YSR
-
అధికార పార్టీ నేతలా.. మజాకా..
ప్రొద్దుటూరు: వక్ఫ్బోర్డుకు సంబంధించి ఆక్రమ ణలను తొలగించేందుకు వచ్చిన అధికారులు.. అధికార పార్టీ నేతల దెబ్బకు వెనక్కి వెళ్లిన సంఘటన మంగళవారం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. మళ్లీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. మోడంమీదపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 278/1లో అధికార పార్టీ నేత నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించాలని స్వయంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వనాథనాయుడు ఆదేశించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక డీసీఎస్ఆర్ కాలనీ వెనుక, సినీ హబ్ బైపాస్ రోడ్డు మధ్యన 11 సెంట్ల విస్తీర్ణంలో బొల్లవరానికి చెందిన అధికార పార్టీ నేత కారు పార్కింగ్ కోసం నిర్మాణ పనులు చేపట్టాడు. గత కొద్ది రోజులుగా ఈ పనులు జరుగుతున్నాయి. వక్ఫ్బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తున్న షేక్ మాబు షరీఫ్ ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు డీఆర్ఓ ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ప్రొద్దుటూరు తహసీల్దార్, కొత్తపల్లె గ్రామ పంచాయతీ సెక్రటరీ, టూటౌన్ ఎస్ఐలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్బోర్డు ఆఫీసర్ వశీం, మండల సర్వేయర్ వెంకటలక్ష్మి మంగళవారం మరో మారు సర్వే నిర్వహించారు. ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా అధికార పార్టీ నేతలు అడ్డుపడటంతో చివరికి అధికారులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదుదారుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి రాకుండా కేవలం తమ సిబ్బందిని మాత్రమే తప్పించి తప్పుకొన్నారు. సంఘటన స్థలంలో సర్వేయర్లు సుధాకర్, రాఘవ, వీఆర్ఓ రవి, కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి వరికూటి రామమోహన్రెడ్డి ఉన్నారు. ఎకరా రెండు సెంట్ల స్థలం కబ్జాకొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మోడంమీదపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 278/1లో మొత్తం 1.02 ఎకరాల వక్ఫ్బోర్డు స్థలం ఉంది. ఈ స్థలం విలువ ప్రస్తుతం సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. 1943 జూన్ 17న మోడంమీదపల్లె మసీదుకు సంబంధించిన కమిటీ సభ్యులు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. పోతుల పాపయ్య కుమారుడు సుబ్బయ్య ఈ స్థలాన్ని అప్పట్లో విక్రయించిన రికార్డులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నాయి. గెజిట్లో ఈ వివరాలను పొందుపరిచారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఒక్కొక్కటిగా వక్ఫ్బోర్డు స్థలాలు ప్రొద్దుటూరులో కబ్జాకు గురవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎకరా రెండు సెంట్ల స్థలాన్ని కూడా ఆక్రమించారు. ఈ స్థలంలోని 33 సెంట్లలో గతంలో ఆరుగురు శాశ్వత గృహలను నిర్మించారు. గతంలోనే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇది ఇలా ఉండగానే ప్రస్తుతం 10 సెంట్ల స్థలంలో ఛాయ్ సెంటర్, మరో 10 స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా, కొత్తగా 11 సెంట్ల స్థలంలో కారు పార్కింగ్ పనులను ప్రారంభించారు. సమస్య తీవ్రత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డీఆర్ఓ ఆదేశాల మేరకు తొలగించేందుకు వచ్చి అధికార పార్టీ నేతల దెబ్బకు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వక్ఫ్బోర్డు స్థలం ఆక్రమణను తొలగించేందుకు వచ్చి వెనక్కి వెళ్లిన అధికారులు డీఆర్ఓ ఆదేశాలు ఇచ్చినాపరిష్కారం కాని సమస్య -
బాబోయ్.. ఇదేం తల్లికి వందనం
కడప వైఎస్ఆర్ సర్కిల్: కూటమి ప్రభుత్వం ఎన్నో కొర్రీల తర్వాత అమలు చేసిన తల్లికి వందనం పథకాన్ని.. అందుకోవడానికి ప్రజలు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. కొందరి తల్లుల బ్యాంక్ ఖాతాలకు కాకుండా.. ఆధార్కు అనుసంధానం అయిన పోస్టల్ ఖాతాలకు నగదు జమ అయింది. డ్రా చేసుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కడపలోని పోస్టల్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ప్రజలు బారులు తీరి కనిపించారు. ఉదయం 7 గంటల నుంచే దాదాపు కిలోమీటరు మేర బారులు తీరారు. చిన్న పిల్లలను తీసుకొచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాగునీరు, భోజనం లేక ఆకలితో అలమటించారు. కార్యాలయం నుంచి ప్రధాన రహదారి పైకి క్యూ ఉండటంతో.. తోపులాట జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పోస్టల్ అధికారులు ప్రజల క్యూకు తగ్గటుగా కౌంటర్లను ఏర్పాటు చేయకుండా.. ఉన్న రెండు కౌంటర్లతోనే కార్యకలాపాలు సాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
సమస్యల వలయంలో కడప ‘రిమ్స్’
కడప అర్బన్ : కడప రిమ్స్ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఓపీ, ఐపీ విభాగాలలో రోగులు పలురకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వైద్యులు ఆయా విభాగాలలో చిత్తశుద్ధితో విధులను నిర్వహిస్తూ వుంటే, కొన్ని విభాగాలలో మాత్రం కేవలం ఎఫ్ఆర్ఎస్, అటెండెన్స్ రిజిష్టర్లలో సంతకాలను పెట్టి మరీ తమ సొంత క్లినిక్లను పయనమవుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని ఓపీ విభాగాలలో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులచే వైద్య పరీక్షలను చేయించి పంపించేస్తున్నారు. ఎక్స్రేలు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ రిపోర్ట్లను ఎప్పటికపుడు ఇస్తే ఆయా డాక్టర్లను సంప్రదించి తగిన వైద్య సేవలను పొందే అవకాశాలున్నాయి. ఫిల్మ్ల కొరతతో ఆయా విభాగాల డాక్టర్లకు ఎక్స్రే రిపోర్ట్లను వారి సెల్ఫోన్లకు ఆన్లైన్ ద్వారా పంపించేస్తున్నామంటూ రోగులకు తెలియజేస్తున్నారు. మరి డాక్టర్ అందుబాటులో వుంటే సరైన వైద్య సహాయంను అందించే అవకాశం వుంటుంది. కానీ సదరు డాక్టర్ తమ పరిధిలోని పీజీ డాక్టర్కుగానీ, హౌస్ సర్జన్కుగానీ సదరు ఫిల్మ్ను లేదా రిపోర్ట్ను పంపించి వైద్య సహాయం చేయమని కోరతారు. ఈ విధానం ఓపీలోనూ, ఐపీలోని కొన్ని విభాగాలలో తూ.చా.తప్పక జరుగుతోంది. ప్రస్తుత డాక్టర్లలో చాలా మంది రోగులతో మాట్లాడే విధానంకు చాలా వరకు స్వస్తి పలికారు. ఆప్యాయంగా రోగులతో మాట్లాడి వారికి భరోసాను ఇస్తూ, వారి వ్యాధి నివారణకు తమవంతుగా కృషి చేద్దామనే ఆలోచన సన్నగిల్లింది. సమయపాలనేదీ..? డాక్టర్లు ఓపీ, ఐపీ విభాగాలలో సమయపాలన పాటించడంలోనూ తీవ్రంగా విమర్శలను ఎదు ర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు ఓపీకి రావాల్సిన డాక్టర్లలో కొందరు 10గంటలకుగానీ, 10:30 గంటలకుగానీ వస్తున్నారు. వచ్చిన వారు ఓపికగా వైద్య సేవలను అందించాల్సిందిపోయి హౌస్సర్జన్లకు, పీజీలకు వదిలేసి తమవంతుగా సెల్ఫోన్లకుగానీ, ఇతరత్రా పనులలో నిమగ్నమైపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓపి వైద్యసేవలను అందిస్తున్న డాక్టర్లందరినీ ప్రజలు హర్షిస్తున్నారు. కొందరు మాత్రం ఈ వేళల్లో తమ విధులకు డుమ్మాకొట్టి కడప నగరంలో తాము నిర్మించుకున్న హాస్పిటల్స్లో వైద్యసేవలను అందించేందుకు వెళుతున్న వైద్యులను మాత్రం ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ వారిలో మార్పులేదనీ, మంత్రి అయినా తమ సమీక్షలో ఓపీ, ఐపీ సేవల విధానాన్ని ఖచ్చితంగా సమయపాలనను అమలు చేస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దళారుల చేతివాటం.. దివ్యాంగుల సర్టిఫికెట్లను నిక్కచ్చిగా రీ వెరిఫికేషన్ చేసి అర్హులైన దివ్యాంగులకే ప్రభుత్వ పథకాలను వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వం ప్రతి ఆసుపత్రిలో ‘రీ వెరిఫికేషన్’ ను ప్రారంభించి, కొనసాగిస్తున్నారు. మంచానికే పరిమితమైన, చేతులు, కాళ్లు పనిచేయక తమ కుటుంబసభ్యుల, బంధువుల మీద ఆధారపడి జీవించే వారిని కూడా రీ వెరిఫికేషన్కు పిలిపించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికితోడుగా దళారుల బెడద కూడా ఎక్కువైంది. జిల్లావ్యాప్తంగా, కడప రిమ్స్లో కొందరు చిరుద్యోగులతోపాటుగా, పరిపాలనా విభాగంలోని ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, కొందరు అటెండర్లు తాము కొందరు డాక్టర్లతో మాట్లాడుకుని రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు అక్రమంగా వసూలు చేసి రీ వెరిఫికేషన్ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓపీ, ఐపీ విభాగాలలో వైద్య సేవలకోసం వచ్చేవారి సంఖ్య కూడా రోజురోజుకు సన్నగిల్లుతోందని చెప్పుకోవచ్చు. ఓపీకి సరాసరి రోజూ 1600 నుంచి 1800 వరకు వచ్చే వారు సోమ, మంగళ, బుధవారాలలో ఎక్కువగా వస్తున్నారు. గురు, శుక్ర, శనివారాలలో తగ్గుతున్నారు. నాడు వైఎస్ఆర్ ఉన్నతాశయం.. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ ఏర్పాటుచేశారు. నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సీఎం అయిన ఏడాదిలోనే కడప రిమ్స్ ఆవరణలో మూడు వివిధ ప్రదేశాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక వైద్యుల ఆసుపత్రికి, కేన్సర్ హాస్టిటల్కు శంకుస్థాపన నిర్వహించడంతో పాటు తమ పరిపాలన ముగిసేలోపే ఆయా హాస్పిటల్స్లలో నిర్మాణ పనులను పూర్తి చేసేలా కృషి చేశారు. 2023 డిసెంబర్లో రూ. 322 కోట్ల వ్యయంతో నిర్మించిన 452 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను, 100 పడకల కేన్సర్ హాస్పిటల్, 100 పడకల మానసిక వైకల్య నివారణ హాస్పిటల్ (ఐ.ఎం.హెచ్)ల భవన నిర్మాణాలను పూర్తి చేసి రిమ్స్ ఆవరణంలో ప్రత్యేక హాస్పిటల్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను ఇచ్చి అధికారులచే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తి కాకమునుపే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలిచిపోయాయి. తాజాగా ఇటీవల సూపర్ స్పెషాలిటీలో 69 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ఇచ్చారు. కానీ ఆ పోస్టులైనా తమకు న్యాయబద్ధంగా భర్తీ జరుగుతాయా? లేదా అని నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మిగతా రెండు హాస్పిటల్స్లలో కూడా పోస్టుల భర్తీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యోగార్థులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ఓపీ, ఐపీ విభాగాలలో రోగులకు తప్పని తిప్పలు దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో దళారుల దందా సూపర్, క్యాన్సర్, మానసిక హాస్పిటల్స్లలో పోస్టుల భర్తీ జరిగేనా..? డాక్టర్ల, సిబ్బంది పనితీరు పై పర్యవేక్షణ లోపం సమయపాలన పాటించని కొందరు వైద్యులు, సిబ్బంది -
డీఎస్సీ పరీక్షకు 267 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు మంగళవారం 267 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 9 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1,514 మంది అభ్యర్థులకు గాను 1,307 మంది హాజరు కాగా 207 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 3 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 545 మందికి గాను 485 మంది హాజరు కాగా 60 మంది గైర్హాజయ్యారు. మొత్తం 2,059 మందికి గాను 1,792 మంది హాజరు కాగా 267 మంది గైర్హాజరయ్యారు. 20న జాబ్ మేళా కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 20న కడప నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు సైజు ఫొటోతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలని పేర్కొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వారికి కావాల్సిన ట్రేడ్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు. పీఎఫ్, మెడికల్ అలవెన్స్తోపాటు క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారని వివరించారు. సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించండి కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు డైరెక్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వసభ్య సమావేశంలో తమకు రక్షణ కల్పించాలని, తమ హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని 39 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హైకోర్టులో ఇటీవల పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగవారం విచారణ జరిపిన న్యాయస్థానం సీరియస్గా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సక్రమంగా పాటించలేదని, గత సమావేశాల్లో జరిగిన పొరపాట్లు ఈ సమావేశంలో జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ కడప జిల్లా అడ్మిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్రశిక్ష కార్యాలయంలో సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులుగా పని చేయుటకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు(స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రెడ్ టీచర్స్) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ కమ్యూనిటీ మొబలైజేషన్ అఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 21 నుంచి 30 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఎన్జీవో కాలనీలోని అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్రశిక్ష కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో కడపలోని అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్ర శిక్ష కార్యాలయం వారిని సంప్రదించాలని వివరించారు. ట్రాన్స్కో ఎస్ఈ బాధ్యతల స్వీకరణ కడప కార్పొరేషన్: ఏపీ ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజినీర్గా సి.శ్రీరామ చంద్రమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 132కేవీ, 220 కేవీ సబ్స్టేషన్లను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కార్మికులు, ఇంజినీర్లు సమన్వయంతో పని చేసి సంస్థకు మంచిపేరు తేవాలని కోరారు. అనంతరం విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీనివాసరావు, విశ్వేశ్వరరెడ్డి, శ్రీనివాసరావు, ఈఈలు సుబ్రమణ్యం, నగేష్, రామిరెడ్డి, వెంకటేశ్వర్లు, నరేంద్ర, నారాయణస్వామి, చంద్రశేఖర్, సతీష్, గోపాలుడు, డీఈలు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్, అచ్యుత్రెడ్డి, విష్ణుకుమార్, రెడ్డి శేఖర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పీఎం ఆవాస్ యోజన కింద గృహాలు మంజూరు
కడప సెవెన్రోడ్స్ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద గృహాలు మంజూరు చేస్తున్నామని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి.రాజరత్నం తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2025 సంవత్సరానికి సంబంధించి గృహాల మంజూరుకు ఆన్లైన్ ఎంట్రీ జరుగుతోందన్నారు. అర్బన్ ప్రాంతాల్లో కనీసం 750 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం ఉన్న పేదలు ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం లాగిన్ ప్రొవైడ్ చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని అర్బన్ ప్రాంతాల నుంచి 2700 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి గృహాలు మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే వీరికి గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందులో కేంద్ర వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందన్నారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు మంజూరు చేస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా లాగిన్స్ ఇంకా ప్రొవైడ్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇంటి మంజూరుకు అవసరమైన పత్రాలు ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకునే వారు భార్యాభర్తల ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంకు వివరాలు, కులం, ఆదాయ సర్టిఫికెట్లు, ఇంటి స్థలం కొనుగోలుకు సంబంధించిన దస్తావేజులు లేదా పొసెషన్ సర్టిఫికెట్లు లేదా డి.పట్టా సమర్పించాల్సి ఉంటుందన్నారు. 14వ స్థానంలో జిల్లా గృహ నిర్మాణంలో ఇప్పటి దాకా 26వ స్థానంలో ఉన్న జిల్లా 14వ స్థానంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద 2019–24 వరకు జిల్లాలో 99,475 గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇందులో 48,016 (49 శాతం) నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. బేస్మెంట్ లెవెల్లో 30 వేలు, రూ.రూఫ్లెవెల్లో 10 వేలు, ఆర్సీ లెవెల్లో 10 వేలు ఉన్నాయన్నారు. ఈనెలాఖరుకు 10,821 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలన్నది లక్ష్యం కాగా, 5000 నిర్మాణాలు మాత్రం పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పటికే చేపట్టిన కాలనీల్లో నీరు, రోడ్లు, పైపులైన్ కనెక్షన్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు చెల్లించాల్సిన రూ.7 కోట్లు పెండింగ్లో ఉందన్నారు. ఆ నిధులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. నిధులు విడుదలైన వెంటనే మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడతామన్నారు. చాలా కాలనీల్లో వీధి లైట్లు వేయించామని, ఇంకా చాలా చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. అవసరమైన ప్రజలు గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో 2,700 ఇళ్లు మౌలిక సదుపాయాలకు రూ.7 కోట్ల కేటాయింపునకు ప్రతిపాదనలు హౌసింగ్ పీడీ వి.రాజరత్నం -
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
పులివెందుల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు భద్రత కరువైందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదోక చోట మహిళలు, చిన్నారులపై అఘాయత్యాలు పెరిగిపోయాయన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా మహిళపై దాడి జరగడం దారుణమన్నారు. రాష్ట్ర హోం మంత్రిగా ఒక మహిళ ఉండి కూడా మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ను ఏర్పాటు చేసి అండగా నిలవడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న టీడీపీ నేతలు అనేక కొర్రీలు పెట్టి ఎగ్గొట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అందలేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని తమకు ఇష్టం వచ్చిన రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపైన అక్రమ కేసులు బనాయించడం జరుగుతోందన్నారు. కొన్ని చోట్ల వీరి వేధింపులు తాళలేక వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి కుటుంబాల వారికి మనోధైర్యం నింపడానికి తమ పార్టీ అధినేత ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతుంటే.. దాన్ని కూడా ఆంక్షల పేరుతో ఈ ప్రభుత్వం అడ్డుకోవాలని చూడటం వారి నీచత్వానికి పరాకాష్టగా ఉందన్నారు. ఇటీవల పొదిలి పర్యటన సందర్భంగా తమ నాయకుడు వైఎస్ జగనన్నకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజులలో ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
21న ‘యోగాంధ్ర’ను విజయవంతం చేయాలి
కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా.. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సభా భవన్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, వారిని చైతన్యం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఇప్పట్లలో అగ్ని ప్రమాదం
లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యుగంధర్రెడ్డి అనే రైతుకు చెందిన డ్రిప్ ఇరిగేషన్ పైపులు, లాడర్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధిత రైతు తెలిపారు. వివరాలలోకి వెళితే.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫీజులు కాలిపోయి అగ్గిరవ్వలు ఎండు గడ్డిపై పడటంతో మంటలు బీడు పొలంలోకి ప్రవేశించడంతో పొలం గట్టున ఉంచిన పైపులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పొందిన రైతుకు అగ్ని ప్రమాదంవల్ల నష్టం సంభవించిందని, దీంతో తిరిగి ఆయనకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. వృద్ధుడు అదృశ్యంజమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధికి చెందిన బాణ చిన్న నారాయణరెడ్డి (75) అనే వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబీకులు మంగళవారం పట్టణ ఎస్ఐ హైమవతికి ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన బాణ చిన్న నారాయణరెడ్డి రోజు మాదిరిగా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. కాగా సోమవారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిరాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గుర్తు తెలియని (30–35 ఏళ్లు) వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రిలోని భవనాలకు వెనుక భాగాన గోడకు ఆనుకొని మృతదేహం కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మృతదేహంపై స్పష్టత రానందున మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడి కోసం ఎవరూ రానందున అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ బివి చలపతి తెలిపారు. -
●ఫ్లైయాష్ కోసం యుద్ధభేరీ
ఫ్లైయాష్ను సిమెంటు పరిశ్రమలకు తామే తరలించాలని కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మధ్య భీకర యుద్ధమే చోటుచేసుకుంది. పోలీసుల ప్రొటెక్షన్ ఏర్పాటు చేయించి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్రెడ్డి వాహనాలకు ఫ్లైయాష్ కేటాయించకుండా.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రైవేటుగా తన మనుషులను పెట్టి అడ్డకున్న ఈ వ్యవహారం పాఠకులకు తెలిసిందే. సీఎంఓ స్థాయిలో జోక్యం చేసుకొని ఎంఓయూ మేరకు ఆయా ట్రేడర్స్కు ఫ్లైయాష్ కేటాయించేలా ఆదేశించారు. కాగా, ఫ్లైయాష్ ఫాండ్కు చేరకుండానే మధ్యలో ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా కొల్లగొట్టుతున్న చరిత్ర తాజాగా ఆర్టీపీపీలో ఉత్పన్నం కావడం గమనార్హం. ఈ విషయమై పలువురు జెన్కో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా నిష్ప్రయోజనమే అయ్యిందని పలువురు వివరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆధారంగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాను తలదన్నేలా.. ఆర్టీపీపీలో అక్రమ దందా తెరపైకి వస్తోంది. నాడు (2014–19) పోట్లదుర్తి బ్రదర్స్ హవా కొనసాగిస్తే.. తాజాగా దేవగుడి సోదరుల హవా నడుస్తోంది. గతంలో ఆర్టీపీపీ 600 ఎండబ్ల్యూ(మెగావాట్లు) ప్లాంట్ నిర్మాణం పేరుతో అక్రమ కార్యకలాపాలు నడిపేవారు. ఇప్పుడు కూడా 600 ఎండబ్ల్యూ గేట్ నుంచి అనధికారికంగా బల్కర్స్ ఇన్ అవుట్ అవుతున్నాయి. ఈఎస్పీ ఆఫర్స్ నుంచి ఫ్లైయాష్ దోపిడీ దందా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు తక్కువంటే రూ.2 లక్షలు జెన్కో ఆదాయం కోల్పోతుండగా, ఆ మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుతోంది. ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా దోపిడీ డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆధారంగా అక్రమార్జన కోసం కూటమి ప్రభుత్వ నేతలు అర్రులు చాస్తున్నారు. నాడు నిర్మాణ పనుల ఆధారంగా అధికార పార్టీ నేతలు ఆదాయం ఆశిస్తే.. నేడు ఆర్టీపీపీ నుంచి వెలువడే ఫ్లైయాష్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఆర్టీపీపీ రన్నింగ్ యూనిట్ల నుంచి ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా సైనోస్ నుంచి ఫ్లైయాష్ రిలీజ్ చేస్తారు. కాగా, సైనోస్లో ప్రాబ్లమ్స్ తలెత్తితే, ఈఎస్పీ ఆఫర్స్ ఓపెన్ చేసి ఫ్లైయాష్ రిలీజ్ చేస్తారు. ఈఎస్పీ ద్వారా రిలీజ్ అయిన గ్రౌండ్ ఫ్లైయాష్ క్లియర్ చేసేందుకు టన్నుకు రూ.60 చొప్పున ఆర్టీపీపీ చెల్లిస్తోంది. అక్కడ నుంచి సదరు కాంట్రాక్టర్ ఫ్లైయాష్ క్లియర్ చేయాలి. అయితే సైనోస్ ద్వారా డైలీ 2 వేల టన్నులు ఫ్లైయాష్ రిలీజ్ అవుతోంది. ఎంఓయూ మేరకు టన్ను రూ.546తో నేరుగా ట్రక్కు లు, ట్యాంకర్ల ద్వారా బల్కర్స్ వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లి పేమేంట్ చేసేవారు. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని అధికార పార్టీ నేతలు పూర్తిగా మరుగు పర్చారు. ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా ఫ్లైయాష్ దోపిడీ చేస్తున్నారు. అధికారుల సహకారంతో జెన్కో ఖజానాకు చిల్లు ఫ్లైయాష్తో నింపిన ట్యాంకర్లు వేబ్రిడ్జి కాటా వేసిన తర్వాత ఇన్వాయిస్, జీఎస్టీ బిల్లు జనరేట్ చేయా ల్సి ఉంది. టన్ను రూ.546తో ట్రేడర్స్కు బిల్లు చేయా ల్సి ఉంది. కాగా ప్రతి రోజు ఈఎస్పీ ఆఫర్స్ ద్వారా ఫ్లైయాష్ను రిలీజ్ చేస్తున్నారు. ఆ ఫ్లైయాష్ నేరుగా ఓ ట్యాంకర్లో పడేలా ఫిక్స్ చేశారు. సదరు ట్యాంకర్కు కంప్రెషర్ ద్వారా ఎయిర్ పైపు ఫిట్ చేసి దాని ద్వారా బల్కర్లకు లోడ్ చేస్తున్నారు. మరోవైపు బల్కర్లు అధికంగా వస్తే నేరుగా ఈఎస్ఫీ ఆఫర్స్కు మిషన్ ఫిట్ చేసి లోడింగ్ చేస్తున్నారు. ఇదంతా అనధికారికంగా నడుస్తోంది. కేజీఎఫ్ సినిమాలో లాగా ఫ్లైయాష్ను కొల్లగొట్టుతున్నారు. ప్రతి రోజు ఇలా 4 నుంచి 6 ట్యాంకర్లు అక్రమంగా తరలుతున్నాయి. ఒక్కొక్క ట్యాంకర్కు 50 నుంచి 70 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. సరాసరిగా ఒక్కొక్క ట్యాంకర్ ద్వారా రూ.35 వేల అక్రమార్జన లభిస్తోంది. ఈ ట్యాంకర్లన్నీ 600 మెగావాట్స్ గేటు నుంచి ఇన్ అవుట్ అవుతోన్నాయి. వీటికి వేబిల్స్ ఉండవు, జీఎస్టీ బిల్లులు ఉండవు. ప్రైవేటు వేబ్రిడ్జి వద్ద కాటా వేయించుకొని సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. కాటా ఆధారంగా సిమెంటు కంపెనీలు బిల్లులు జనరేట్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం జెన్కో అధికారుల సహకారంతోనే అధికార పార్టీ నేతలు తరలిస్తోన్నట్లు సమాచారం. ప్రతి రోజు దాదాపు రూ.2 లక్షలు తెలిసి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంటే ‘కళ్లుండీ చూడలేని కబోదిలా’ వ్యవహరిస్తున్నారు. నాడు పోట్లదుర్తి బ్రదర్స్.. నేడు దేవగుడి సోదరుల దందా ఫ్లైయాష్ అక్రమ రవాణాలో ఆరితేరిన కూటమి నేతలు యాష్ ఫాండ్కు తరలించకుండానే అక్రమ రవాణా దోపిడీకి సరికొత్త ఎత్తుగడ.. నిత్యం లక్షలాది రూపాయలు స్వాహా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జెన్కో యంత్రాంగం -
ఒంటరి మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరికం
కడప కార్పొరేషన్ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తన పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అనాగరికమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం దారుణమన్నారు. తన భర్త అప్పులు చేసి పారిపోతే కూలి పనులు చేసుకుంటూ ఆ మహిళ కొద్ది కొద్దిగా అప్పు చెల్లిస్తోందని, అయినా వినకుండా మునికన్నప్ప అనే వ్యక్తి ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లి ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టడం అమానవీయమన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రిగానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రిగానీ స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట హింస జరుగుతూనే ఉందన్నారు. జమ్మలమడుగులోని మైలవరంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుని ఇంటిని కూల్చివేశారన్నారు. ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు భద్రత కల్పించలేమని ఒక ఎస్పీ ప్రెస్మీట్ పెట్టి విమర్శలు చేయడం దారుణమన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి బెయిల్ వస్తే దానిపై మాట్లాడిన హోంమంత్రి, ఇలాంటి ఘటనలపై నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. కుప్పంలో దాడికి గురైన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి, రత్నకుమారి, బి. మరియలు, నారాయణమ్మ, సుశీలమ్మ, తులశమ్మ, చైతల్య, మల్లీశ్వరి, పద్మ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ -
