో ఇంటి స్థలం ఉన్న వారిని, ఎల్ 2 కేటగిరిలో ఇంటి స్థలం, ఇల్లులేని వారిని, ఎల్ 3 కేటగిరిలో అర్హతలు లేని వారిని గుర్తించాలన్నారు. వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత గ్రామ పంచాయతీల్లో అర్హుల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, ఏపీడీ వెంకటనారాయణ, ఈడీఎం దేవేందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
రేషన్ డీలర్పై చర్య తీసుకోవాలి..
గ్రామంలోని షాపు నంబర్–9 డీలర్ నిరుపేదల నుంచి బియ్యం కొనుగోలు చేసి ప్రైవేటుగా అమ్ముకుంటున్నాడు. గతంలో ఫిర్యాదు చేస్తే పోలీసులను ఆశ్రయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికారులు విచారణ చేసి సస్పెండ్ చేశారు. తిరిగి విధుల్లోకి చేరాడు. కానీ ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో పాటు దివ్యాంగుడినైన తనకు ఇందిరమ్మ ఇంటిని కేటాయించాలని అధికారులను వేడుకున్నా.. అయినా స్పందించలేదు. ఎంపీడీఓను కలిస్తే కాంగ్రెస్ నాయకులను కలవమని చెబుతున్నారు. – లెంకలపల్లి కుమారస్వామి, దుంపెల్లిగూడెం, గోవిందరావుపేట -
ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం..
యాసంగి వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం అని జిల్లాలోని 40 మంది రైస్ మిల్లర్లు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. యాసంగిలో వచ్చే ధాన్యంతో బాయిల్డ్ బియ్యం మాత్రమే వస్తాయని ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు చెప్పామని తెలిపారు. అధికారుల ఒత్తిడికి లోనై ధాన్యం దించుకుంటే మిల్లర్లు పూర్తిగా దివాళాతీసే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. గతంలో సైతం ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మాత్రమే ఇచ్చేవాళ్లమని వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రైస్ మిల్లర్లను ఆదుకోవాలని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్, కార్యదర్శి సహోదర్రెడ్డి, ఎలగందుల మోహన్, కొమురవెల్లి హరినాథ్, సుదర్శన్రెడ్డి, అక్కల రఘోత్తం, భద్రయ్య, వినయ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. – రైస్ మిల్లర్లుకలెక్టర్ దివాకరకు వినతిపత్రం ఇస్తున్న రైస్మిల్లర్లు -
ఎస్జీఎఫ్ జాతీయస్థాయి బాక్సింగ్ కోచ్గా రమేశ్
వెంకటాపురం(ఎం): స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ (ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే బాక్సింగ్ టీంకు కోచ్గా మండల కేంద్రానికి చెందిన మామిడిపెల్లి రమేశ్ ఎంపికయ్యారు. ఈనెల 30నుంచి మే 5 వరకు ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో నిర్వహించబోయే 68వ ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే అండర్–19 బాలికల బాక్సింగ్ జట్టుకు కోచ్గా రమేశ్ వ్యవహరించనున్నారు. తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం ఏటూరునాగారం: ఈ నెల 26, 27వ తేదీల్లో హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇండియా, నేపాల్ దేశాల మొదటి అంతర్జాతీయ తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల గిరిజన ఉపాధ్యాయుడు మైపతి సంతోష్ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ మాస్టర్ పాయం నేశంత్ తెలిపారు. 61కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకం సాధించడం అభినందనీయన్నారు. సివిల్ కోర్టులో చలివేంద్రం ప్రారంభం భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు శ్రవణరావు, రాజ్ కుమార్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు భూపాలపల్లి అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్ఖరే అభినందించారు. సివిల్స్ ర్యాంకర్కు సన్మానం భూపాలపల్లి అర్బన్: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జితేంద్ర నాయక్ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారితల్లిదండ్రులను అభినందించారు. టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలిభూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించి, పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపించారు. -
కేయూలో విద్యార్థుల ఆందోళన
కేయూ హాస్టళ్లు, మెస్లను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేశారు. హన్మకొండ: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తరచూ ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటివద్ద నుంచి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొత్తగా వాట్సాప్ చాట్బాట్ను తీసుకువచ్చింది. దీనిద్వారా విద్యుత్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా తమ సమస్యను సులువుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
బాలికలకు స్వీయ రక్షణ అవసరం
ఏటూరునాగారం: బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరమని కరాటే మాస్టర్ అబ్బు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల జూనియర్ కళాశాల రెసిడెన్షియల్లో అడ్వాన్స్ కరాటే సమ్మర్ క్యాంపు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, జిల్లా కరాటే అధ్యక్షుడు సూర్య సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలు బాలికల వెంటపడితే ఎలా రక్షించుకోవాలని ముఖ్యంగా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపునకు హాజరైన 75మంది బాలబాలికలకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, కరాటే మాస్టర్లు హుస్సేన్, అమీర్, బాలకృష్ణ, ఇరుప రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కరాటే మాస్టర్ అబ్బు నాలుగు రోజుల పాటు సమ్మర్ క్యాంపు -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలి ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడు లను నిలిపివేయాలని సీపీఐఎంఎల్ నాయకుడు విజయ్కుమార్ డిమాండ్ చేశారు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీచే అవకాశం ఉంది.అన్నదాతల అరిగోస గోవిందరావుపేటలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాల నుంచి రైతులు తేరుకోకముందే మళ్లీ కురుస్తున్న వర్షానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు.సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 9లోuప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్తి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్రోడ్లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు కట్టిపడేసిన ఆటాపాట.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. మృతులకు నివాళి అర్పించి.. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. గులాబీ వనంగా మారిన ఎల్కతుర్తి రోడ్లపైనే కిలోమీటర్ల మేర వాహనాలు ఆపరేషన్ కగార్ను ఆపాలి, నక్సల్స్తో చర్చించాలి.. తీర్మానానికి సభ ఆమోదం అట్టహాసంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ శ్రేణుల్లో జోష్..చప్పట్లు, కేరింతల నడుమ సాగిన కేసీఆర్ ప్రసంగం -
కొనసాగుతున్న కూంబింగ్
● కర్రిగుట్టలపై గుహ ఉన్నట్లు ప్రచారం వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో ఆరు రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్టుల ఆగ్రనేతలతో పాటు సుమారుగా వెయ్యిమంది ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఆదివారం 6వ రోజు కూంబింగ్లో భాగంగా గుట్టలపై వెయ్యి మంది నివాసం ఉండే విధంగా గుహ ఉందని అందులో నీటి సదుపాయంతో పాటు నిత్యావసర సరుకులు, ఆయుధాలు ఉన్నట్లు కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లిన జవాన్లు గుర్తించారని, జవా న్ల రాకను గమనించి అక్కడ తలదాచుకున్న మావోయిస్టులు వేరే ప్రాంతానికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. నిరసన ర్యాలీ మంగపేట: జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ మండల పరిధిలోని కమలాపురం జామియా మసీదు కమిటీ సభ్యులు ఆదివారం అంబేడ్కర్ సెంటర్ నుంచి జామా మసీదు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని కోరారు. -
నిర్దేశిత కాలవ్యవధిలో చార్జిషీట్లు సమర్పించాలి
ములుగు: ప్రతీ కేసును క్షుణ్ణంగా విచారించి నిర్దేశిత కాలవ్యవధిలో న్యాయస్థానానికి చార్జిషీట్లు సమర్పించాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయ సంబంధిత కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాక్షులను హాజరుపర్చడంపై బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సమన్వయంగా ఉంటూ కేసుల పరిష్కారాన్ని వేగంగా ముందుకుసాగేలా చూడాలని తెలిపారు. న్యాయస్థానాల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలన్నారు. ప్రతీ అధికారి తన విధులను నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. వారెంట్లను అమలు చేసి అనుమానితులను, నేరస్తులను సకాలంలో సురక్షితంగా న్యాయస్థానాలకు తరలించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయడమే పోలీసుల ప్రధా న బాధ్యత అన్నారు. ఈ సమీక్షలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్కుమార్, ఎస్సై జగదీశ్, ఐటీ సెల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సంధ్య, లైజనింగ్ అధికారులు, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు. ‘పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలి’ ములుగు: ఈ నెల 29న హైదరాబాద్లోని ఇందిరాపార్కు ఎదుట నిర్వహించ తలపెట్టిన ప్రభుత్వ పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గందె జగన్నాధం, బానోత్ దేవ్సింగ్లు శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చిన ప్రభుత్వం నేడు కాలం వెళ్లదీస్తూ వస్తుందని పేర్కొన్నారు. పెండింగ్ డీఏ, డీఆర్లను ప్రకటించాలని, పీఆర్సీ, 2023 జులై నుంచి అందాల్సిన మానిటరి బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఈహెచ్ఎస్, హెల్త్ కార్డులపై చికిత్స అందించాలని కోరారు. 2024 మార్చి తర్వాత పదవీవిరమణ పొందిన వారికి అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఎంజేపీ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు షురూ ఏటూరునాగారం: ములుగులోని మహాత్మాజ్యోతిరావుపూలే మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆడ్మిషన్లు ప్రారంభం అయినట్లు కళాశాల ప్రిన్సి పాల్ చెన్న సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రస్తుతం కాజీపేట మండల పరిధిలోని సోమిడిలో కొనసాగుతుందని వివరించారు. మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థినులు మే 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9491685294లో సంప్రదించాలని కోరారు. సర్వే పనుల అడ్డగింత మొగుళ్లపల్లి: మండలకేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు సర్వే పనులను రైతులు శనివారం అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ భూములు కోల్పోతున్న తమకు సరైన న్యాయం జరగకతేనే సర్వే పనులను ముందుకు సాగనివ్వమని రైతులు ఆర్డీఓ రవికి మొరపెట్టుకున్నారు. సర్వే పనులకు రైతులు సహకరించాలని ఆర్డీఓ కోరారు. మే మొదటివారంలో ట్రస్టుబోర్డు?కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం ట్రస్టుబోర్డు (పాలక వర్గం) నియామకానికి మే మొదటి వారంలోగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది. మే 15నుంచి 26వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంతో ట్రస్టుబోర్డు నియా మకం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ట్రస్టుబోర్డు కోసం జనవరి 6న నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల వారు ఽట్రస్టుబోర్డు డైరెక్టర్ల కోసం 86కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ధృవీకరణ పత్రాలు, పోలీసు కేసులు, ఇతర వ్యవహారాలు, వివరాలు సరిగ్గా లేని వారిని స్క్రూటినీలో తీసివేశారు. అన్ని సరిగ్గా ఉన్న 41మందిలో నుంచి 14మందిని డైరెక్టర్ల కోసం మంత్రి శ్రీధర్బాబు ఎంపికచేసి దేవాదాయశాఖకు లేఖ పంపించనున్నట్లు సమాచారం. ట్రస్టుబోర్డులో ఎక్స్అఫీషియోతో 15మంది డైరెక్టర్లు కాగా అందులో ఒక్కరిని చైర్మన్గా ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆశావహులు మంత్రి శ్రీధర్బాబు ఇతర నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
ములుగు రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసవిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ స్థాయిలో నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. విద్యార్థులకు క్రీడలు మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ఈ క్రీడా శిక్షణ శిబిరాలను యువజన సర్వీసుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ శిబిరాలను వినియోగించుకుని ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించాలి. శిక్షణ శిబిరాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో చేరేందుకు ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31 వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకు శిక్షణ ఇస్తారు. శిబిరాల్లో సైక్లింగ్, ప్లోర్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, క్రికెట్, ఖో–ఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కోచ్ల ఎంపిక పూర్తి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యింది. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం యువజన సర్వీసుల క్రీడల శాఖకు రూ.1.05లక్షలు కేటాయించింది. ఇందులో కోచ్లకు రూ.40 వేలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధికి, శిక్షణ శిబిరం నిర్వహణకు రూ.10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ. 4వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వహణకు వెయ్యి చెల్లిస్తారు. ములుగులో క్రికెట్, కబడ్డీ, ఏటూరునాగారంలో కబడ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారంలో హ్యాండ్బాల్, ఆకులవారి ఘణపూర్లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్ల ఎంపిక పూర్తి చేశాం. మే 1నుంచి 31వరకు శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన 14ఏళ్ల లోపు బాలబాలికలు అర్హులు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మందికి అవకాశం ఉంటుంది. – తుల రవి, జిల్లా యువజన సర్వీసుల క్రీడల అధికారి మే 1నుంచి 31వరకు నిర్వహణ జిల్లాలో 10 శిబిరాలు.. కోచ్ల ఎంపిక పూర్తి ఒక్కో శిబిరంలో 20నుంచి 25 మంది విద్యార్థులు -
‘భూభారతి’తోనే సమస్యలు పరిష్కారం
ఏటూరునాగారం: భూభారతి చట్టంతోనే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై ప్రజలు, నాయకులు, రైతులకు శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టంలో 14అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. దీంతో భూమితో ఉన్న సమస్యలు, తగాదాలు, గట్టు పంచాయతీలు కూడా తొలిగిపోతాయన్నారు. భూమి రిజిస్ట్రేషన్ ఇక నుంచి పారదర్శంగా ఉంటుందని వివరించారు. నిబంధనల ప్రకారమే భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారని వివరించారు. అంతేకాకుండా భూమి పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు, మార్పులు చేర్పులు చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత రైతుల వివరాలను సేకరించడంతో పాటు ఇరుగు పొరుగు వారి స్టేట్మెంట్ సైతం తీసుకుంటారని వివరించారు. చట్టంలో కీలకమైనది అప్పీలు వ్యవస్థ అని, ఎవరైనా రైతుకు అన్యాయం జరిగితే అప్పిల్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో గ్రామ పాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలను తగ్గించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. భూభారతితో ప్రజలందరికీ మేలు కన్నాయిగూడెం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రజలకు అన్నిరకాలుగా మేలు జరుగుతుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని రైతు వేదికలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సును స్థానిక తహసీల్దార్ వేణుగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణికి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టానికి ఉన్న తేడాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సాజిద తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
కాంగ్రెస్ ఇక ఖతమే!● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక – IVలోu -
నేడు చింతలపల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవం
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు (ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజ తోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకలకు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాల ను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో.. రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి చూడముచ్చటగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక రెడీ అయ్యింది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకోసం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్ అవిశ్రాంతంగా శ్రమించారు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28 మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 511 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు మిగతా డిస్ట్రిక్ట్ గార్డ్స్ను నియమించారు. మొత్తం 1,100 మందికిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ తదితర ప్రాంతాల్లో సేవలందించనున్నారు. వరంగల్ నగరం నుంచి ఎల్కతుర్తి వరకు ప్రదర్శనగా వెళ్తున్న ఆటోలుగంటకుపైగా ప్రసంగించనున్న కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న అధినేత కేసీఆర్ నేరుగా సభావేదికకు సుమారు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగుతారు. సుమారు 5.30 గంటల సమయంలో వేదికపైకి చేరుకునే అవకాశం ఉంది. వేదికపై ఆయన సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. పాతికేళ్ల పండుగకు తరలుతున్న జనం ఉమ్మడి వరంగల్ టార్గెట్ 2.50 లక్షల మంది జన సమీకరణలో నాయకుల తలమునకలు సాయంత్రం 4.30 గంటలలోపు సభకు చేరేలా ప్లాన్ 5.30 గంటల సమయంలో వేదికపైకి అధినేత కేసీఆర్ -