మలుగుడుపాడులో భూఆక్రమణల జోరు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని డి.నేలటూరు పంచాయతీ మలుగుడు పాడు గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 571లో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇందులో అధికార టీడీపీకి చెందిన స్థానిక పంచాయతీ నాయకులు ముందు ఉండి ఆక్రమణలకు శ్రీకారం చుడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 2005లో అసైన్మెంట్ కమిటీకి ఉత్తర్వులు ఇవ్వడంతో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ డీయల్ రవీంద్రారెడ్డి డి.నేలటూరు పంచాయతీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఓసీ నిరుపేదలకు ఒక్కొక్కరికి 3 నుంచి 5 ఎకరాల వరకు భూ పంపిణీ చేశారు. డీ పట్టాలు కూడా పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డి.నేలటూరు పంచాయతీ పరిధిలో ఉన్న అధికార పార్టీ నాయకులు నిరుపేదలకు ఇచ్చిన భూములపై పడ్డారు. నాయకులు వాటాలుగా పంచుకొని రాత్రివేళ్లలో బోర్లు వేయడం.. డోజర్లతో చదును చేయడం ప్రారంభించారు. డీ పట్టాలు ఉన్న బీసీలు, ఎస్సీలు అడ్డుకొనేందుకు వెళ్లినా నీ భూమి ఇక్కడ లేదు ఎక్కడో ఉంది అక్కడికి వెళ్లు.. అని భయానికి గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. వందలాది ఎకరాలు ఆక్రమణలకు గురి అవుతున్నా రెవిన్యూ అధికారులు మాత్రం అటువైపు చూడనట్లు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైతే చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులకు చెప్పానని అంటున్నారు. మరి ఆయన మాటలు వారు విననట్లు ఉంది. పేదల భూములు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నా చర్యలు మాత్రం శూన్యం.. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అధికార పార్టీ అండతో నిరుపేదలకు ఇచ్చిన భూముల ఆక్రమణ దివంగత వైఎస్సార్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు -
ప్రారంభమైన బదిలీల కౌన్సెలింగ్
కడప రూరల్ : వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఉద్యోగుల బదిలీల జూమ్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు జరగనుంది. కౌన్సిలింగ్ను ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య, విజయవాడ నుంచి వచ్చిన పరిశీలకులు రామ్నాధం, భిక్షాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, జూనియర్ అసిస్టెంట్స్ వనీష, బత్తనయ్య తదితరులు పాల్గొన్నారు. అంతటా ఆసక్తి.. ఈ శాఖ పరిధిలో రాయలసీమ జిల్లాలు ఉద్యోగులు వస్తారు. వివిధ కేడర్లకు సంబంధించి నిబంధనల ప్రకారం వేలాది మంది ఉద్యోగులను బదిలీ చేయాలి. ఈ సందర్భంగా పలువురు పలుకుబడి..పరపతి ఉన్న ఉద్యోగులు ఉన్నచోటే ఉండడానికి పాకులాడారు. మరికొందరు ఆశించిన సీటు కోసం పోరాటం చేశారు. ఈ నేపధ్యంలో కొందరికి అనూహ్యంగా నిరాశ ఎదురైంది. ఈ పరిణామాలు ఆ శాఖ ఉద్యోగుల్లో ఉత్కంఠ రేపాయి. మొదటి రోజు కౌన్సెలింగ్లో కీలకమైన ఆఫీస్ సూపరింటెండెంట్ స్థానం కోసం కొందరు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా వినికిడి. అలాగే హెల్త్ ఎడ్యుకేటర్కు సంబంధించి బది‘లీలలు’ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా రెండు రోజుల పాటు జరిగే కౌన్సెలింగ్పై అందరూ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం బదిలీలు చేపడుతున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఉత్కంఠ రేపుతున్న ట్రాన్స్ఫర్స్ -
మట్కా బీటర్లు అరెస్ట్
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని అలంకార్ సినిమా హాలు వద్ద 5 మంది మట్కా బీటర్లను అరెస్ట్చేసి వారి వద్ద నుంచి మట్కా పట్టీలు, రూ. 1,39,000 స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ హైమావతి మంగళవారం తెలిపారు. పట్టణంలోని అలంకార్ సినిమా హాల్ వద్ద మట్కా బీటర్లు ఉన్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో షేక్ గౌస్ ఖలందర్తో పాటు మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆంధ్రసౌత్ జోన్ క్రికెట్ జట్టుకు నందలూరు బాలిక నందలూరు : ఆంధ్ర సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు నందలూరు విభా ఏరుడైట్ స్కూల్కు చెందిన హనుమంతు పూర్విజా ఎంపికై నట్లు క్రికెట్ సబ్ సెంటర్ కోచ్లు గయాజ్, ఫైరోజ్ఖాన్ లోడీలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ పూర్విజ స్థానిక సబ్సెంటర్లో ఫాస్ట్ బౌలింగ్లో శిక్షణ పొందుతూ మంచి క్రమశిక్షణతో శ్రమించి ప్రాక్టీస్ చేస్తూ జిల్లా జట్టుకు ఎంపిక అయిందన్నారు. తన ఫాస్ట్ బౌలింగ్తో నెల్లూరు జిల్లాలో జరిగిన జిల్లా క్రికెట్ మ్యాచ్లలో నెల్లూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లలో అన్ని జిల్లాల మీద మంచి వికెట్లు సాధించి అండర్ –15 విభాగంలో ఆంధ్రా సౌత్జోన్ జట్టుకు ఎంపిక అయిందన్నారు. వివాహిత ఆత్మహత్యమదనపల్లె రూరల్ : వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రామసముద్రం మండలంలో జరిగింది. కాప్పల్లె చెందిన సంతోష్ కు ఏడేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన అహల్య (27) తో వివాహం జరిగింది. వీరికి రోహన్ సాయి, రుషి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గత కొంతకాలంగా అహల్య వేరు కాపురం పెట్టాలని భర్తతో తరచూ గొడవపడుతుండేది. మంగళవారం ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అహల్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. -
ఆ థర్డ్ డిగ్రీపై నిగ్గుతేల్చండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు పలువురు కార్మికులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. వారి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవంటూ పులివెందుల ప్రభుత్వాసుపత్రి మెడికల్ ఆఫీసర్ తప్పుడు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చే బాధ్యతను కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్కు అప్పగించింది. పిటిషనర్లకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ రిపోర్టులను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దారుణంగా హింసించిన డీఎస్పీ, సీఐ ఓ కేసులో పులివెందుల 4వ వార్డు కౌన్సిలర్ పి.కిషోర్, 25వ వార్డు కౌన్సిలర్ కావేటి మల్లికార్జున, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ వెంకటపతితో పాటు పలువురు కార్మికులను పులివెందుల పోలీసులు గత నెల 28న అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్బాషా, రమణ కలిసి తీవ్రంగా కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు సంబంధిత మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకొచ్చారు. వీరు చెప్పిన వివరాలను రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్ వైద్య పరీక్షల నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పంపారు.అయితే, బాధితుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని అక్కడి వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు కడప వెలుపల ఏదైనా ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో గానీ, స్వతంత్ర వైద్యుడి చేత గానీ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కౌన్సిలర్లు కిషోర్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ హరినాథ్ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారన్నారు. పులివెందుల ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా నిష్పాక్షికంగా వ్యవహరించకుండా పోలీసులు చెప్పినట్టు తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, దీనివల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. పిటిషనర్లను 24 గంటల్లోపు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ముందు హాజరుపరచాలని పులివెందుల పోలీసులను ఆదేశించారు. వీరికి తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను తమ ముందుంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను న్యాయమూర్తి ఆదేశించారు. -
వన్డే క్రికెట్ టోర్నీలో కడప, చిత్తూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో కడప, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. సోమవారం కేఎస్ఆర్ఎం మైదానంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై 4 వికెట్ల తేడాతో చిత్తూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 21.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులు చేసింది. చిత్తూరు జట్టులో ధనుష్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు , సాయి శరణ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 82 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాంటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 15.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. జట్టులోని వరుణ్ 50 పరుగులు చేశాడు. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన వేరొక మ్యాచ్లో అనంతపురం జట్టుపై 10 వికెట్ల తేడాతో కడప జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 43.4 ఓవర్లకు అన్ని వికెట్లు కోల్పోయి130 పరుగులు చేసింది. జట్టులోని వీరారెడ్డి 25 పరుగులు చేశాడు. కడప బౌలర్ నాగ కుళ్లాయప్ప 3 వికెట్లు తీశాడు. అనంతరం 131 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 15.1 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 132 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రోహిత్ వర్మ 90 పరుగులు చేశాడు. -
నగరపాలక సర్వసభ్య సమావేశానికి భద్రత కల్పించండి
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో ఈనెల 20వ తేదీ నిర్వహించే సర్వసభ్య సమావేశానికి తగిన భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కోరారు. సోమవారం వారు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగి సర్వసభ్య సమావేశాల్లో బయటి వ్యక్తులు సభలోకి రావడంతో సభలో గందరగోళం ఏర్పడిందన్నారు. మేయర్, కార్పొరేటర్లు ఆమోదించిన ఎజెండాను కమిషనర్ తాను వినలేదు అని చెప్పి సెక్రటరీ వద్ద ఉన్న మినిట్స్ పుస్తకాన్ని కమిషనర్ తెప్పించుకొని ఆయనవద్దే ఉంచుకొని నెలరోజులపాటు తీర్మానాలను ఆమోదించలేదన్నారు. అప్పటి నుంచి కౌన్సిల్ హాలుకు తాళాలు వేశారని, హాలును తెరవాలని మేయర్, కార్పొరేటర్లు కలిసి రాతమూలకంగా తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈనెల 20న సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో అందులో వసతుల కల్పనకు ఈనెల 18వ తేదీ కౌన్సిల్ హాలు తెరిచేందుకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మాధవి కార్పొరేషన్కు సంబంధం లేని వ్యక్తులతో సభలోకి ప్రవేశించడాన్ని నిరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, కె. బాబు, రామలక్ష్మణ్రెడ్డి, శివకోటిరెడ్డి, షంషీర్, జహీర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, డివిజన్ ఇన్చార్జులు జమాల్వలీ, ఎస్ఎండీ రిజ్వాన్, సుబ్బరాయుడు పాల్గొన్నారు.జేసీ, ఎస్పీలకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వినతి -
ప్రజలను సంఘటితం చేయాలి
2019 ఎన్నికల్లో ఎలా పని చేశామో కార్యకర్తలంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇటుక, ఇటుక పేర్చుకుంటూ పార్టీ నిర్మాణం చేయాలి. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లు.. మన సొంత గ్రామం నుంచే పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.అజయ్రెడ్డి, కడప పార్లమెంటు పరిశీలకులు బ్లూ బుక్లో రాసుకోండి వైఎస్సార్సీపీ నాయకులను వేధించే అధికారులు, టీడీపీ నాయకుల పేర్లను బ్లూ బుక్లో రాసుకోవాలి. చంద్రబాబు అబద్ధాల వల్లే వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమికి ఓటేసి ఎంత పొరపాటు చేశామని ప్రజలు నేడు బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. – ఎస్.రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ -
టిప్పర్ చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
మైదుకూరు : మైదుకూరులో శనివారం రాత్రి టిప్పర్ చోరీకి గురైన సంఘటనలో సోమవారం మైదుకూరు అర్బన్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ సోమవారం సాయంత్రం అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నెపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న కాశినాయన మండలం రెడ్డికొట్టాలు గ్రామానికి చెందిన దేశిరెడ్డి ఈశ్వర్రెడ్డి కొంత కాలంగా మైదుకూరు మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన చాగంరెడ్డి సాంబశివారెడ్డికి చెందిన టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇవ్వాల్సిన జీతం సాంబశివారెడ్డి రూ.29వేలు బకాయి పడ్డాడు. బకాయి సొమ్ము అడిగినా ఇవ్వడం లేదనే కోపంతో డ్రైవర్ ఈశ్వర్రెడ్డి తన స్నేహితులైన బ్రహ్మంగారిమంఠం మండలం కేవశవాపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి ఓబుళరెడ్డి, రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామానికి చెందిన పోరెడ్డి రామసుబ్బారెడ్డి అనే వారితో కలిసి శనివారం రాత్రి స్థానిక వనిపెంట రోడ్డులో జగన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద పార్కు చేసి ఉన్న సాంబశివారెడ్డికి చెందిన రూ.10లక్షల విలువైన టిప్పర్ను దొంగలించుకెళ్లారు. టిప్పర్ను విక్రయించి వచ్చిన సొమ్మును ముగ్గురు సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. టిప్పర్ను గుంటూరుకు తీసుకెళ్లి విడిభాగాలుగా చేసి విక్రయించాలని పథకం వేసుకున్నారు. అంతవరకు టిప్పర్ను ఖాజీపేట మండలం నాగసానిపల్లె వద్ద కంపచెట్లలో దాచి పెట్టారు. తనకున్న ఇంకొక టిప్పర్ కేశలింగాయపల్లె వద్ద ఉండగా అక్కడికి వెళ్లి వచ్చేసరికి చోరీకి గురికావడంపై యజమాని చాగంరెడ్డి సాంబశివారెడ్డి ఆదివారం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిప్పర్కున్న జీపీఎస్ పరికరాన్ని దుండగులు తొలగించడంతో అర్బన్ పోలీసులు దుండగుల కోసం గాలిస్తూ నిఘా ఉంచారు. సోమవారం డ్రైవర్ ఈశ్వర్రెడ్డి, అతని స్నేహితులు కలిసి టిప్పర్ను విక్రయించేందుకు గుంటూరుకు తీసుకుని వెళుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మైదుకూరు – బద్వేలు రోడ్డులో ఉన్న తువ్వపల్లె కూడలి వద్ద అరెస్టు చేసి టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో దేశిరెడ్డి ఈశ్వర్రెడ్డి గతంలో రెండు హత్యకేసుల్లో, 5 మోటారు బైక్ల చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని.. వేమిరెడ్డి ఓబుళరెడ్డి ఒక ఎర్రచందనం కేసు, ట్రాక్టర్ చోరీ, రెండు మోటార్ బైక్ల చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. టిప్పర్ చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే నిఘా ఉంచి నిందితులను పట్టుకున్న అర్బన్ సీఐ కేవీ రమణారెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సిబ్బందికి రివార్డులను అందజేశారు. విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ కేవీ రమణారెడ్డి, ఎస్ఐ ఎస్.సుబ్బారావు, ఏఎస్ఐ మురళి, సిబ్బంది పాల్గొన్నారు.ఇద్దరు పాత కేసుల్లో నిందితులు -
30 లక్షల మంది తల్లులకు కోత
కడప కార్పొరేషన్ : తల్లికి వందనం పథకంలో 30 లక్షల మంది తల్లులకు కోత విధించారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక మేడా కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, పార్లమెంటు పరిశీలకులు కె. అజయ్రెడ్డి, పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఎస్. రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, జెడ్పీ ఛైర్మన్ రామగోవిందరెడ్డి, కమలాపురం సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి, మాజీ సలహాదారు ఇ. తిరుపాల్రెడ్డిలతో కలిసి ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల హామీలను ఏ రకంగా అమలు చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే, ఏ రకంగా తుంగలో తొక్కాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని, ఎల్లో మీడియా తప్పా మరే మీడియా ఉండకూడదన్న ఉద్దేశం కనబడుతోందన్నారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేస్తే, వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనే తిరిగి కేసులు పెట్టారన్నారు. వారిని అసాంఽఘిక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని, ఈ ఘోరాలు, నేరాలు, తప్పులను చూపకుండా మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దొంగతనాలు, జూదం, మట్కా, అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతోందని, శాంతిభద్రతలను గాలికొదిలేశారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడంలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో రూ.3.30లక్షల కోట్ల అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదికే రూ.1.58లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. అంత అప్పు చేసి కూడా పథకాలు అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. చొక్కాలు పట్టుకోవడం కాదు.. ఊడదీస్తారు: రవీంద్రనాథ్రెడ్డి అన్నీ లెక్కలు వేసుకున్నాం.. సూపర్ సిక్స్ పథకాలతో పాటు అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేస్తాం...అలా చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల్లో చెప్పారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు వారి చొక్కాలు ఊడదీయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్సీపీ ఉద్యమిస్తేనే తల్లికి వందనం అమలు చేశారని, అందులోనూ సగం మందికి కోత కోశారన్నారు. నాలుగున్నర లక్షల మందికి పింఛన్లు ఎగ్గొట్టారన్నారు. సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ కేకులు కట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. అమరావతి పేరుతో రూ.53వేల కోట్లు అప్పులు చేశారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసమే టెండర్లు పిలిచారన్నారు. వివిధ పథకాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం రూ.83వేల కోట్లు ప్రజలకు ఎగనామం పెట్టిందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కూటమి పాలన అప్పులు చేస్తున్నా.. పథకాలు అమలు చేయడం లేదు శాంతి భద్రతలను గాలికొదిలేశారు ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
నిబంధనాలు
● సజావుగా సాగని రిజిస్ట్రేషన్లు ● స్లాట్ బుకింగ్తో ఆటంకాలు ● సతాయిస్తున్న సర్వర్ సమస్య ● క్రయవిక్రయదారులకు ఇక్కట్లు ● ప్రభుత్వ తీరుపై అసహనం కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రభుత్వానికి రోజూ రిజిస్ట్రేషన్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయితే కూటమి సర్కార్ రోజుకొక కొత్త నిబంధన తీసుకు వస్తుండటంతో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగకపోగా, వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం 2.0 విధానం తీసుకొచ్చింది. దాని తర్వాత స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకు రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తొలుత సర్వర్ సరిగా పనిచేయక రిజిస్ట్రేషన్కు తరచూ ఆటంకాలు కలుగుతుండటంతో.. క్రయ విక్రయదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సర్వర్ సమస్య, మరోవైపు ఇంటర్నెట్ సరిగా పని చేయకపోవడంతో గంటల కొద్దీ ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కడపలో ప్రధాన అర్బన్ కార్యాలయంతోపాటు రూరల్ కార్యాలయం ఉంది. వీటితోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులి వెందుల, ముద్దనూరు, ఎర్రగుంట్ల, వేంపల్లె, కమలాపురం, సిద్దవటం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరులో నిత్యం క్రయ విక్రయదారుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట కడప అర్బన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానా న్ని అమలు చేశారు. ఆ తర్వాత జిల్లాలోని మిగి లిన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ విధా నం అమలులోకి వచ్చినప్పటికీ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తమ రిజిస్ట్రేషన్ కోసం తొలుత స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి.. కచ్చితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకోవాలి. ఆ సమయానికి వెళ్లకపోతే తిరిగి స్లాట్ బుక్ చేసుకోవా ల్సి వస్తోంది. ఈ కారణంగా సుదూర ప్రాంతాల ను ంచి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రతి రోజు ఒకరిద్దరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రోజుకు ఒక్కొక్క కార్యాలయంలో 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ప్రస్తుతం స్లాట్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత 39 రిజిస్ట్రేషన్లు మాత్ర మే చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి పడుతోంది. ఆధార్, పాన్ కార్డు తప్పనిసరి ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు సంబంధించి క్రయ విక్రయదారులు ఇరువురు ఆధార్, పాన్కార్డులను కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయా కార్డుల్లో జన్మదిన తేదీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కొంత మంది క్రయ విక్రయదారులకు పాన్కార్డు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. ఏ దస్తావేజుకై నా కక్షిదారులు తప్పనిసరిగా పాన్కార్డు ఉంటేనే.. రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వానికి ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే శాఖపైనే సంబంధిత అధికారులు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. పాన్ కార్డు తప్పనిసరి కావడం వల్ల అమ్మకం, కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి వచ్చాక కష్టాలు అధికం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వచ్చాక కష్టాలు అధికమయ్యాయి. క్రయ విక్రయదారులకు పాన్కార్డు ఉండాలన్న నిబంధనలతో తీవ్ర సమస్యగా మారింది. అలాగే శ్లాట్ బుకింగ్ విధానంతో కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. – డేనియల్, కడప -
ఫిర్యాదుదారులకు న్యాయం చేయండి
కడప అర్బన్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్న్స్ రిడ్రెస్సల్ సిస్టం ) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ స్థలం ఆక్రమణదారులకు నోటీసులు
ప్రొద్దుటూరు క్రైం : రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో నివాసం ఉంటున్న వారికి సోమవారం అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ఎఫ్ఆర్ఓ హేమాంజలి ఆధ్వర్యంలో అటవీ, రెవెన్యూ అధికారులు కలిసి 3వ నోటీసును అందజేశారు. కొన్ని రోజుల క్రితం వీరికి రెండు నోటీసులను అందజేసిన విషయం తెలిసిందే. నోటీసులు ముట్టిన 15 రోజుల్లోపు సంజాయిషీ, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను అటవీశాఖ అధికారులకు చూపించాల్సి ఉంది. అయితే మొదటి రెండు నోటీసులకు ఆక్రమణదారులు ఎలాంటి డాక్యుమెంట్లను చూపించలేదని అధికారులు చెబుతున్నారు. ఇదే చివరి నోటీసు.. రామేశ్వరం రిజర్వు ఫారెస్ట్ స్థలంలో పెద్ద ఎత్తున ఇళ్లు వెలిశాయి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్లను నిర్మించుకొని వందలాది కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి. కొన్ని ఇళ్లైతే రెండు, మూడు చేతులు కూడా మారాయి. అటవీస్థలం పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైందని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణంలోని ఒక న్యాయవాది లోకాయుక్తకు వెళ్లారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అటవీ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రొద్దుటూరు అటవీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే అటవీ– రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. ప్రొద్దుటూరు రేంజ్ పరిధిలో సుమారు 1044 ఎకరాల అటవీభూమి ఉన్నట్లు అధికారిక గెజిట్లో ఉంది. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి, ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో ఉండాల్సిన అటవీ భూమిలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సర్వే అనంతరం 825 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మిగతా 219 ఎకరాలు ఏమైందనేది తేలాల్సి ఉంది. జాయింట్ సర్వే రిపోర్టు తుది నివేదికను అధికారులు నేడో, రేపో కోర్టుకు సమర్పించనున్నారు. కాగా సోమవారం నుంచి 3వ నోటీసును అందించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో నోటీసు జారీ పూర్తి కానున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఇదే చివరి నోటీసు అని, నోటీసు అందిన 15 రోజుల్లోగా అటవీ స్థలంలో ఇళ్లను నిర్మించుకున్న వారు సంజాయిషీతో పాటు తగు డాక్యుమెంట్లను చూపించకుంటే స్థలాన్ని ఖాళీ చేయించేందుకు అఽధికారులు సిద్ధమవుతున్నారు. 35 ఏళ్లుగా నివాసాలు బైపాస్రోడ్డులోని ముక్తియార్ ఆయిల్మిల్లు వెనుక భాగంలో ఉన్న రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో సుమారు 254 ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక్కడ 35 ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్నారు. ఈ ప్రాంతంలో పోలింగ్బూత్తో పాటు అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రతి ఇంటికి డోర్ నంబర్, విద్యుత్ మీటర్ ఉందని, కుళాయి పన్ను కూడా కడుతున్నట్లు తెలిపారు. ఇప్పడు ఉన్నట్టుండి ఎలా ఖాళీ చేస్తామని వారు చెబుతున్నారు. -
సైనికుల్లా పని చేయాలి
రాబోయే నాలుగేళ్లు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలి. ప్రతి నెలా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి సమావేశాలు నిర్వహించాలి. మూడు నెలలకోసారి జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోవాలి. కార్యకర్తలు, నాయకులే పార్టీకి పట్టుగొమ్మలు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, బలోపేతంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి. 2019–24లో కార్యకర్తల అంచనాలకు అందుకోలేకపోయాం. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ 2.0 సరికొత్తగా, అద్భుతంగా ఉంటుంది. అన్ని కమిటీలు పార్టీకి పునాది లాంటివి. – పి. రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ -
తల్లికి వందనం కార్మికులందరికీ వర్తింపజేయాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాస్, అంగన్వాడీ, మున్సిపల్, స్టీమ్ వర్కర్లందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికుల సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయని సీఐటీయూ కార్యదర్శి మనోహర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకట సుబ్బయ్య అన్నారు. తాము అధికారంలోకి వస్తే రూ. 25 వేల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరించడం దారుణమని విమర్శించారు. అంగన్వాడీ ఆయాకు రూ. 7 వేలు, టీచర్కు రూ. 11,500 మాత్రమే వేతనం ఇస్తున్నారని, వీరికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి, వరలక్ష్మి, భాగ్యమ్మ, సావిత్రి, విజయ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
దువ్వూరు : మండలంలోని ఐ.బయనపల్లె గ్రామంలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐ.బయనపల్లె గ్రామానికి చెందిన బొందెల రాంబాబు (37) పొలం కౌలుకు తీసుకుని పూల పంటను సాగు చేస్తున్నాడు. సోమవారం ఉదయం పొలానికి నీరు కట్టాలని మోటార్ను ఆన్ చేయడానికి స్టార్టర్ స్విచ్ ఆన్ చేయగా విద్యుత్ షాక్తో రాంబాబు అక్కడికక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కేరళ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రాధా, అర్షిత్ (8), అభిరామ్ (7) అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. డిష్ కేబుల్ మెడకు తగిలి.. వాహనదారుడికి తీవ్ర గాయాలుఅట్లూరు : డిష్ కేబుల్ మెడకు తగిలి ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన అట్లూరు మండలం అయ్యప్పస్వామి ఆలయం వద్ద జరిగింది. స్థానికులు, బాధితుని వివరాల మేరకు కొండూరు బీసీ కాలనీకి చెందిన కోడికాళ్ల హరికృష్ణ తన ఇద్దరు కుమారులను ద్విచక్ర వాహనంపై అట్లూరు క్రాస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి గుడి దగ్గరకు వచ్చే సరికి విద్యుత్తు స్థంభాలపై వేలాడుతున్న డిష్ కేబుల్ హరికృష్ణ మెడకు తగిలి చుట్టుకుంది. దీంతో ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అతని కుమారులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన హరికృష్ణను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
సారూ.. సమస్యలు తీర్చరూ..
కడప సెవెన్రోడ్స్: సారూ.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని సభా భవనంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో వారు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జిల్లా అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక్కడికి వచ్చామని, మీరైనా కష్టాలు తీర్చాలని కోరారు. వారిలోని కొందరి సమస్యలు ఇలా ఉన్నాయి. ● భూ రీ సర్వే అనంతరం కొత్తగా 1బీ అడంగల్లో ఇనాం అనే పేరు చేర్చడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె గ్రామానికి చెందిన రైతు జాగృతి సంఘం అధ్యక్షుడు జి.మనోసాగర్రెడ్డి తెలిపారు. అందువల్ల రైతులు భూమిని అమ్ముకోలేకపోతున్నారని, ఒకవేళ కొనేందుకు ఎవరైనా వచ్చినా తక్కువ రేటుకు అడుగుతున్నారని చెప్పారు. ఆర్ఎస్ఆర్లో ఇనాం అని ఉండటం వల్ల 1బీ అడంగల్లో ఇనాం పొందుపరిచినట్లు సర్వేయర్ అంటున్నారని తెలిపారు. ● మైదుకూరులో నాఫెడ్ సంస్థకు, ఉల్లి పరిశోధన కేంద్రం ఎన్హెచ్ఆర్డీఎఫ్లకు భూమిని కేటాయించాలని బీపీ వెంకట ప్రతాప్రెడ్డి కోరారు. జనవరి 18న ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు పర్యటనకు వచ్చినపుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు. జలవనరుల శాఖ భూమి ఉల్లి పరిశోధన కేంద్రానికి, నాఫెడ్ సంస్థ భూమి వాణిజ్య అవసరాల కోసం తిరిగి ఆ సంస్థకే కేటాయించాలని కోరారు. ● తమ గ్రామ సర్వే నంబరు 158లో 3.26 ఎకరాల భూమి తాను 1986లో కొనుగోలు చేశానని జమ్మలమడుగు మండలం పి.సిరిగేపల్లె గ్రామానికి చెందని ఎస్.గుర్రప్ప తెలిపారు. అయితే చిన్నదండ్లూరు గ్రామానికి చెందిన మాచనూరు వీరారెడ్డి అనే రైతు ఆ భూమి తనకు వచ్చిందంటూ సరిహద్దు రాళ్లు పీకేసి సుమారు ఎకరా భూమిని ఆక్రమించారని ఆరోపించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ సి.శ్రీధర్తోపాటు జిల్లా అధికారులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఎస్డీసీ వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్కుమార్తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గంగమ్మా..కరుణించమ్మా
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా కరుణించి.. కాపాడవమ్మా.. సకాలంలో వర్షాలు కురిపించు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని క ల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూంబింగ్ సిద్దవటం: సిద్దవటం రేంజిలోని గొల్లపల్లె బీటులో కూబింగ్ నిర్వహించామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు సిద్దవటం ఫారెస్టు రేంజి పరిధిలోని గొల్లపల్లె, ఫారెస్ట్ బీట్లలోని సమస్యాత్మక , అనుమానిత ప్రదేశాల్లో తమ సిబ్బంది ఆదివారం ఎర్రచందనం అక్రమాలు జరగకుండా కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ప్రజలకు ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేసు, ఫారెస్టుబీట్ అఫీసర్లు ఆది విశ్వనాథ్, మధు పాల్గొన్నారు. -
రాజ్యాంగేతర శక్తి!
● ఈనెల 7న శనివారం అర్ధరాత్రి అనంతంపల్లె సింగిల్విండో మాజీ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డిపై పుల్లంపేటలో హత్యాయత్నం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు నిందితుల దాడి నుంచి ప్రాణాలు దక్కించుకున్నారు. వివాహానికి వెళ్లిన సుదర్శన్రెడ్డి ఇంటికి వస్తారని తెలుసుకొని పోలీసుస్టేషన్లో సమీపంలో మాటువేసి ఉన్న దుండగులకు అనూహ్యంగా చిక్కారు. పిడిబాకుతో పొడుస్తుండగా పెనుగులాటలో జారుడు గాయాలు తగిలాయి. సుదర్శన్రెడ్డి చావు కేకలు విన్పించడంతో ఇరుగుపొరుగు వారు నిద్రలేచి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఈతతంగం మొత్తం పోలీసుస్టేషన్ ఎదుట చోటుచేసుకుంది. ● ఈనెల 13న శుక్రవారం సాయంత్రం ఓబులవారిపల్లె మండలం తల్లంవారిపల్లెలో భూవివాదంలో వాగ్వాదం చోటుచేసుకుంది. భూముల్లోకి వెళ్లే దారికి అడ్డంగా బీజేపీ నేత రాజగోపాల్రెడ్డి ముళ్ల కంచె వేశారు. ఆపై మద్యంమత్తులో రెచ్చిపోయి పరుషపదజాలంతో దూషణలకు దిగారు. దీంతో చలించిపోయిన గ్రామస్తులు ప్రతిఘటించారు. ఆత్మాభిమానంతో రాజగోపాల్రెడ్డిపై తిరగబడ్డారు. పరస్పర దాడుల్లో రాజగోపాల్రెడ్డి గాయాలయ్యాయి. సాక్షి టాస్క్ఫోర్స్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో వారంలోపు వేర్వేరుగా చోటుచేసుకున్న రెండు ఘటనల్లో పోలీసుల ట్రీట్మెంట్ ఆక్షేపణీయం. ఘర్షణ తలెత్తితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం పరస్పర వైరుధ్యాన్ని ప్రదర్శించింది. పుల్లంపేట పోలీసుస్టేషన్లోనే మాటువేసి అనంతంపల్లె మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుదర్శనరెడ్డిని అంతమొందించాలనే చర్యలకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై 324 సెక్షన్లపెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి గౌరవంగా ఇళ్లుకు పంపించారు. భూముల్లోకి వెళ్లేందుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి, దుర్భాషలాడుతూ వీరంగం చేసిన రాజగోపాల్రెడ్డిపై దాడి ఘటనలో నాన్బెయిల్బుల్ సెక్షన్లతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతటితో సరిపెట్టక పోలీసుస్టేషన్లు మార్చుతూ చిట్వేల్కు తీసుకెళ్లి రాత్రంతా భారీగా కోటింగ్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన భూమిక పోషించింది అక్కడి రాజ్యాంగేతర శక్తి. అమ్మగా పిలువబడే రాజ్యాంగేతర శక్తి స్వయంగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి సుదర్శన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని పట్టుబట్టింది. కాదు కూడదు అని పోలీసులు బతిమాలి కొట్లాటగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే రాజగోపాల్రెడ్డిపై దాడి చేసిన కేసులో అప్పటికప్పుడు నిందితులను పట్టుకురావడం, ఆపై కోటింగ్ ఇవ్వడం, హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఒకదాని వెంట ఒకటి క్రమంగా తెరపైకి వచ్చాయి. ● అమ్మ అండతో రెచ్చిపోతున్న కూటమి కార్యకర్తలు ● ఆ నియోజకవర్గంలో డమ్మీగా మారిన పోలీసు యంత్రాంగం ● ప్రతి విషయంలో జోక్యం...అమ్మ ఫోన్ వస్తే జడుసుకుంటున్న అధికారులు ● చెప్పింది చెప్పినట్లు ఆచరిస్తేనే విధి నిర్వహణలో కొనసాగింపు ● చట్టం, నిబంధనలంటే ఒప్పుకునేది లేదు...బదిలీనే బహుమానం ● మండలానికో ఇన్చార్జి...ఫైనల్ తీర్పు అమ్మదే... ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వేకోడూరు నియోజకవర్గంలో సూపర్ బాస్ చెప్పిందే వేదంగా నడుస్తోంది. ఒకే కుటుంబ సభ్యులు మండలానికి ఒక ఇన్చార్జి ఉన్నప్పటికీ ఫైనల్ తీర్పు అమ్మ చెప్పినట్లు చేయాల్సిందే. అమ్మ చెప్పిందంటే అయ్యా చెప్పినా నిరుపయోగమే. అక్కడి ప్రజాప్రతినిధిని కాదని రాజ్యాంగేతర శక్తి మొత్తం వ్యవ హారం నడిపిస్తోన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు అనేక ఉదాహరణలు సైతం నియోజకవర్గ ప్రజలు కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చట్టం.. నిబంధనలంటే అక్కడి విధుల నుంచి జారుకోవాల్సిందే. అలాంటి దుస్థితి రైల్వేకోడూరులో నియోజకవర్గంలో ఉండిపోయింది. ఆయా మండల ఇన్చార్జిలుగా ఉన్న కుటుంబ సభ్యులు అధికారులకు సిఫార్సు చేసినా అమ్మ నుంచి ఫోన్కాల్ వచ్చిందంటే అదే ఫైనల్. ఆ తీర్పునకు అనుగుణంగా అధికారుల చర్యలు ఉండిపోవాల్సిందే. చెప్పిన మాట చెప్పినట్లుగా ఆచరించకపోతే వెంటనే ఆ అధికారికి బదిలీ బహుమానంగా దక్కనుంది. అలాంటి పరిస్థితిని ఓ తహసీల్దార్ , మరో ఎస్ఐ ఎదుర్కొన్నా రు. బదిలీపై విధుల్లో చేరిన తహసీల్దార్కు 9నెలల్లోనే మళ్లీ బదిలీ బహుమానంగా దక్కింది. ఓ ఎస్ఐకి కూడా అదే పరిస్థితి తలెత్తింది. దీంతో అధికారులు రాజ్యాంగేతర శక్తి నుంచి ఫోన్ కాల్ వస్తే గంగిరెద్దులా తలూపాల్సిందే, ఆచరణలో చూపెట్టాల్సిందేనని విశ్లేషకులు సైతం వాపోతున్నారు. -
భూమిలేకపోయినా ఉందని చూపి..
మాది పేద కుటుంబం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒకరిది 8, మరొకది 10వ తరగతి పూర్తయింది. ఇద్దరికి తల్లికి వందనం పేరుతో రూ.30వేలు వస్తాయనుకున్నాం.అయితే నా పేరిట,తన భర్త సుంకేసుల పెద్ద రెడ్డయ్య పేరిట సెంటు భూమి లేకపోయినా 13 ఎకరాలు ఉందని చూపి డబ్బులకు ఎగనామం పెట్టారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద నగదు అందింది. వాస్తవ అర్హతలు పరిశీలించి డబ్బులు అందేలా చూడాలి. – సుంకేసుల ఇమాంబీ, లింగారెడ్డిపల్లి, చింతకొమ్మదిన్నె మండలం -
డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోండి
ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ కడప అర్బన్: జిల్లాలోని ప్రజలు పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 112 ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాలు, న్యూసెన్స్ , కుటుంబ తగాదాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గొడవలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల వివరాలను డయల్ 112 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే స్పందించి పట్టణ ప్రాంతాల్లో అయితే బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీస్లు 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలో, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 6 నుంచి 10 నిమిషాలలోపు ఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు. సమస్యను తెలుసుకుని, తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ 112 హెల్ప్ లైన్ నంబర్ 24/7 కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు. గతంలో పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ గా ఉన్న డయల్ 100కు బదులు హెల్ప్ లైన్ నంబర్ 112గా ప్రభుత్వం మార్చిందని చెప్పారు. ● ఎల్.హెచ్.ఎం.ఎస్ యాప్ ద్వారా పోలీసు సేవలను ఉపయోగించుకుని ఇళ్లలోని వస్తువులకు రక్షణ కల్పించుకోవాలనిఎస్పీ అన్నారు.. ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు 8186881100 నంబర్కు స మాచారమిస్తే పోలీసులు వచ్చి మీ ఇంటిలో ఎల్.హెచ్.ఎం.ఎస్ కెమెరాలను అమర్చుతారని ఎస్పీ తెలిపారు. -
దళారీ వల.. సర్టిఫికెట్లకు వెల
కడప అర్బన్ : దివ్యాంగుల పింఛన్లలో కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వైకల్య శాతం ధ్రువీకరణపై రీవెరిఫికేషన్ (పునఃపరిశీలన) చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహించి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కడపలో నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో కొన్ని నెలలుగా చేపడుతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లోగా ఈ గడువు కూడా ముగియనుంది. తమ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఈఎన్టీ, ఆర్థోఫెడిక్, మానసిక దివ్యాంగులు, పక్షవాతం లాంటి కేటగిరీలలో వైద్యులు లేని పక్షంలో.. రిమ్స్కు వస్తున్నారు. పింఛన్ రద్దు అవుతుందేమోననే భయంతో.. సదరం శిబిరాలకు అర్హులైన దివ్యాంగులతోపాటు కొందరు అనర్హులు కూడా హాజరవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులు, అనర్హులు కూడా తమకు పింఛన్లు రద్దు కాకుండా చేసుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. నిక్కచ్చిగా వున్న దివ్యాంగులు ఎంతో కష్టపడి తమ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజల సహకారంతో రిమ్స్కు వస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్లోని కొందరు చిరుద్యోగులు దళారుల అవతారం ఎత్తారు. వీరిని కొందరు దివ్యాంగులు ఆశ్రయిస్తున్నారు. అర్హులైన వారు తమకు మరల సర్టిఫికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనే అనుమానంతో దళారుల మాయలో పడుతున్నారు. మరి కొంత మంది అనర్హులైనప్పటికీ గతంలో ఫ్రెష్గా దివ్యాంగుల సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు తమ పరిధిలో నానా తంటాలు పడి ఎలాగోలా సర్టిఫికెట్ సాధించుకున్నారు. తాము సర్టిఫికెట్లను పొందినప్పటి నుంచి ప్రస్తుతం వరకు దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉంటారు. అలాంటి వారిలో చాలా మంది కడప రిమ్స్ ఓపీకి రాగానే చిరుద్యోగులైన దళారులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 25 వేల దాకా వసూలు తమ ప్రాంతంలోని దివ్యాంగులకు సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో కొందరు దళారులు.. రిమ్స్లోని ‘ఫలానా’ చిరుద్యోగుల దగ్గరికి వెళితే పని అయిపోతుందని తెలియజేస్తుంటారు. అలా రీ వెరిఫికేషన్లో ‘సక్సెస్’ పొందిన దివ్యాంగుడికి సదరు చిరుద్యోగి తమ ఫోన్ నంబర్ను ఇచ్చి.. తమ గ్రామ, మండల పరిధిలోని దివ్యాంగులను తమ దగ్గరికే పంపించాలని చెబుతుంటారు. వారి రెఫరెన్స్తో సంబంధిత దివ్యాంగులు మరలా చిరుద్యోగులను ఆశ్రయిస్తుంటారు. ఒక్కో వెరిఫికేషన్ సర్టిఫికెట్ కోసం రూ.15 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆ విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న జూనియర్ అసిస్టెంట్, అటెండర్తోపాటు కొందరి చిరుద్యోగుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మరో జూనియర్ అసిస్టెంట్ ప్రమే యం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డాక్టర్లతో కుమ్మకై ్క ఏదిఏమైనా ఎవరైనా సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో జాబితా ప్రదర్శించిన తరువాత ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ ప్రక్రియలో కొందరు డాక్టర్లతో.. అక్రమార్జనకు అలవాటు పడిన చిరుద్యోగులు కుమ్మకై ్క ‘రీ వెరిఫికేషన్’ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రీ వెరిఫికేషన్లో అక్రమార్జన చిరుద్యోగులు తమకు సహాయం చేసే కొందరు వైద్యులు చెప్పిన ఫోన్ పే నంబర్లకు ఎంచక్కా డబ్బులకు వేసేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే సర్టిఫికెట్ చేద్దామని, మానవతా దృక్పథంతో సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్లో వ్యవహరించే వారిని కూడా చిరుద్యోగులు ఇబ్బంది పెడుతున్నారని సమాచారం వచ్చింది. సమగ్ర విచారణ ఈ వ్యవహారంపై ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యను సాక్షి వివరణ కోరగా.. సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలనలో అవకతవకలు రిమ్స్ సదరం శిబిరంలో చేతివాటం కొందరు వైద్యులు, ఉద్యోగుల ప్రమేయం విలవిలలాడుతున్న దివ్యాంగులు -
అరుదైన యోగ రామాలయం
కడప కల్చరల్ : కడప జిల్లాలో విశిష్టమైన రామాలయం ఉంది. వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామంలో యోగ రామాలయంగా ప్రసిద్ధి చెందింది. అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న ఈ ఆలయానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జిల్లాను పాలించిన చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇందులో మిగతా ఆలయాల్లో లాగా సీతారాములు నిలుచొని ఆశీర్వదించే భంగిమలో కనిపించడం లేదు. కేవలం యోగ ముద్రలో మూర్తులు కనిపిస్తున్నారు. ప్రతి రామాలయంలో సీతారాములు నిలుచొని ఆశీర్వదిస్తున్న భంగిమలో మూలమూర్తులు ఉంటాయి. కానీ మన జిల్లాలోని ఈ రామాలయంలో రాముడు, సీతమ్మ యోగ ముద్రలో కూర్చొని ఉన్న మూలమూర్తులను చూడవచ్చు. ఇలాంటి విశిష్టత గల ఆలయం ఇదొక్కటే అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో యోగ ముద్రలో ఉన్న శ్రీరామచంద్రస్వామి గురించి ప్రత్యేక కథనం. పరిశోధకుల పరిశోధన పెద్దపుత్తలోని రామాలయంలో శ్రీరాముని ధనుర్భాణాలు లేవు. రాముడు పద్మాసనంలో యోగ ముద్రలో కనిపిస్తుండటం విశేషం. రాముడి కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు కలిపి ఉంచిన చిన్ముద్రలో కనిపిస్తారు. భూమి స్పర్శ ముద్రతో భూమిని నేలను తగులుతున్నట్లుగా ఉంది. రాముడే కాక సీతమ్మ కూడా రాముడికి ఎడమ వైపున కూర్చొన్న భంగిమలో మనం చూడవచ్చు. చేతిలోని పద్మాన్ని ధరించి ఉండటం కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం ధనుర్భాణాలతో శ్రీరామునికి కుడి వైపు నిలుచొని ఉన్నారు. ఈ ఆలయంలో ఆంజనేయులు కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన శ్రీరాముని విగ్రహానికి ఎదురుగా యోగ ముద్రలో చేతిలో తాళ పత్రాలతో కనిపిస్తారు. ఇలాంటి విగ్రహాలు తమిళనాడులోని జలదుర్గ ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకుల సమాచారం. అనంతపురంలోని శింగనమల రామాలయంలో కూడా దాదాపు ఇవే పోలికలు గల విగ్రహాలు ఉన్నట్లు యోగి వేమన విశ్వ విద్యాలయ పరిశోధకులు తెలుపుతున్నారు. ఆ బృందం సభ్యులందరూ ఈ ఆలయంతోపాటు పెద్దపుత్తలోని యోగ రామాలయాన్ని పరిశీలించారు. మూల విరాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమిళనాడులోని అనంతపురంలో కూడా ఇలాంటి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పరిశోధనలు కొనసాగితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పురాతన ఆలయాలు, విశిష్టత గల దేవతామూర్తుల విగ్రహాలు, శాసనాలు తదితర వారసత్వ సంపద కూడా వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. పురాణాల్లో.. రాముడు సీతమ్మ యోగ ముద్రలో ఉన్నట్లు కనిపించే దృశ్యాలను అధ్యాత్మ రామాయణంలో చూడవచ్చు. శ్రీరాముడు హనుమంతునికి తారక మంత్ర బ్రహ్మోపదేశం చేశారు. ఈ ఘట్టం ఆధారంగా పెద్దపుత్త యోగ రామాయణంలో మూల మూర్తులను రూపొందించి ఉండవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. విశిష్టత గల ఈ రామాలయంలోని మూల మూర్తులను కాపాడుకోవాల్సిన అవసరం జిల్లా వాసులపై ఉంది. పెద్దపుత్తలో విశిష్ట మూలమూర్తులు యోగా ముద్రలో సీతారాములు చోళుల నిర్మాణంగా పరిశోధన -
వివాహిత అనుమానాస్పద మృతి
పోరుమామిళ్ల : మండలంలోని దమ్మన్నపల్లె పంచాయతీ సుంకేసులపల్లెలో ఆదివారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెముడూరి నరేంద్ర మండలంలోని కాలువకట్టకు చెందిన మహాలక్ష్మి(25)ని ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆయన తాపీమేసీ్త్రగా పని చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భర్తే చంపేసి, ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిత్యం తాగుతూ తన కూతురిని చిత్రహింసలకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర పరారీలో ఉన్నాడు. ఎస్ఐ కొండారెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ పూర్తయితే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆత్మహత్యాయత్నంమదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం శేష్మహల్ ఏరియాకు చెందిన సురేష్(39) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఆదివారం పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
బ్రహ్మంగారిమఠం : ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయాల పాలయ్యారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బి.మఠం – మిట్టమానుపల్లె రోడ్డులో ఈశ్వరీదేవి గృహ సమీపాన స్కూటర్ ప్రమాదంలో బి.మఠంకు చెందిన లక్షుమయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. మైదుకూరు మండలం అక్కులాయపల్లెకు చెందిన లక్షుమయ్య గతంలో ఈశ్వరీదేవి మఠంలో కొంత కాలం అటెండర్గా పని చేశాడు. మఠంలో నివాసం ఉంటున్నాడు. ఆయన అక్కులాయపల్లెకు వెళ్లి టీవీఎస్ మోపెడ్ మోటార్ సైకిల్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్కూటర్ను ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేక కింద పడి ప్రమాదానికి గురయ్యాడా తెలియాల్సి ఉంది. బాధితుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని.. లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కుర్నూతల గ్రామం అగ్రహారం వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్నూతుల గ్రామం డియ్యాలవాండ్లపల్లికి చెందిన జై భరత్రెడ్డి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. అగ్రహారం వద్ద ఎదురుగా వస్తున్న కొయ్యల ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో జై భరత్ రెడ్డితోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బాధితులను వెంటనే లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రాయచోటిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వారిని తిరుపతికి తరలించినట్లు బంధువులు తెలిపారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హామీలపై ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి
రాయచోటి : ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్టపాలనకు ముకుతాడు వేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. ఆదివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని మదనపల్లి నియోజకవర్గవె ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషాలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
● తల్లులను ప్రోత్సహించేందుకు..