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో కోల్బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ ఎం.పవన్కుమార్ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకో వాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.● తేలిగ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి.● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్, ఎస్జీఎల్టీ 2 ఇన్హిబిటర్స్) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్ సలహా తీసుకోవాలి.● డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి.● డాక్టర్ సలహా లేకుండా మందులు మానేయరాదు.● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.– డాక్టర్ ఎం.ప్రవన్కుమార్, ఎండీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, భూపాలపల్లివాహనాల బ్యాటరీపై అధిక లోడ్ ఉండకుండా చూసుకోవాలి..– ఎండీ జాఫర్, సీనియర్ మెకానిక్ఖిలా వరంగల్: వేసవిలో ఏ వాహనమైన ఇంధనాన్ని పూర్తిగా నింపొద్దు. ఎండ వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పలుచబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజనాయిల్ను మార్చుకోవడం మంచిది. వాహన పెట్రోలు ట్యాంకుపై మందం కవర్ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణమైనవి. అయితే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకు ప్రత్యామ్నాయంగా వేడి కాకుండా ఉండేందుకు వెలివేట్ క్లాత్ వంటి సీటు కవరును వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే ద్విచక్రవాహనాలు దెబ్బతింటాయి. ఇంజన్లో మంటలు వస్తాయి. టైర్లు పేలుతాయి. ఎప్పటికప్పుడు కూలెంట్ ఆయిల్ చెక్చేసుకోవాలి. దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో వాహనాలను ఆపి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల వాహన ఇంజన్ వేడి తగ్గి కూల్ అవుతుంది. వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పార్కింగ్ చేయడం మంచిది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎండ వేడికి టైర్లు మెత్తబడి గాలి తగ్గి, బైక్ మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్కోసారి బైక్ టైర్లు పేలి అదుపు తప్పి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. వేసవిలో వాహనాల్లో బ్యాటరీపై ఎక్కువ లోడ్ పడుతుంది. ఇదే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, పరిమితికి మించి వాహనంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలను బిగించడం వల్ల షార్ట్ సర్క్యూట్కు ఆస్కారం ఉంటుంది.చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు.హీట్ స్ట్రోక్ లక్షణాలు..● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు.● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి.● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి.● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి.● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి.మూగజీవాలకు తాగునీరు అందిద్దాం– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేటజనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండెలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి.ఉద్యాన పంటలకు ఎప్పుడూ తేమ ఉండాలిహన్మకొండ: వేసవిలో ఉద్యాన పంటలను తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాపాడుకోవచ్చు. కిచెన్, రూఫ్ గార్డెన్ నిర్వహిస్తున్న వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి సరి పడా కూరగాయలు పండాలంటే ఎంత స్థలంలో సాగు చేయాలనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. సాగుకోసం నర్సరీ నుంచి నాణ్యమైన మొక్కలు తెచ్చి పెంచుకోవాలి. మొక్కలను ఎండ, వాన ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో పూత రాలిపోతుంది. మొక్కలకు ఎప్పుడు తేమ తగిలేలా చూసుకోవాలి. కర్రల సాయంతో గ్రీన్ షేడ్నెట్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. వేప నూనె, క షాయాలు మొక్కల పాదులో కాకుండా పైనా పిచికారీ చేయాలి. అప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. – చేరాల రాకేశ్, వరంగల్ ఉద్యాన అధికారి (టెక్నికల్) -
పిల్లల ఎదుగుదలపై శ్రద్ధ చూపాలి
ములుగు: పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో శుక్రవారం సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బందితో జిల్లా సంక్షేమ అధికారి కె.శిరీష పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఏఎం, ఎంఏఎం (లోప పోషణ) పిల్లల పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి చిన్నారులను పరిశీలించి ఎస్ఏఎం, ఎంఏఎ లోపం లేదని నిర్ధారించుకోవాలన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం, కేంద్రాల్లో తాగునీటి సరఫరాతో పాటు తదితర అంశాలపై సీడీపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం ద్వారా 18 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు కలెక్టర్ మంజూరు చేయగా పనుల వివరాలపై చర్చించినట్లు తెలిపారు. సొంత, అద్దె భవనాలు శిథిలావస్థలో ఉంటే వెంటనే మార్చాలని సూచించారు. అంగన్వాడీలు మొబైల్ అప్లికేషన్లో డేటా అప్డేట్ చేసే విధంగా ఎప్పటికప్పడు సీడీపీఓలు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీడీపీఓ ప్రేమలత, ఎస్ఎస్తాడ్వాయి సీడీపీఓ విజయ, ఉమ్మడి జిల్లా ఐటీ సమన్వయ కర్త మహేష్, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ మమత, బ్లాక్ కో ఆర్డినేటర్లు వెంకట్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మహాజాతరలో శాశ్వత తాగునీటి పనులకు ప్రణాళికలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో 2026 ఫిబ్రవరిలో జరగనున్న మహాజాతరలో శాశ్వత తాగునీటి పనుల కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి శుక్రవారం మేడారంలో పర్యటించారు. 2026లో జరిగే మహాజాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు శాశ్వత తాగునీటి వసతి కల్పించనున్న పనుల ప్రదేశాలను గుర్తించారు. మేడారం పరిసర ప్రాంతంలోని చింతల్ క్రాస్ రోడ్డు, కాల్వ పల్లి క్రాస్, కన్నెపల్లి, చిలకలగుట్ట, జంపన్నవాగు బ్రిడ్జి పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్, శివరాంసాగర్ చెరువు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో భక్తులు వేలాదిగా విడిది చేస్తారని గుర్తించారు. తాగునీటి పనుల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సురేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాశ్వత పనుల నిర్మాణానికి గుర్తించిన ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు భక్తుల సౌకర్యార్థం మూత్రశాలలు, మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రణాళికలను తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. మేడారంలో 2026లో మహాజాతరకు వచ్చే భక్తులకు జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వచ్చే మహాజాతరకు జాతర పరిసర ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేష్, ఈఈలు మాణిక్యరావు, రామాంజనేయులు, సుభాష్, డీఈలు సునీత, సతీష్, జీవన్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.మేడారంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారుల బృందం పర్యటన -
‘ఆపరేషన్ కర్రెగుట్ట ఆపండి.. చర్చలకు రండి’
ములుగు: తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రబుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
ములుగు: పీసీ–పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం.. ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం.. నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రుల్లో అందించే సేవల ధరల పట్టికను, వైద్యుల పేర్లను ప్రదర్శించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలన్నారు. లేకపోతే రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. ప్రతీ నెల ప్రైవేట్ నర్సింగ్ హోంలో అందించిన వైద్య సేవలను, హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో 5వ తేదీ వరకు నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ పరీక్షలు చేసే సమయంలో పాజిటివ్గా నిర్ధారణ అయితే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ అధికారి పూర్ణ సంపత్రావు, ఎస్ఓ స్వరూపారాణి, మానిటరింగ్ సూపర్వైజర్ సురేశ్బాబు, డీఈఓ నిఖిల్, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఏటూరునాగారం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్లు ఏటూరునాగారం కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఇటీవల వరంగల్లో జరిగిన సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ జిల్లా స్థాయి పోటీల్లో రాధిక, సాయి కీర్తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. కాగా.. ఈనెల 29 నుంచి 30 వరకు ఆదిలాబాద్లో జరిగే రాష్ట్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి వరంగల్ టీం తరఫున పాల్గొంటారని ఆయన తెలిపారు.శిక్షణార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలిములుగు/ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)సెంటర్ను గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ ఆకస్మికంగా పరిశీలించారు. నిరుద్యోగులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు అందించాలని సూచించారు. ఏమైనా అవసరాలుంటే వెంటనే మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి వసతులు కల్పిస్తామన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ నాయకుడు గూడెపు రాకేశ్, తదితరులు ఉన్నారు. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అజ్మీర దులమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబాన్ని గురువారం రవిచందర్ పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.మద్యం మత్తులో మహిళ ఆత్మహత్యాయత్నం!కన్నాయిగూడెం: మండలంలోని చిట్యాలలో ఓ మహిళ మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సర్వాయి గ్రామ పంచాయతీలోని చిట్యాలకు చెందిన బంధం సమ్మక్క(42) మద్యం మత్తులో పురుగుల మందు తాగిందా? లేక కుటుంబ గొడవలు ఏమైనా జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తుల సహకారంతో మహిళను భర్త లక్ష్మయ్య 108లో వైద్యం కోసం ఏటూరునాగారం తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సలహా మేరకు ములుగు ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు తెలిసింది.రాత్రి పది తర్వాతే లారీలు అనుమతించాలి..వెంకటాపురం(కె): రాత్రి పది గంటల తర్వాతే ఇసుక లారీలను మండలం నుంచి బయటకు వెళ్లేలా అనుమతించాలని ఆది వాసీ నవ నిర్మాణసేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహమూర్తి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బుధవారం రాత్రి బర్గూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుక లారీ ఢీకొని చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఇసుక లారీలను అనుమతించడంతోనే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్ర మాదం జరిగితే లారీ ఓనర్స్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీల అతివేగం, ఓవర్లోడ్తో వెళ్తున్నాయన్నారు. వేగాన్ని నియంత్రిండంతో పాటు ప్రమాదాలు తగ్గేలా రాత్రి సమయాల్లో మాత్రమే లారీలను అనుమతించాలని కోరారు.అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులివ్వాలి..ములుగు రూరల్: అంగన్వాడీ సెంటర్లకు మే నెలలో వేసవి సెలవులివ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. ఈమేరకు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీడబ్యూఓ శిరీష, అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండల తీవ్రత కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క, భాగ్యలక్ష్మి, సరిత, జమున, రాణి, సత్యనారాయణమ్మ, మీనా పాల్గొన్నారు. -
29న హేమాచల క్షేత్రంలో జాతర వేలం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 29న జాతర బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్లూరు గుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో మే 8 నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు(జాతర) ఆత్యంత వైభవంగా జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుట్టపై జరిగే పది రోజుల జాతరలో, జాతర ప్రారంభానికి ముందు మే 1 నుంచి 31 వరకు నెల రోజులు ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపులు ఏర్పాటు చేసుకుని విక్రయాలు జరిపేందుకు దేవాదాయశాఖ ద్వారా అనుమతి ఇచ్చేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునేందుకు రూ.లక్ష లడ్డు, పులిహోర ప్రసాదాలు తయారు చేసి విక్రయించేందుకు రూ.లక్ష, భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలు (పుట్టు వెంట్రుకలు) పోగు చేసుకునేందుకు రూ.2 లక్షలు, కొబ్బరి ముక్కలకు రూ.10 వేలు చెప్పుల స్టాండ్కు రూ.5 వేలు, ఫొటోలు తీసుకునేందుకు రూ.5 వేలు, బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 నుంచి 28 వరకు దేవస్థానం కార్యాలయంలో రూ.500 చెల్లించి కొటేషన్ కొనుగోలు చేయాలని సూచించారు. కొటేషన్ కొన్న వారికి మాత్రమే, షెడ్యూల్లో పొందుపర్చిన దరావత్తు సొమ్ము డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంని పేర్కొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ హైదరాబాద్ వారి తుది ఆమోద ఉత్తర్వుల మేరకు వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి సమాచారం కోసం హేమాచల క్షేత్రం ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
ఎస్ఎస్తాడ్వాయి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మతిపోయేలా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి వియవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా పార్టీ నాయకులతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేడారం జాతర మాజీ చైర్మన్ రేగ నర్సయ్య, జిల్లా నాయకుడు జగదీశ్, మాజీ మండల అధ్యక్షుడు మోహన్రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తుమ్మల రాజేందర్, మాజీ ఉప సర్పంచ్ ఇంద్రాసేనారెడ్డి, నాయకులు ఎండీ రఫీక్, కొర్నెబెల్లి శేషగిరి, పత్తి గోపాల్రెడ్డి, నగేశ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ కోట సురేశ్ పాల్గొన్నారు. -
మరమ్మతుకు నోచని ‘మల్లూరు’
మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టునిధులు కేటాయించాలి.. వేలాది ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం నిధులు కేటాయించాలి. మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టుతో పాటు ఈప్రాంత సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన మంత్రి సీతక్క ఈఅంశంపై స్పందించాలి. ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలి. – తాటి భిక్షం, రైతు, నర్సింహాసాగర్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాం.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ తూము లీకేజీలు, మత్తడి 1, 2, 3, 4 మరమ్మతులు, అపరాన్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.10.5 కోట్లు ఎస్టిమేట్ నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయానికి పంపించాం. – వలీమ్ మహ్మద్, ఏఈ, ఏటూరునాగారం సబ్డివిజన్మంగపేట: మండలంలోని మల్లూరు మధ్య తరహా ప్రాజెక్టు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టును ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపుచూపులా వచ్చి వెళ్తున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 26 అడుగుల నీటి మట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యింది. మొట్ట మొదటిసారి ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు ఉన్న 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాలువ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరందాల్సి ఉంది. హామీలు నీటి మూటలు.. ప్రాజెక్టు అభివృద్ధిపై గడిచిన పదేళ్లలో అప్పటి పాలకులు ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. 2015లో స్వయంగా అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దివంగత మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధి కోసం.. కుడి, ఎడమ కాలువలు, తూముల నిర్మాణం, ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలు అతీగతీ లేకుండా పోయాయి.ప్రస్తుతం ప్రాజెక్ట్ మత్తడి శిథిలావస్థకు చేరింది. ఇప్పటికే మత్తడి పలు చోట్ల కొతకు గురై కొట్టుకుపోయింది. అపరాన్ పూర్తిగా ధ్వంసమై మూడేళ్లు గడుస్తున్నా.. ఇరిగేషన్ అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీలకు వేసవి కాలం ప్రాజెక్టులో నీరు నిండుకున్న సమయంలో చేపట్టకుండా.. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తర్వాత మరమ్మతులు చేపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మకై ్క నాసిరకంగా మరమ్మతులు చేపడుతూ.. చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పొలాలకు ఉపయోగపడాల్సిన నీరు తూముల నుంచి లీకేజీ రూపంలో వృథాగా పోతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో గత 15 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా.. ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఈఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అయిన్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.కొరవడిన పర్యవేక్షణ 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వాహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో అభివృద్ధికి నోచుకోక పూర్తి నిరాధరణకు గురైంది. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు అనుకూలించిన రెండు నుంచి నాలుగు ధఫాలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి ఆయకట్టు భూములకు సాగునీరందిన సందర్భాలు లేవని రైతులు వాపోతున్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమా అంటూ.. ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు అందినకాడికి దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుడి, ఎడమ కాలువల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో గత 10 ఏళ్ల కాలంలో కొందరు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు దండుకుని చేతులు దులుపుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. -
ఇసుక క్వారీ నిర్వహణకు ఏకగ్రీవ తీర్మానం
మంగపేట: మండలంలోని కత్తిగూడెం ఇసుక క్వారీ నిర్వహణను శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్కు అప్పగిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. పంచాయతీ పరిధి రిజిస్టర్డ్ ఇసుక లేబర్ సొసైటీల్లో ఇసుక రీచ్ నిర్వహణ కోసం సొసైటీని గుర్తించేందుకు జీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి చెదలవాడ కృష్ణాజీ అధ్యక్షతన గురువారం పెసా గ్రామ సభ నిర్వహించారు. ఎంపీడీఓ భద్రు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ భిక్షపతి పెసా నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శ్రీ ఆంజనేయ, సమ్మక్క సారక్క రెండు సొసైటీలు ఉండగా.. సమక్క సార క్క సొసైటీ ఆడిట్ లేకపోవడంతో శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్కు క్వారీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు సొసైటీ సభ్యులు 12 మంది అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. నివేదికను ఉ న్నతాధికారులకు పంపిస్తామని ఎంపీడీఓ వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ వల్లి శ్రీను, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి..
ములుగు రూరల్: ఎస్టీ ఉపకులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం మండలంలోని రాయినిగూడెంలో ఎస్టీ వర్గీకరణ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ తెగల్లో ఏబీసీడీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ.. 1996లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బకట్ల నర్సింగరావు ఆశయ సాధనకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్టీ, ఎస్సీ ఉప కులాలు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందేలా వర్గీకరణ చేపట్టాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏటూరునాగారంలో నేడు(శుక్రవారం) నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు తవిటి నారాయణ, నెమలి నర్సయ్య, స్వామి, జగ్గారావు, వజ్జ రాజు, రమేశ్, సాంబయ్య, వినీత్ పాల్గొన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని జిల్లా కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మ ల్లయ్య, కైలాశ్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. ‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు.. ఆరు జిల్లాల నుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులుడీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాల నుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడి నుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్రాజ్, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడ వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీ పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి కీలకం కానున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోకే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. -
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు. -
‘భూభారతి’తో భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ టీఎస్.దివాకర వాజేడు: దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని, రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల్లో ఉన్న పొరపాట్ల సవరణకు సైతం అవకాశం ఉందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన సదస్సులో భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు తమ భూముల విషయంలో ఉన్న అభద్రతా భావానికి తావు లేకుండా జవాబుదారి తనాన్ని పెంచేందుకు భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులుభ తరం అవుతాయని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాల్లోని ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు. జిల్లాలో ఉన్న అసైన్మెంట్, సాదా బైనామాలు, పాస్ పుస్తకాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సర్వేలు చేసి కొలతలు, హద్దులు, భూముల వివరాలను ఒకే పుస్తకంలో ఉండేలా ఆధార్ తరహాలో భూధార్ను రూపొందించ నున్నట్లు వెల్లడించారు. భూ భారతి చట్టం ద్వారా భూమికి సంబంధించిన సమస్యలు జిల్లా స్థాయిలో సత్వరమే పరిష్కరించబడుతాయని వివరించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చింతూరు, లక్ష్మీపురం, ఆర్లగూడెం గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట దెబ్బతిందని తమకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సదస్సులో మండల ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. విశ్వ సుందరీమణుల రాకకు ఏర్పాట్లు వెంకటాపురం(ఎం): వచ్చే నెల 14వ తేదీన విశ్వ సుందరీమణుల రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం రామప్ప ఆలయం, హరితహోటల్, ఇంటర్ర్పిటేషన్ సెంటర్లలో చేస్తున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామప్పను సందర్శించడానికి వచ్చే విశ్వ సుందరీమణుల కోసం స్వాగత ఆర్చ్, ఆలయంలో లైటింగ్తో సుందరీకరణ, గ్రీనరీ పెంచడం, కాకతీయ కట్టడాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడానికి విదేశీ పర్యాటకుల కోసం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా దేశాల సుందరీమణులను పర్యాటక ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, పర్యాటక అభివృద్ధి శాఖ అధికారులు, పురావస్తుశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
భయం గుప్పిట్లో ఏజెన్సీ
ములుగు: బచావో కర్రిగుట్టల పేరుతో కేంద్ర సాయుధ బలగాలు, తెలగాణ సీఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్తో సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సాయుధులైన సుమారు 2000 మంది పోలీసు బలగాలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ముందుకు సాగుతున్నాయి. మంగళవారం నుంచి దట్టమైన అడవిలో కాలు మోపిన బలగాలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను అందించేందుకు కేంద్రం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. యుద్ధ బలగాలను గుర్తించి సరుకులను అందిస్తోంది. దీంతో బలగాలు రెట్టింపు వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కర్రిగుట్టల చుట్టు బాంబులను అమర్చినట్లు మావోయిస్టులు కర పత్రాలను విడుదల చేసిన నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్స్ వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. 30గంటలు దాటినా కానరాని మావోయిస్టుల ఆచూకీ.. ఇదిలా ఉండగా పోలీసు బలగాలు కర్రిగుట్టల్లో అడుగు పెట్టి 30గంటల సమయం దాటుతున్నప్పటికీ మావోయిస్టుల ఆచూకీ తెలియలేదని సమాచారం. ఒక వేల కర్రిగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకొని ఉండి ఉంటే ఇప్పటికే పోలీసుల సమాచారం మావోయిస్టులకు తెలిసి ఉంటుంది. ఈ ప్రకారం గెరిల్లా శిక్షణ పొందిన మావోయిస్టులు ఎదురు దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని వాతావరణం నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తూర్పువైపు నుంచి ఛత్తీస్గఢ్ బలగాలు, పడమర నుంచి తెలంగాణ, కేంద్ర సాయుధ బలగాలు కర్రి గుట్టల్లో ప్రవేశించడం వెనుక గల ఆంతర్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నివురుగప్పిన నిప్పులా మారిన కర్రిగుట్టల్లో తుపాకీ మోతల శబ్ధాలు వినిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై వాజేడు, వెంకటాపురం(కె) ములుగు జిల్లా పోలీసులను వివరణ కోరగా ఎలాంటి సమాచారం రావడం లేదు. కర్రిగుట్టలను చుట్టు ముట్టిన సాయుధ బలగాలు హెలికాప్టర్ల ద్వారా సిబ్బందికి నిత్యావసర సరుకులు బచావో కర్రిగుట్టల పేరుతో కొనసాగుతున్న కూంబింగ్హిడ్మా, దామోదర్ ఉన్నారా? రోజు రోజుకూ బలహీన పడుతున్న మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్ర కమిటీలో ఉన్న మడవి హిడ్మా, దామోదర్ వంటి అగ్రనేతలు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వ్యాపించి విస్తారంగా ఉన్న అడవిలో కర్రి గుట్టలను స్థావరంగా మార్చుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటనతో బలగాలు రెట్టింపుగా కూంబింగ్కు దిగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులను కోల్పోవడం, మరి కొందరు లొంగుబాటుతో పార్టీకి దూరమవడంతో మావోయిస్టు పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోంది. ఈ క్రమంలో మడవి హిడ్మా, దామోదర్లు కర్రి గుట్టల్లో ఉండవచ్చనే నిఘా వర్గాల సమాచారంతో సాయుధులైన పోలీసు బలగాలు ముందుకు చొచ్చుకు పోతున్నట్లు తెలుస్తోంది. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో 19మంది డీబార్
ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రంలో 19మంది అభ్యర్థులను బుధవారం డీబార్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఓపెన్ పరీక్ష సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్వాడ్ బృందం తనిఖీలు చేయగా అభ్యర్థుల వద్ద మాస్కాపీయింగ్ స్లిప్లు దొరకడంతో డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులను మిగిలి ఉన్న మూడు పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారని వివరించారు. ‘భూ క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్లు ఇవ్వాలి’ ములుగు రూరల్: భూ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రొసీడింగ్లు ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూల్ చేస్తుందని ఆరోపించారు. డబ్బు చెల్లించినా ప్రొసిడింగ్ కాపీలను అందించకుండా కాలయాపన చేయడం సరికాదని వివరించారు. జిల్లాలో 1,440 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.2.43 కోట్లు చెల్లిస్తే 582 మందికి మాత్రమే ప్రొసీడింగ్ అందించారని వివరించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీండింగ్లు అందించాలని కోరారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీడీ ఆవిష్కరణ చిట్యాల: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన గూడెపు హర్షవర్ధన్ ఓరుగల్లుకు ‘ పోదాం పద ’ అనే పాటతో సీడీ రూపొందించాడు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సభా వేదిక ఏర్పాటు ప్రదేశంలో బుధవారం సీడీని ఆవిష్కరించారు. ఈసంద్భంగా గాయకుడిని కేటీఆర్ అభినందించారు. పాటను రచించిన కల్లెపెల్లి సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు, సహకారం అందించిన తౌటం నవీన్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, పీఏసీఏస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, రవీందర్ రావు, రాజేందర్, నవీన్, నాయకులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు చిట్యాల: అభం శుభం తెలియని చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన రత్న రమేష్ కుమార్తె నైనిషా బుధవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న మూడు కుక్కలు ఆమెను వెంటాడి గాయపరిచాయి. దీంతో చిన్నారరి మెడ చుట్టూ, వీపుపై గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయిబాట’ భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ నాయకులు బుధవారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో బాయిబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6వ గనిలో కార్మికులను మ్యాన్ రైడింగ్ సమస్య, పని స్థలాల్లో గాలి, తాగునీరు సరఫరా చేయాలనే సమస్యలను కార్మికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్రెడ్డి తెలిపారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భూగర్బ గనిలోని వెళ్లి కార్మికుల పని స్థలాలను పరిశీలించి నేరుగా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జోగు బుచ్చయ్య, హుస్సెన్, అశోక్, లక్ష్మీనారాయణ, రఘు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఆరబెట్టిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన కరాబు రాజు నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలం పత్తి పంటను సాగుచేయగా అధిక వర్షాలకు దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో పత్తి పంటను తొలగించి నాలుగు ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు. పంట కోత కోసి ఆరేందుకు పొలంలోనే ఉంచాడు. బుధవారం ప్రమాదవశాత్తు పంటకు నిప్పు అంటుకుంది. ఇతర రైతులు గమనించి రాజుకు సమాచారం అందించారు. రైతులంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితంలేకుండాపోయింది. నాలుగు ఎకరాల పంట అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.4 లక్షల పంట నష్టం జరిగిందని రైతు వాపోయాడు. అలాగే మరో రైతు కృష్ణకు చెందిన రెండు ఎకరాలల్లోని మొక్కజొన్న పంట కోసి పొలంలో ఆరబెట్టగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. -
సేవాభావంతోనే ప్రతిభకు గుర్తింపు
ములుగు: ఉన్నత చదువులు చదివి సేవాభావం కలిగి ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80.12శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలివడంపై హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ప్రణవి, రితీష్ నాయక్, స్ఫూర్తి, నితీష్, కీర్తన, చైత్రను శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎంత నేర్చుకున్నాం అనేది ముఖ్యం కాదని.. నేర్చుకున్నది ఎవరికి ఉపయోగపడుతుందనేదే ముఖ్యం అన్నారు. ఉన్నత చదువులు చదివిన వారు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయడానికి ముందుకురావాలన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగుతో పాటు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న అసిఫాబాద్ జిల్లాలు ఇంటర్ ఫలితాల్లో మొదటి, రెండో స్థానాల్లో నిలవడం అభినందనీయమన్నారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలతో అవార్డులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి చంద్రకళ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రామాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ జిల్లా కేంద్రంలోని రామాలయ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క బుధవారం భూమిపూజ చేశారు. రూ.10లక్షలతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి సీతక్కను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పనులను చేపట్టే విధంగా కృషి చేస్తానని వివరించారు. ములుగు నియోజకవర్గంలోని అన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తానని వెల్లడించారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
పర్యాటకులపై దాడి అమానుషం
ములుగు రూరల్: కశ్మీర్లో పహల్గాంలో పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేయడం అమానుషం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని జాతీయ రహదారిపై ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్యులరిజం ముసుగులో రాజకీయ పార్టీలు హిందువులను జెండాలు మోసే బానిసలుగా చూస్తున్నాయన్నారు. దేశాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజల జీవితాలను, భవిష్యత్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్లాల్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీశ్, కృష్ణాకర్రావు, రాజ్కుమార్, నాగరాజు, హేమాద్రి, పాపిరెడ్డి, మహేందర్, రఘుపతి, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జ్లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చార్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలుసభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్నాయ క్, నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్య ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్పూర్లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్ను స్వాఽధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు.. సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్ప్రీత్సింగ్ అభినందించారు. సాయి ప్రకాశ్ హత్య కేసులో కానిస్టేబుల్తో సహా ఆరుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ సన్ప్రీత్సింగ్ -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి
ఏటూరునాగారం: దేశంలోని అన్ని రంగాల కార్మికుల కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని మే 20న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి కార్మికులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ 29కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసిందన్నారు. అనంతరం నాయకులు మల్లికార్జున్, దావూద్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను మోసం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తం సమ్మెకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, నాయకులు సద్దాం హుస్సేన్, మహేష్, పాప, రంజిత్, సడాలు, భిక్షపతి, సూరమ్మ, ఈశ్వరి, సుశాంత, నర్సమ్మ, రాంబాబు, రుక్మిణి, ఆదిలక్ష్మి, కాంత, కొమురయ్య, రాంబాబు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మాధవి -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్రెడ్డి అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్రెడ్డి, మధుకర్రెడ్డి,ఎం.సతీశ్కుమార్ అభినందించారు. -
రాష్ట్రస్థాయిలో నంబర్వన్
బాలికలదే మొదటి స్థానం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరంలో మొత్తం 833 మంది బాలురు పరీక్ష రాయగా 616 మంది పాసై 73.95శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 802 మంది పరీక్ష రాయగా 694 మంది పాసై 86.53 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,635 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,310 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో బాలురు 56 మంది పరీక్ష రాయగా 41 మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలు 152 మంది పరీక్ష రాయగా 143 మంది పాసై ఏకంగా 94.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్, ఒకేషనల్ విభాగంలో బాలికలే మొదటి స్థానంలో నిలిచారు.ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జిల్లాస్థానం ● గతేడాది ఫస్టియర్లో ఫస్ట్, ఈఏడాది 13వ స్థానం ● కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను సన్మానించిన మంత్రి సీతక్క ములుగు: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఈ సారి 80.12 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. గతేడాది మొదటి సంవత్సరంలో ఇదే బ్యాచ్ వందశాతం ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఇంటర్మీడియట్ ఫలితాలపై మంత్రి సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారి వివరాలను సేకరించి జిల్లా యంత్రాంగం తరఫున వారిని సన్మానించాలని కలెక్టర్కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగంలో ఎంపీహెచ్డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పెండ్యాల ప్రవళిక 984/1000 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంకర్గా నిలిచారు. అలాగే టి.నందిని బైపీసీ సెకండియర్లో 935మార్కులు సాధించగా ఎంపీసీ సెకండియర్లో నితీష 953మార్కులు సాధించింది. మాధవరావుపల్లిలోని కస్తూర్బాలో ఎంపీహెచ్డబ్ల్యూ మొదటి సంవత్సరంలో జాడి రష్మిత 468మార్కులు సాధించింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 13వ స్థానం ఇంటర్మీమీడియట్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 877 మంది బాలురు పరీక్ష రాయగా 734 మంది పాస్ కాగా శాతం ఉత్తీ ర్ణత సాధించారు. బాలికల విభాగంలో 832 మంది పరీక్ష రాయగా 625 మంది పాసై 75.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 71 మంది బాలురు పరీక్ష రాయగా 45 మంది పాసై 63.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 170 మంది బాలికలు పరీక్ష రాయగా 151 మంది పాసై 88.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తానికి రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్స రం ఫలితాల్లో జిల్లా 13 స్థానంలో నిలిచింది. అభినందించిన మంత్రి సీతక్క ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణతలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను శాలువాలతో సన్మానించారు. అనంతరం విద్యాభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కను సైతం అధికారులు సన్మానించారు.ఐఏఎస్ కావడమే లక్ష్యం వాజేడు: మండల కేంద్రానికి చెందిన డెక్క వెంకటస్వామి, మాలతీల కూతురు ధరణి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఎంపీసీలో 983మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. తండ్రి టీవీ మెకానిక్ చేస్తుండగా తల్లి టైలరింగ్ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన ధరణి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అన్నారు. ఎంతకష్టమైన పడి అనుకున్న లక్ష్యం చేసుకుంటానని చెబుతోంది. -