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో 3,05,330 మంది విద్యార్థులు పదవ తరగతి వరకూ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 2,41,119 మందిని మాత్ర మే అర్హులుగా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు మరో17,904 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికి ఇప్పటి వరకూ ఈ పథకం వర్తింపజేయలేదు. ప్రభుత్వం పథకం అమలు చేయడంలో సాధ్యమైనంత తక్కవ మంది లబ్ధిదారులు ఉండేలా ఎత్తుగడ వేసింది. ఈక్రమంలో 300 యూనిట్లు విద్యుత్ వాడకం, 300 గజాల ఇళ్లు, పట్టణాల్లో 1000 చదరపు అడుగులు ఇంటి స్థలం, ఫోర్ వీల్ వాహనం, మెట్ట భూమి పదెకరాల లోపు ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. ఈకారణాలతో అనేక మంది అనర్హులు జాబితాలోకి వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు దక్కని వైనం.... చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే ప్రకటించిన హామీలు అమలు చేసింటే గత ఏడాది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించేది. దాదాపు 16,669 మంది ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తాజాగా 17,904 మంది ఇంటర్ చదువుతోన్నారు. వారిలో ఏ ఒక్కరికి తల్లికివందనం పథకం అమలు కాలేదు. తాజా నిబంధనల కారణంగా 10వ తరగతి లోపు విద్యార్థులు 64,211 మందికి అందలేదు. అటు ఇంటర్ విద్యార్థులతో కలిపితే 82,115 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ కాకపోవడం విశేషం. ● విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవడంతో తల్లికి వందనం పథకంలో చాలామంది విద్యార్థులు అనర్హులుగా మారుతున్నారు.గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా అనర్హత వేటు పడుతుంది. ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టేశారు. పాలనకు రెండో ఏడాది ప్రారంభయ్యాక తొలిసారి అమల్లోకి తెచ్చిన తల్లికి వందనాన్ని నిబంధనల చట్రంలో ఇరికించారు. ఆచరణకొచ్చేసరికి కొర్రీలతో కోతలు పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదుండ్రులు కూటమిసర్కార్ తీరుపై ఆగ్రహిస్తున్నారు. ఎన్నికలప్పుడు ఒకలా..అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడటం చంద్రబాబుకు కొత్తేమి కాదని విమర్శిస్తున్నారు. అర్హులకు అన్యాయం..! ● నిబంధనలతో పథకానికి తూట్లు ● 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే అనర్హత ● వైఎస్సార్ జిల్లాలో 3.05 లక్షల మంది విద్యార్థులు ● 2.41 లక్షల మంది మాత్రమే అర్హులుగా తేల్చిన వైనం ● తక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరం విద్యను అభ్యసించాల్సిన వయస్సులో పనులకు వెళ్లడం, అర్ధాంతరంగా పిల్లలను పాఠశాల మాన్పించడం లాంటివి నిరోధించేందుకు వైఎస్సార్సీపీ సర్కార్లో అమ్మఒడి పథకం రూపుదిద్దుకుంది. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పిస్తూ, ఇంగ్లీషు మీడియం విద్యా బోధన అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు పనుల కోసం పిల్లల్ని పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకునే చర్యలకు చెక్ పెట్టేందుకు తల్లుల బ్యాంకు అకౌంట్కు రూ.13వేల నగదు జమ చేస్తూ మరో రూ.2వేలు పాఠశాల మెయింటెన్స్కు వెచ్చించేవారు. ఈక్రమంలో ఎన్నికల ముందు ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికీ తల్లికి వందనం పేరిట రూ.15వేలు చొప్పున బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చి రూ.13వేలు చొప్పున అందిస్తున్నారు. హామీని యధావిధిగా అమలు చేస్తే పదో తరగతిలోపు చదివే పిల్లలకు జిల్లాలో 3,05,330 మందికి అందాల్సి ఉంది. తాజా నిబంధనలతో 2,41,119 మందికి మాత్రమే ఈ పథకం అందుతోంది. -
మంత్రి సొంత జిల్లాలోనే ఇలానా.. చేతులెత్తేసిన కూటమి సర్కార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణం జరిగింది. మైదుకూరులో పట్టపగలే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. నిర్వహణ చేతకాక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీకి వెళ్లిన సందర్భంలో తాళం వేసిన ఆసుపత్రి దర్శనమిచ్చింది.వైఎస్ జగన్ హయాంలో మంచి భవనాలు కట్టించి.. సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం చేతకాక తాళం వేశారు. సిబ్బంది తాళం వేసుకుని వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ నానా హంగామా చేశారు. డీఎం అండ్ హెచ్వోకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు.సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే కూటమి ప్రభుత్వ చేతగానితనం బట్టబయలైంది. కనీసం మండల స్థాయిలో ఉన్న పీహెచ్సీని కూడా నిర్వహించలేని కూటమి సర్కార్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విఫల మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు -
రక్తదానం చేద్దాం... ప్రాణాలు నిలుపుదాం
కడప కల్చరల్ : ప్రస్తుత సమాజంలో బాధితులకు రక్తం అవసరం ఎంతైనా ఉందని, మిగతా వారికి కూడా అవసరమున్నసమయంలో స్పందించాలని జిల్లా రెవెన్యూ అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ స్పెషలాఫీసర్ విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఏపీ సాక్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కడప నగరంలోని మట్టి పెద్దపులి సర్కిల్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ .నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయడంతో పాటు మన చుట్టూ ఉన్నవారితో కూడా రక్తదానం చేయించాలన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న 18 నుంచి 60 సంవత్సరాలలోపు గలవార, 45 కేజీల పైన బరువు వున్న వారు రక్తదానం చేయవచ్చన్నారు. అంతేకాకుండా రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, రెడ్ క్రాస్ జిల్లా సెక్రెటరీ ఏ.సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో ఫ్యాక్టరీలు, కళాశాలలు ఉన్నాయని, ఆయా యాజమాన్యాల వారు వారి సిబ్బంది, విద్యార్థులకు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి సహకరించాలని కోరారు. అనంతరం జీవిత కాలంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన రక్తదాతలకు, 2024– 25 ఆర్థిక సంవత్సరంలో రెడ్ క్రాస్ సొసైటీకి సహకరించి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన కళాశాలలకు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీవో సంస్థలకు మెమొంటోలు, ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం రక్తదాతలను శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎస్ రవిబాబు, ఏపీ సాక్స్ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి భాస్కర్, రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఆఫీసర్ యశస్విని రెడ్డి, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సుధాకర్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు -
● తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను జాతీయస్థాయి నీట్లో 379వ ర్యాంకు సాధించానని దూదిమణి అక్షయ్కీర్తన్ తెలిపారు. కడప ద్వారకానగర్కు చెందిన డాక్టర్ రెడ్డిప్రసాద్(రిమ్స్ వైద్యులు), మల్లిక(గైనాకాలజిస్టు)ల కుమారుడు అక్షయకీర్తీన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కడపలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. పదో తరగతిలో 600కు 590 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచాడు. ఇంటర్మీడియెట్ను విజయవాడ నారాయణ కళాశాలలో చదివి సెంట్రల్ సిలబస్లో 500లకు 497 మార్కులు సాధించాడు. ప్రస్తుతం విడుదలైన నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 379వ ర్యాంకు సాధించాడు. ఇంకా బాగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి తరువాత కార్డియాలజీ డాక్టర్ కావడమే జీవితాశయం అని అక్షయ్కీర్తన్ తెలిపారు. -
తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో తల్లి, కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తల్లి పరిస్థితి విషమంగా మారిన సంఘటన శనివారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. మండలంలోని వెలిగల్లు పంచాయతీ పడమటివారిపల్లెకు చెందిన నాగిరెడ్డి భార్య జానకమ్మ(30), కుమార్తె వర్షారెడ్డి(10) కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా నాగిరెడ్డి కుటుంబాన్ని నిర్లక్షం చేస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో జానకమ్మ తీవ్రంగా మనస్థాపం చెందింది. శనివారం తాను విషం తాగి పిల్లలకు విషం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా పురుగు మందు జ్యూస్లో కలుపుకుని ఆమె సగం తాగి, కుమార్తె వర్షారెడ్డికి ఇచ్చింది. కుమార్తె కొద్దిగా తాగి చేదుగా ఉందని చెప్పింది. అయితే జానకమ్మ కుమారుడిని పిలవమని చెప్పడంతో వర్షారెడ్డి వెళ్లింది. ఎక్కువ మోతాదులో జానకమ్మ తాగడంతో జానమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు జానకమ్మతో పాటు వర్షారెడ్డిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం జానకమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. పెద్దమండ్యం పోలీసులుకేసు విచారణ చేస్తున్నారు. తల్లి పరిస్థితి విషమం -
నీట్లో మెరిసి.. ర్యాంకుతో మురిసి..
దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్– యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో కడప విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. పలువురు ఉత్తమ ర్యాంకులు సాధించి భళా అనిపించారు. వారితోపాటు తల్లిదండ్రులు, గురువులు ఆనందం వ్యక్తం చేశారు. వారికి బంధువులు, స్థానికులు అభినందనలు తెలిపారు. – కడప ఎడ్యుకేషన్ ● ఇష్టపడి చదివా● వైద్య విద్య ప్రవేశ పరీక్షలో కడప విద్యార్థుల సత్తా ● హన్షికరెడ్డికి జాతీయ స్థాయిలో 343వ ర్యాంకు చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఎంతో కష్టపడి చదివానని నీట్లో 343వ ర్యాంకు సాధించిన మల్లపు హన్షికరెడ్డి తెలిపారు. కడపకు చెందిన మల్లపు జయరామక్రిష్ణారెడ్డి(ఆడిటర్), అనురాధ(గృహిణి)ల కుమార్తె. ఆమె 1 నుంచి 10వ తరగతి వరకు కడప నాగార్జున మోడల్ స్కూల్లో చదివి 10వ తరగతిలో 584 మార్కులు సాధించింది. ఇంటర్మీడియెట్ను విజయవాడ నారాయణ కళాశాలలో(సెంట్రల్ సిలబస్) చదివి 500కు 484 మార్కులు తెచ్చుకుంది. ప్రస్తుతం విడుదలైన జాతీయస్థాయి నీట్ ఫలితాల్లో 343వ ర్యాంకు కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా హన్షికారెడ్డి మాట్లాడుతూ బాగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి చిన్నపిల్లల వైద్యురాలినై వైద్య సేవలందించడమే తన లక్ష్యమని తెలిపారు. కడపలోని వంశీ ట్యూషన్ అధినేత వంశీ సర్ సూచనలు, సలహాలతోనే నీట్లో ఉత్తమ ర్యాంకు సాధించానని పేర్కొన్నారు. -
● గుండె డాక్టర్ కావడమే లక్ష్యం
ఇంకా బాగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసి గుండె వైద్య నిపుణులుగా సేవలు అందించడమే తన లక్ష్యమని జాతీయస్థాయి నీట్లో 900 ర్యాంకు సాధించిన యారాసి క్రిష్ణప్రశాంత్ తెలిపారు. కడప నగరానికి చెందిన సురేంద్రనాథ్(ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీ), జాన్సీలక్ష్మిరెడ్డి( ప్రముఖ దంత వైద్యులు)ల కుమారుడు యారాసి క్రిష్ణప్రశాంత్ 1 నుంచి 7వ తరగతి వరకు రాజమండ్రి, కాకినాడలో చదివాడు. ఆ తరువాత 7 నుంచి 10వ తరగతి వరకు కడపలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివి పదో తరగతిలో 577 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియెట్ను విజయవాడ నారాయణ జూనియర్ కళాశాలలో చదివి 461 మార్కులు కై వసం చేసుకున్నాడు. ప్రస్తుతం విడుదలైన నీట్లో 900 ర్యాంకు సాధించాడు. తన తల్లిదండ్రులు, గురువుల సూచనలు, సలహాలతోనే ఈ ర్యాంకు సాధించానని క్రిష్ణప్రశాంత్ తెలిపారు. -
జులై 14 నుంచి బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, ఎంఈడీ కళాశాలల విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలు జూలై 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. బీఈడీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులకు, అలాగే ఎంఈడీ రెండు, నాలుగు సెమిస్టర్ల సప్లిమెంటరీ, రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలను డీఎస్సీ (ఉపాధ్యాయ ఉద్యోగ నియామకపు పరీక్ష) రాసే విద్యార్థుల అభ్యర్థన దృష్ట్యా, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూలై 14వ తేదీకి వాయిదా వేశామన్నారు. రీషెడ్యూల్ అయిన తేదీల టైం టేబుల్ విద్యార్థులు చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు. ఏపీ ట్రాన్స్కో కడప జోనల్ సీఈగా క్రిష్ణకుమార్ కడప కార్పొరేషన్ : ఏపీ ట్రాన్స్కో కడప జోనల్ చీఫ్ ఇంజినీర్గా డీవీ క్రిష్ణ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈగా పని చేస్తున్న శ్రీనివాసులును విజయవాడ విద్యుత్ సౌధకు బదిలీ చేశారు. క్రిష్ణ కుమార్ కడపలోనే కన్స్ట్రక్షన్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పించి సీఈగా నియమించారు. క్రిష్ణ కుమార్కు విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ అందరూ కష్టపడి పని చేసి సంస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు శ్రీరామచంద్రమూర్తి, బాషా, ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకులు శ్రీనాథుడు, రామ్మోహన్, వెంకటసుబ్బయ్య, రమణ, నారాయణస్వామి, చంద్రశేఖర్, భాస్కర్నాయుడు, సతీష్, రామిరెడ్డి, నరసింహ, ప్రసాద్రెడ్డి, విష్ణు కుమార్ పాల్గొన్నారు. -
నాడు కౌన్సిలర్.. నేడు కౌన్సిలర్ అభ్యర్థి
సాక్షి టాస్క్ఫోర్స్ : టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పో లీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సమాజాన్ని ఉద్దరించేందుకు ప్రజల పక్షాన పోరాటాలు చేసే క్రమంలో నమోదైన కేసుల్లో అయితే కాదు. అసాంఘిక కా ర్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట లాంటి జూదాలు పేద, మధ్య తరగతి కుటుంబాల రక్తాన్ని పీలుస్తూ వాళ్ల కుటుంబాలు వీధిన పడటానికి కారణం అవుతున్నాయి. కూలీ నాలీ చేసుకునే పేదలు వీటి బారిన పడుతున్నారు. వీరి బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు టీడీపీ నేతలు అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జిన్నా రోడ్డులో మట్కా నిర్వహిస్తున్న టీడీపీ కౌన్సిలర్ను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో టీడీపీ నాయకుడు మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రీనాథ్ను మట్కా కేసులో శుక్రవారం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం వన్టౌన్ పోలీస్స్టేషన్లో టీడీపీకి చెందిన పలువురు నాయకులపై క్రికెట్ బెట్టింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడానికి కృషి చేయాల్సిన ఆ పార్టీ నేతలే వీటిని ప్రోత్సహించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మట్కా కేసుల్లో టీడీపీ నాయకులు -
ప్రకాష్నగర్లో చోరీ
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రకాష్నగర్లో నివాసం వుంటున్న భవనాసి శ్రీనివాసులు (ఎల్ఐసీ, ఏఏఓ), ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అతని భార్య మేరీ స్టెల్లా శుక్రవారం రాత్రి తమ ఇంటికి లోపలివైపు నుంచి తాళాలు వేసుకుని బెడ్రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనుకవైపున కటాంజనం (ఇనుపవాకిలి)కి వేసిన తాళం పగులగొట్టాడు. ఎంచక్కా ఇంటిలోకి ప్రవేశించి బీరువాను తెరిచి అందులోని బంగారు ఆభరణాలను దాదాపు ఏడు తులాలు, రూ.లక్షకు పైగా నగదును దోచుకుపోయాడు. ప్రకా ష్నగర్లోనే సంచరించిన సదరు దొంగ మూడు ఇళ్లలో కాలింగ్బెల్ నొక్కి దొంగతనాలకు ప్రయత్నించాడు. వీరి ఇంటిలో దొంగతనం చేశాడు. సీసీపుటేజీల ఆధారంగా దొంగకోసం గాలింపు చర్యలను చేపట్టారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్నచౌక్ ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వర్రెడ్డి, క్లూస్ టీంతోపాటు సిబ్బంది పరిశీలించారు. వ్యక్తిపై దాడి : కేసు నమోదు కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలో ఇందిరానగర్కు చెందిన చాంద్బాషా అనే వ్యక్తిని మనస్పర్థలతో రెడ్డెయ్య, అభి అనే ఇద్దరు శనివారం దాడి చేశారు. గాయపడిన చాంద్బాషా రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి. రామకృష్ణ తెలియజేశారు. కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్య మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలిలా.. పట్టణంలోని రామగోపాల్నాయుడు వీఽధికి చెందిన ఆదినారాయణ కుమారుడు లోకేష్(31)కదిరిరోడ్డులోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పని చేస్తున్నాడు. అతడు అవాహితుడు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ మనస్థాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. టు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులను బలిగొన్న రోడ్డు ప్రమాదం కేసు ఛేదింపుపెద్దతిప్పసముద్రం : ఈ ఏడాది మార్చి 17న అర్ధరాత్రి పీటీఎం–బి.కొత్తకోట రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో ఈ దుర్గటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సాదిలి చందూ కుమార్ (20), దండు శీనూ (21) బి.కొత్తకోటలో సెకండ్ షో సినిమా చూసి తిరిగి పీటీఎంకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా యువకులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చందూకుమార్ తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లారీకి చెందిన వస్తువు ఆధారంగా ఎస్ఐ ఈ కేసును సవాల్గా తీసుకుని ఎట్టకేలకు ఛేదించారు. ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు... ప్రమాద స్థలంలో టీఏ అని ఆంగ్ల అక్షరాలు కలిగి ఉన్న పార్కింగ్ స్టాండ్ పీస్ ఆధారంగా కేసును ఛేదించామన్నారు. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్కు చెందిన సిమెంటు ట్యాంకర్ లారీ ద్విచక్ర వాహనదారులను బలంగా గుద్ది ముందుకు వెళుతుండగా ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కేకలు వేస్తున్నప్పటికీ లారీ డ్రైవర్ దవరిక యాదవ్ (30) వాహనం నిలిపినట్టే నిలిపి ఒక్కసారిగా వేగంగా ముందుకు వెళ్ళిపోయినట్లు విచారణలో వెళ్ళడైందన్నారు. అనంతరం ప్రమాద స్థలంలోని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పలు చోట్ల ప్రధాన రహదారుల్లోని సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలించి పోలీస్ సాంకేతిక నిపుణుల చొరవ, స్థానిక పోలీసు సిబ్బంది సహకారంతో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించామని ఎస్ఐ తెలిపారు. అనంతరం వాహన యజమానిని సంప్రదించగా లారీ సహా ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్ శనివారం స్టేషన్లో లొగిపోగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ పేర్కొన్నారు. -
చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు విజయ ఢంకా మోగించాయి. శనివారం వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నెల్లూరు జట్టుపై 110 పరుగుల తేడాతో చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చిత్తూరు జట్టు 46.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 237పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్రెడ్డి 119 బంతులకు 110 పరుగులు చేశాడు . నెల్లూరు జట్టులో భార్గవ్ మహేష్ 5, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 238 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 31.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేశారు. ఆ జట్టులోని సాహుల్ హామీద్ 60 పరుగులు చేశాడు . చిత్తూరు జట్టులోని ధనుష్రెడ్డి 4 వికెట్లు తీశాడు. 110 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయం: కెఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్లో కర్నూలు జట్టుపై 110 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన అనంతపురం జట్టు 50 ఓవర్లలకు 283 పరుగుల చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రిహాన్ 16 ఫోర్లు, 2 సిక్సర్లతో117 పరుగులు చేశాడు. అనంతరం 284 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 31.3 ఓవర్లలో 173 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని కెవి ఓంకార్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని నిషిచ్ 5, టివి సాయి ప్రతాప్ రెడ్డి 5 వికెట్లు తీసుకున్నారు. -
జేఈఈ ఫలితాల్లో మెరిసిన దొండపాటి
కడప ఎడ్యుకేషన్ : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో కడపకు చెందిన దొండపాటి లలిత్ ప్రసాద్రెడ్డి షార్ట్ టర్మ్లోనే 2411 ర్యాంకు సాధించి ప్రముఖ కాన్పూర్ ఐఐటీలో ఎలక్ట్రానిక్ సీటు సాధించాడు. కడప నగరానికి దొండపాటి సుబోధరెడ్డి(కాంట్రాక్టరు) తల్లి గీతాంజలి (గృహిణి) కుమారుడు లలిత్ ప్రసాద్రెడ్డి కడపలోని మోంటిపోర్ట్ స్కూల్లో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివాడు. ఆ తరువాత 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నారాయణ స్కూల్ చదివాడు. ఇంటర్మీడియట్ను బెంగళూరులోని నారాయణ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడ కళాశాల వారు ఇచ్చిన షార్ట్ టర్మ్ కోచింగ్తోనే 2411వ ర్యాంకును సాధించాడు. దొండపాటి లలిత్ ప్రసాద్రెడ్డి సోదరుడు భవాని శంకర్ కూడా మద్రాసు ఐఐటీలో ఏరోస్పేస్ లో సీటు సాధించి చివరి సంవత్సరం చదువుతున్నాడు. నీట్ ఫలితాల్లో ప్రతిభ మదనపల్లె సిటీ : నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన కె. జయంత్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో మదనపల్లె పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్రెడ్డి ,శ్రావణిల కుమారుడు జయంత్రెడ్డి 4571 ఆలిండియా ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్లో రాష్ట్ర స్థాయిలో 48 ర్యాంకు దక్కించుకున్నాడు. ఇంటర్మీడియట్ విజయవాడ చైతన్య కాలేజీలో చదివాడు. ఇంటర్మీడియట్లో 978 మార్కులు సాఽధించాడు. జయంత్రెడ్డిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
డీఐపీఆర్వోకు ఆత్మీయ వీడ్కోలు
కడప సెవెన్రోడ్స్: శ్రీ సత్యసాయి జిల్లా డీఐిపీఆర్వోగా బదిలీపై పుట్టపర్తికి వెళుతున్న వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ డీఐపీఆర్వో పి.వేణుగోపాల్ రెడ్డిని ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐపీఆర్వోతోపాటు బదిలీపై వెళ్తున్న డివిజనల్ పీఆర్వో మస్తాన్ సాహెబ్, సీనియర్ అసిస్టెంట్ జయశాంత శరీఫాలను ఆ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది వారి మనోభావాలను వ్యక్తం చేస్తూ.. బదిలీ అయిన వారితో వారికి విధి నిర్వహణలో ఉన్న అనుభవాలు, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా శాఖాధిపతిగా డీఐ పీఆర్వో వేణుగోపాల్రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ● ఈ సందర్భంగా డీఐపీఆర్వో వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ కడప కార్యాలయంలో విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ ప్రాంత వాతావరణం, ఇక్కడి మీడియా మిత్రుల అభిమానం, అధికారులు సిబ్బంది సమన్వయ సహకారం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ సందర్బంగా డీఈఐఈ శ్రీనివాసరావు, డివిజనల్ పీఆర్వో సునీల్ సాగర్, పీఆర్వో రవికుమార్, ఏవీఎస్ నాగయ్య, రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, టైపిస్టులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
– స్కూటీని ఢీకొన్న క్యాంపర్ వాహనం కడప అర్బన్ : సొంత పని కోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో క్యాంపర్ వాహనం స్కూటీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు ఇద్దరు బావాబామ్మర్దులు కావడంతో రెండు కుటుంబాలు విషాదంతో నిండిపోయాయి. కడప ట్రాఫిక్ ఎస్ఐ జయ రాములు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. కడప చలమారెడ్డి పల్లెకు చెందిన నంద్యాల రవి (32) ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరుసకు బావమరిది అయిన రాయచోటి వినోద్ (26) ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే రాయచోటి వినోద్కు కడపకు చెందిన యువతితో వివాహం జరిగింది. వినోద్ భార్య ప్రస్తుతం గర్భిణి. సొంత పని నిమిత్తం రవి, వినోద్ ఇద్దరు కలిసి స్కూటిలో చలమారెడ్డి పల్లె నుంచి అలంఖాన్పల్లెకు వెళ్లారు. తిరిగి చలమారెడ్డిపల్లెలోని తమ ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన మహేంద్ర క్యాంపర్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయరాములు తెలిపారు. అసిస్టెంట్ లైన్మెన్పై విచారణ జరపాలి ప్రొద్దుటూరు : తప్పుడు పద్ధతిలో ఉద్యోగం పొందిన అసిస్టెంట్ లైన్మెన్ మైలవరం సాయికుమార్పై విచారణ జరపాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని సౌత్ సెక్షన్లో సాయికుమార్ విధులు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన తన తండ్రి మైలవరం శేఖర్ మరణానంతరం కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందారని తెలిపారు. ఆయన ఏవిధంగా మరణించారన్న విషయంపై సాక్ష్యాధారులు లేకుండా, డెత్ సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం పొందారన్నారు. ఈ విషయంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ విషయంపై ఈఈని సాక్షి వివరణ కోరగా గోసా మనోహర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని ఏడీఈకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన బదిలీపై వెళ్లడంతో విచారణ ఆగిందని, కొత్తగా వచ్చిన ఏడీఈతో విచారణ పూర్తి చేయిస్తామని తెలిపారు. -
అందరిలో జోష్ నింపుతూ...