మహాజాతర పనులకు రూ.145 కోట్లు
ములుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరలో చేపట్టే వివిధ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.145 కోట్లు కేటాయించనుందని, ఈ మేరకు అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో పనులు పూర్తిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర అధ్యక్షతన మేడారం మహాజాతర 2026ను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించగా మంత్రికి పలుశాఖల అధికారులు వివిధ రకాల పనుల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారంలో 6 నెలల ముందుగా పనులు చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ఏడాదిలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరతో పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రెండు పెద్ద పండుగలను పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కుంభమేళా తరహాలో సాగుతున్న మేడారం జాతరను విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. గత మహాజాతర సందర్భంగా మిగిలి ఉన్న రూ.50 కోట్లను సైతం రానున్న మహాజాతరకు వినియోగిస్తామని వెల్లడించారు. గద్దెల పరిసర ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు జంపన్న వాగుపై రూ.5 కోట్లతో పెద్దలు, పిల్లలు సేద తీరడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. జాతర సందర్భంగా తాగునీటి సమస్య, మరుగుదొడ్ల సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ గతంలో మేడారం మహాజాతరలో పనిచేసిన అధికారుల సూచనలతో రానున్న మహాజాతరను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఆర్డీఓ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్డీఓ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే జాతర నాటికి మేడారంలో శాశ్వత పనులు చేయాలి ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు సమర్పించాలి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కభూ భారతితో సమస్యలు పరిష్కారం మంగపేట: ఽరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో అన్ని రకాల భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూ సమస్యలను పరిష్కరించి పట్టాలు అందజేసేలా సీఎం రేవంత్రెడ్డి చట్టాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ భూభారతి చట్టంతో 90శాతం భూ సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం మంత్రి సీతక్క వివిధ గ్రామాలకు చెందిన 35మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రికి పలువురు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తదితర సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. -
ములుగు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ -
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
ములుగు, సాక్షి: తెలంగాణలో సరిహద్దులో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో(Karreguttalu) భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. ఛత్తీస్గఢ్ వైపు నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు ప్రతి కాల్పులకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలోకి వస్తోంది. అయితే.. కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావొద్దంటూ ఆ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాన్ని ములుగు పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు రెండు వేల మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. హిడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు . దీంతో ఆ రీజియన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొంగాల, అరుణాచల పురం, బొల్లారం గ్రామాలు, అలాగే.. వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు, పెంక వాగు, మల్లాపురం, కర్రెవానిగుప్ప, లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు కలిపాక, సీతారాంపురం గ్రామాల్లో, కర్రెగుట్ట పైన ఉన్న పామనూరు, ముకునూరు, చెలిమెల, తడపల , జెల్ల గ్రామాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
2,208.34ఎకరాల్లో పంట నష్టం
మంగపేట: మండల పరిధిలో ఈ నెల 7న కురిసిన వడగండ్ల వర్షానికి 2,208.34 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మండల పరిధిలోని మల్లూరు. కొత్తమల్లూరు, నర్సింహాసాగర్, తిమ్మంపేట, బాలన్నగూడెం పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించగా చేపట్టిన సర్వే సోమవారంతో ముగిసిందని వెల్లడించారు. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన 4 టీములతో కూడిన 16మంది అధికారులు ఆయా గ్రామాల్లో దెబ్బతిన పంటలను 14రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు. అగ్రికల్చర్ కమిషనరేట్ నిబంధనల మేరకు 942మంది రైతులకు చెందిన 2,208.34ఎకరాల్లో పంటనష్టం సంభవించగా ఆ వివరాలను ట్యాబ్లలో నమోదు చేసినట్లు వివరించారు. గ్రామాల వారీగా పంటనష్టం వివరాలు ఇలా.. గ్రామం బాధిత రైతుల ఎకరాలు సంఖ్యనర్సింహాసాగర్ 323 829.12 నర్సింహాసాగర్ 33 84.25 (ఆర్ఓఎఫ్ఆర్) నరేందర్రావుపేట 21 46.09 శనిగకుంట 03 13.20 తిమ్మంపేట 194 431.06 అబ్బాయిగూడెం 01 01 మొట్లగూడెం 06 17.11 మెట్టుగూడెం 02 6.30 కొత్తమల్లూరు 01 01 మల్లూరు 184 441.37 బాలన్నగూడెం 63 94.25 చెరుపల్లి 111 242.24వివరాలు వెల్లడించిన అధికారులు -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాసర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిపోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్ఫర్ట్స్తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు పూర్తిచేయాలి
గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో 2018లో 34 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు అయ్యాయి. లబ్ధిదారుల కమిటీని ఏర్పాటు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టాం. ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం రూ.1.50కోట్లు మంజూరు అయ్యాయి. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ. 22లక్షలు నిలిచిపోయాయి. ఈ విషయంలో ఐటీడీఏ పీఓ, కలెక్టర్లకు పలుమార్లు పనులు పూర్తి చేయాలని విన్నవించాం. పెండింగ్ నిధులు మంజూరైతే ఇళ్ల పనులు పూర్తి అవుతాయి. ఒకేసారి నిధులు మంజూరు చేస్తే లబ్ధిదారులకు ఆసరాగా ఉంటుంది. – ఎన్టీఆర్ కాలనీ, డబుల్ బెడ్రూం ఇళ్ల్ల లబ్ధిదారులు● -
కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడారు. కవిత సోమవారం భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తుండగా చల్వాయి గ్రామంలో 10నిమిషాల పాటు కాన్వాయి ఆపి కార్యకర్తలను పలకరించారు. ఈ క్రమంలో మహిళలు కవితకు మంగళ హారతితో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ క్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహనాయక్, తుమ్మల హరిబాబు, భూరెడ్డి మధు, పూర్ణచందర్, బొల్లం ప్రసాద్, ఆలూరి శ్రీను, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. -
రవళికకు మంత్రి సీతక్క పరామర్శ
ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రిలో ప్రసవ సమయంలో బిడ్డను కోల్పోయిన రవళిక హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. ఈ మేరకు ఆరోగ్య విషయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రవళిక వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అక్రమ గ్యాస్ సిలిండర్ల పట్టివేత గోవిందరావుపేట: మండల పరిధిలోని సివిల్ సప్లయీస్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమ గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నారు. మండలంలోని వివిధ హోటళ్లు, గ్యాస్ ఫిల్లింగ్ చేసే షాపులు, చికెన్ సెంటర్లు, టీ స్టాల్స్, కిరాణ షాపుల్లో సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి ఫైసల్ హుస్సేన్, ములుగు, ఏటూరునాగారం డిప్యూటీ తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖల అధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనల మేరకు పలువురిపై కేసు నమోదు చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్గా సతీష్ వెంకటాపురం(కె): ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్గా పర్శిక సతీష్ను నియమించారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీను హాజరయ్యారు. ఆయన సమక్షంలో జిల్లా కన్వీనర్గా సతీష్, కో కన్వీనర్గా టింగ బుచ్చయ్య, పాయం భారతి, కుర్సం శివశంకర్, తాటి రామచందర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5న ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ చేపట్టనున్న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలిభూపాలపల్లి అర్బన్: సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి కోరారు. సింగరేణి పాఠశాలలోని శిక్షణ తరగుతులను జీఎం సోమవారం సందర్శించి మాట్లాడారు. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.45 కోట్లను విద్యకు ఖర్చు చేస్తుందన్నారు. ఏరియా పరిసర ప్రాంతాల పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝూన్సిరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు బుర్ర అశోక్, జితేందర్, వినోద్, రమేష్, విజయ్, ప్రశాంత్, విక్రమ్, రాజేష్, రాజు, సదానందం, సునిల్ పాల్గొన్నారు. -
గడువులోపు పనులు పూర్తి చేయాలి
భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోపు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ శాఖ, ఆర్టీసీ, వివిధ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖల అధికారులు ఇప్పటికే పనుల షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని, షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో నీటి సామర్ధ్యం నిశితంగా గమనిస్తూ ఉండాలని, గడిచిన 21 రోజుల నుంచి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నామని, 13 సెంటిమీటర్లు నీరు తగ్గిందన్నారు. గత మే నెలలో గోదావరి నీటి మట్టం 94 మీటర్ల 540 సెంటిమీటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్, డీపీఓ నారాయణరావు, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ సరస్వతి పుష్కరాల పనుల పురోగతిపై సమీక్ష -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారంతో పాటు భూమి హక్కు పట్టాలు రైతులు పొందుతారని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మల్లంపల్లి మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో ధరణి పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్లకు తప్ప ఏ అధికారికి అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతో తహసీల్దార్ స్థాయిలో వేల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి ద్వారా భూ సమస్యల పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. మ్యూటేషన్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని తెలిపారు. రెండింతల అప్పిల్ వ్యవస్థతో రైతులు భూ సమస్యలపై కోర్టు వరకు వెళ్లే అవసరం దాదాపుగా ఉండదని వివరించారు. గత చట్టానికి అనుగుణంగా మరో 14 నూతన అంశాలను పొందుపరిచారని తెలిపారు. ప్రతీ వ్యక్తికి గుర్తింపు కార్డు ఉన్న తరహాలో భూ భారతి చట్టం ద్వారా భూమి హక్కు పట్టాలు పొందుతారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ విజయభాస్కర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
వినతుల వెల్లువ
గ్రీవెన్స్, గిరిజన దర్బార్లో సమస్యలు పరిష్కరించాలని బాధితుల మొరములుగు/ఏటూరునాగారం: కలెక్టరేట్, ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, గిరిజన దర్భార్కు ప్రజలు భారీగా తరలివచ్చి పలు సమస్యలపై వినతులు అందజేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్లు సంపత్రావు, మహేందర్జీలు ప్రజల నుంచి 39దరఖాస్తులు స్వీకరించారు. ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా 15దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా వివిధ సమస్యలపై 54 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించిన అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. గ్రీవెన్స్ సెల్లో భూ సమస్యలు పరిష్కరించాలని బాధితులు అత్యధిక దరఖాస్తులు సమర్పించారు. గిరిజన దర్బార్లో వినతులు ఇలా.. కన్నాయిగూడెం మండలం ఏహెచ్ఎస్లో సీఆర్టీగా పనిచేస్తున్న సనప సుహాసిని తన ఇటీవల పాపకు ఆపరేషన్ జరిగిందని.. అందుకోసం ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి భద్రాచలం ఐటీడీఏకు డిప్యూటేషన్ చేయాలని వేడుకున్నారు. కన్నాయిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్ఐటీఐ పూర్తి చేసిన ఆదివాసీలతో కట్టర్ జాబ్స్ భర్తీ చేయాలని బాధితులు కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతానికి చెందిన కేంసర్తి అరుణ ఏదైనా జీవనోపాధి కల్పించి ఆదుకోవాలని వేడుకున్నారు. మండల కేంద్రంలోని క్రాస్రోడ్డు ప్రాంతంలో గల ఐటీడీఏ కాంప్లెక్స్ భవనం మరమ్మతులు చేయించాలని స్థానిక గిరిజన మహిళ బడే సులోచన కోరారు. మంగపేట మండలం బాలన్నగూడెం ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వాటిని తిరిగి ఇప్పించాలని గిరిజన రైతులు తిరుపతి, లక్ష్మయ్యతో పాటు మరో 14 మంది గిరిజనులు విన్నవించారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రాంతానికి చెందిన శ్రీరాములు, కృష్ణయ్యలు రెండ్యాల ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్కు సీసీ రోడ్డు, నీటి పైపులైన్లు నిర్మించేందుకు నిధులు మంజూరు ఇవ్వాలని కోరారు. తాడ్వాయి మండలం మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ తాడ్వాయిలోని ఎంపీపీఎస్కు కొత్త పాఠశాల నిర్మించాలని కోరారు. తాడ్వాయి మండలం రంగాపూర్, కోమటిపల్లి, చెల్పాక క్లాస్–4 ఉద్యోగులు ఇన్చార్జ్ వార్డులుగా పనిచేస్తూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రమోషన్ కల్పించి గ్రేడ్–2 వార్డెన్గా ప్రమోషన్ కల్పించాలని పీఓకు విన్నవించారు. ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో జరుపుల బానుచందర్ పంట చేనుకు బోరు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, డీడీ పోచం, ఐటీఐ టీఏ మువీన్, విద్యుత్శాఖ ఏఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ ఫొటోలో ఉన్నవ్యక్తి పేరు ఎట్టి రేవతి. ఎస్ఎస్ తాడ్వాయి మండలం భూపతిపురంకు చెందిన గిరిజన మహిళ. 2016లో జీఎన్ఎంగా పూర్తి చేసింది. ఐటీడీఏ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జీఎన్ఎం పోస్టు ఇప్పించి ఆదుకోవాలని గిరిజన దర్బార్లో పీఓకు వినతి అందజేసేందుకు వచ్చింది. తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని పీఓకు మొరపెట్టుకుంది. వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు, పీఓ మొత్తంగా 54 దరఖాస్తుల స్వీకరణ పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలుu -
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్హాల్ కాంప్లెక్స్లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ -
డెడ్ స్టోరేజీకి చేరువలో..
లక్నవరం సరస్సులో అడుగంటుతున్న నీరుగోవిందరావుపేట: లక్నవరం సరస్సు కళ చెదురుతున్నది. నీటితో కళకళలాడే సరస్సులో ఎండమావులు కమ్ముకుంటున్నాయి. లక్నవరం పూర్తి నీటి సామర్థ్యం 36 అడుగులు కాగా.. ఇప్పటికే నీటిమట్టం 14 అడుగులకు చేరింది. వేసవి తాపానికి తోడు యాసంగి పంట అధికారికంగా 4,150 ఎకరాలకు నీరు అందిస్తుండగా..అనధికారికంగా మరో 500 ఎకరాలు పంట సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చివరి ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే లక్నవరం సరస్సులోని నీరు ఇప్పటికే అడుగంటేది. నీరు లేక పర్యాటకుల రద్దీ తగ్గి, లక్నవరం సరస్సు వెలవెలబోతోంది. వచ్చిన కొద్దిమంది బోటు షికారు, అడ్వైంచర్ గేమ్స్ లేక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు. అగో వచ్చే, ఇగో వచ్చే అన్న చందంగా ఉంది లక్నవరంలోకి గోదావరి జలాలను తరలించే ప్రక్రియ. రామప్ప రిజర్వాయర్ నుంచి లక్నవరం వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు మోక్షం కలగడం లేదు. ప్రస్తుతం అడుగంటుతున్న జలాశయం మళ్లీ కళకళలాడాలంటే వర్షాలు సమృద్ధిగా పడటమే ఏకై క మార్గం. దేవాదుల నీటితో నింపితేనే జలకళ లక్నవరం సరస్సులో 365 రోజులు నీరు ఉండాలంటే దేవాదుల నీటితో లక్నవరం సరస్సును నింపడం ఒక్కటే మార్గం. వర్షాల వల్ల చెరువులోకి నీరు సమృద్ధిగా వచ్చినా అది కాస్త పంటలకు, మేడారం జాతరకు నీళ్లు వాడుతున్నంందున్న ప్రతిఏటా ఏప్రిల్, మే నె వచ్చేసరికి నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజీకి పడిపోతుంది. దీంతో రైతన్నలకు, పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా లక్నవరం లో 365 రోజులు నీరు ఉండేలా ప్రభుత్వం రామప్ప సరస్సు నుంచి ప్రత్యేకంగా పైపులైన్ వేయడం కోసం భూసేకరణ పనులు చేపట్టింది. కాల్వ నిర్మాణానికి 145.36 ఎకరాల భూములు అవసరమవుతాయని సాగునీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు చర్యలు చేపట్టగా రైతులు పరిహారం విషయంలో ఒప్పుకోకపోవడంతో మళ్లీ అధికారులు అంచనా వ్యయాన్ని పెంచి ప్రభుత్వానికి నివేదించారు. ఆమోదం లభించకపోవడంతో 6 ఏళ్లు గడిచాయి. ఇటీవల మంత్రి సీతక్క పనులు పూర్తయ్యేలా అటు ప్రభుత్వంతో, ఇటు భూమి కోల్పోతున్న రైతులతో చర్చలు జరిపారు.● తగ్గిన పర్యాటకులు.. ఒడ్డుకు చేరిన బోట్లు మూలనపడిన వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్లు గ్రావిటీ కెనాల్ ద్వారా గోదావరి జలాలను తరలిస్తేనే కళకళరెండేళ్లుగా పూర్తిగా ఎండిపోతూ.. గడిచిన రెండేళ్లలో లక్నవరం సరస్సు పూర్తిగా ఎండిపోయింది. దీంతో వేలాడే వంతెనల కింది నుంచి మట్టి రోడ్డుపై సైతం వాహనాలు వెళ్లేవి. ఈసారి కూడా చెరువులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉంది. యాసంగి పంటల సాగుకు చివరి తడి నీరు అవసరం ఉంది. దీంతో ప్రస్తుతం 14 అడుగుల నీటిమట్టం ఉండగా మరో తడికి 5, 6 అడుగుల నీరు అవసరం ఉంది. 20 రోజుల్లో వరి కోతలు పూరై ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. మే మొదటి వారంలోగా సరస్సులోని నీరు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. లక్నవరం పూర్తిగా అడుగంటిపోతే చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోయే ప్రమాదం ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి దీవించారు. కలెక్టర్ సమీక్షతో అభివృద్ధికి అడుగులు పడేనా? మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో మే 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర)ఏర్పాట్లపై కలెక్టర్ దివాకర నేడు(సోమవారం) వివిధ శాఖల అధికారులతో సాయంత్రం రివ్యూ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 9రోజుల పాటు సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలతో పాటు 12న జరిగే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు చేపట్టనున్న ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంతోనైనా ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మే 8నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు నేడు అధికారులతో కలెక్టర్ సమీక్ష -
నగదు బదిలీ చేస్తేనే మేలు..
ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేప పిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండటంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది. చిన్న పిల్లలను పెద్ద చేపలు తినడంతో మ రింత నష్టం తప్పడం లేదు. నగదు బదిలీతో చేపల పంపిణీ కార్యక్రమం నడిపిస్తే.. నాణ్యమైన, కాస్త పెద్ద సైజు పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. – నీల సోమన్న, మత్స్యసొసైటీ చైర్మన్, స్టేషన్ఘన్పూర్ -
నీటి తరలింపు పనులు వేగంగా పూర్తిచేయాలి
రామప్ప నుంచి నీటి తరలింపునకు ఐదేళ్ల క్రితమే టెండర్లు పిలిచారు. భూ సేకరణ స్థాయిలోనే కెనాల్ పనులు నిలిచిపోయాయి. మూడేళ్ల నుంచి చెరువు పూర్తిగా ఎండిపోతుంది. ఈసారి ఇప్పటికే 14అడుగులకు నీరు చేరింది. ఇంక మే నెలలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. లక్నవరం ఎండిపోతే రైతులకు, పర్యాటక రంగానికి చాలా ప్రమాదం. మంత్రి సీతక్క దృష్టి సారించి పనులు వేగవంతం చేసి త్వరగా రామప్ప నుంచి లక్నవరంలోకి నీటిని తీసుకొస్తే రైతులతో పాటు పర్యాటకులకు బాగుంటుంది. – భేతి దేవేందర్రెడ్డి, బుస్సాపూర్, మాజీ సర్పంచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము.. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దామని లక్నవరం సరస్సుకు వచ్చాము. కానీ, ఇక్కడికి వచ్చాక చెరువులో నీరు లేకపోవడంతో బాధగా ఉంది. బోటింగ్ చేయలేకపోయాం, అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆడలేకపోయాం. లక్నవరం సరస్సు నిత్యం నీటితో నిండి ఉంటే బాగుంటుంది. అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – గట్టు సుమన్, పర్యాటకుడు, వరంగల్ -
ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక
వెంకటాపురం(కె): ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం నిర్వహించి కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తాటి నాగరాజు, గౌరవ అధ్యక్షుడిగా పీర్ల మల్లిఖార్జున్, ప్రధాన కార్యదర్శిగా పోలేబోయిన కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా సుననం సూరిబాబు, పాయం రాకేష్, బొగ్గుల సమ్మయ్య, సంయుక్త కార్యదర్శిగా బొగ్గుల సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా చీమల రామనాధం, కోశాధికారిగా ఉకె.జగన్, కార్యదర్శిగా బొగ్గుల నారాయణ, యాలం వెంకటరత్నం, చిక్కుడు ప్రవీణ్, శ్యామల వెంకటేశ్వర్లు, కణితి శేషును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్, సోయం కామరాజు, నర్సింహరావు, పసుల సూర్యనారాయణ, సవలం వీరస్వామి, ఈసాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి ములుగు: జిల్లా కేంద్రంలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 350 ఏళ్ల క్రితం మొఘల్ పాలకుల దౌర్జన్యాలకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న అన్నారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి, వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూముల్లో తాటిచెట్లను నాటుకునే అవకాశం కల్పించాలన్నారు. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. కరాటే అసోసియేషన్ జిల్లా రిప్రజెంటేటివ్గా రాజు ములుగు: కరాటే అసోసియేషన్ ములుగు జిల్లా రిప్రజెంటేటివ్, అఫిషీయల్ జడ్జిగా అజ్మీ ర రాజును నియమించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కరాటే ఇండియా ఆర్గనైజింగ్ జాతీయ అధ్యక్షుడు భరత్శర్మ ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో ఫిజిక్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే కరాటేలో బ్లాక్బెల్ట్ సాధించానని తెలిపారు. అప్పటి నుంచి కరాటే పోటీల్లో పాల్గొంటూ గిరిజన విద్యార్థులకు కరాటే నేర్పిస్తూ జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దినట్లుగా వెల్లడించారు. ఈ సేవలను గుర్తించి జిల్లా రిప్రజెంటేటివ్గా నియమించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజును తెలంగాణ కరాటే రిప్రజెంటేటివ్ పాపయ్య అభినందిచారు. ఆదివాసీ చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యంవెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఏజెన్సీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీల ఆభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఆదివాసీల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంటి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ముదిరాజ్లను బీసీ ఏలో చేర్చాలి
గోవిందరావుపేట: ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని ముదిరాజ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు సదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చేపట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర మూడోరోజు మండల కేంద్రానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ముదిరాజ్ల ఐక్యత కోసం పాదయాత్ర చేపట్టిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ముదిరాజ్లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే కార్పొరేషన్కు ప్రతిఏటా రూ.1000కోట్లు కేటాయించాలని, 75శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 50ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించాలన్నారు. 18ఏళ్లు నిండిన వారందరికీ సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, రవీందర్, వేణు, సురేష్, హరికుమార్, అనిల్, పెద్దన్న, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.సంఘం జిల్లా అధ్యక్షుడు సదయ్య -
ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి
ములుగు: యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. సన్నబియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై శనివారం హైదరాబాద్ నుంచి ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని అన్నారు. రైస్మిల్లర్లు తాలు, తరుగు పేరుతో కోతలు విధించకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్లు సంపత్రావు, సీహెచ్ మహేందర్జీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశం, జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి అప్పలనాయుడు, ఈఈ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవ్రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు. -
కంట్రోల్ రూం ఏర్పాటు
ములుగు: ధాన్యం విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి పౌరసరఫరాల శాఖ డీఎం, జిల్లా అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు ఉంటే 93474 16178 నంబర్కు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో రూపంగా కూడా ఫిర్యాదు అందించవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిశు మరణంపై విచారణ ములుగు: జిల్లా ఆస్పత్రిలో డెలివరీ సమయంలో గర్భంలోనే చిన్నారి మృతిచెందిన ఘటనపై శనివారం అదనపు కలెక్టర్ మహేందర్ జీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, వైద్యుల బృందం విచారణ చేపట్టింది. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ్ల రవళి గర్భంలోనే చిన్నారి మృతిచెందిన విషయంపై మంత్రి సీతక్క శుక్రవారం విచారణకు ఆదేశించారు. బృందం విచారణ చేపట్టంది. నివేదికను కలెక్టర్కు అందజేస్తామని మహేందర్జీ తెలిపారు. పిల్లల వైద్య నిపుణులు సుధాకర్, మత్తు వైద్యులు భారతి, జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, డాక్టర్ శ్రీకాంత్, డీడబ్ల్యూఓ శిరీష, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్పతి, డాక్టర్ నాగన్వేష్, గణేష్ పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీకోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సిండగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్ష ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్ రోల్స్ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని పరీక్షల రాజేందర్ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూల్ కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. -
ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య
ములుగు/గోవిందరావుపేట: భూ భారతి చట్టంలో ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయిస్తామని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకోవాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా జిల్లాకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో, గోవిందరావుపేట మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూ భారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి ఆర్జీలు స్వీకరిస్తారని అన్నారు. సమస్యలను నిర్ధిష్ణ గడువులోపు పరిష్కరించనున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా సీసీఎల్ఏకు అప్పిల్ చేసుకోవచ్చని తెలిపారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలవడనున్నాయని అన్నారు. ప్రతిగ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారుచేసి ప్రతి ఏడాది గ్రామాలలో డిస్ప్లే చేస్తామని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిగ్రామంలో పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, తహసీల్దార్ విజయభాస్కర్, సృజన్కుమార్, ఎంపీడీఓ రామకృష్ణ, జవహర్రెడ్డి, ఆర్.యుగేందర్రెడ్డి, గోవిందరావుపేట మండల వ్యవసాయ అధికారి జితేందర్రెడ్డి పాల్గొన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఆదివారం(నేడు), సోమవారం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, ధాన్యం కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. భూ భారతిపై అవగాహన ఉండాలి కలెక్టర్ టీఎస్ దివాకర -
కలెక్టర్కు విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం
ములుగు రూరల్: బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండి సాంబశివ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రకటన తదుపరి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు, హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సరికొండ బలరాం, భూక్య జవహర్లాల్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాకేష్యాదవ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తర్ఫీదునిప్పిద్దాం.. పునాది వేద్దాం..
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025క్రీడల్లో శిక్షణ.. ‘దేశం బలిష్టం కావాలంటే యువత మైదానాల్లో చెమట చిందించాలి’ అని ఓ కవి చెప్పినట్లు.. విద్యార్థులు మైదానాల బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణ కోసం కరాటే, కుస్తీ పట్టడం నేర్చుకోవచ్చు. జిల్లా క్రీడల, యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో, హనుమకొండలోని జేఎన్ఎస్లో పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు. పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూడాలి● ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. ● సెల్ఫోన్ను దూరం పెట్టాలి.. పుస్తకాలను చేరువ చేయాలి ● ఆ బాధ్యత తల్లిదండ్రులదే..సజీవ కళ చిత్రలేఖనం.. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. కొన్ని వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెలకువలు నేర్పుతున్నారు.నృత్య, సంగీతంలో.. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. పుస్తక పఠనం.. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేథను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్లలను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్రోడ్డులోని జూపార్క్, సైన్స్సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ జిల్లా వికాసతరంగణి ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులకు వ్యాసరచన, భగవద్గీత శ్లోకం, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాలపై శిక్షణ ఇస్తోంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వలంటీర్గా సేవలందించవచ్చు. ఆర్ఎస్ఎస్, ఎన్ఎస్ఎస్లో విద్యార్థులు శిక్షణ తీసుకుని ఉమ్మడి జిల్లా విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.. ప్రస్తుతం టెక్నాలజీ వెంట పరిగెట్టాల్సిందే. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. ఇస్రో ప్రతీ యేటా వర్క్షాప్ నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థులను ఎంపిక చేస్తోంది. స్థానికంగా ఉన్న కంప్యూటర్ శిక్షణలో చేరి కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోవాలి. పుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్ -
చదువుతోపాటు విలువలు నేర్పించాలి
ములుగు: విద్యార్థులకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఉన్నత విలువలను నేర్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్ సూచించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి సౌఖ్యతో కలిసి శనివారం జిల్లాకేంద్రంలోని బాలసదనంను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో విద్యార్థులు ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఫలాలను అంకితభావంతో విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, ప్రొటెక్షన్ అధికారి కృష్ణవేణి, బాలసదనం మ్యాట్రీన్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు న్యాయవ్యవస్థకు అనుసంధానంగా పనిచేయాలి పారాలీగల్ వలంటీర్లు ప్రజలకు, న్యాయవ్యవస్థకు అనుసంధానంగా పనిచేయాలని సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వలంటీర్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సౌఖ్య, బార్అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భిక్షపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ మహేందర్, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిలర్ స్వామిదాస్, న్యాయవాదులు కన్నోజు సునీల్కుమార్, రాజ్కుమార్, అశోక్, ప్రణయ్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో రైతు సదస్సులు ఎప్పుడు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి–2020 చట్టాన్ని బంగాళాఖాతంలో వేసి సామాన్య ప్రజల కోసం భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా కాస్తులో ఉన్న ప్రతీ రైతుకు పట్టా పాస్ బుక్కులు అందజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకొని ఉన్న ఆబాదీ భూములకు డాక్యుమెంట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పండుగ వాతావరణం భూ భారతి చట్టంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలైందని, ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని చట్టంపై రైతులకు అవగాహన పెంచుతూ భూ సమస్యలను తెలుసుకుంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులను, ఎంపీ, ఎమ్మెల్యేలను సీతక్క శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కొంతమంది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులను మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. 746 దరఖాస్తులు స్వీకరణ మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకునేందుకు 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ భూ సమస్యలపై 746 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ధరణితో గోసపడ్డాం..ధరణి చట్టంతో గోసపడ్డాం.. చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయాం. భూములున్న వారికి పట్టాలు ఇవ్వలేదు. ధరణిలో భూములు ఎక్కించే అవకాశాలు లేవని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంతోనైనా మాకు న్యాయం జరగాలని పలువురు రైతులు అభిప్రాయ పడ్డారు. ● ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నాం. ధరణి రాకముందు రికార్డుల్లో ఉంది. ధరణి చట్టం వచ్చాక మా భూమిని తొలగించారని వెంకటాపురం(ఎం)కు చెందిన తుత్తురు పర్వతాలు అన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగిన రికార్డులో ఎక్కలేదని వాపోయారు. పట్టా లేకపోవడంతో పథకాలు అందలేదు.. భూములకు పట్టా లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందలేదు. పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు తిరిగినా..పట్టా కాలేదు. భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భూభారతిలోనైనా పట్టా చేసి ఆదుకోవాలి. – తైనేని సరోజన, వెంకటాపురం(ఎం)రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వైఎస్సార్ హయాంలో రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా పేదలకు, దళితులకు భూములు పంచారని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు.భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. నూతన చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.పార్టీలకతీతంగా ప్రతీ నిరుపేదకు లబ్ధి సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ గిరిజన ప్రాంత సమస్యలపై కమిటీ ఏర్పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ భారతి పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సు హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులు -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
ములుగు: వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలో శిశువు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండారుపల్లికి చెందిన బిల్ల రవళి గురువారం ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. మొదట వైద్యులు పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తామన్నారు. తదనంతరం సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వైద్యులు ప్రసవానికి ప్రయత్నించే సమయంలో గర్భంలోనే మగ శిశువు మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయరహదారిపై ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో రెవెన్యూ సదస్సుకు హాజరుకావడానికి వచ్చిన మంత్రులు ఈ రహదారి గుండా వెంటాపురం(ఎం) మండలకేంద్రానికి వెళ్లాల్సి ఉంది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు ఆందోళన కార్యక్రమాన్ని నిలువరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బాధ్యులపై చర్య తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే బాలింత పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు అన్నారు. స్థానికంగా డెలివరీ కాకపోతే వేరే ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన బాధ్యులపై చర్య తీసుకుంటామన్న మంత్రి సీతక్క -
యాసంగి ధాన్యం దిగుమతి చేసుకోం..