డాక్టర్ వేణుగోపాల్ ఇప్పటికి 110 సార్లు వ్యక్తిగతంగా రక్తదానం చేశారు. అందుకోసం ఆయనకు రాష్ట్ర గవర్నర్ ప్రత్యేకంగా రక్తదాతల దినోత్సవ సందర్బంగా ఆయనను పిలిపించి ఘనంగా సత్కరించారు. ప్రతి సంవత్సరం ఆయన రక్తదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఏ చిన్న అవకాశం లభించినా స్వయంగా వెళ్లి రక్తదాతకు అవసరమైన సహకారం అందజేస్తున్నారు. ఈ చుట్టుప్రక్కల దాదాపు 110 సార్లు రక్తదానం చేయడం నిజంగా అరుదైన విషయం. డాక్టర్ వేణుగోపాల్ అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వారు. చిట్వేలి హైస్కూలులో ఆయన మొదటి సోదరుడు డాక్టర్ చంద్రశేఖర్, మరో సోదరుడు దొండ్లవాగు శ్రీనివాసులు కూడా ఓవైపు సామాజిక సేవారంగంలో తలమునకలుగా ఉంటూ వేలాది మందితో మొక్కలు నాటే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వేణుగోపాల్ తాను హాజరయ్యే కార్యక్రమాలతోపాటు ఇలా పలుమార్లు రక్తదానం చేసేందుకు స్పూర్తినిస్తున్నారు. మహిళలు కూడా ఎక్కువ మంది ఈ రంగం నుంచి రావాలన్న ఆశయంతో ఆయన మహిళలను కూడా ప్రోత్సహిస్తున్నారు. -
ఉత్సాహంగా అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టుపై 7 వికెట్ల తేడాతో చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 55.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆ జట్టులోని భువనేశ్వర్ 65, జయంత్ కృష్ణ 41 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని చరణ్ 3, ప్రకాష్ రాజ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 230 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 33.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మి నారాయణ అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 104 బంతులను ఎదుర్కొని 17 బౌండరీలు, 2 సిక్సర్ల సహాయంతో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. వేదాంత్ 32 పరుగులు చేశాడు. 36 పరుగుల తేడాతో కడప జట్టు విజయం కెఎస్ఆర్ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్లో నెల్లూరు జట్టుపై 36 పరుగుల తేడాతో కడప జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కడప జట్టు 48.4 ఓవర్లలో 243 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రణధీర్ రెడ్డి 65, ఆర్దిత్ రెడ్డి 61 (నాటౌట్) పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 3, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 37.5 ఓవర్లలో 207 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 77, మన్విత్ 38 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 2, ధీరజ్ కుమార్ రెడ్డి 2, హృతిక్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖలో నిర్వహించే బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు బదిలీల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదేళ్ల మినహాయింపును ఇవ్వాలన్నారు. బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంగల్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సహాయ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి రవికుమార్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సికిందర్ హుస్సేన్కు లెజెండ్ అవార్డు
– 50 సార్లు రక్తదానం చేసినందుకు సన్మానం కడప ఎడ్యుకేషన్ : నగరంలోని 27వ డివిజన్ గౌస్ నగర్లో శుక్రవారం జెకె జనం కోసం యూత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 50 సార్లు రక్తదానం చేసిన మను పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ మహమ్మద్ సికిందర్ హుస్సేన్ను ఘనంగా సత్కరించి లెజెండ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు లయన్ పటాన్ ఖాదర్బాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడంతో పాటు ఎంతో మందిని అవగాహన చేసిన మహమ్మద్ సికిందర్ అభినందనీయుడన్నారు. నేటి యువత అతడిని ఆదర్శంగా తీసుకొని మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అమానుల్లా షేక్, నారాయణ, జాకీర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలపై పోలీసు జులుం
● టీడీపీ జెండాలను తొలగించారని మైనర్లపై కేసు ● అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలింపు ● మా పిల్లలకు సంబంధం లేదంటున్న తల్లిదండ్రులు ● ఎవరో పీకిన వాటికి బాధ్యులను చేశారని ఆవేదన ● మా వారిని చూపించాలనిస్టేషన్ ఎదుట నిరసన పులివెందుల రూరల్: పులివెందుల అర్బన్ పోలీస్స్టేషన్ ఎదుట శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం కదిరి రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలను తొలగించారని కనంపల్లెకు చెందిన బాలాజి నాయక్తోపాటు ముగ్గురు మైనర్లను గురువారం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు ఆచూకీ లేకపోవడంతో మా పిల్లలను చూపించాలని వారి తల్లిదండ్రులు శుక్రవారం పులివెందుల పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అరెస్టు చేసి 24 గంటలవుతున్నా పిల్లలను చూపించలేదని, కడప డీటీసీలో ఉంచారని, అలాగే ఇతర స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏవరో జెండాలు తొలగిస్తే.. తమ పిల్లలను బాధ్యులను చేయడం దారుణమని వాపోయారు. వారు ముగ్గురూ మైనర్లేనని, ఇంటి వద్ద ఆడుకుంటుండగా బాలాజి నాయక్ పిలిచుకుని వెళ్లారని తెలిపారు. బాలాజి నాయక్ ఒక్కడే జెండాలను పీకి కాల్చినట్లు ఒప్పుకున్నారని మైనర్ల తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. దీంతో డీఎస్పీ మురళీ నాయక్, సీఐ చాంద్ బాషాలు.. స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలతో మాట్లాడారు. నిజంగా మీ పిల్లలు ఎటువంటి తప్పు చేయకపోతే ఇంటికి పంపించేస్తానని, తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలియజేశారు. మైనర్ పిల్లలపై అక్రమ కేసు నమోదు టీడీపీ నాయకులు క్రియేట్ చేసిన వీడియో ఆధారంగా గురువారం రాత్రి బాలాజి నాయక్తోపాటు ముగ్గురు మైనర్ పిల్లలపై పులివెందుల పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. టీడీపీ జెండాలు తొలగించారని సంజీవ్ అనే వ్యక్తి వీరిని అడ్డుకున్నట్లుగా.. అతనిపై పిల్లలు దాడి చేసినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ రాసుకుని కేసు నమోదు చేశారు. మైనర్ పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలి. అలా కాకుండా పులివెందుల పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన గురువారం సాయంత్రం పోలీసులు మైనర్ పిల్లలను అరెస్టు చేయడంపై శుక్రవారం పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు, వారి బంధువులు పులివెందుల అర్బన్ పోలీస్స్టేషన్కు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు ఏ పార్టీకి సంబంధం లేదని, తమ పిల్లలను గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని, పలు స్టేషన్లలో వారిని కొడుతున్నారని, మా పిల్లలను చూపించాలని ఆందోళన చేపట్టారు. కనీసం తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో డీఎస్పీ మురళీ నాయక్ వచ్చి మీ పిల్లలు తప్పు చేయకుంటే ఇంటికి వస్తారని, తప్పు చేస్తే జైలుకు వెళ్తారని తెలిపారు. జువైనైల్ హోంకు.. గురువారం రాత్రి జరిగిన సంఘటనలో మైనర్ పిల్లలను కడప జువైనైల్ హోంకు రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. అలాగే బాలాజి నాయక్ను జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నాయకులపై కూడా.. గురువారం సాయంత్రం జరిగిన సంఘటనలో టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు పలువురు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నలుగురు పాల్గొన్నట్లు టీడీపీ నాయకులే మీడియా వారికి వీడియో విడుదల చేశారు. అయితే దీని ఆధారంగా చేసుకుని వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న పలువురి నాయకులపై ఈ కేసులో పేర్లు నమోదు చేసినట్లు సమాచారం. దాదాపు 12 మందిపై ఈ కేసులో అక్రమంగా పేర్లు చేర్చినట్లు తెలుస్తోంది. ఎటువంటి తప్పు చేయలేదు ఇంటి వద్ద ఆడుకుంటున్న మా పిల్లవాడిని బాలాజి నాయక్ తీసుకొని వెళ్లాడు. మా కొడుకు జెండాలు పీకలేదు, మా వాడికి ఎటువంటి సంబంధం లేదు. అయినా పోలీసులు తీసుకెళ్లి ఎక్కడున్నాడో చూపించకుండా కొడుతున్నారు. ఇది చాలా దారుణం.మా పిల్లలను మాకు చూపించాలి. – రెహ్మాన్, మైనర్ పిల్లవాడి తండ్రి, పులివెందుల మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మేము పులివెందుల పట్టణంలో నివాసముంటున్నాం. ఏ పార్టీతో సంబంధం లేదు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. టీడీపీ జెండాలు పీకారని మా కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో తెలియదు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. – మల్లేశ్వరి, మైనర్ పిల్లవాడి తల్లి, పులివెందుల మైనర్లనూ వదలని టీడీపీ నాయకులు పులివెందులలో టీడీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలను కొనసాగిస్తున్నారు. రెండు వారాల క్రితమే కేవలం మహానాడు సందర్భంగా పులివెందుల రింగ్ రోడ్డు ప్రాంతాలలో వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడం జరిగింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు వాటిని తొలగించడం జరిగింది. కేవలం వాటిని తొలగించారనే కారణంతో టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు, దొంగ అక్రమ కేసులో జైలులో ఉంచడం జరిగింది. అయితే గురువారం సాయంత్రం కనంపల్లెకు చెందిన బాలాజి నాయక్ అనే యువకుడు వైఎస్సార్ మీద అభిమానంతో కదిరి రింగ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న టీడీపీ జెండాలను తొలగించారు. అయితే బాలాజి నాయక్ తనతోపాటు తన బంధువుల పిల్లలైన మైనర్ పిల్లలను వెంట తీసుకుపోయారు. ఇందులో బాలాజి నాయక్ టీడీపీ తోరణాలను తొలగించి పక్కన వేయడం జరిగింది. మైనర్ పిల్లలకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడే టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు తెర లేపారు. తోరణాలు కాల్చకున్నా కూడా కాల్చినట్లుగా అదే ప్రాంతంలో పక్కన ఉన్న కంపచెట్లలో మంటను రాజేసి తోరణాలను కాల్చినట్లుగా వీడియో క్రియేట్ చేశారు. కోటింగ్ గురువారం సాయంత్రం జరిగిన విషయంలో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గురువారం అర్ధరాత్రి వారిని కడప డీటీసీకి తరలించినట్లు సమాచారం. అక్కడ పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలిసింది. అయితే మైనర్ పిల్లలపై ఈ విధంగా పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంత వరకు సమంజసమని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
ముద్దనూరు : మండలంలోని దేనేపల్లె గ్రామంలో ఈనెల 10వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. గ్రామంలోని రామ్మోహన్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో రామ్మోహన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హత్యాయత్నం కింద నమోదైన ఈ కేసులో నిందితులైన గూనివాండ్ల శివ, శివశంకర్, నరసింహ, ఉత్తయ్యలను అరెస్టు చేసినట్లు, మరో మైనర్ బాలుడిని కడపలోని జైవెనెల్ హోంకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. కడపలో పేలిన ఐపీ బాంబ్ కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఐపీ బాంబ్ను పేల్చాడు. తనకు పరిచయమైన వ్యక్తుల నుంచి, బంధువుల నుంచి రూ. 1 వడ్డీతో డబ్బులను తీసుకుని, బయటి వ్యక్తులకు రూ. 3 నుంచి 5 రూపాయల వడ్డీలకు డబ్బులను అప్పుగా ఇచ్చేవాడు. ఈక్రమంలో తాను తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుండా కోర్టులో రూ.కోటి 30 లక్షలకు ఐపీ పిటీషన్ను దాఖలు చేసినట్లు సమాచారం. రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైలుమార్గంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు. మృతునికి 30–35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు తెల్లని ఫుల్షర్ట్పై బ్లూ కలర్ పూలు ఉన్నాయని, బ్లూ కలర్ లోయర్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడు సున్తీ చేయించుకని మొలతాడు ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే ఎస్ఐ (సెల్ నెంబరు 94409 00811)కు సమాచారం అందించాలన్నారు. ఉరి వేసుకుని మహిళ మృతి కాశినాయన : మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన నీలం అనురాధ (23) ఉరి వేసుకుని మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటిలో ఎవరు లేని సమయంలో తలుపు గడియ వేసుకుని ఉరి వేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త వెంకటేశ్వర్లు సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలికి నాలుగు సంవత్సరాల కూతురు ఉందని తెలిపారు. హత్యా.. రోడ్డు ప్రమాదమా? కలసపాడు/పోరుమామిళ్ల : మండలంలోని జాతివర్టిపల్లె – చింతలపల్లె మధ్యలో శుక్రవారం ఎల్జిబెత్ (22) సామాజిక కార్యకర్త అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామానికి చెందిన నారిపోగు ఓబయ్య కుమార్తె ఎల్జిబెత్ తమిళనాడులో మహిళలు, యువతులకు కుట్టు మిషన్లో శిక్షణ ఇప్పిస్తూ సామాజిక సేవ చేస్తున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. రెండు నెలల క్రితం ఎల్జిబెత్కు పెళ్లి సంబంధం చూస్తుండగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జాతివర్టిపల్లె – చింతలపల్లె మధ్య ప్రధాన రహదారిలో ఎల్జిబెత్ విగత జీవిగా పడి ఉందన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోరుమామిళ్ల, కలసాపాడు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి సోదరుడు, బాబాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కలసపాడు ఎస్ఐ తిమోతిని వివరణ కోరగా ఎల్జిబెత్ కారు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఓబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
డీఎస్సీ పరీక్షకు 127 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు శుక్రవారం 127 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 8 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1510 మందికి గాను 1415 మంది హాజరు కాగా 95 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 1510 మందికి గాను 1478 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజయ్యారు. మొత్తం 3020 మందికి గాను 2893 మంది హాజరు కాగా 127 మంది గైర్హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణ కడప సెవెన్రోడ్స్: సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సహాయ సంచాలకులు (ఏడీ)గా పద్మజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఈఐఈ శ్రీనివాస రావు, డివిజనల్ పీఆర్వో సునీల్ సాగర్, పీఆర్వో రవికుమార్, ఏవీఎస్ నాగయ్య, రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, సిబ్బంది ఏడీని కలిసి అభినందనలు తెలియజేశారు. నేరాల నియంత్రణే లక్ష్యంబద్వేలు అర్బన్ : నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బద్వేలు అర్బన్, రూరల్ పోలీస్స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బద్వేలు ప్రాంతంలో భూకబ్జాలు, నకిలీ పట్టాల సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో నకిలీ పట్టాలని తేలితే సంబంధిత వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ రాజగోపాల్, ఎస్ఐలు ఎం.సత్యనారాయణ, కె.శ్రీకాంత్, కె.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం పెనవేసిన బంధం
కడప కల్చరల్ : రక్తదానం చేయడమంటే అదో గొప్పతనం. ఓ మనిషికి నిండు ప్రాణం నిలుపడంలోని ఔన్నత్యం. ఇలా మానవత్వం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తనవి తీరదు. నీరు లేకుంటే ఒకరోజైనా బతకవచ్చుగానీ, అవసరమైన సమయంలో రక్తం లభించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. అవసరమై ఎంత ప్రాధేయపడినా రక్తదానం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్బంగా ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం. రక్తదాతలు..ప్రాణదాతలతో సమానం రక్తదాతలను బంధువుల కంటే ఎక్కువగా భావిస్తారు. అవసరమైనపుడు వారు మనలా ఎందరికో ప్రాణాలు దక్కేందుకు కారకులవుతారు. అందుకే అలాంటి సమయంలో రక్తదానం చేసే వారిని ప్రాణదాతలంటారు. రక్తం ఇచ్చిన వారెవరో తెలియకపోయినా ఆ రక్తంతో తమ ప్రాణం నిలబడినందుకు వారి మధ్య రక్తసంబంధం ఏర్పడుతుంది. జిల్లాలో రికార్డు స్థాయిలో రక్తం ఇచ్చిన దాతగా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డిని పేర్కొంటారు. రక్తదానాన్ని ఉద్యమంగా తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించిన బోగా పార్వతమ్మ రక్తదాన సేవా సమితి వ్యవస్థాపకులు బోగా చిన్నయ్య, పోరుమామిళ్లకు చెందిన జ్ఞాన సరస్వతి చారిటుబల్ ట్రస్టు వ్యవస్థాపకులు యనమల శ్రీనివాసులు, రక్తదాన ప్రచారమే పెద్ద వ్యాపకంగా పూర్తి స్థాయిలో ప్రచారం, అవగాహన నిర్వహిస్తున్న పట్టుపోగుల పవన్కుమార్... వీరి స్ఫూర్తితో ప్రస్తుతం జిల్లాలో 100కు పైగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా రక్తదాన సేవలు అందిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా స్పందించి పార్టీలో ఓ విభాగాన్ని రక్తదానం కోసం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ రంగం నుంచి తప్పుకున్నా మిగతా వారిలో మరికొందరు యువత ముందుకు వచ్చి ఆ బాధ్యతను తాము మోసేందుకు సిద్ధమంటున్నారు. వాళ్లలో రక్తంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వేగం తగ్గినా మొన్నటివరకు బోగా చిన్నయ్య రక్తదాన ఉద్యమకర్తగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సాధించారు. ఇతరులను ప్రోత్సహిస్తూ మరెందరికో స్ఫూర్తినిస్తున్న ఆయనను మిగతావారంతా ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. లక్షలాది రూపాయలు స్వంత నిధులు వెచ్చించి రక్తదాన ఉద్యమంలో తాను ప్రధానపాత్ర పోషించారు. ఖూన్ కా రిస్తానగరంలో 2015లో సంస్థ ఏర్పాటైంది. స్థానిక యువకులు ఎం.తారిఖ్ అలీ, ఎస్ఎండీ గౌస్ఖాన్లు స్థాపించారు. రక్తం కొరతతో ఎవరికీ ప్రాణాపాయం కలగకూడదన్న భావనతో ఏర్పాటైన ఈ సంస్థ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలతోపాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో కూడా సేవలందిస్తోంది. రక్తం అవసరమున్న వారు 99481 04130 నెంబరులో సంప్రదిస్తే వెంటనే తమ సభ్యులను సంప్రదించి అవసరమైన రక్తదాతను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ రంగంలో యువతలో జోష్ నింపేందుకు నాటి క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ను వ్యయ ప్రయాసలు వెచ్చించి రక్తదాతల్లో ఉత్సాహం నింపారు. ఐపీఎల్ క్రికెటర్ పైడికాల్వ విజయ్కుమార్తో కూడా పలు శిబిరాలకు హాజరవుతూ యువతలో ఉత్సాహాన్నినింపుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 580 శిబిరాలు నిర్వహించి 20407 మంది రక్తదానం చేసేలా కృషి చేశారు.అలాగే శిబిరాలతోపాటు రక్త నిర్దారణ శిబిరాలు నిర్వహించారు. జిల్లాలో మంచి రక్తదాన సంస్థగా అతి తక్కువ సమయంలోనే ఈ సంస్థ పేరు గడించింది. లైఫ్.. ఈజ్ బ్లడ్రక్తం అంటే ప్రాణమే. అవసరమైన సమయంలో ప్రాణాన్ని కాపాడేది రక్తమేనని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి సురేష్కుమార్ అంటున్నారు. రక్తదానం చేయడంలోని ఆత్మ సంతృప్తి, సేవా తత్పరత మరొకటి ప్రాణం నిలుపగలిగే అవకాశం లభించడం గొప్ప విషయమే. సమీపం నుంచి ఇలాంటి ఎందరినో రెడ్క్రాస్ సంస్థ ద్వారా చూస్తున్నాను. చాలాసార్లు రక్తం లేకుండా ఇబ్బందులు పడకూడదని, ఇలాంటి దురదృష్టం మరెవరికీ రాకూడదని, బాధలు పడుతున్న వారిని చూస్తున్నాను. ఇలాంటి వారికి అతి తక్కువ ధరలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కేవలం నామమాత్రపు ఽచార్జీలతో ప్రజలకు అవసరమైన రక్తం అందిస్తున్నాం. సిబ్బంది అందరిలో కూడా మానవత్వపు అనుభూతి ఉండడంతో వారు కూడా బంధువుల్లా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మాత్రం సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం -
మా నాలుక మందమో.. మీ చర్మం మందమో ప్రజలే తేలుస్తారు
● తల్లికి వందనం పథకం చెప్పింది ఎంత మందికి.. ఇచ్చింది ఎంత మందికి? ● సూపర్ 6 పథకాలు అమలు చేశామని ఏవిధంగా చెబుతున్నారు ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : తమ ప్రభుత్వం సూపర్– 6 పథకాలను అన్ని అమలు చేసినట్లేనని.. ఎవరైనా విమర్శిస్తే వారి నాలుక మందమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. విమర్శించిన వారి నాలుక మందమో.. పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన వారి చర్మం మందమో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికి 67,27,164 మందికి తల్లికి వందనం అమలు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇస్తున్నది మాత్రం 54,94,500 మందికి మాత్రమే అన్నారు. ఇంకా 14 లక్షల మంది విద్యార్థులకు వారు చెప్పిన ప్రకారం వర్తింపజేయాల్సి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కో విద్యార్థికి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని 44 లక్షల మందికి అమలు చేశారని, ఇద్దరు విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు ఇంకెంత మందికి వర్తింపజేయాల్సి ఉంటుందని ప్రశ్నించారు. 83 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందని గతంలో చంద్రబాబు, లోకేష్ జగన్ను విమర్శించారన్నారు. ఇది అమ్మ ఒడి కాదు అర్ధ ఒడి అని వారు విమర్శించారని, మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పావల ఒడినా అన్నారు. మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి అమ్మ ఒడి పథకంలో రూ.1000 కట్ చేస్తే నానా యాగి చేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు రూ.2వేలు ఏవిధంగా కట్ చేశారని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం మొత్తంలో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు. ఉదాహరణకు మండలంలోని తాళ్లమాపురం గ్రామంలో జగనన్న ప్రభుత్వంలో 549 మందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుండగా ఇప్పుడు 509 మందికి మాత్రమే వచ్చిందన్నారు. 300 యూనిట్లు విద్యుత్ అని, రకరకాల కారణాలతో కోత విధించారన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారన్నారు. కేవలం పల్లె వెలుగుల బస్సులనే ఈ పథకంలో ఏర్పాటు చేస్తారని, జిల్లాలను దాటకుండా హద్దులు విధించే అవకాశం ఉందన్నారు. ఉచిత సిలిండర్ల పథకం 100కి 30 మందికి మాత్రమే అమలవుతోందని రాచమల్లు స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తామని ప్రకటించారని, ఇప్పుడేమో రెండు కలిపి రూ.20వేలు ఇస్తామని చెప్పడం తగునా అని ప్రశ్నించారు. ఆ రెండు పథకాల పరిస్థితి ఏమిటి ? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆడబిడ్డ నిధి పథకం అని రాచమల్లు తెలిపారు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేయకపోగా పీ4 విధానంలో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మన దేశానికి సంబంధించి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్న పేదలను ధనవంతులుగా చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగిందన్నారు. ఇది సాధ్యమేనా అని రాచమల్లు ప్రశ్నించారు. పీ4 విధానం గురించి ప్రజలకు కనీస అవగాహన ఉందా అని తెలిపారు. నిరుద్యోగ భృతి పథకం పరిస్థితి కూడా అంతేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ రెండు పథకాలకు సంబంధించి పీ4 విధానంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పిస్తామనే ధైర్యం ఉంటే ప్రజల వద్దకు వెళ్లి చెప్పాలని అన్నారు. గత ఏడాది కాలంలో తాము సంపద సృష్టించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, అలాంటప్పుడు గత ఏడాదిలో రూ.1.70 లక్షల కోట్ల అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కాలంలో 188 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో సాధించిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, చిన్నారులను చిదిమేస్తున్నారని, హింస పెరిగిందని, జర్నిలిజంపై దాడి చేస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని విమర్శించారు. పథకాలను అమలు చేసేంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంగా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్లు రాగుల శాంతి, లావణ్య, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, చింపిరి అనిల్ కుమార్, చౌడం రవిచంద్ర, వైఎస్సార్సీపీ నాయకుడు గౌతం రెడ్డి పాల్గొన్నారు. -
కొమ్మినేనికి బెయిల్ ప్రభుత్వానికి చెంపపెట్టు
కడప కార్పొరేషన్ : సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేనికి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. మూడేళ్లలోపు శిక్షపడే కేసులకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అవేమీ పాటించకుండా డిబేట్లో ఓ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను యాంకర్కు, ప్రసారం చేసిన ఛానెల్కు ఆపాదించడం దారుణమన్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయించి, రౌడీ మూకలతో దాడులు చేయించిందన్నారు. పరిపాలనలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కేఎస్ఆర్పై కేసు కక్ష పూరిత చర్య సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి నోటీసులను ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. 30 ఏళ్ల అనుభవం వున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు టీవీ రంగంలో కూడా గత 15 ఏళ్ల నుంచి యాంకరింగ్ నిర్వహిస్తున్నారు. టీవీ డిబేట్లలో యాంకరింగ్ చేసే సీనియర్ పాత్రికేయులకు, డిబేట్లో పాల్గొనే విశ్లేషకుల అభిప్రాయాలకు సంబంధం లేకపోయినా.. కేఎస్ఆర్పై అక్రమ కేసు బనాయించడం వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తోంది. ఈ సంఘటన ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరించిన చర్యగా భావించాల్సి వస్తోంది. పత్రికా, మీడియా కార్యాలయాలపైన దాడులను చేయించడం ఎంతవరకు సమంజసం. వ్యక్తుల, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లక తప్పదు. – వీజీ రాఘవరెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు -
లబ్ధిదారుల సంఖ్య తగ్గించరాదు
జిల్లాలో అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్యను 30 వేలకు పైగా తగ్గించడం సబబుగా లేదు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించకుండా ఎన్నికల ముందు చెప్పిన విధంగా రూ.20 వేలను ఈ ఖరీఫ్ సాగు ఖర్చులకు గాను ఒకే విడతలో విడుదల చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ప్రధాన వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున విడతల వారీగా కాకుండా ఒకే విడతలో రైతు ఖాతాలకు జమ చేయాలి. అలాగే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నదాత సుఖీభవ నిధులను వారికి కూడా అందించాలి. – పోతిరెడ్డి భాస్కర్, ఏపీ రైతు సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఏడాది పాలన అంతా మోసం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసపూరితమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పులివెందులలోని తన స్వగృహం వద్ద మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం రూ.1.51 లక్షల కోట్లు అప్పు చేయడం జరిగిందని, కానీ ప్రజలకు మాత్రం ఏ సంక్షేమ పథకాన్ని అందజేయలేదన్నారు. రైతు భరోసా, అమ్మఒడి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇలా అనేక రకాల హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో మొదటి ఏడాది పాలనలో సచివాలయాల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు, 2.75 లక్షల మంది వలంటీర్లను నియమించడం జరిగిందన్నారు. అలాగే పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేశారన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారన్నారు. అమ్మఒడి ద్వారా విద్యా ర్థుల తల్లులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్స్, నోటు బుక్స్ వంటివి విద్యా కా నుక ద్వారా అందించారని తెలిపారు. మహిళల భద్ర త కోసం దిశ యాప్ను ప్రవేశ పెట్టారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అందించడమేకాక రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారన్నా రు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం అప్పట్లో కొనుగోలు చేసిందన్నారు. ప్రజల కు ఇచ్చిన ఏ హామీని విస్మరించకుండా కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దేశంలోనే ఒక్క వైఎస్ జగనన్నకే దక్కుతుందన్నారు. అలా కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వ హించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. జర్నలిస్టుల క్రికెట్ టీంను అభినందించిన ఎంపీ గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలలో విజేతగా నిలిచిన కడప జర్నలిస్టుల టీంను ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పట్టణంలోని తన నివాసం వద్ద అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే క్రీడలలో రాణించాలని ఆయన కోరారు. త్వరలో రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు పులివెందులలో నిర్వహించాలని, అందుకు తాను పూర్తిగా సహకరిస్తానని జేశాప్ నాయకులకు హామీ ఇచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసిన వారిలో జేశాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, జేశాప్ రాష్ట్ర సలహాదారు భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టా మాధవరెడ్డి, టీం సభ్యులు షరీఫ్, పఠాన్, శేషు, అరుణ్, ప్రభంజన్ రెడ్డి, జయ రామకృష్ణారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, శివకేశవరెడ్డి, సురేంద్ర తదితరులు ఉన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషులకు 100 మీ., 200 మీ., 400 మీ., 800 మీటర్లు పరుగు పోటీలు, లాంగ్జంప్, షార్ట్పుట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 70 మంది పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈనెల 14, 15 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహమర్ బాషా తెలిపారు. ఎం.లోకేశ్వరరావు, జి.సింహాచలం, పి.మంజునాథ, బి.యేసు వరప్రసాద్, కె.మహేష్, బి.మల్లికార్జున, ఆర్.మునినరేంద్ర, డి.నీలా మహేశ్వరి, ఎస్.స్నేహలత, నాగనవీన రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు నాగేశ్వరరావు, ఖాదర్ రెడ్డి, కుమార్, దిలీప్, కోచ్ అనిల్ పర్యవేక్షించారు. జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు క్రీడాకారుల ఎంపికప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణానికి చెందిన మై స్పేస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై నట్లు అకాడమీ డైరెక్టర్ మాస్టర్ సలీం తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో ఫాతిమా, అలోక్య, హసేన్ సత్తా చాటి బంగారు పతకాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. అలాగే క్యాడెట్ విభాగంలో హసేన్, కౌసర్ బంగారు పతకాలు సాధించారన్నారు. ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో జరగనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్లు ఇస్మాయిల్, రియాజ్, సాయికళ్యాణ్ అభినందించారు. -
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో రుచికరమైన భోజనం అందించాలని పాఠ్యపుస్తకాలు, విద్యాకానుక రాష్ట్ర డైరెక్టర్ మధుసూదన్ రావు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆయన స్వయంగా భోజనం తిని నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ చేసినందున విద్యార్థులు ఎలా తింటున్నారని అడిగి తెలుసుకున్నారు. వంటల నిర్వాహకులు పరిశుభ్రంగా ఉండాలని, వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మండలానికి వచ్చిన పాఠ్య పుస్తకాలు, విద్యా సామాగ్రిని ఆయన పరిశీలించారు. పాఠ్య పుస్తకాలన్నింటిని పాఠశాలలకు సరఫరా చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎంఈఓ శోభారాణి, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం గీత, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.గడ్డిమందు తాగి వ్యక్తి మృతికాశినాయన : మండలంలోని కొండ్రాజుపల్లె గ్రామానికి చెందిన కుమారి రమణయ్య (52) అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతి చెందాడు. కాశినాయన ఎస్ఐ యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని, దీంతో పాటు అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది ఈనెల 10న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి కడపలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా గురువారం రమణయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య సుబ్బలక్ష్మితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.వృద్ధురాలి అదృశ్యంప్రొద్దుటూరు క్రైం : పట్టణానికి చెందిన నాగమ్మ అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగమ్మ మే 27న స్థానిక రామేశ్వరం మునిస్వామి దేవస్థానం ఎదురు వీధిలో ఉన్న తన చిన్న కుమారుడు గంగాధర్ ఇంటి నుంచి మనస్థాపంతో వెళ్లిపోయిందని కుమారులు గంగాధర్, బాబులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిజమ్మలమడుగు రూరల్ : మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకాలయ్య (38) అనే వ్యక్తి గురు వారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ హైమావతి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మోరగుడి గ్రామానికి చెందిన చాకలి అంకలయ్య గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి మద్యం తాగా డు. గురువారం ఆరోగ్యం సరిగా లేదని సోదరుడి కుమారుడు యోగేశ్వర్కుతో మాత్రలు తెప్పించుకున్నాడు. మాత్రలు వేసుకున్న తరువాత ఆయాసం ఎక్కువ కావడంతో వెంటనే తమ్ముడు సంజీవకు సమాచారం ఇచ్చారు. ఆటోలో జమ్మలమడుగులో ని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా ముక్కులో నుంచి రక్తస్రావమైంది. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
‘డీఎస్సీ’కి 275 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ ఆన్లైన్ పరీక్షకు గురువారం 275 మంది గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో 8 పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1410 మంది అభ్యర్థులకు గాను 1325 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 1410 మందికి గాను 1220 మంది హాజరు కాగా 190 మంది గైర్హాజయ్యారు. మొత్తం 2820 మందికి గాను 2545 మంది హాజరు కాగా 275 మంది గైర్హాజరయ్యారు.వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషికడప అగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. ఆయన గురువారం జిల్లా వ్యవసాయ అధికారిగా కడప కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.డీసీఓ బాధ్యతల స్వీకరణకడప అగ్రికల్చర్: జిల్లా కో ఆపరేటివ్ అధికారి(డీసీఓ)గా వెంకటసుబ్బయ్య గురువారం కడప కలెక్టరేట్లోని కోఆపరేటివ్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన కర్నూలు జిల్లా డ్వామా పీడీగా, జెడ్పీ సీఈఓగా పని చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేయడంతోపాటు డీసీఓగా పని చేస్తూ తాజాగా వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోఆపరేటివ్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.మెరుగైన విద్యే లక్ష్యంకడప ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఇంటర్మీడియెట్ విద్య వైఎస్సార్ కడప జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి(డీఐఈఓ) టీఎన్వీవీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన గురువారం తన చాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోని మురుమండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పని చూస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి.రామక్రిష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ రవీంద్రారెడ్డి, ట్రెజరర్ రమణయ్య, స్టేట్ కౌన్సిలర్ పద్మావతి, అధ్యాపకులు నాగమహేశ్వరరెడ్డి, హబీబుల్లా సన్మానించారు. -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కడప కార్పొరేషన్ : జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ షఫీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ రాష్ట్రంలో 87లక్షల మంది విద్యార్థులు ఉండగా కేవలం రూ.8వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం దారుణమన్నారు. వారందరికీ తల్లికి వందనం ఇవ్వాలంటే రూ.13వేల కోట్లు అవసరమవుతుందని తెలిపారు. విద్యార్థులకు 4 సెమిస్టర్ల ఫీజు రీయంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదన్నారు. ప్రైవేటు కాలేజీలు, పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎక్కువైందని, రకరకాల పేర్లు చెప్పి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, ఈశ్వర్రెడ్డి, సందీప్రెడ్డి పాల్గొన్నారు. -
పాఠశాలను విలీనం చేస్తే ఒప్పుకోం!
చాపాడు: తమ ఊరిలోని పాఠశాలను వేరే గ్రామంలోకి విలీనం చేస్తే ఒప్పుకోబోమని సిద్దారెడ్డిపల్లె వాసులు తేల్చిజెప్పారు. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సిద్దారెడ్డిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఇక్కడ ఉండే 3, 4, 5 తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులను గ్రామ నుంచి 1.50 కిలోమీటర్ల దూరంలో ఉండే మొర్రాయిపల్లె మోడల్ స్కూల్లో విలీనం చేశారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు రాగా తల్లిదండ్రులు పంపబోమని వారితో చెప్పారు. గతంలో ఇదే విధంగా విద్యార్థులను పంపబోమని చెప్పినప్పటికీ.. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలను ఇంటి వద్దనైనా ఉంచుకుంటామని, దూరంగా ఉండే పాఠశాలకు మాత్రం పంపబోమన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ససేమిరా అన్నారు. కిలో మీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉండే పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే ఆటో చార్జీల కోసం రూ.600 చెల్లించే నిబంధనలు ఉన్నప్పటికీ.. కేవలం ఇక్కడ పాఠశాలల మధ్య వ్యత్యాసం 700 మీటర్లు మాత్రమే ఉన్నట్లు చూపడంతో.. ఆటో చార్జీల చెల్లింపు అవకాశం కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు తమ పిల్లలను ఎలా పంపాలని, దారిలో నడిచి వెళితే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. తమ గ్రామం నుంచి మొర్రాయిపల్లెకు ఆటో సౌకర్యం కూడా లేకపోవడంతో.. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని తెలిపారు. లేనిపక్షంలో ఇక్కడి నుంచి తమ పిల్లలను విలీన పాఠశాలకు పంపబోమని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. విద్యార్థులను పాఠశాలకు పంపబోమని తేల్చిచెప్పిన సిద్దారెడ్డిపల్లె గ్రామస్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు -
ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో చెప్పాలి
అట్లూరు : కేంద్రంలో, రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య ప్రశ్నించారు. గురువారం బద్వేలు పట్టణంలోని సీపీఐ కార్యాలయం జేవీ భవన్లో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ మహాసభలలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజన్ సర్కార్ అనే గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు ఆచరణలో అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా సహాయ కార్యదర్శి పి.మస్తాన్, పట్టణ కార్యదర్శి బాబు తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవాలి
కడప కార్పొరేషన్: ‘కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగే కౌన్సిల్ హాలులో ఏ మర్మం దాగి ఉందో ఎవరికీ తెలియడం లేదు.. నేను స్వయంగా కౌన్సిల్ హాలు తెరవాలని కోరినా కమిషనర్ స్పందించడం లేదు’ అని మేయర్ సురేష్బాబు అన్నారు. గురువారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను చిన్నచూపు చూస్తోందని, ఏడాది పాలనలో వారు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల్లను అక్రమంగా కై వసం చేసుకుందన్నారు. అందులో భాగంగానే కడప కార్పొరేషన్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్ధిని కనస్ట్రక్షన్స్ సంస్థ తనకు తెలియకుండా రిజిస్టర్ అయిందని, రిజిస్టర్ అయినప్పటి నుంచి ఆ సంస్థ చేసిన పనులు రూ.36 లక్షలలోపే అన్నారు. ఈ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని, నాణ్యతా లోపాలు కూడా లేవన్నారు. అయినా కోట్ల రూపాయలలో స్కాం జరిగిందంటూ దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకుండా అవమానం కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం నిర్వహించే కౌ న్సిల్ హాలుకు తాళాలు వేశారని, తాళాలు తీసి ఓపె న్ చేయాలని తాను స్వయంగా అడిగినా కమిషనర్ స్పందించడం లేదన్నారు. సమావేశ మందరంలో ఏ మర్మం దాగి ఉందోనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. నగరపాలక అధికారులు ఒకరిపై ఒకరు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని, తాళాలు ఎక్కడ ఉన్నాయో కమిషనర్ తెలపాలన్నారు. రెండు రోజుల్లో కౌన్సిల్ హాలు తెరవకపో తే మీడియా సమక్షంలో తామే తాళాలు ఓపెన్ చేస్తా మని హెచ్చరించారు. కడప కార్పొరేషన్లో పాలకవర్గంగా ఉన్న తమ మాట అఽధికారులు వినడం లేదని, అన్ని డివిజన్లలో కార్పొరేటర్లకు ఆహ్వానం పంపకుండా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టం ప్రకారం నడుచుకున్నాం గతంలో మేయర్గా తన విచక్షణాధికారాలను వినియోగించి కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు ఎక్స్ అఫిసియో సభ్యుల హోదాలో వేదికపై కుర్చీలు వేశామన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి అహంకార పూరిత వైఖరి చూశాక చట్టం ప్రకారం నడుచుకున్నామని, మేయర్కు తప్ప మరెవరికీ వేదికపై కుర్చీలు వేయలేదన్నారు. దీంతో గత రెండు సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవి నానా రచ్చ చేశారని, తాను మేయర్గా ఉంటే కార్పొరేషన్లో తనకు కుర్చీ ఉండదని గ్రహించి తనను ఎలాగైనా దించేయాలని కుట్ర పన్నారన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి పార్టీ మారేలా చేశారన్నారు. మిగతా వారు రాకపోవడంతో తన కుమారుడి కాంట్రాక్టు సంస్థను బూచిగా చూపి అనర్హత వేటు వేయాలని ప్రయత్నించారన్నారు. న్యాయసమ్మతం కాదు ఒక కాంట్రాక్టు సంస్థను మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ చేయడం చెల్లదని.. అయినా చేశారన్నారు. రూ.10 లక్షలలోపు పనులు తన దృష్టికి వచ్చే అవకాశమే లేదన్నారు. దీని ఆధారంగా తనపై అనర్హత వేటు వేయాలనుకోవడం న్యాయసమ్మతం కాదన్నారు. ఈ నెల 16న విచారణకు తప్పకుండా హాజరవుతానని, తన వివరణను ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేష్, మల్లికార్జున, రామలక్ష్మణ్రెడ్డి, మగ్బూల్బాషా, డివిజన్ ఇన్చార్జులు శ్రీరంజన్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, సుబ్బరాయుడు, ఐస్క్రీం రవి పాల్గొన్నారు. కార్పొరేషన్కు ‘మహా’ నష్టంమహానాడు సందర్భంగా కడప కార్పొరేషనన్్ పరిధిలో ఎన్నో ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లు కట్టారని, కానీ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ చెల్లించలేదన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థకు లక్షల రూపాయల్లో నష్టం జరిగిందన్నారు. కార్పొరేషన్లో కమిషనర్ మనోజ్రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని, పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దౌర్భాగ్య పాలన లేదని ఆవేదన వ్యక్తం చేశా రు. మేయర్గా తనకే ఇలాంటి దౌర్భాగ్య పరి స్థితులు ఉంటే కార్పొరేటర్లు, సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో మీడియా సమక్షంలో తెరుస్తాం నగరపాలక అధికారులుప్రొటోకాల్ పాటించడం లేదు మేయర్గా సురేష్ ఉంటే కుర్చీ ఉండదు..అనర్హత వేటు వేసి తొలగిస్తే అడ్డు ఉండదనే కుట్రలు కడప మేయర్ కె.సురేష్బాబు కీలక వ్యాఖ్యలు -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం
జమ్మలమడుగు : రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు పొగాకు, పత్తి పంటలను సాగు చేసుకోమని ప్రోత్సహించిందని, పంట చేతికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలిలో పర్యటిస్తే ఆయనపై కూటమి నాయకులు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రతి పనికి కప్పం కట్టించుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితులు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడంతో వైఎస్సార్సీపీ పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపారన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటుధరతోపాటు రైతులకు ఆర్బీకే సెంటర్ల ద్వార నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నేరుగా గ్రామాలలోనే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రైతు నాయకులు సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి -
దేవదాయ అధికారులకు లోకాయుక్త నోటీసులు
ప్రొద్దుటూరు : దేవదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్తోపాటు ఈఓలకు ఈనెల 3వ తేదీన లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో చోటు చేసుకున్న అవినీతిపై సమాధానం చెప్పాలని లోకాయుక్త కోరింది. గీతాశ్రమంలోని ఈఓ కార్యాలయంలో అటెండర్గా పని చేసిన బి.జనార్ధన్రెడ్డికి ఈఓ రామచంద్రాచార్యులు వేతన రూపంలో రూ.5 లక్షలు చెల్లించారు. గీతాశ్రమం నిర్వహణకు సంబంధించిన డబ్బును ఇందుకోసం వినియోగించారు. గతంలో ఇదే కార్యాలయంలో పని చేసిన జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న గంగాధరానంద గిరి స్వామి తొలగించారు. 2021 జూలై నుంచి జనార్ధన్రెడ్డి విధులకు హాజరు కాకపోగా.. రోజూ కార్యాలయ పరిసరాలకు వచ్చి గూగుల్ ద్వారా ఫొటోలు తీసుకుని కోర్టును ఆశ్రయించాడు. తాను రోజు విధులకు హాజరవుతున్నానని తెలిపాడు. కోర్టు నోటీసు మేరకు గతంలో పని చేసిన దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్.. జనార్ధన్రెడ్డి ప్రవర్తన సరిగా లేని మాట వాస్తవమేనని, గంగాధరానందగిరి స్వామి ఇచ్చిన లేఖను సమర్పిస్తూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి జనార్ధన్రెడ్డికి, గీతాశ్రమానికి సంబంధాలు లేవు. కాగా ఇటీవల ఈఓ రామచంద్రాచార్యులు అతనికి లీజు బకాయిలు ఉన్నాయని చెప్పి రూ.5 లక్షలు చెల్లించడం జరిగింది. విధులకు రాని వ్యక్తికి రూ.5 లక్షలు దేవదాయ శాఖ సొమ్మును ఎలా చెల్లిస్తారని, దీనిపై విచారణ జరిపి ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని కోరుతూ పర్లపాడు గౌరీశంకర్ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ అధికారులకు లోకాయుక్త నోటీసులు అందాయి. ఏకంగా కమిషనర్ ఉత్తర్వులను కాదని ఈఓ రామచంద్రాచార్యులు అప్పనంగా జనార్ధన్రెడ్డికి డబ్బు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. జనార్ధన్రెడ్డిని తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులు, కమిషనర్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అన్నీ కాదని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఇలా చేశారు. ఇది ఇలా ఉండగా ఈఓగా పని చేసిన రామచంద్రాచార్యులు గత నెలాఖరునే పదవీ విరమణ చెందారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. గీతాశ్రమానికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువలా ఉన్నా.. దేవదాయశాఖ అధికారులు ఇంకా నిద్రమత్తు వీడలేదు. శ్రీకృష్ణ గీతాశ్రమంలోని అవినీతిపై ఆరా రూ.5 లక్షల చెల్లింపుపై వివాదం కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కిన వైనం -
చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాలి
ప్రొద్దుటూరు రూరల్ : పిల్లలకు చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. గత నెల 23వ తేదీన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నె గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబ సభ్యులను గురువారం ప్రొద్దుటూరు మండలం అమృతానగర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శించారు. హత్యకు గురైన చిన్నారి తల్లి స్నేహతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను పని వద్ద నుంచి ఇంటికి వచ్చే సరికి తన కూతురు గుండెలపై కూర్చొని ముద్దు ముద్దు మాటలతో నవ్విస్తూ ఉండేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారి ఫొటోలను చైర్పర్సన్కు చూపించి స్నేహ విలపించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడు తనకు తాను శిక్ష వేసుకున్నా హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తరపున రూ.4,12,500 చెక్కు అందించామని, మరో రూ.4.5 లక్షలు త్వరలోనే ఇస్తామన్నారు. కాగా చిన్నారి తండ్రి చెన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు కోరారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు భావన, భవాని, తహసీల్దార్ గంగయ్య, ఐసీడీఎస్ రూరల్ సీడీపీఓ అరుణకుమారి పాల్గొన్నారు. -
చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిందేమీ లేదు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించింది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. గురువారం కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా సూపర్ సిక్స్కు, ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. ఉచిత ప్రయాణంపై పండుగల పేరు చెప్పి కాలయాపన చేశారన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలకు దిక్కులేదన్నారు. రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితికి సంబంధించిందని, ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇస్తూ 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేశారన్నారు. అన్నదాత సుఖీభవ మోసమేనన్నారు. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉండగా, కత్తెర పేరుతో 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం, బీజేపీకి ఊడిగం చేయడమేనని ధ్వజమెత్తారు. బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు -
చదువులకు మార్గం.. సార్వత్రిక విద్యా పీఠం
రాజంపేట టౌన్ : చదువుకోవాలన్న ఆసక్తి ఉండి కుటుంబ పరిస్థితులు అనుకూలించక నిత్యం, స్కూల్ లేక కళాశాలకు వెళ్లలేని వారికి ఓపెన్ స్కూల్ బాసటగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నామమాత్రపు ఫీజుతో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్ స్కూల్) రాష్ట్ర ప్రభుత్వం దూర విద్యను అందిస్తుంది. రెగ్యులర్ చదువుతో సమానమైన ఈ కోర్సుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు చదువుకునేందుకు అర్హులే. రెగ్యులర్గా చదివి టెన్త్, ఇంటర్ ఫెయిల్ అయిన వారు, చదువు మధ్యలో నిలిపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, గృహిణులు, ప్రజా ప్రతినిధులు ఇలా ఎవరైనా ఓపెన్ స్కూల్లో చేరవచ్చు. గతంలో ఈ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల.. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల వారు ఈ ఏడాది జూలై 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్లో ప్రవేశానికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదివి వుంటే రికార్డు షీటు, ఆరవ తరగతి నుంచి ఆపై చదివి వుంటే టీసీ, టెన్త్ ఫెయిల్ అయివుంటే టీసీతో పాటు ఫెయిల్ అయిన మార్కుల మెమో కలిగి వుండాలి. ఇక ఏమీ చదవకుండా ఉంటే సంబంధిత అధికారులు జారీ చేసే జనన ధృవీకరణ పత్రం కలిగివుంటే టెన్త్లో ప్రవేశానికి అర్హులవుతారు. టెన్త్లో ఐదు సబ్జెక్ట్లు ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్గా హిందీని తీసుకోవచ్చు. ఇక టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు తీసుకున్నా ఐదు సబ్జెక్టులు చదవాల్సి వుంటుంది. రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానం.. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్కు రెగ్యులర్ విద్యార్థుల సర్టిఫికెట్తో తత్సమానంగా ప్రాధాన్యత ఉంటుందో ఉండదో అని చాలా మందిలో అపోహ వుంది. అయితే అది అవాస్తవం. ఓపెన్ స్కూల్ సొసైటీ జారీ చేసే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సాధారణ పాఠశాల విద్య, కళాశాల విద్య సర్టిఫికెట్లతో సమానం. ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. జిల్లాలో 41 స్టడీ సెంటర్లు.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో టెన్త్, ఇంటర్మీడియట్కు సంబంధించి 41 కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో స్టడీ సెంటర్లో టెన్త్లో 100 సీట్ల చొప్పున ఉంటాయి. అలాగే ఇంటర్లో నాన్ సైన్స్ గ్రూపులకు సంబంధించి 40 సీట్లు, సైన్స్ గ్రూపులకు సంబంధించి 100 సీట్లు ఉంటాయి. అడ్మిషనన్ పొందిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది. ప్రతి ఆదివారం, రెండవ శనివారం వంటి సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తారు. దాదాపు 30 కాంట్రాక్టు తరగతులను నిర్వహిస్తారు. ఇందులో 24 కాంట్రాక్టు తరగతులకు హాజరైన వారికి మాత్రమే పబ్లిక్ పరీక్షక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. విద్యార్థులు వెంటనే ఉత్తీర్ణులు కాకుంటే ఐదు సంవత్సరాల్లో తొమ్మిది మార్లు పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చు. ఇంటర్లో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు.. ఇంటర్మీడియట్లో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ, ఎంబైపీసీ గ్రూపులు ఉంటాయి. ఇందులో విద్యార్థులు తమకు నచ్చిన గ్రూపులో చేరవచ్చు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా మీడియంలు ఉన్నాయి. వీటిలో విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. టెన్త్ ఉత్తీర్ణులైన సంవత్సరంలోనే ఇంటర్ చేరితే ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్ట్లు మాత్రమే పరీక్ష రాసుకోవాల్సి వుంటుంది. ఆ తరువాత ఏడాది మరొక సబ్జెక్ట్ రాసుకోవాల్సి వుంటుంది. టెన్త్ ఉత్తీర్ణులైన తరువాత ఒక ఏడాది గ్యాప్ ఉంటే ఐదు సబ్జెక్ట్లు ఒకేసారి రాసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ :30–7–2025 200 రూపాయల అపరాధ రుసుముతో 1–8–2025 నుంచి 15–8–2025 వరకు ప్రవేశం పొందవచ్చు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు అందరూ అర్హులే టెన్త్, ఇంటర్మీడియెట్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలికొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఏడాది కొత్తగా ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి గల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వివిధ కారణాల రీత్యా రెగ్యులర్గా టెన్త్, ఇంటర్మీడియట్ చదవలేని వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకోవడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఈ ఉత్తీర్ణత సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు వుంది. అందువల్ల ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి. – కొండూరు శ్రీనివాసరాజు, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
చింతకొమ్మదిన్నె : కడప నగరం సాక్షి సర్కిల్ నుంచి రాయచోటి సర్కిల్ వైపునకు వెళుతూ జయరాజ కల్యాణ మండపం సమీపంలో రింగు రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశాంత్ (23)కు తీవ్ర గాయాలవగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సు ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు ప్రకాశం జిల్లాకు చెందిన వారని సమాచారం.కారు వ్యవహారంలో వ్యక్తి అరెస్టుప్రొద్దుటూరు క్రైం : కారు కొనుగోలు వ్యవహారంలో ఓ పాఠశాలలో పనిచేస్తున్న గణేష్ను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. గణేష్ రూరల్ పరిధిలోని ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం గుంటూరు జిల్లాలోని వినుకొండలో ఉంటున్న కోటేశ్వరరావు స్కార్పియో వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తెచ్చుకున్నాడు. అద్దె డబ్బులను కారు కంతులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని రోజులు గణేష్ అద్దె చెల్లించాడు. తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో కొన్ని రోజుల క్రితం కోటేశ్వరరావు ప్రొద్దుటూరుకు వచ్చి పాఠశాల ఆవరణలో స్కార్పియో కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గణేష్ అడ్డుకొని బలవంతంగా అతన్ని బయటకి తోసేశాడు. దీంతో కోటేశ్వరరావు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం గణేష్ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ అరుణ్రెడ్డి తెలిపారు. పట్టపగలే యువకుడి కిడ్నాప్కలకడ : పట్టపగలే యువకుడిపై దాడిచేసి కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం కలకడ టౌన్లో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు.. కలకడ టౌన్ గుర్రంకొండ రోడ్డు సందువీఽధికి చెందిన పర్వీన్ను ఐదేళ్ల కిందట రాయచోటికి చెందిన ఖాజాకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఖాజా భార్య పర్వీన్ అన్నదమ్ములకు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన నగదు ఇవ్వాలని నాలుగు సంవత్సరాలుగా కోరుతున్నా తిరిగి చెల్లించడం లేదని ఖాజా మంగళవారం మధ్యాహ్నం మరో ఆరుగురు అనుచరులతో కలకడకు వచ్చి తౌలిక్ ఆలీని కిడ్నాప్ చేశారు. కట్టి కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. బుధవారం కిడ్నాప్కు గురైన తౌలిక్ అల్లి (లాలు)తల్లి షేక్ కౌషిక్ ఫిర్యాదు మేరకు ఖాజా, మరో ఆరుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు.ఏడుగురిపై కేసు నమోదు -
షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా అడ్డుకుంటాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని ఐఎంఏ హాల్లో 12న జరగబోయే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమావేశాన్ని శాంతియుతంగా గాంధేయమార్గంలో అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎ.సత్తార్, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు నాసిర్ హుస్సేన్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, పేర్కొన్నారు. నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్.రాజశేఖర్రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనుకున్నామన్నారు. కానీ టీడీపీకి ఆమె కోవర్టుగా పనిచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారన్నారు. సీనియర్ నాయకులను దూరం చేస్తూ తనకు కావాల్సిన వారిని పదవుల్లో నియమిస్తున్నారని ఆరోపించారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నజీర్అహ్మద్ను ఏఐసీసీ ఎన్నిక చేస్తే చివరి నిమిషంలో తెలంగాణకు చెందిన ఆర్థిక నేరగాడికి టికెట్ ఇచ్చారన్నారు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎస్ఎ.సత్తార్, ఖాశీంఖాన్లకు ఇవ్వాలని బలపరిచినా కర్ణాటకకు చెందిన వ్యక్తికి కేటాయించి పార్టీకి నష్టం కలిగేలా చేశారన్నారు. షర్మిల నాయకత్వాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్రమ్, నాసిర్ఖాన్, కర్నాటి చంద్రశేఖర్రెడ్డి, అన్వర్, జాన్బాషా, రత్నకుమారి పాల్గొన్నారు. -
హౌసింగ్ బోర్డు చోరీ కేసులో పురోగతి
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన చోరీ కేసులో టూటౌన్ పోలీసులు పురోగతి సాధించారు. బుధవారం రాత్రి సీఐ సదాశివయ్య కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలోని గోపిరెడ్డి శివశంకర్రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మార్చి 15న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇంట్లో సుమారు 249 గ్రాముల బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు. ఈ కేసులోని నిందితులు జంగా వెంకటరావు, సుధాకర్లను ఇటీవల ఇతర జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్పై ఇద్దరినీ ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి, కోర్టు అనుమతి మేరకు పోలీస్ కష్టడిలోకి తీసుకొని ఆభరణాలను రికవరీ చేశారు. వీటిలో కొంత బంగారాన్ని నిందితులు విక్రయించారు. బద్వేల్ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిన మిగిలిన 180 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నచౌక్ పరిధిలో జరిగిన చోరీకి సంబంధించిన బంగారు నగలను స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ సదాశివయ్య, ఎస్ఐలు ధనుంజయ, రాఘవేంద్రారెడ్డి, సిబ్బందిని ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ భావన అభినందించారు. -
నన్నే కారు తీయమంటావా..