ములుగు రూరల్: యాసంగి సాగులో వరి ధాన్యం దిగుమతి చేసుకోలేమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాదం ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సాగు ధాన్యం కేవలం బాయిల్డ్ బియ్యం మాత్రమే అవుతాయని, రారైస్ అయినా అవి తినడానికి వీలుగా ఉండవన్నారు. స్పందించిన మంత్రి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. పల్లెపాటి సమ్మిరెడ్డి, అనిల్, హరినాఽథ్ తదితరులు ఉన్నారు.ఆదివాసీ సమస్యలపై పోరాటంవెంకటాపురం(కె): ఆదివాసీ సమస్యలపై యువత అలుపెరుగని పోరాటం చేయాలని తెలంగాణ భూమి పుత్ర ఆదివాసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పూనం రాంచందర్ అన్నారు. శుక్రవారం టీబీఏఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో ఆదివాసీ సమస్యలు, చట్టాలు, హక్కులపై పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసం లక్ష్మయ్య, పూనెం మునేశ్వరరావు, తాటి లక్ష్మణ్, పొడెం రాకేష్, ఇరుప లక్ష్మి, స్వరూప, ఉషారాణి, సుశీల, నాగరాజు తదితరులు ఉన్నారు.కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలివాజేడు: మే 5న నిర్వహించతలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ కోరారు. మండల పరిధిలోని పేరూరులో శుక్రవారం ఏటూరునాగారం డివిజన్ అధ్యక్షుడు టింగ బుచ్చయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను కాపాడుతామని చెబుతూనే గిరిజనేతరులకు హక్కులు కల్పించడానికి కుట్ర చేస్తుందన్నారు. చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీ ప్రజలు, యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నర్సింహరావు, సుధాకర్, మనోజ్, కృష్ణబాబు, రాంబాబు, నర్సింహరావు, అర్జున్ తదితరులు ఉన్నారు.భద్రకాళి సన్నిధిలో ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ బానోత్ శరత్నాయక్ కుటుంబసమేతంగా సందర్శించారు. వారిని ఆలయ అధికారులు స్వాగతించారు. ముందుగా వారు ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం శరత్నాయక్ దంపతులకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.నేటినుంచి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మెకేయూ క్యాంపస్: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కేయూ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (కుక్టా) అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ శుక్రవారం తెలిపారు. ఇప్పటికే యూనివర్సిటీ అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చామని పేర్కొన్నారు. నేడు పరిపాలనాభవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం జారీచేసిన 21 జీఓను వ్యతిరేకిస్తున్నామని, దీనిలో సవరణలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాకే మిగతా పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంగపేట: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 (ఉగాది నుంచి ఉగాది) సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని ఆలయాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలనే ఆకాంక్షతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పనిచేస్తున్నారన్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగుల సమస్యలపై త్వరలో సదస్సు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారని, ఆ సదస్సులో అర్చక ఉద్యోగుల దూపదీప నైవేద్యం, అర్చకుల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయన్నారు. ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే త్రివేణి సంఘమములోని అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలను ప్రయాగ్రాజ్లో నిర్వహించిన తరహాలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ ప్రత్యేక చొరవతో కోట్లాది మంది హిందువులు పుణ్య స్నానాలు చేయాలనే సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు తరలివచ్చి పవిత్రమైన పుణ్య స్నానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక జేఏసీ గౌరవ అధ్యక్షుడు ముక్కామల రాజశేఖర్ శర్మ, ఆలయ అర్చకులు కారంపుడి పవన్కుమార్, ఈశ్వర్చంద్, సిబ్బంది సుధీర్, అజయ్ పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయంలో అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రామప్ప అర్చకులు కోమళ్లపల్లి హరీష్శర్మ, మోహనపు ఉమాశంకర్లతో కలిసి ఉగాది టు ఉగాది డైరీని ఆవిష్కరించారు. అర్చకుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
మంగపేట: జిల్లాలో పలు గ్రామాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని పలువురు పాస్టర్లు చర్చిల్లో సందేశమిచ్చారు. మంగపేట మండలం కమలాపురం, ఆయా గ్రామాల్లోని ఆర్ఎంసీ, సీఎస్ఐ, సియోను, అగాపే, అపోస్తలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఏసుప్రభు భక్తి గీతాలను ఆలపించారు. కమలాపురంలో రోమన్ కేథలిక్ చర్చి బృందం క్రీస్తు శిలువ యాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు ఆదాం, విజయరాజు, దేవరాజు, కృపానిధి భక్తులు పాల్గొన్నారు. వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలిభూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాకు కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డెరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. భూపాలపల్లి ఏరియాను శుక్రవారం సందర్శించి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధించాలని ఆదేశించారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బొగ్గు రవాణ లక్ష్యం కూడా తప్పక సాధించాలని అధికారులను కోరారు. ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూ సేకరణ, మట్టి వెలికితీయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తక్షణమే పరిష్కరించుకొ ని ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కార్మికులకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఓసీ–2 పీఓ వెంకటరామరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఓసీ–3 పీఓ భిక్షమయ్య పాల్గొన్నారు. -
సాంఘిక బహిష్కరణ చేసిన వారిని శిక్షించాలి
ఎస్ఎస్తాడ్వాయి: గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కాటాపూర్లో కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ఆధ్వర్యంలో గీత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఎర్రగట్టు మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గీతకార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి పండుగ రోజు గుడిలోకి వచ్చిన మహిళలను అవమానపరచడంతోపాటు, ఈతచెట్లను ధ్వంసం చేసిన వీడీసీ సభ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రంగు సత్యనారాయణ, రంగు లాలయ్య, గండు సదానందం, సురేష్, రంగు రాజు, లింగాల వెంకన్న, సురేష్, మార్క ప్రణయ్, గట్టు వసంత్, కక్కెర్ల వెంకటేష్, గీత కార్మికులు పాల్గొన్నారు.కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్ రమేశ్బాబు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోu -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
ములుగు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. అలాగే రవళి కు టుంబానికి న్యాయం చేసి వైద్యులపై చర్య తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, ములుగు మండల అధ్యక్షుడు రమేష్రెడ్డి, పోరిక వి జయరాంనాయక్, రాసమల్ల సురేందర్, కోగిల మ హేష్, పాలెపు శ్రీను, చెన్న విజయ్ పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు: అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి నాగరాజు సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులకు జిల్లా ఫైర్ అధికారి నాగరాజు, స్టేషన్ ఫైర్ అధికారి కుమారస్వామి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సురక్షితంగా బయటపడడంపై వివరించారు. అగ్ని ప్రమాదాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలను విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా వివరించారు. అనంతరం జిల్లా అధికారి నాగరాజు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ధైర్యంగా స్పందించాలని సూచించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ మహేశ్వర్, డ్రైవర్, ఆపరేటర్ కుమార్, ఫైర్మెన్లు పాల్గొన్నారు. -
21నుంచి ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాలు
వెంకటాపూర్(ఎం): ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టబోయే ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప కేంద్రాల వారీగా లెఫ్ట్ అవుట్, డ్రాప్ అవుట్, టీకాలు ఇవ్వని పిల్లల జాబితా ప్రకారం అందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. పీహెచ్సీలో మందుల నిల్వల, ఓపీ రిజిస్టర్, వడదెబ్బ నివారణకు ఏర్పాట్లు చేసిన జింక్, ఓఆర్ఎస్ కార్నర్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవలకు వచ్చే రోగులకు జింక్, ఓఆర్ఎస్ వాడకంపై, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం పొందేలా అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన పిల్లలకు తల్లిపాలు పట్టించడం వల్ల కలిగే లాభాలను వివరించాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను 100శాతం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్, జిల్లా శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి రణధీర్, డాక్టర్ గౌతమ్, డెమో సంపత్, మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ సంఘ మిత్ర, ఫార్మసిస్ట్ రాజమణి, స్టాఫ్ నర్స్ మణెమ్మ, ఆయూష్ ఫార్మసిస్ట్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
వారంనుంచే విద్యార్థుల ఇంటిబాట..
ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు వేసవి సెలవులకు ఇంకా వారం రోజుల సమయం ఉండగానే ముందస్తుగా ఇంటిబాట పడుతున్నారు. వారం రోజుల ముందు నుంచే సంబంధిత వార్డెన్లు, హెడ్మాస్టర్లు విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వారి తల్లిదండ్రులు వచ్చి పెట్టెబేడతో ఇంటికి తీసుకెళ్తున్నారు. దీంతో వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ విద్యార్థుల అనుమతి ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందా లేక హాస్టల్ వార్డెన్, హెడ్మాస్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధ్యాపకురాలు శిరీషకు డాక్టరేట్ ప్రదానం ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న బి.శిరీష డాక్టరేట్ అందుకున్నారు. కేయూలోని వాణిజ్యశాస్త్రం, బిజినెస్ మేనేజ్మెంట్లో ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ప్రమోషన్ ఆన్ ఆన్లైన్ బయింగ్ బి హేవియర్–ఏ స్టడీ అనే ఆంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన సిద్ధాంతగ్రంధానికి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా కళాశాలలో శిరీషకు గురువారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జిల్లాలో పలుచోట్ల ఆర్టీసీ బస్షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. బస్సులు వచ్చే వరకు రోడ్లపైనే నిలబడి ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు. పలుచోట్ల బస్షెల్టర్లు ఉన్నా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీటి వసతులు లేవు. మరికొన్ని చోట్ల దుకాణాలు, చెట్ల కింద బస్సులు వచ్చే వరకు ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాలో బస్షెల్టర్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. – ములుగుఏటూరునాగారం మండల పరిధిలోని షాపెల్లి, చిన్నబోయినపల్లి, శంకర్రాజుపల్లి, రొయ్యూరులో ఆర్టీసీ బస్టాండ్లు లేవు. రోజువారీగా ఉద్యోగ, వ్యాపారాల కోసం వరంగల్, ములుగు, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల నుంచి పలువురు వస్తుంటారు. వచ్చే వారంతా ఆకులవారి గణపురంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉన్న పాయింట్ వద్ద దిగి ఆయా ప్రాంతాలకు వెళ్తుంటారు. కన్నాయిగూడెం, మంగపేట మండలాలకు వెళ్లే వారంతా నిలబడడానికి సైతం ఆర్టీసీ బస్షెల్టర్ లేదు. దీంతో చెట్ల కింద, వ్యాపార దుకాణాల్లో కొద్ది పాటి నీడన నిలబడుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లే బస్సులు వచ్చేంత వరకు దుకాణాల్లో గిరాకీ చేయడమో.. తెలిసిన వారి వద్ద గంటల తరబడి నిలబడడమో పరిపాటిగా మారింది. న్యూస్రీల్చెట్టే బస్టాప్.. -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డులో గల ఓ పెట్రోల్బంకు. గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో బంకులోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గడ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సాలు మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
ఐటీడీఏ ఎదుట బస్షెల్టర్ నిర్మించాలి..
ఏటూరునాగారం మండలకేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉంది. కానీ ఎక్కువ మంది రోజు వారీగా ప్రయాణించే ఆకులవారి గణపురంలో ఐటీడీఏ భవనం ఎదుట ఎలాంటి షెల్టర్ లేదు. రోజు వారీగా ఉద్యోగులు ఎండలో ఇబ్బందులు పడుతూ చెట్ల నీడన నిలబడుతున్నారు. స్థానికులు సైతం బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడడానికి షెల్టర్ లేక షాపుల్లో ఉండాల్సి వస్తుంది. ఆర్టీసీ ఆధికారులు స్పందించి ఐటీడీఏ ఎదుట బస్షెల్టర్ ఏర్పాటు చేయాలి. – కర్నె నాగేశ్వర్రావు, ఏటూరునాగారం కుర్చీలు ఏర్పాటు చేయాలి.. వాజేడు మండలం నుంచి వెంకటాపురం(కె), నియోజకవర్గం భద్రాచలం, చర్ల మండలాలకు వెళ్లాలంటే జగన్నాధపురం జంక్షన్ నుంచి ప్రయాణించాల్సిందే. హైవే నిర్మాణంలో భాగంగా బస్ షెల్టర్ ఏర్పాటు చేసినా అధికారులు, ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, బేంచీలను ఏర్పాటు చేయలేదు. అసలే ఏజెన్సీ, ఆపై బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే క్రమంలో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్తో మాట్లాడి కుర్చీలు ఏర్పాటు చేయాలి. – యాలం రామకృష్ణ, వాజేడు -
బస్టాండ్ ఉన్నా.. కుర్చీలు నిల్
వాజేడు మండల పరిధిలోని జగన్నాధపురం జంక్షన్ ఉంది. ములుగు జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి వెళ్లే ప్రయాణికులకు ఇది అనుసంధాన ప్రాంతం. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా జగన్నాధపురం జంక్షన్ వద్ద బస్ షెల్టర్ను నిర్మించినా ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, బేంచీలు లేకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు బస్ షెల్టర్లో కుర్చీలు, బేంచీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
క్షయవ్యాధిపై అవగాహన
వాజేడు: క్షయవ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పీహెచ్సీ వైద్యాధికారి కొమరం మహేందర్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం క్షయవ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీఎంహెచ్ఓ గోపాల్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు సర్వేలో భాగంగా గుర్తించిన 15 మంది అనుమానితులను పీహెచ్సీకి తీసుకొచ్చి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తెమడను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టీఎల్ఎస్ రవి, హెల్త్ సూపర్ వైజర్ కోటిరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ రజనీకాంత్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆశ కార్యకర్తలు రమణమ్మ, కళావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతాలు వాజేడు: మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లిలో సూపర్ వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం గర్భిణులకు సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏడ్జెర్లపల్లి క్లస్టర్లోని 5 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పప్పులు, బెల్లం, పాలు, ఆకుకూరలు, గుడ్లు, ఐరన్కు సంబంధించిన ఇతర ఆహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రమణ, దేవి, నర్సమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వాటర్ కూలర్ ఏర్పాటు ఏటూరునాగారం: మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఉన్న ఫాస్టాగ్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రయాణికులు, బాటసారులకు చల్లటి నీటిని అందించడానికి వాటర్ కూలర్ను ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. వేసవికాలం కావడంతో దాహం తీర్చుకోవడానికి ప్రయాణికులు, రైతులు, ఇతర కార్మికులకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. లంబాడ న్యాయవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాలాజీ నాయక్ ములుగు రూరల్: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన బాదావత్ బాలాజీ నాయక్ను లంబాడ న్యాయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు దేవా నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని అప్పగించినందుకు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పుష్కరాల పనులు పూర్తిచేయాలికాళేశ్వరం: సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గురువారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సంఽబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వీఐపీ ఘాటు, ప్రధానఘాటుల వద్ద శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఈ, డీఈ పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