పీలేరు రూరల్ : అడ్డంగా పెట్టిన కారు పక్కకు తీయాలని అడిగిన సెక్యూరిటీ గార్డుపై నన్నే కారు తీయమంటావా అంటూ ఓ టీడీపీ నాయకుడు విరుచుకుపడిన సంఘటన బుధవారం జరిగింది. బాధితుడి వివరాల మేరకు.. ఏరియా ఆస్పత్రిలో బుధవారం పట్టణానికి చెందిన తుమ్మల ధరణికుమార్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయన విధులు నిర్వర్తించే సమయంలో టీడీపీ నాయకుడు మహేష్ వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో రోడ్డుపై అడ్డంగా కారు పార్క్ చేశాడు. కారు పక్కకు తీయాలని అక్కడే ఉన్న ధరణీ కుమార్ కోరారు. దీంతో ఆవేశంగా నన్నే కారు తీయమంటావా.. అంటూ ధరణికుమార్పై మహేష్ దాడి చేశాడు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడతో దళిత సంఘాల నాయకులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టిఎల్.వెంకటేష్, సుధాకర్ బాబు, సుభాష్, బోదేషా పాల్గొన్నారు. -
కొండను తవ్వేస్తూ.. మట్టిని తరలిస్తూ
అధికారం మాదే.. అడ్డెవరన్నట్లు ఓ కాంట్రాక్టర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా కొండను తవ్వేసి మట్టిని జాతీయ రహదారి నిర్మాణానికి తరలించేస్తున్నారు. ఇదంతా చూస్తున్న అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు : కల్వకుర్తి–నంద్యాల జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం మీదుగా ముద్దనూరు రహదారిలో కొత్త రోడ్డు వరకు ఈ దారి విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం నంద్యాల–కోవెల కుంట్ల మీదుగా నొస్సం వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. పెద్దముడియం మండలం గుల్లకుంట మీదుగా ఉప్పలపాడు, జమ్మలమడుగు, పెన్నానది మీద నుంచి పాలిటెక్నిక్ కళాశాల వెనుక వైపునా కొత్త రోడ్డు విస్తరణ పనులను ఎస్ఆర్సీప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికార పార్టీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. పెద్దముడియం మండలం నుంచి జమ్మలమడుగు కొత్త రోడ్డు వరకు 22 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం పనులు చేపట్టిన గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా..అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా మట్టి తరలింపు రోడ్డు నిర్మాణానికి గుత్తేదారు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ముద్దనూరుకు వెళ్లే రహదారిలో కొండను పొక్లెయిన్ పెట్టి తవ్వేస్తున్నారు. టిప్పర్లు పెట్టి తరలిస్తున్నా.. ఆ వాహనాలన్నీ అధికారుల కళ్లెదుటే తిరిగినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా పనులు చేస్తున్న గుత్తేదారును అడ్డుకునేందుకు అధికారులు జంకుతున్న పరిస్థితి. తమదే అధికారం.. మాకు అడ్డు ఎవరు అంటూ కొండను పిండి చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఎలాంటి అనుమతులు లేవు జాతీయ రహదారి కోసం కొండ తవ్వుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంత మట్టి తవ్వారో మొత్తం క్యూబిక్ మీటర్ల మేర కొలిచి చలానా కట్టిస్తాం. అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, జమ్మలమడుగు పొక్లెయిన్తో తవ్వి టిప్పర్లతో మట్టి తరలింపు అధికార పార్టీ గుత్తేదారు నిర్వాకం -
ఆటలకు బై.. పాఠాలకు సై
వేసవి సెలవులు ముగిశాయ్.. దాదాపు రెండు నెలలపాటు తోటి స్నేహితులతో ఆటలాడుతూ గడిపిన చిన్నారులు మళ్లీ టై కట్టి. బూట్లు వేసుకుని.. బడి బాట పట్టనున్నారు. విజ్ఞానం కోసం పలు శిక్షణ శిబిరాల్లో గడిపిన వారంతా ఇపుడు మళ్లీ పాఠాలు నేర్వడానికి సై అంటున్నారు. నేడు పాఠశాలలు తెరచుకోనున్నాయి. సెలవుల నేపథ్యంలో నగరం, పట్టణాల్లోని పాఠశాలల్లో చదివే చిన్నారులు ఇంటి బాట పట్టారు. తిరిగి ఇపుడు బడిబాట పట్టి.. గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండులో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ చిన్నారులు గడిపిన క్షణాలు, బస్టాండులో పరిస్థితులపై దృశ్యాలివీ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
జమ్మలమడుగు : ఎర్రగుంట్ల మండలం ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన దాసరి పవన్ కుమార్(20) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాష్ నగర్కు చెందిన పవన్కుమార్ ప్రొద్దుటూరు సీబీఐటీ కాలేజ్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పి వస్తుండటంతో ఆ బాధను భరించలేక బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తగిలి ఎద్దు మృతికలసపాడు : మండలంలోని ఎగువరామాపురం గ్రామానికి చెందిన ఎనుముల అంకిరెడ్డికి చెందిన ఎద్దు ట్రాన్స్ఫార్మర్కు తగిలి మృతిచెందింది. బుధవారం అంకిరెడ్డి ఎద్దులను పొలానికి తీసుకెళ్లి ఇంటికి వస్తున్నారు. గ్రామ సమీపంలో కాలువ దాటే క్రమంలో పరిగెత్తుకుంటూ వెళ్లిన ఎద్దు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురైన అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఎద్దు విలువ రూ.70వేలు అని రైతు అంకిరెడ్డి తెలిపారు. యువకుడు అదృశ్యం జమ్మలమడుగు రూరల్ (మైలవరం): మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు(32) అదృశ్యమైనట్లు తండ్రి చౌడప్ప మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్యాసుందర్రెడ్డి వివరాల మేరకు.. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన వెల్లపు వేణు డిగ్రీ పూర్తిచేశాడు. ఇతను ప్రొద్దుటూరు వాస్తు కాంప్లెక్స్లోని నారాయణ స్వామికి చెందిన హర్డ్వేర్ అంగడిలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఈ నెల 6వతేదీన ఇంటి నుంచి వెళ్లిన అతడు తరువాత ఇంటికి తిరిగి రాలేదని ఎస్ఐ తెలిపారు. అచూకీ తెలిసిన వారు 9121100608 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. -
కడప, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఏసీఏ సౌత్ జోన్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టుపై కడప జట్టు ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. జట్టులోని మురారి హృదయ్ 66 పరుగులు చేశారు. కడప జట్టులో నాగ కుల్లాయప్ప నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కడప జట్టు బ్యాటింగ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు ఓవర్లను కుదించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 37 ఓవర్లలో 164 పరుగుల టార్గెట్ నిర్ణయించారు. అనంతరం 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 30.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప జట్టులోని రోహిత్ వర్మ 68, రణధీర్ రెడ్డి 55 (నాటౌట్) పరుగులు చేశారు. విజయం సాధించిన నెల్లూరు జట్టు.. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టుపై మూడు వికెట్ల తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 47.3 ఓవర్లలో 240 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ చెట్టులోని భువనేశ్వర్ 63, మనోజ్ కుమార్ 43 పరుగులు చేశారు. నెల్లూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా అంపైర్లు విజేడీ పద్ధతి ప్రకారం మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. 224 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 50, మన్విత్ 44 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సాయి ప్రతాప్ రెడ్డి 3, వీరారెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. -
ఫీజుల నియంత్రణ చట్టం అమలుచేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలుకాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు కోరారు. కడప ప్రకాశ్నగర్లో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ టెక్నోల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం గాకముందే అడ్మిషన్లు చేయించుకుంటూ దోపిడీకి తెరతీస్తున్నారన్నారు. కనీస సదుపాయాలు లేకున్నాఇరుకుభవనాల్లో విద్యా సంస్థలను నడుపుతున్నారన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికల బాధలు వర్ణణాతీతం అన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చొరవ తీసుకుని విద్యా చట్టాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓర్సు వీరభాస్కర్. ఎస్ఎండీ.యూసుఫ్బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.మణికుమార్ పాల్గొన్నారు.ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడంరెడ్డిబాబు -
విద్యుత్ షాక్తో రైతు మృతి
తొండూరు : గ్రామంలో అందరికీ సాయం చేస్తూ ఆదరణ పొందిన పల్లేటి రమేష్రెడ్డి(46) రైతు పల్లేటి రమేష్ రెడ్డి బుధవారం విద్యుత్తు షాక్తో మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. మండలంలోని క్రిష్ణంగారిపల్లెకు చెందిన రమేష్రెడ్డి, సర్పంచ్ రమణారెడ్డి బుధవారం స్థానిక తాగునీటి బోరు పనిచేయకపోవడంతో అక్కడికి వెళ్లారు. విద్యుత్తు మోటారు స్టాటర్ బాక్స్ వద్దకు వెళ్లి రమేష్రెడ్డి స్విచ్ ఆన్ చేయగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి ఈశ్వరరెడ్డి, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ఒకరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, మరొకరు హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. తొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్ఛార్జి వైఎస్.మధురెడ్డి, క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చేరుకుని రమేష్రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రామమునిరెడ్డి, సురేష్రెడ్డి, శివశంకర్రెడ్డి, రమణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. బోరు వద్ద మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం నివాళులర్పించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
● సంసిద్ధంగా లేని స్టూడెంట్స్ కిట్స్
గతంలో పాఠశాలలు పునః ప్రారంభం అంటేనే పుస్తకాలు, కిట్స్ రెడీగా ఉండేవి. ఈమారు కూటమి సర్కార్కు ముందు చూపు లేకపోవడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టూడెంట్స్ కిట్స్ అందుబాటులో లేవని పలువురు వాపోతున్నారు. మరోవైపు అయ్యవార్ల బదిలీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకో వైపు నాడు–నేడు పనులు నిలిచిపోయి తరగతి గదులు, టాయిలెట్స్ అసంపూర్తిగా ఉన్నాయి. విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగేందుకు ఆర్వో ప్లాంట్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా పాఠశాలలల్లో నిర్వహణ లేకపోవడంతో మరుగున పడ్డాయి. గ్రామీణ విద్య పట్ల, మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇలాంటి ముందుచూపు కొరవడిందని విద్యావేత్తలు వివరిస్తున్నారు. -
చెరువును చెరబట్టారు!
● బుగ్గవంకనూ వదల్లేదు.. కడప నగరం మధ్యలో ప్రవహిస్తున్న బుగ్గవంకను కూడా టీడీపీ నాయకులు తమ అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకున్నారు. బుగ్గవంక బ్యూటిఫికేషన్ పేరు చెప్పి రూ.3.50 కోట్ల అత్యధిక మొత్తానికి టెండర్లు పిలిచి బుగ్గవంకలోని కంపచెట్లను తొలగించిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు వంకలోని మట్టిని కూడా అమ్ము కొని సొమ్ము చేసుకుంటున్నారు. పాలెంపల్లె వద్ద బుగ్గవంకలోని మట్టిని జేసీబీ, హిటాచీలతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. నెలరోజులు గా ఇలాగే తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ.500 చొప్పున విక్రయిస్తూ రోజుకు 600 ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నెలరోజుల్లో రూ.90లక్షల వరకూ ఆర్జించినట్లు తెలుస్తోంది. నిత్యం ట్రాక్టర్లు మట్టితో తిర గడం వల్ల పాలెంపల్లె, బుడ్డాయపల్లె గ్రామా ల్లోని రోడ్లు మట్టితో నిండిపోయాయి. వాహనాలు వెళ్లినప్పుడల్లా దుమ్ము,ఽ ధూళి పైకి లేచి ఇళ్ల నిండా దుమ్ము పేరుకుపోతోందని, ట్రాక్టర్ల శబ్దాలతో శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కడప కార్పొరేషన్: కడప నగరానికి అతి సమీపంలో ఉన్న పాతకడప చెరువును టీడీపీ నేతలు చెరబట్టారు. చెరువులోని మట్టిని జేసీబీలు, హిటాచీలతో తవ్వి 15 టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు మట్టి సారవంతంగా ఉంటుంది కనుక చౌడు భూముల్లో సారవంతమైన ఈ మట్టిని వేస్తే పంటలు బాగా పండేందుకు ఆస్కారముంటుంది. అలాగే లో లెవెల్ ఏరియాలలో ఎత్తు పెంచడానికి ఈ మట్టిని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టిప్పర్ రూ.5వేలు, ఒక్కో ట్రాక్టర్ రూ.600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక రోజుకు టిప్పర్లతో 100 ట్రిప్పులు, ట్రాక్టర్లతో 100 ట్రిప్పులు తోలినా రూ.5.50లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజులు తోలుకుంటే అన్ని లక్షల ఆదాయం అన్నమాట. పాత కడప రైతులమంటూ కొంతమంది విచ్చలవిడిగా దందా మట్టి రవాణా చేస్తూ చెరువును తవ్వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దర్జాగా మట్టి అక్రమ రవాణా చేస్తుంటే ఇరిగేషన్, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు అఽధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మట్టి మాఫియాపై కొందరు అధికార పార్టీ నేతలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ అయినా స్పందించి చర్యలు తీసుకుంటారని వారు ఆశిస్తున్నారు. నివాస గృహాలకు దగ్గరగా బఫర్ జోన్లో మట్టి తవ్వడం వల్ల చెరువుకు నీరు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా ఈతకు వెళ్తే లోతు తెలియక ఇరుక్కుపోయి చనిపోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాలు ఇదివరకు చాలానే జరిగాయి కూడా. అయినా ఇరిగేషన్ అఽధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి తోలడం వల్ల దేవుని కడప, పాత కడప ప్రాంతాలు దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత కడప చెరువులో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్న వైనం రెండు జేసీబీలు, పది టిప్పర్లు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా అక్రమ రవాణా -
పట్టాలు తప్పిన ప్రొటోకాల్!
రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్లో బుధవారం ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ హాల్టింగ్(అదనపుస్టాపేజ్) సభ నిర్వహణ విషయంలో పాటించాల్సిన ప్రొటోకాల్ను రైల్వేశాఖ పట్టాలు తప్పించిందనే ఆరోపణలు రైల్వే వర్గాల నుంచి వినిపించాయి. ప్లాట్ఫాంలో కడప వైపు ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖాన్ను పిలిచారు. తర్వాత ఆహ్వాన పత్రికలో పేర్కొన్న ప్రజాప్రతినిధులు పేర్లు కూడా కనీసం ఉచ్ఛరించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానించిన వారు కొన్ని అనివార్యకారణాల వల్ల రాలేకపోయినప్పటికీ, ప్రొటోకాల్ రీతిలో అధికారులు ప్రస్ఫుటించలేకపోవడం విమర్శలకు దారితీసింది. విధిలేని పరిస్థితిలో రైల్వే అధికారులు ప్రోటోకాల్ను పక్కనపెట్టేసి, బీజెపీ నేతలు సాయిలోకేశ్, రమేష్నాయుడు, టీడీపీ నేత చమర్తి జగన్మోహన్రాజును వేదికను ఎక్కించేశారు. అక్కడి నుంచి వేదిక పూర్తిగా కూటమిపార్టీ సభగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అందరి చేతికి పచ్చజెండాలు ఇచ్చేశారు. రైలును కదిలించారు. వేదిక సాక్షిగా సన్మానాలు, సత్కారాలు చేసేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. రైల్వేఅధికారులు అందరికి మాట్లాడే అవకాశం ఇస్తే ప్రొటోకాల్ రగడ రాజుకుంటుందని, ఒక్క మంత్రికే మాట్లాడే అవకాశం కల్పించడం గమనార్హం. ఢిల్లీ రైలు హాల్టింగ్కు పచ్చజెండా ఢిల్లీకి వెళ్లే ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్(12707/12708) రైలుకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈయనతోపాటు ఎమ్మెల్సీ జకియాఖాన్, గుంటూరు డీఆర్ఎం సుధేష్ణసేన్, డివిజన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజంపేట నుంచి దేశ రాజధానికి ప్రత్యక్ష అనుసంధాన్ని అందించే మొదటిరైలు ఇదే అని అనన్నారు. రాజంపేట స్టేషన్ నుంచి తిరుపతి, కాచిగూడ, నాగ్పూర్, బోఫాల్, ఢిల్లీ వంటి నగరాలకు ప్రయాణం సులభతరం చేస్తుందన్నారు. రైల్వేఅధికారులనుదారితప్పించిన పచ్చపెత్తనం ఢిల్లీ రైలుహాల్టింగ్ సభావేదికపై కూటమినేతలు -
ఎర్ర దొంగలకు మదనపల్లె రాచబాట?
మదనపల్లె: ఎర్రచందనం అక్రమ తరలింపునకు మదనపల్లె అటవీ రేంజి సురక్షిత ప్రాంతంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉండటం, ఇక్కడ అటవీశాఖ తనిఖీలు, దాడులు పూర్తిగా లేకపోవడంతో ఇక్కడినుంచి తరలింపునకు అటంకం లేదని నిర్ధారించాక.. ఈ ప్రాంతం మీదుగా స్మగ్లింగ్ సాగుతున్న విషయం తిరుపతి టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశాక కాని వెలుగులోకి రాలేదు. ఈనెల 9న తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె వద్ద 48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ములకలచెరువు, పెద్దమండ్యం, గుర్రకొండ మండలాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఎర్ర చందనం స్మగ్లింగ్ మదనపల్లె రేంజి పరిధిలో సాగుతోందన్న విషయం స్పష్టమైంది. గతంలో పట్టుబడిన ఎర్ర చందనం, నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. అయితే కొంతకాలంగా మదనపల్లె అటవీశాఖ నుంచి దాడులు, నిఘా లేకపోవడంతో ఈ వ్యవహారం ఇంతకాలం వెలుగులోకి రాలేదు. దీంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. స్మగర్లు ఎంచుకున్న మార్గాలు? జిల్లాలోని రాజంపేట లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలోని ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు మార్గాలుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని గాలివీడు నుంచి పెద్దమండ్యం, సత్యసాయి జిల్లాలోని కదిరి మీదుగా.. మదనపల్లె రేంజిలోని ములకలచెరువు నుంచి బి.కొత్తకోట మీదుగా బెంగళూరు, చైన్నెలకు, పెద్దమండ్యం మండలంలోని పాపేపల్లె, దిగువపల్లె గ్రామాల మీదుగా, గాలివీడు మండలం గోరానిచెరువు నుంచి సరిహద్దు పాపేపల్లి పంచాయతీలోని గొర్లవానికుంట మీదుగా పెద్దమండ్యంలోకి, గుడిసివారిపల్లె మీదుగా పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం, గాలివీడు బస్టాండు నుండి దిగువపల్లె మీదుగా బండ్రేవు వద్ద పెద్దమండ్యం–తంబళ్లపల్లె మార్గం మీదుగా ములకలచెరువు, మదనపల్లె వైపు వెళ్తున్న మార్గం, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా.. సత్యసాయి జిల్లా కదిరి నుంచి ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట, శంకరాపురం నుంచి కర్ణాటకకు, అలాగే ములకలచెరువు నుంచి మద్దయ్యగారిపల్లె మీదుగా కందుకూరు, కర్ణాటకలోని చేలూరు నుంచి బెంగళూరుకు, కదిరి నుంచి ములకలచెరువు మీదుగా మదనపల్లె, అక్కడినుంచి చీకలబైలు నుంచి కర్ణాటకలోకి స్మగ్లింగ్ సాగించేందుకు ఎలాంటి ఆటకం లేకపోవడం, రద్దీ ఉండని కారణంగా ఈ మార్గాలు ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. తొమ్మిదో తేదిన తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్గంలోని అన్నగారిపల్లె వద్ద దుంగలు పట్టుబడ్డాయి. అంటే ఈ మార్గంలో ములకలచెరువు చేరుకుని అక్కడి నుంచి వారి గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నంగా తెలుస్తోంది. గుర్రంకొండ, పెద్దమండ్యం, మదనపల్లె మీదుగా చీకలబైలు మార్గం కూడా స్మగ్లింగ్కు సురక్షితంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రేంజిలో అధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే ఎర్ర చందనం కేసులు అధికంగా నమోదు కావడం విశేషం. చెక్పోస్టుల మూత మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు, తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలోని శంకరాపురం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను మూసివేశారు. ఇవి ఉన్నప్పుడు విధుల్లోని అటవీ సిబ్బంది తనిఖీలైనా చేసేవారు. ఇప్పుడు ఆ అవ కాశం కూడా లేదు. దీంతో ఈ మార్గాల్లో స్మగ్లింగ్ చేసుకునేందుకు అటంకం లేకుండాపోయింది. ఈ ప్రాంతం సేఫ్ జోన్గా స్మగర్ల కార్యకలాపాలు ఆగిపోయిన అటవీశాఖ నిఘా, దాడులు -
నేడు, రేపు స్టూడెంట్ పాసుల జారీ ఉండదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండు కౌంటర్లలో విద్యార్థులకు బస్సు పాసులను గురు, శుక్రవారాల్లో జారీ చేయబోరని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. సెలవుల అనంతరం స్కూళ్లు, కళాశాలలు పునః ప్రారంభించే సమయంలో విద్యార్థులకు కొత్త బస్సు పాసులను ఈనెల 14 నుంచి జారీ చేస్తామన్నారు. బస్సు పాసులను పొందే విద్యార్థులు తమ వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బస్సుపాస్ డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్న తర్వాత జనరేట్ అయిన పిన్ నెంబరు కౌంటర్లో తెలియజేస్తూ బస్సు పాసుకోసం క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గుతుందన్నారు. నమోదు ప్రక్రియ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చని సూచించారు. కమనీయం..కల్యాణం ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో జేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేవపూజ, కంకణ పూజ, యజ్ఞోపవీతధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తరించారు.రిమ్స్ సూపరింటెండెంట్గా కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావు కడప అర్బన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) సూపరింటెండెంట్గా డాక్టర్ కె.ఎస్.ఎస్. వెంకటేశ్వరరావును నియమిస్తూ ఇటీవల డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. గతంలో కడప రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ అనంతపురం జీజీహెచ్కు వెళ్లారు. ప్రస్తుతం తిరిగి కడప రిమ్స్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. నేడో,రేపో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా దాసరి రమణయ్య కడప అర్బన్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మాజీ సైనిక సంఘం నూతన అధ్యక్షుడిగా సుబేదార్ దాసరి రమణయ్యను ఎన్నుకున్నారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం వద్ద బుధవారం వైఎస్సార్ కడప జిల్లా మాజీ సైనికుల సంఘం (డీఈఎస్ఎంఏ) సమావేశం నిర్వహించారు. గతంలో మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న పువ్వాడ లక్ష్మీనారాయణ ఈ ఏడాది మార్చి 19న మరణించారు. ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ ఎస్.ఎస్. రాముడు, మాజీ వారెంట్ ఆఫీసర్ బి.వి.రంగయ్య, ప్రధాన కార్యదర్శి బి.వి. గోపాల్రెడ్డి, ఇతర మాజీ సైనికులు పాల్గొన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నారాజంపేట: మామిడిరైతులకు గిట్టుబాటుధర కల్పించాలని బుధవారం రాజంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతు సంఘంనేతలు పందికాళ్ల మణి, చిట్వేలి రవి మాట్లాడుతూ మామిడిరైతులను ఆదుకోవాలని, ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రైవేటు మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు దాదాపు 200 ఉన్నాయ న్నారు. వారు సిండికేట్గా ఏర్పడి గతంలో ఉన్న ధరల కన్నా సగానికి తగ్గించి వేశారన్నారు. చిత్తూరు కలెక్టర్ తోతాపూరి కేజీ రూ. 12గా ధర నిర్ణయించారన్నారు. ఆ ధర అమలు కావడంలేదన్నారు. రూ.6తో కోనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రూ.15వేల ఉన్న తోతాపురి కాయలు టన్ను రూ.6వేలకు కొనుగోలుచేశారన్నారు. ఈ ఏడాది మామిడికాపు తక్కువగా ఉందని, ధర పెరగాల్సి ఉందన్నారు. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
కడప కార్పొరేషన్: వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లోని సమావేశ భవనంలో డీఈలు, ఏఏఓలు, జేఏఓలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు పాతరిమ్స్లోని 33/11 కేవీ సబ్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు లేకుండా నాణ్యమైన సరఫరా చేయాలని, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్లో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ప్రధాన మంత్రి సౌర విద్యుత్ పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పుపై సోలార్ ఫలకలు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకంలో బీసీలకు అదనంగా రూ.28వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలను అరికట్టాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన వెంటనే సంస్థ ఖర్చులతో మరమ్మతులు చేయించాలన్నారు. ఇళ్లకు, వాణిజ్య సముదాయలకు, పరిశ్రమలకు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ సరఫరా ఇవ్వాలన్నారు. 50 శాతం డెవలప్మెంట్ చార్జెస్ మాత్రమే చెల్లించి తమ అదనపు లోడ్ క్రమబద్ధీకరణ చేసుకునే పథకం ఈ నెల 30 తో ముగియనుందని దానిని ఉపయోగించుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ, ఈఈ హరిసేవ్యా నాయక్, టెక్నికల్ ఈఈ మధుసూదన్, డీఈఈలు, ఏఏఓలు, ఏఈలు, జేఏఓలు పాల్గొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ కె. గురవయ్య -
నిన్నటి దాకా ఆట పాటల్లో మునిగి తేలిన విద్యార్థులు నేటి నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. నేడు బడి గంటలు మోగనున్నాయి. అందరూ బడి బాట పట్టనున్నారు. అయితే అనేక పాఠశాలల్లో చాలీ చాలని తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, కనీస వసతులు లేకపోవడం, స్టూడెంట్స్ కిట్లు అ
సాక్షి ప్రతినిధి, కడప: వేసవి సెలవులంతా ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక ఆటపాటలకు టాటా చెబుతూ చదువుల బాటకు వెల్కం చెబుతున్నారు. గురువారం నుంచి పిల్లలంతా బుద్ధిగా పుస్తకాల బ్యాగ్ను భుజాన వేసుకుని బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పెండింగ్లో ఉంది. మరో రెండు రోజులు కౌన్సెలింగ్ కొనసాగించాల్సి ఉంది. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్టూడెంట్స్ కిట్స్ చేరలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసౌకర్యాల మధ్య ఆయా ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు పునః ప్రారంభించేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లాలో 2,816 విద్యాసంస్థలు.. వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 2816 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,05,330 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతోపాటు కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పేరుతో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు 2,042 ఉన్నాయి. వీటిల్లో 1,37,352 మంది విద్యార్థులున్నారు. అలాగే ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 774 ఉన్నాయి. వీటి పరిధిలో 1,67,978 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విద్యాసంస్థలన్నీ గురువారం నుంచి ప్రారంభించి నూతన్య విద్యా సంవత్సరం కొనసాగించనున్నారు. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం జిల్లాలో తలుపులు తెరుచుకోనున్న 2,816 స్కూళ్లు బడిబాట పట్టనున్న 3,05,330 మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో చేరని స్టూడెంట్స్ కిట్లు చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి: డీఈఓ షంషుద్దీన్ జూన్ 12 నుంచి యధావిధిగా అన్ని పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మెరుగైన విద్యా బోధన, వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో పుష్కలంగా ఉన్నాయి. తల్లిదండ్రులు కార్పొరేట్ మోజు వీడి ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లల్ని చేర్పించాలి. కార్పొరేట్ పాఠశాలల్లో మూస పద్ధతిలో బట్టీ చదువులకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
నారాయణరెడ్డి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇటీవల పోలీసుల దాష్టీకానికి ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పరామర్శించారు. వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పాలన వదిలేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. నారాయణరెడ్డిని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘తప్పుడు కేసు పెట్టీ ఆయనను ఇష్టారీతిన కొట్టి పోలీసులు అవమాన పరిచారు. ఇప్పటికే నారాయణరెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు. అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నారాయణరెడ్డి మృతికి కారణమైన పోలీసులపై ఇప్పటికే కేసు నమోదైంది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం’’ అని అవినాష్రెడ్డి అన్నారు.మీడియాపై జరుగుతున్న దాడులపై అవినాష్రెడ్డి స్పందిస్తూ.. ఈ ప్రభుత్వం చేసేదేమీ లేక ఇలాంటి దాడులకు దిగుతోందని.. ఈ విధంగా దాడులకు దిగడం దారుణమన్నారు. ‘‘జరిగిన అంశాన్ని పక్కదోవ పట్టించి రాజకీయం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పొదిలి వెళితే జనసంద్రం ఆయన వెంట నడిచింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతుల సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వీళ్ల మీడియా మాత్రమే ఉండాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు...కొమ్మినేని, రామకృష్ణంరాజులు క్షమాపణలు చెప్పినా కూడా దాడులు చేస్తున్నారంటే దీని వెనుక ఏముందొ ప్రజలు అర్థం చేసుకోగలరు. ప్రజల గొంతుకగా ప్రజా సమస్యలు ఎత్తిచూపే మీడియా ఉండకూడదని మొదటి నుంచీ కుట్ర చేస్తున్నారు. కేవలం వాళ్ల మీడియా మాత్రమే ఉండాలి. వాళ్ళు చెప్పే అబద్ధాలే ప్రజలు వినాలి అన్నట్లు చేస్తున్నారు. మీడియాపై దాడి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.. వాళ్లే వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగయ్యే స్థాయిలో ప్రజలు బుద్ధి చెప్తారు’’ అని వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. -
పల్లె నుంచి.. యునైటెడ్ కింగ్డమ్కు పూర్ణిమ
కడప సెవెన్రోడ్స్ : నగరానికి చెందిన విద్యార్థిని యూకూలో సీటు సాధించి భళా అనిపించింది. కడప నగరానికి చెందిన పూర్ణిమ నిమ్మకాయల యునైటెడ్ కింగ్ డమ్లోని ప్రపంచ ప్రఖ్యాత ఎడెన్బర్గ్ యూనివర్సిటీలో సీటు సాధించి అందరినీ అబ్బుర పరిచారు. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె గ్రామానికి చెందిన రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి, కె.అనితల కుమార్తె పూర్ణిమ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కడప వికాస్ హైసూ్కల్, 4 నుంచి 10వ తరగతి వరకు కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియేట్ హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాదు పబ్లిక్ స్కూల్లోనూ చదివారు. ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో బీఎస్సీ(ఆనర్స్) చేశారు. అనంతరం యునైటెడ్ కింగ్డమ్లోని ఎడెన్బర్గ్ యూనివర్శిటీలో ఎంఎస్ మేథమ్యాటికల్ ఎకనామిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్కు దరఖాస్తు చేశారు. ఎడెన్బర్గ్ యూనివర్శిటీ యాజమాన్యం ఈ మేరకు ఆమెకు ఐడీ నెంబరు 2858866కు జారీ చేసి జులై 28న అడ్మిషన్ పొందాలని సమాచారం పంపింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో ఎడెన్బర్గ్ వర్శిటీ 27వ స్థానంలో ఉంది.చార్లెస్ డార్విన్, అలెగ్జాండర్ గ్రహంబెల్, ప్రఫుల్ల చంద్రరే, ప్రకాశ్ కారత్, ఓలివర్ గోల్డ్స్మిత్, డేవిడ్ హ్యూమ్, వాల్టర్ స్కాట్ తదితర వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు ఈ యూనివర్శిటీలో చదివారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఐఈఎల్టీఎస్లో 8 పాయింట్లు సాధించి ప్రతిష్ఠాత్మక ఎడెన్బర్గ్ వర్శిటీలో పూర్ణిమ సీటు సాధించారు. అంతేగాక యూకేలోని బ్రిష్టల్ యూనివర్శిటీలోనూ ఎంఎస్లో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ మేథమ్యాటిక్స్లోనూ, లండన్లోని కింగ్స్ కాలేజీలో ఫైనాన్షియల్ మేథమ్యాటిక్స్ అండ్ మేథమ్యాటిక్స్ ప్రవేశానికి కూడా పూరి్ణమ అర్హత సాధించారు. ఈ ఘనత సాధించిన ఆమెను పలువురు అభినందించారు. -
ఎస్జీటీలకు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జిటి) మ్యానువల్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు డీఈఒ షేక్ షంషుద్దీన్ ఆధ్వర్యంలో కడప శంకరాపురం స్కౌట్ హాల్లో కౌన్సెలింగ్ను ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాత్రి ఏడు గంటల వరకు ఎస్జీటీలు వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎంపీపీ మేనేజ్మెంట్కు సంబంధించి 2410, కడప కార్పొరేషన్ ఉర్దూ, పొద్దుటూరు మున్సిపాలిటి పరిధిలో మరో 130 పోస్టులకుగానూ ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంంది. మంగళవారం రాత్రి పొద్దపోయే వరకూ 360 మందికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. బదిలీల పక్రియ ఈ నెల 14వతేదీ నాటికి ముగుస్తుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. డిప్యూటీ ఈఓ రాజగోపాల్రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.సాంకేతిక సమస్యలతో రాత్రి ఏడు గంటలకు ప్రారంభం -
గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ ఏర్పాటు
కడప సెవెన్రోడ్స్ : పుత్తడిపురి ప్రొద్దుటూరులో గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ క్లస్టర్ (జీజేఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు వ్యాపారంలో రెండవ బాంబేగా ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరులో జీజేఎంసీ ఏర్పాటయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన తయారీదారులు, పెట్టుబడి దారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాస మూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, ఎల్డీఎం జనార్దనం, డీటీసీ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ రంగరాజు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ శారదమ్మ, ప్రొద్దుటూరు గోల్డ్ మర్చంట్స్ పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రాణాలు కాపాడిన రైల్వే పోలీస్
జమ్మలమడుగు : కుటుంబ కలహాలతో విసిగి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిని వారించి రైల్వే పోలీసులు ప్రాణాలు కాపాడిన సంఘటన మంగళవారం జరిగింది. ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి పల్లెటి మునుస్వామి మంగళవారం ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల రైల్వే స్టేషన్కు వచ్చాడు. సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన రైల్వే స్టేషన్ మాస్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఆర్థరాత్రి జీఆర్పీ ఆర్ఎస్ఐ రవిచంద్ర, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివకుమార్ కలమల్ల రైల్వే స్టేషన్కు వెళ్లి మునుస్వామిని విచారించారు. అతడిని వారించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి మునుస్వామిని భార్య, కుమారుల వెంట పంపించారు. -
కేటాయించిన లక్ష్యం అధిగమిద్దాం
కడప అగ్రికల్చర్ : జిల్లాలో కంపెనీలకు కేటాయించిన బిందు, తుంపర సేద్యం లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషిచేయాలని ఏపీ సూక్ష్మనీటి సాగు పథకం జిల్లా అధికారి వెంకటేశ్వరరెడ్డి సూచించారు.కడప ఏపీఎంఐపీ కార్యాలయంలో వివిధ కంపెనీల సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి 15వేల హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పథకం అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఐదెకరాల పొలం కలిగిన ఎస్సీ, ఎస్టీలకు వందశాతం, పదెకరాలు కలిగిన రైతులకు 90 శాతం, 12.5 ఎకరాలున్న రైతులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు. అర్హులైన రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళీమోహన్రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె..!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : చదువుతో పాటు చిన్నారులు క్రీడల్లోనూ రాణించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి నెలకొల్పిన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు వేళయింది. ఆయన హయాంలో కడప శివారులో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నాటి నుంచి నేటి వరకూ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటారు. ఎంతోమంది ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి చేరారు. ఈ ఏడాది క్రీడా పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. క్రీడా పాఠశాలలో ప్రవేశాలు పొందితే మంచి భవిష్యతు ఉంటుందని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను సిద్ధం చేస్తున్నారు. 19వ తేదీ వరకూ గడువు ఆన్లైన్ ద్వారా మే 31వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 4వ తరగతిలో 40 సీట్లకు గానూ బాలురు–20, బాలికలు–20, 5వ తరగతిలో మొత్తం 40 సీట్లకు గాను బాలురు–20, బాలికలు –20 మందికి అవకాశం కల్పిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపికలు జరిగేవి. ఈ ఏడాది నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఎంపికలు నిర్వహించనున్నారు. 4వ తరగతి ప్రవేశానికి 01–04–2015–31–03–2017 మధ్య జన్మించిన వారు, ఐదో తరగతికి 01–04–2014 నుంచి 31–03–2016 మధ్య జన్మించిన వారు అర్హులవుతారు. వయస్సు ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుడి ఒరిజినటల్ డాక్యుమెంట్లు, వైద్య పరీక్షల తర్వాత జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది. ఎంపికలు ఇలా..... జిల్లా స్థాయిలో ఈ ఏడాది జులై 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు కడప డీఎస్ఎ స్టేడియంలో చేపట్టనున్నారు. 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్ , స్టాడింగ్ బ్రాండ్ జంప్, మెడిసిన్ బాల్, షటిల్ రన్, ప్లెక్సీబిలిటీ టెస్ట్, 800 మీటర్ల పరుగు పందెం వంటివి నిర్వహిస్తారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాస్థాయిలో ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయి శారీరక సామర్థ్య ఎంపికలను ఈ ఏడాది జులై 10, 11వ తేదీల్లో నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనపరిచిన వారు క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిలుస్తారు. జులై 24వ తేదీ నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జులై 1 నుంచి జిల్లా స్థాయి ఎంపికలు దరఖాస్తు చేసుకోవాలి వచ్చే విద్యా సంవత్సరానికి కడప క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఈ నెల 19తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. అర్హత ఉండి ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. –జగన్నాథరెడ్డి, ఇన్చార్జ్ డీఎస్డీవో, వైఎస్ఆర్ కడప జిల్లా -
గొడ్డలితో దాడి
ముద్దనూరు : ఓ సంఘటనలో ఇరు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. దేనేపల్లెలో రామ్మోహన్ ఈ నెల 8న పెద్దమ్మ తల్లికి కొందరి సాయంతో యాటలు నిర్వహించాడు. అయితే గూనిగాండ్ల శివను దీనికి పిలవలేదు. దీంతో రామ్మోహన్ నీ కథ చూస్తా అంటూ గూనివాండ్లశివ బెదిరించాడు. అంతిటతోఆగ కుండా రామ్మోహన్ మంగళవారం తోటలో పనిచేయిస్తుండగా.. లక్షుమయ్య, శివశంకర్, నరసింహ, ఉత్తయ్యలతో వచ్చి.. శివ తన గొడ్డలితో రామ్మోహన్పై దాడిచేశాడు. గాయాలైన రామ్మోహన్ ఫిర్యాదు మేరకు గూనివాండ్లశివ, మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు ముద్దనూరు : మండలంలోని దేనేపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి రామ్మోహన్ తోటలో కూలి పనులకు వెళ్లింది. పైపులు తేవాలంటూ తోట యజమాని రామ్మోహన్ ఆమెను పిలిచాడని, అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడని, తప్పించుకోబోగా కులం పేరుతో దూషించాడని విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏదో విధంగా తప్పించుకుని బయటపడినట్లు ఆరోపించింది. దీంతో రామ్మోహన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడి ఆత్మహత్యప్రొద్దుటూరు క్రైం : మైదుకూరు రోడ్డులోని ధారా అపార్ట్మెంట్ వెనుకవైపున గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకొని ఉండటంతో ఆ ప్రాంత వాసులు మంగళవారం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి సుమారు 65–70 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు. నలుగురు తహసీల్దార్ల బదిలీ కడప సెవెన్రోడ్స్: జిల్లాలో నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులిచ్చారు. బ్రహ్మంగారిమఠంలో పనిచేస్తున్న డి.దామోదర్రెడ్డిని ఒంటిమిట్టకు, అక్కడ పనిచేస్తున్న ఏవీ.రమణమ్మను ఖాజీపేటకు బదిలీచేశారు. ఖాజీపేటలో ఉన్న డి.మహబూబ్బాషాను జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్ఆర్సీ విభాగానికి బదిలీ చేశారు. గోపవరం తహసీల్దార్ ఆర్.జీవన్ చంద్ర శేఖర్ను ముద్దనూరుకు బదిలీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నందున జీవన్ చంద్రశేఖర్ను జిల్లా కేంద్రంలోనే ఉంచాల్సి ఉంది. అయినా కడపలో కాకుండా ముద్దనూరుకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా..?
పులివెందుల టౌన్ : సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు, సాక్షి కార్యాలయాలపై దాడులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఆపాలంటూ పులివెందుల జర్నలిస్ట్ అసోసియేషన్ ర్యాలీ చేపట్టింది. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండు నుంచి మెయిన్ బజార్, పూలంగళ్ల సర్కిల్, కచేరి రోడ్డు మీదుగా అర్బన్ పోలీస్స్టేషన్కు మీడియా మిత్రులు ర్యాలీగా చేరుకుని ఏఎస్ఐ సిద్ధార్థ, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరెడ్డిలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో పాత్రికేయుల అక్రమ అరెస్టులపై, దాడులు, దౌర్జన్యాలు జరగకుండా చూడాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు కార్తీక్, రాజు, దామోదర్రెడ్డి, విష్ణువర్థన్రెడ్డి, ప్రవీణ్, కృష్ణకుమార్, చంద్రమోహన్రెడ్డి, రమణారెడ్డి, జయరామిరెడ్డి, విమన్, సుబ్బారెడ్డి, ప్రకాష్, రాము, రామ్మోహన్, శంకర్, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు : సాక్షి దినపత్రిక కార్యాలయాలపై దాడి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో ఎస్ఐ మైనుద్దీన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్(సాక్షి), ఏసు(ప్రజాశక్తి), బాలకృష్ణ(వార్త), సుధాకర్(విశాలాంధ్ర), శ్రీనివాసులు (ప్రజాభూమి)నందకుమార్(జ్యోతి), భాస్కర్బాబు(సాయంకాలం) పాల్గొన్నారు. అక్రమ అరెస్ట్పై మండిపడిన పాత్రికేయులు పోలీసులకు వినతి పత్రాలు -
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం ఉదయం 9.30 గంటలకు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మర్ బాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీ్త్ర, పురుషులకు 100 మీటర్లు, 200 మీ., 400 మీ., 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 14, 15వ తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగే సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 18 ఏళ్లు నిండిన సీ్త్ర, పురుషులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాలకు 9949686586, 8019880995 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. యువకుడి మృతివీరపునాయునిపల్లె : మండలంలోని వీరపునాయునిపల్లె ఎస్సీ కాలనీలో యువకుడు ప్రశాంత్(22) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. మృతుడు ప్రశాంత్ తల్లి మృతి చెందడంతో మద్యానికి బానిసైన ప్రశాంత్ జులాయిగా తిరుగుతూ తరచూ తండ్రితో గొడవపడేవాడు. గతంలోనూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం ఉందని ఎస్సై మంజునాథ్ తెలిపారు. రెండు రోజుల కిందట మళ్లీ తండ్రీ, కొడుకుల మద్య ఘర్షణ జరగడంతో మనస్తాపానికి గురై సోమ వారం రాత్రి ఇంట్లోనే ప్రశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంగోపవరం : మండలంలోని రాచాయపేట పంచాయతీ బెడుసుపల్లి దళిత వాడకు చెందిన అట్లూరు వెంకటయ్య(45) రోడ్డు ప్రమాదంలో మంగళవారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నవరం నుంచి ద్విచక్ర వాహనంలో వెంకటయ్య బెడుసుపల్లెకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటయ్య మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైఫల్యం కప్పిపుచ్చుకొనేందుకే దాడులు
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రజలకు వాక్ స్వాతంత్య్రం లేకుండా చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి.అంజద్బాషా ధ్వజమెత్తారు. కడపలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏదైనా పెద్ద సమస్య జరిగితే దాని నుంచి ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఐదు దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉన్నారని, పలు పత్రికల్లో, టీవీల్లో ఆయన పనిచేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొమ్మినేని డిబేట్ షోలకు ప్రజాదరణ ఉందని, ఆయనంటే చంద్రబాబుకు పడదన్నారు. 2014లో ఎన్టీవీ ప్రసారాలు బంద్ చేస్తామని బెదిరించి ఆయన్ను తొలగించేలా చేశారని గుర్తుచేశారు. టీవీల్లో డిబేట్లు జరిగినపుడు పాల్గొన్న విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటార న్నారు. ఇందులో భాగంగానే క్రిష్ణంరాజు అమరావతి పరిసరాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారన్నారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. క్రిష్ణంరాజుతోపాటు కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి ఛానెల్ కూడా క్షమాపణ కోరిందన్నారు. అయితే టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా సాక్షి ఛానెల్, వైఎస్ జగన్ను, వైఎస్ భారతిలను ఇందులోకి లాగడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా ఏ హామీలు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. ‘వెన్నుపోటు దినం’ విజయవంతం కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఓ కల్పిత ఉద్యమాన్ని సృష్టించి సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి, కొమ్మినేనిని అరెస్ట్ చేయించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీవీ5, ఏబీఎన్, మహా టీవీలలో సాంబశివరావు, వెంకటక్రిష్ణ, రాధాక్రిష్ణ, వంశీక్రిష్ణలాంటి వారు విషం కక్కుతూ ఎన్నో వ్యాఖ్యలు చేశారని, ఆ రోజున వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని ఇలా వేధించలేదన్నారు. ఫేక్ ఐడీలతో కిరాక్ ఆర్పీ, సీమరాజా వంటివారు బండబూతులు తిడుతున్నా వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దళిత మైనర్ బాలికను నెలల తరబడి గ్యాంగ్ రేప్చేసి హత్య చేయడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీకి మద్దతిచ్చే వారిపై అక్రమ కేసులు బనాయించి, టీడీపీ నాయకులను కాపాడటానికే పోలీసు వ్యవస్థ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, మున్సిపల్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, ౖషఫీ, జోన్ అధ్యక్షుడు తోటక్రిష్ణ, కంచుపాటి బాబు, అబ్దుల్ సుభాన్, డీజే అక్బర్, తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ అక్రమం టీడీపీ నేతలదంతా కల్పిత ఉద్యమం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
హామీలు అమలుచేయలేక డైవర్షన్ పాలిటిక్స్
జమ్మలమడుగు : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎవరో చెప్పారంటూ.. ఒక అంశాన్ని పట్టుకుని వైఎస్సార్సీపీ, సాక్షికి ముడిపెట్టి టీడీపీ నాయకులు ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు పక్కనపెట్టి టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వచ్చిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక కెఎస్ఆర్ లైవ్షోలో జరిగిన అంశాన్ని అమరావతి ప్రజలందరికీ ఆపాదించడం తగదన్నారు. కెఎస్ఆర్ క్షమాపణ చెప్పినా పట్టించుకోకుండా, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరైందికాదన్నారు. ఈ రోజు అధికారం ఉందని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి జైలుకు పంపడమేగాక, చానెల్స్లో మాట్లాడటానికి వీలులేని భాషలో వైఎస్సార్సీపీ నాయకులపై కామెంట్లు చేస్తున్నారన్నారు. అధికారం కొల్పోయిన తర్వాత మీ పరిస్థితి ఎమిటో తెలుసుకోవాలని, కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ చెప్పే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి హామీలు గుప్పించి.. ఇపుడు చేతగాక చిన్న విషయాన్ని పట్టుకుని ప్రజల చూపు మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, వేణుయాదవ్, విష్ణువర్థన్రెడ్డి, లక్షుమయ్య, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడులు సిగ్గుచేటు క్షమాపణ కోరినా దాడులు చేయడం దారుణం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
ఏసీఏ సౌత్జోన్ అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్–19 వన్డే క్రికెట్ మ్యాచ్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. కడప కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు, కడప జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 33.1 ఓవర్లలో 124 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 128 పరుగులు సాధించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రణధీర్ రెడ్డి 54, రోహిత్ వర్మ 37 పరుగులు చేశారు. ఏడు వికెట్ల తేడాతో కర్నూలు జట్టు విజయం వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టుపై కర్నూలు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 48.1 ఓవర్లలో 176 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కిన్ను కిషన్ 50 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మహిత్ 3, నౌసూన్ కళ్యాణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 34.0 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 180 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ చెట్టులోని విఖ్యాత్ 66 పరుగులు చేశాడు. -
షట్డౌన్ దిశగా అల్ట్రాటెక్!
పరిశ్రమ మూసేస్తే.. మా పరిస్థితి ఏంటి? సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, క్షేత్రస్థాయిలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు వెరసి అల్ట్రాటెక్ పరిశ్రమ యాజమాన్యం షట్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా? అని ప్రశ్నిస్తే ఔను అనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 48 రోజులుగా అల్ట్రాటెక్లో సిమెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగులను పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుతగులుతున్నారు. స్వయంగా పోలీసు అధికారులు దగ్గరుండీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈక్రమంలో పరిశ్రమ నిర్వహణ కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ● చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ యాజమాన్యం తలొగ్గి బతిమాలాడాలనే తలంపుతో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకోసం అధికార దుర్వినియోగం ఎలా చేయాలో అంతా సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఓవైపు అనుచరులు, మరోవైపు పోలీసులను కాపలాగా పెట్టి వలసపల్లె, కర్చుకుంటుపల్లె, తుమ్మలపల్లె, దేవగుడి గ్రామాలకు చెందిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడే తిష్టవేసి పర్మినెంట్ ఉద్యోగులను సైతం విధుల్లోకి వెళ్లనీయడం లేదని పలువురు వాపోతున్నారు. అదేమంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతోందని స్వయంగా పోలీసు అధికారులు అడ్డుతుగులుతున్నట్లు తెలుస్తోంది. ఆ సాకు చెబుతూ విధులకు హాజర కాకుండా అడ్డగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే తమ సీఐ ఇరువురి మధ్య పరిష్కారం చూపుతారంటూ యర్రగుంట్ల సర్కిల్ కార్యాలయానికి చెందిన కింది స్థాయి పోలీసు అధికారులు చెబుతున్నట్లు యాజమాన్య ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇది వరకు ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు నమోదు చేసి వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. అధికారులు అలా ఎమ్మెల్యేకు అండగా సహకరిస్తుంటే, మరోవైపు ప్యాంకింగ్ ఫ్లాంట్ను దక్కించుకొని యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్యాకింగ్ ప్లాంట్ మూసివేశారు. వెరసి 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి ఆగిపోయింది. ‘రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే అన్నీ అనుమతులు ఇచ్చి రికార్డు టైమ్లో దాన్ని అమల్లోకి తెచ్చేందుకు బాధ్యత తీసుకుంటున్నాను. మీరంతా సమీప భవిష్యత్లో కనీసం ఒక్క వ్యాపారమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలి.’ సీఎం చంద్రబాబు ఇటీవల సీసీఐ చర్చాగోష్టిలో పారిశ్రామికవేత్తలతో అన్నమాటలివి. నోటితో చెప్పడం నొసలుతో వెక్కిరించడం, దేని పని దానిదే అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మాటలకు, చర్యలకు పొంతన ఉండదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఊదాహరణగా చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నిలుస్తోందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఉత్పత్తిలో పొలిటికల్ వాటాలు ఇవ్వాల్సిందేనని నిక్కచ్చిగా సీఎంఓ పేర్కొనడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి ఉంటే అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోతుందా? 48 రోజులుగా సిమెంటు ఉత్పత్తి నిలిచిపోతే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