వెంకటాపురం(ఎం)/ఎస్ఎస్తాడ్వాయి: భూ భారతి చట్టంతోనే భూ సమస్యలకు తగిన పరిష్కార మార్గం లభిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అదనపు కలెక్టర్ సీహెచ్. మహేందర్, ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాశ్తో కలిసి గురువారం మండల పరిధిలోని నర్సాపూర్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలన్నారు. భూ భారతి చట్టం ప్రకారం వివరాలు సేకరించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. దరఖాస్తుల స్వీకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యలు పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈ సదస్సులో భాగంగా నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా సమస్యలు పరిష్కారించాలని మొత్తం 650 వినతులు అందాయి. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అదే విధంగా ఎస్ఎస్తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి.. అది పరిష్కారం కాకుంటే ఎవరికీ అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని వివరించారు. భూ భారతి పోర్టల్లో ఎకరం భూమి మ్యూటేషన్ దరఖాస్తుతో పాటు వారసత్వ ఒప్పంద పత్రం.. నిర్ధేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలన్నారు. ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ సురేష్బాబు, ఎంపీడీఓ సుమనవాణి, అధికారులు పాల్గొన్నారు. నేటి సదస్సుకు మంత్రుల రాక పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో నేడు నిర్వహించనున్న భూ భారతి రెవవెన్యూ సదస్సుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు రానున్న తరుణంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ దివాకర పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఆయన వెంట రెవెన్యూ సదస్సుల ఇన్చార్జ్ కిరణ్ప్రకాశ్, ఆర్డీఓ నలువాల వెంకటేశ్, ఎంపీడీఓ రాజు, తహసీల్దార్ గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి
ములుగు: అగ్నిప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా ధైర్యంగా స్పందించాలన్నారు. అగ్ని ప్రమాదాలను గుర్తించిన వెంటనే ఆస్పత్రిలో అందుబాటులో ఉండే ఫైర్ ఎక్సిటింగ్విషర్స్ను వాడే విధానంపై వివరించారు. మంటలు పెద్దస్థాయిలో వ్యాపించినప్పడు వెంటనే 101, ములుగు ఫైర్ స్టేషన్ నంబర్ 8712699210, స్టేషన్ పైర్ ఆఫీసర్ సెల్ నంబర్ 8712699211కు కాల్చేసి సమస్యను వివరించాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక వాహనం పని విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, పైర్ సిబ్బంది నగేష్, డ్రైవర్ కుమార్, ఫైర్మెన్ మహేందర్, రాజు, ప్రవీణ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి -
కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనులు ప్రారంభం
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన ఆర్చి నిర్మాణ పనులు ఎన్హెచ్ 353(సీ) ప్రధాన రహదారిపైన బుధవారం ప్రారంభమయ్యాయి. 2018 లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భారీ యంత్రాలు, పరికరాలు, మోటార్లు ఆర్చి కింద నుంచి వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మేఘా ఇన్ఫ్రా సంస్థ కూల్చివేసింది. నిర్మాణానికి నష్టపరిహారంగా రూ.25లక్షలు దేవస్థానానికి సదరు సంస్థ చెల్లించింది. అప్పటి నుంచి ఆర్చి నిర్మాణాలపై దేవాదా యశాఖ దృష్టిసారించలేదు. ఈక్రమంలో మే 15వ తేదీ నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్చి పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించడంతో ఈఓ మహేష్ పనులు ప్రారంభించారు. పిల్లర్లకో సం జేసీబీతో తవ్వకాల చేపట్టారు. కాగా, రూ.32 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు.2018లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొలగింపు -
‘భూభారతి’పై అవగాహన కల్పించాలి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా ఎంపికై న వెంకటాపురం(ఎం) మండలంలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి భూ భారతి కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూప కల్పన చేయాలన్నారు. అవగాహన సదస్సులకు ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించారు. భూభారతి విధివిధానాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన భూభారతి పోర్టల్కు గతంలోని ధరణి పోర్టల్కు చాలా తేడా ఉందని, భూముల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం మరో 14అంశాలను పొందుపరిచిందని తెలిపారు.భూముల విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఏడాదిలో పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. భూమి విలువ రూ.5లక్షల లోపు ఉంటే ఆర్డీఓ స్థాయి, రూ.5లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇక నుంచి పరిశీలించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిస్తారని తెలిపారు. మే 1నుంచి 31వరకు పరిశీలన చేసిన అనంతరం జూన్ 2నుంచి పట్టాలు అందిస్తామని వివరించారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
ఎలుగుబంటి మృతి కేసులో ఒకరి అరెస్ట్
కాటారం: మహాముత్తారం మండలం యత్నారం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి మృతి చెంది కళేబరం లభ్యమైన కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పెగడపల్లి రేంజర్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. యత్నారం కొండెంగలవాగు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 14న పలువురు గ్రామస్తులు ఎలుగుబంటి కళేబరం గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి పక్కనే విద్యుత్ తీగ ఉచ్చు ఉండటంతోపాటు మాంసం, గోర్లు తీసుకెళ్లిన దుండగులు కేవలం కళేబరం మిగిల్చారు. పంచనామా, పోస్టుమార్టం చేయించిన అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు కోణాల్లో విచారణ ప్రారంభించిన అధికారులు ఎలుగుబంటి మృతికి సంబంధం ఉందని యత్నారం గ్రామానికి చెందిన మంగూనాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. బుధవారం కాటారంలోని పెగడపల్లి రేంజ్ కార్యాలయంలో మంగునాయక్ అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించారు. పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని రేంజ్ అధికారి తెలిపారు. కాగా, మంగూనాయక్ అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు రేంజర్, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మంగూనాయక్పై అక్రమంగా అధికారులు కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ప్రమీల, జగత్సింగ్, సురేందర్ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తడి ఎక్కువగా ఉందని, నీవు ఒప్పుకొని కేసు నీపై వేసుకుంటే బెయిల్కు అయ్యే ఖర్చులు సగం తాము భరిస్తామని అటవీశాఖ అధికారులు తనను ఇబ్బంది పెట్టారని అరెస్ట్ అయిన మంగూనాయక్ విలేకర్ల ఎదుట ఆరోపించారు. అక్రమంగా కేసు పెట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ -
ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా ఆధ్వర్యంలో ములుగు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్తో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమాన్ని ములుగు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల ఇన్చార్జ్లుగా వంగ రవియాదవ్, చింతనిప్పుల భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ బొక్క సత్తిరెడ్డి, ముసినేపల్లి కుమార్గౌడ్, కూనూరు అశోక్గౌడ్లను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ -
డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుక నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థులు రాజకీయ నాయకులుగా మారి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో చర్చించే విషయాలు, తీర్మాణాల వంటి అంశాలను స్పీకర్ ద్వారా పోటీ పోటీగా చర్చించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్పర్సన్గా ములుగు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం వ్యవహరించి మాక్ అసెంబ్లీని నడిపించారు. విద్యార్థుల పరీక్షలు, వారి సిలబస్స్, రాజకీయ నాయకుల విధి విధానాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, నవీన్, వెంకటయ్య, జ్యోతి, కనీఫ్ఫాతిమా, సంపత్, భాస్కర్, అభిలాష, జీవవేణి, మున్ని, సుమలత, భావన, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి
ములుగు: వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రతీ బుధ, శనివారాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు సూచించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన సర్వేలైన్స్ మెడికల్ ఆఫీసర్ అతుల్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రణధీర్తో కలిసి పీహెచ్సీల వారీగా టీకాల కార్యక్రమంపై ఆరా తీశారు. సబ్సెంటర్ల వారీగా తూచ తప్పకుండా టీకాలు అందించాలన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల్లో జ్వరం, దగ్గు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే రక్త నమూనాలను సేకరించాలన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని సబ్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. వ్యాక్సిన్ వీవీఎం, కండీషనింగ్ ఐస్ పైప్స్ లబ్ధిదారుల లిస్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రామ్ ఆఫీసర్ పవన్ కుమార్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్రావు, సూపర్వైజర్లు దేవమ్మ, దేవేందర్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. మహాముత్తారం అడవిలో పులి కలకలం కాటారం: మహాముత్తారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పులి అటవీ ప్రాంతంలోకి వచ్చిందనే పుకార్లతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా స్తంభంపల్లి(పీకే), మద్దిమడుగు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటువైపు వెళ్లిన పలువురు గుర్తించారు. సమాచారం అందుకున్న దూదేకులపల్లి రేంజర్ రాంమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు (ప్లగ్ మార్క్స్)ను నిర్ధారించారు. కానీ, అవి తాజా పాదముద్రలు కావని.. నాలుగు రోజుల క్రితం పులి ఇటువైపుగా వెళ్లినట్లుగా ఉన్నాయని రేంజర్ తెలిపారు. గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు కాటారం: మహాముత్తారం మండలం స్తంభంపల్లి, రేగులగూడెం, బోర్లగూడెం గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై బుధవారం డీటీఎఫ్ సీఐ రాజసమ్మయ్య, ఎకై ్సజ్ ఎస్సై కిష్టయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాటుసారా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడి చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై పేర్కొన్నారు. 20 లీటర్ల గుడుంబా, 35 కిలోల చక్కెర స్వాధీనపర్చుకొని 1,100 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. చట్టాలను నిర్వీర్యం చేసే కుట్ర భూపాలపల్లి అర్బన్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్హౌజ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ, బీఎంఎస్లు మినహా ఇతర పార్టీలు, సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 51 శాతం మంది కార్మికులు సమ్మెను అంగీకరిస్తేనే సమ్మె చేయాలని, సీఎంపీఎఫ్ కాంట్రీబ్యూషన్ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం. 12 గంటలకు పని వేళలను పెంచడం, లేబర్ ఇన్స్పెక్టర్ను ఫెసిలిటేటర్గా మార్చడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అప్రెంటీస్ విధానం ద్వారా కార్మికులను నియమించుకుంటూ వారితో ఏళ్ల తరబడి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సంస్థకు రావాల్సిన బాకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి ప్రైవేట్ గనులను అప్పగించాలని ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు. -
వైభవంగా అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన
ఏటూరునాగారం: మండల కేంద్రంలో శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు శేషు, మల్లవజ్జుల రామకృష్ణ శర్మలతో పాటు మరో 9మంది అర్చకులు వేదమంత్రాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం ఉదయం 11.08గంటలకు యంత్ర ప్రతిష్ట అనంతరం అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠతో పాటు ప్రాణ ప్రతిష్ట, దృష్టి కుంభము, బలిహరణ ఇతర కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. అయ్యప్ప విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, నాగేంద్రస్వామి, మాలికాపు రత్తమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు. సాయంత్రం సమయంలో మహా పడిపూజను కనులపండువగా భజన కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి 5వేల మంది తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినదించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ గౌరీ శంకర్తో పాటు కమిటీ సభ్యులు ఇతర ఆలయాల చెందిన కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు ఏర్పాటు చేశారు. ప్రముఖుల దర్శనం అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థానిక ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుకు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతిలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితుడు రాధాకృష్ణశర్మ, బోడ సత్యం, అలి శ్రీనివాస్, బోడ శంకర్, గోపి, నర్సింహరావు అయ్యప్పస్వామి మాలధారులు పాల్గొన్నారు.విద్యుద్దీపాల వెలుగులో దేవాలయంఆలయంలో ప్రత్యేక పూజలు.. ప్రముఖుల హాజరు -
నిబంధనల ప్రకారమే తునికాకు సేకరణ
ఏటూరునాగారం: ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారమే తునికాకు సేకరణ చేపట్టాలని కాంట్రాక్టర్లకు అటవీశాఖ సౌత్ రేంజ్ అధికారి అబ్దుల్ రహమాన్ సూచించారు. మండల కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో పేదవారి ఆర్థికాభివృద్ధికి వేసవిలో చేపట్టే తునికాకు సేకరణ టార్గెట్ చేరుకునే విధంగా చేపట్టాలన్నారు. ఆకు సేకరణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూస్తామన్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పించినట్లు తెలిపారు. అడవుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, అడవులను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టామన్నారు.ఎఫ్ఆర్ఓ అబ్దుల్రహమాన్ -
మే 14న రామప్పకు మిస్వరల్డ్ టీం
ములుగు: మే 14న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం రానున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావుతో కలిసి రామప్పలో చేపట్టనున్న ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచ సుందరీ పోటీలలో పాల్గొననున్న పలు దేశాలకు చెందిన మహిళలు రామప్ప సందర్శనకు వస్తున్న తరుణంలో ములుగు జిల్లా ప్రవేశ మార్గమైన మహ్మద్గౌస్పల్లి నుంచి జంగాలపల్లి వరకు, జంగాలపల్లి నుంచి రామప్ప వరకు, రామప్ప నుంచి హరిత హోటల్ వరకు పంచాయతీరోడ్డు ఇంజనీరింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా మరమ్మతులు ఉంటే ఈ నెల 30వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పర్యటన వివరాలను తెలుసుకొని ఏర్పాట్ల విషయంలో ఎప్పటికప్పుడు ఫొటోలు వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా ముందుకుసాగి ప్రపంచ మిస్ వరల్డ్ టీం పర్యటనను విజయవంతంగా ముగించాలని సూచించారు. ఈ సమావేశంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రొఫెసర్ పాండురంగారావు, డీఎస్పీ రవీందర్, పురావస్తు శాఖ అధికారులు, వెంకటాపురం(ఎం) మండల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలి కలెక్టర్ టీఎస్.దివాకర -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
ములుగు/ఏటూరునాగారం: అగ్ని ప్రమాదాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఫైర్స్టేషన్ ఆఫీసర్ కుమారస్వామి సూచించారు. అగ్ని ప్రమాద నివారణ వారోత్సవాల సందర్భంగా ములుగు బస్టాండ్ ఆవరణలో మంగళవారం ములుగు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వాల్ పోస్టర్లను అంటించారు. నీటితో వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించారు. విన్యాసాల ద్వారా అగ్నిని ఆర్పే పద్ధతులు, ఫైర్ సిబ్బంది చేసే సహాయక చర్యలపై, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తల గురించి, ప్రమాద సమయంలో తక్షణం ఎలా స్పందించాలో, ఫైర్ సర్వీస్ నంబర్ని ఎలా వినియోగించాలో వివరించారు. ప్రజల సహకారం ఉంటే అగ్ని ప్రమాదాలను ముందుగా గుర్తించి నివారించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మెన్ మహేశ్వర్, డీఓపీ సురేందర్, ఫైర్మెన్లు మహేందర్, రాజు, ప్రవీణ్, సాయి కుమార్, హోంగార్డ్ ధన్సింగ్లు పాల్గొన్నారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ అధికారి సత్తయ్య మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తతో వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకురావాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు 101 లేదా 8712685772 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం వాల్పోస్టర్లను విడుదల చేసి ప్రయాణికులకు కనిపించే విధంగా ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో వాటిని అంటించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రవికుమార్, అనిల్, భార్గవ్, రాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.ఫైర్స్టేషన్ ఆఫీసర్ కుమారస్వామి -
ఘనంగా హోమం, జలాదివాసం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపనలో భాగంగా మంగళవారం ఉదయం ఆవాహిత దేవతా మండల మూల మంత్ర హోమములు, విగ్రహ స్నపనము, జలాధివాసం కార్యక్రమాన్ని భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు రామకృష్ణ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసము, ధాన్యాధివాసము ఫల పుష్ప ఆదివాసములను విగ్రహాలకు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు ప్రత్యేక హోమాలను నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోమశాలను ఏర్పాటు చేసి వేదమంత్రాల మధ్య దంపతులతో హోమాలు చేపట్టారు.నేడు అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప పంచలోహవిగ్రహంతో పాటు ఇతర విగ్రహాలను బుధవారం ఉదయం 11గంటలకు ప్రతిష్ఠించనున్నట్లు బ్రహ్మశ్రీ మల్లావజ్జల రామకృష్ణశర్మ తెలిపారు. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు శివలింగం, మాలికపురత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగేంద్రస్వామి, గణపతి, నందీశ్వరులకు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. -
తమ్ముడి ప్రేమ వివాహం..
ములుగు రూరల్: తమ్ముడు ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ అమ్మాయి అన్నదమ్ములు కోపం పెంచుకొని అబ్బాయి తండ్రి సమ్మయ్య, అన్న సురేశ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మల్లంపల్లి మండలం దేవనగర్లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేవనగర్ గ్రామానికి చెందిన ముక్కాముల సమ్మయ్య గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు నవీన్ అదే గ్రామానికి చెందిన మద్దెవేని కొమురయ్య కుమార్తె సౌజన్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై ఇరువర్గాల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేసి పంపించారు. మంగళవారం సమ్మయ్య బంధువు మృతి చెందగా తన రెండో కుమారుడు సురేశ్ హైదరాబాద్ నుంచి ఇంటి వచ్చాడు. సాయంత్రం సమయంలో తండ్రిని ద్విచక్ర వాహనంపై రంగాపూర్ సమీపంలో గొర్రెల మంద వద్దకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అమ్మాయి అన్నదమ్ములు మద్దెవేని సతీష్, ప్రసాద్లు ద్విచక్రవాహనంపై వచ్చి దేవనగర్ సమీపంలోని రైస్మిల్లు వద్ద వాహానాన్ని అడ్డగించి గొడ్డలితో సమ్మయ్య, సురేశ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సమ్మయ్య ఎడమ చేయి విరిగిపోయింది. సురేశ్ను గొడ్డలితో నరికే ప్రయత్నం చేయగా చేయి అడ్డుపెట్టడంతో అరచేతికి గాయమైంది. రక్తస్రావం కావడంతో భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. కొంత దూరం వెంబడించి వదిలేశారు. గమనించి వారు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తండ్రి, అన్నకు ప్రాణ సంకటం ఇరువురిపై దాడికి పాల్పడిన అమ్మాయి అన్నదమ్ములు -
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఅమల్లోకి భూభారతి చట్టం ● పైలెట్ ప్రాజెక్టుగా వెంకటాపురం(ఎం) మండలం ఎంపిక ● భూ సమస్యల పరిష్కారంపై చిగురిస్తున్న ఆశలు ● ధరణితో నష్టపోయామంటున్న రైతులుములుగు/వెంకటాపురం(ఎం): బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధివిధానాలతో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలెట్ మండలాలుగా ఎంపిక చేయగా అందులో జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూభారతితోనైనా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రం ప్రభుత్వం అందించిన విధివిధానాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించి భూసమస్యలకు పరిష్కారం చూపనున్నారు. ఐదేళ్లుగా తిరుగుతున్నా.. మండల కేంద్రం శివారులో ఎకరం భూమి తాతల కాలం నుంచి మాకు ఉంది. కాస్తుల్లో ఉన్నప్పటికీ పట్టా లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సాగు చేసుకుంటున్న భూమికి పట్టా కావాలని ఐదేళ్లుగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. డీఎస్ పెండింగ్లో ఉంద ని, ధరణిలో పట్టా చేసే ఆప్షన్ లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నా రు. భూభారతి చట్టంతోనైనా రెవెన్యూ అధికారులు పట్టా అందించాలి. – నాగెల్లి శ్రీధర్రెడ్డి, వెంకటాపురం(ఎం) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం భూ భారతి కింద వెంకటాపురం(ఎం) మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. భూభారతి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం. భూ సమస్యలు ఉన్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పకడ్బందీగా భూ భారతిని అమలు చేస్తాం. – టీఎస్.దివాకర, కలెక్టర్వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని 23గ్రామ పంచాయతీల పరిధిలో 74,667 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. 13,530మంది రైతులు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. మండలంలో చాలామంది రైతులు కాస్తులో ఉన్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ధరణితో అందలేదు. పట్టాదార్ పాస్ పుస్తకాలు కావాలని రైతులు ఎన్నిసార్లు తహసీల్దార్కు మొరపెట్టుకున్నా ధరణిలో ఆప్షన్ లేకపోవడంతో రైతులకు న్యాయం జరగలేదు. భూభారతి చట్టంతో కాస్తులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. వెంకటాపురం మండల కేంద్ర శివారులో సర్వే నంబర్ 234లో నాలుగు ఎకరాల భూమి ఉండగా 2,7ఎకరాల భూమి మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. మిగిలిన భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని అధికారులకు ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మోక్షం కలగలేదు. సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన క్రమంలో మండలాన్ని పైలెట్ మండలంగా ప్రకటించడంతో రికార్డుల్లో లేని భూములకు పట్టా హక్కులు కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలి. – పంబిడి శ్రీధర్రావు, వెంకటాపురం(ఎం)●అసైన్డ్ భూములుకు హక్కులు కల్పించాలి మండల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి భూములను కొనుగోలు చేసి సాగు చేస్తున్న రైతులకు ఇప్పటివరకు హక్కులు కల్పించలేదు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టూ ఉన్న భూములతో పాటు వెంకటాపురం, లక్ష్మీదేవిపేట, రామాంజాపూర్ గ్రామాల్లో అసైన్డ్ భూములే అధికంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అమలులోకి రాలేదు. ములుగు సబ్ కలెక్టర్గా పనిచేసిన గౌతమ్ అసైన్డ్ భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉన్న 5 ఎకరాలలోపు రైతులందరికీ కులమత భేదం లేకుండా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు జాకారం భూములతో పాటు ఇతర గ్రామాల్లో కాస్తులో ఉన్నవారికి రీ అసైన్డ్ చేశారు. అదేవిధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కాస్తులో ఉండి మోకా మీద ఉన్న వారికి రీ అసైన్డ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. న్యూస్రీల్మండలంలో 74,667ఎకరాలు -
సమ్మక్క బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి చాలా రోజుల తర్వాత అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. గత కొన్ని రోజుల నుంచి దిగవకు నీటిని వదలకుండా బ్యారేజీలో ఉన్న 59గేట్లను మూసేసి నీటిని నిల్వ చేసిన అధికారులు మంగళవారం ఒక గేటును ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గడంతో నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలుస్తోంది. బ్యారేజీ నీటి పూర్తి సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.90 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దేవాదుల ఇన్టెక్వెల్ నుంచి 539 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వెంకటాపురం(కె): మండల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం వాల్పోస్టర్లు వెలిశాయి. అడవుల్లో విచ్చలవిడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఆదివాసీలను చంపడం మీ సిద్ధాంతామా..అడవుల్లో బాంబులు ఆదివాసీగూడెల్లో గుబులు మావోయిస్టులారా సిగ్గు సిగ్గు అంటూ వాల్పోస్టర్లలో ఉన్నాయి. -
సంగీతంలో ప్రణీత్కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఏటూరునాగారం: మండల పరిధిలోని కొండాయి పీహెచ్సీలో వైద్యాధికారిగా పనిచేస్తున్న ప్రణీత్కుమార్ వైద్య వృత్తిని కొనసాగిస్తూనే సంగీతంలో పట్టు సాధించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించాడు. ఆయన సంగీత పోటీల్లో కీబోర్డ్ ప్లే చేయడంలో ప్రతిభ చూపి రికార్డు సాధించారు. డిసెంబర్ 1న హలేల్ మ్యూజిక్ నిర్వహించిన స్కూల్ ఆన్లైన్ సంగీత పోటీల్లో ప్రణీత్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ మ్యూజిక్ ప్రదర్శనలో అతను గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాధించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ చేతుల మీదగా సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ అందుకున్నారు. -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఏటూరునాగారం: అకాల వర్షంతో మిర్చి, వరితో పాటు తదితర పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు సుమారు వెయ్యి ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గాలివాన బీభత్సానికి కల్లాల్లో మిర్చి తడవడంతో పాటు వరిధాన్యం మొత్తం రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి.ఖాజాపాషా, తుమ్మ మల్లారెడ్డి, పోరిక గోవిందనాయక్, తాడూరి రఘు, తక్కెళ్లపల్లి మోహన్, గోవిందరావుపేట మాజీ జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజారావు తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్డు పనుల పరిశీలన దెబ్బతిన్న పంటల పరిశీలన అనంతరం లక్ష్మీనర్సింహరావు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నుంచి ఆస్పత్రి వరకు రూ.1కోటితో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. సీసీ రోడ్డు సైడ్ బర్మ్స్ పనులు నిబంధనల ప్రకారం చేపట్టలేదన్నారు. సదరు కాంట్రాక్టర్ పక్కనే ఉన్న చెరువు మట్టితో పాటు డిగ్రీ కళాశాల గోడ పక్కన ఉన్న మట్టిని తోడి వేస్తున్నాడని, దీంతో కళాశాల గోడ కూలే ప్రమాదం ఉందని తెలిపారు. చెరువు మట్టి తీయడం నిబంధనలకు వ్యతిరేకమని సంబంధిత శాఖ ఈఈ అజయ్తో మాట్లాడారు. పనుల్లో నాణ్యత లేకుంటే బిల్లు మంజూరు చేయరాదని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ మంత్రి సీతక్క అనుచరుడు కావడంతో అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరావు -
అంబేడ్కర్ అందరివాడు
ములుగు: ప్రజలందరికీ సమానహక్కులు ఉండాలనే లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ భీమ్రావు అంబేడ్కర్ అందరివాడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో అదనపు కలెక్టర్ సంపత్రావు(స్థానిక సంస్థలు) అధ్యక్షతన సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ 134వ జయంతికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దళిత సంఘాల నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంటరానితనాన్ని రూపు మాపిన మహాగొప్ప వ్యక్తి అంబేడ్కర్ అన్నారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దళిత పక్షపాతి అన్నారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివి.. అదనపు కలెక్టర్ సంపత్రావు మాట్లాడుతూ అంబేడ్కర్ సేవలు మరువలేనివని అన్నారు. దేశంలో గొప్ప నాయకుల విగ్రహాలను వారి మరణాంతరం మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ అంబేడ్కర్ బతికి ఉండగానే 1950లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఆయన గొప్పతనం అర్ధం అవుతుందని వివరించారు. అంబేడ్కర్ ఏర్పాటు చేసుకున్న లైబ్రరీలో 50వేల పుస్తకాలను పొందుపరిచి వాటిని చదివారని గుర్తు చేశారు. అంతకు ముందు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి లక్ష్మణ్, డీపీఓ దేవరాజ్, డీసీఓ సర్దార్సింగ్, జిల్లా పరిశ్రమల అధికారి సిద్ధార్థరెడ్డి, కలెక్టరేట్ ఏఓ రాజ్కుమార్, జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు జన్ను రవి, మహేష్నాయక్, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ముగిసిన బీరమయ్య జాతర
వాజేడు: గత మూడు రోజులుగా కోలాహలంగా సాగిన బీరమయ్య జాతర సోమవారంతో ముగిసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్ట గండి వద్ద జాతరను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి లొట్టిపిట్ట గండి గుట్టపైకి సారలమ్మ, ముత్యాలమ్మ, పోషమ్మ, లక్ష్మీదేవరలను చేర్చడంతో ప్రారంభమైంది. జాతర తంతు ఆదివారం బీరమయ్య, రేఖలమ్మలకు కల్యాణం జరిపించడంతో కోలాహలంగా మారింది. మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఉన్న భక్తులు దేవుడికి మొక్కులు సమర్పించుకుని ఒక్కొక్కరుగా సోమవారం ఇంటి దారి పట్టారు. బీరమయ్య నామస్మరణతో మారుమోగిన లొట్టిపిట్ట గండి ప్రాంతం ఒక్క సారిగా నిర్మానుష్యంగా మారింది. సల్లంగా ఉంటే మళ్లీ వస్తామంటూ భక్తులు తిరుగు ప్రయాణం అయ్యారు. దేవర్లను సాంప్రదాయం ప్రకారం పూజారులు కడేకల్, పెద గంగారం, టేకుల గూడెం గ్రామాలకు పంపించారు. ఈ నెల 21న రేఖులమ్మ జాతరను మండల పరిధిలోని అయ్యవారిపేటలో నిర్వహించనున్నారు. -
అకాల వర్షం.. పంట నష్టం
ఈ ఫొటోలో ఉన్న రైతు దంపతులు కొండగొర్ల చిన్న దుర్గయ్య, దుర్గ. ఇద్దరు కలిసి రామన్నగూడెం శివారులో 5ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. పంట కోతదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయింది. పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వందలాది ఎకరాల్లో నేలవాలిన వరిపైరు ● కల్లాలో ఆరబోసిన మిర్చి పంటకు దెబ్బ ● ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు● -
సీఎం సమావేశంలో కలెక్టర్ దివాకర
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కలెక్టర్లతో సోమవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ములుగు కలెక్టర్ టీఎస్.దివాకర పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అడవికి నిప్పు పెట్టొద్దు ఎస్ఎస్తాడ్వాయి: తునికాకు సేకరణకు కొమ్మకొట్టే సమయంలో అడవికి నిప్పు పెట్టొద్దని కాంట్రాక్టర్లు పలు గ్రామాల్లో సోమవారం కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని కాటాపూర్ ఏ యూనిట్ పరిధి తునికాకు కాంట్రాక్టర్ ఖలీద్ అహ్మద్ ఆధ్వర్యంలో నాంపెల్లి, నర్సింహులపేట, గంగారం ఎస్టీ కాలనీ, అన్నారం, నర్సాపూర్, భూపతిపూర్, కాటాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అడవికి నిప్పు పెడితే కలిగే నష్టాలను కూలీలకు వివరించారు. అలాగే లవ్వాల యూనిట్ పరిధిలోని లవ్వాల, జలగలంచ గ్రామాల్లో కాంట్రాక్టర్ అయేషా సుల్తాన్ అడవులకు నిప్పు పెట్టకూడదని ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో అవగాహన కోసం ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు వాజేడు/ఏటూరునాగారం: వాజేడు, ఏటూరునాగారం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరుతో సోమవారం వాల్పోస్టర్లు వెలిశాయి. ‘మమ్మల్ని బతక నివ్వండి, నిత్యం ఆదివాసీ ప్రజలపై ఆధారపడి బతికే మీరు అడవుల్లో విచ్చల విడిగా బాంబులు పెట్టడం సరికాదు.. ఆదివాసీలను చంపడం మీ సిద్ధాంతమా’ అంటూ ఆదివాసీ యువజన సంఘం పేరుతో పలు రకాల విమర్శలు, హెచ్చరికలతో వాల్పోస్టర్లలో రాసి ఉంది. ప్రమాదకరంగా సూచిక బోర్డు వాజేడు: జాతీయ రహదారిపై సూచిక బోర్డు ప్రమాదం పొంచి ఉంది. మండల పరిధిలోని బీరమయ్య గుట్టపైకి వెళ్లే దారిలోని మూడో మలుపు వద్ద కుడి చేతి వైపున ఉన్న సూచిక బోర్డు దారికి అడ్డంగా వంగి ఉంది. వాహన దారులు చూడకుండా వస్తే తాకేలా ఉంది. రామప్పలో మెక్సికో దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ డేనియల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్లు తాడబోయిన వెంకటేశ్, సాయినాథ్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని కొనియాడారు. గుడుంబా విక్రయిస్తే చర్యలు ములుగు: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే గుడుంబా (నాటుసారా) తయారు చేసినా.. విక్రయించినా శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నాటుసారా విక్రయించిన వారిపై 184 కేసులు నమోదు చేసి 3,023 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 216మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 62 కేసులు నమోదు చేసి 1,426 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 62 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
యువత మత్తుకు బానిస కావొద్దు
● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం: డ్రగ్స్ని తరిమికొడదామని.. యువత మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని రామన్నగూడెంలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్, ఫొక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ పొందిన నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలో సోమవారం తనిఖీ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కు బానిసలుగా మారితే విలువైన జీవితాలు ఆగం అవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోకి అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడుమార్గంలో పయణించకుండా మంచి మార్గంవైపు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాలకు చెక్
టోల్ ఫ్రీ నంబర్ 101కి ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తాం..విస్తృత అవగాహన రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చాలా గ్రామాలు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో అగ్ని ప్రమాదాలు చోటు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో నేటి (సోమవారం) నుంచి 20వ తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఇందులో ముఖ్యంగా గృహాల్లోని ఆల్మారాలు, సెల్ఫ్లను సక్రమంగా ఉంచుకోవడం, చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, బాణసంచా అందుబాటులో లేకుండా చేయడం, కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను అందుబాటులో ఉంచకుండా చూడడం, వంట గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవడం, గ్యాస్ లీకేజీ కాకుండా తీసుకునే జాగ్రత్తలు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్లో ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన చోట ఏర్పాట్లు చేయడం, సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించడం, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే రెండో దారి ద్వారా బయటికి రావడం వంటి అంశాలపై ప్రజలకు స్వయం ప్రదర్శన చేయనున్నారు.● ప్రజలకు అగ్ని మాపకశాఖ తరఫున అవగాహన ● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● జిల్లాలో ములుగు, ఏటూరునాగారంలో స్టేషన్లు ● ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరత ములుగు: వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాలతో ఆందోళన చెందకండి.. కాస్త కుదుటపడి 101 టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి.. సకాలంలో వివరాలు అందిస్తే కొద్ది సమయంలోనే అందుబాటులోకి వస్తాం.. జరిగే నష్టాన్ని మా వంతుగా కొంతమేర ఆపగలుగుతాం అంటున్నారు.. అగ్ని మాపకశాఖ అధికారులు, సిబ్బంది. ‘అగ్ని సురక్షిత భారతదేశాన్ని ప్రజ్వలించడానికి ఏకం కండి’ అనే థీమ్తో ఈ ఏడాది వారోత్సవాల నిర్వహణకు అగ్రిమాపక శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం కేంద్రాల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగిన కసరత్తు చేసి సిద్ధంగా ఉన్నట్లుగా ములుగు ఫైర్స్టేషన్ అధికారి కె.కుమారస్వామి తెలిపారు. ఫైర్ అధికారులు, కార్యాలయాల ఫోన్ నంబర్లు -
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
సోమవారం నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రోజూవారీ షెడ్యూల్లో భాగంగా పట్టణాలతో పాటు గ్రామాల్లో వంట గదులు, స్కూల్స్, కాంప్లెక్స్, హాస్పిటల్స్, గోదాములు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో తీసుకునే జాగ్రత్తలను సూచిస్తాం. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందిస్తే సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వస్తాం. – స్టేషన్ ఫైర్ ఆఫీసర్, కుమారస్వామి ● -
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్.బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ●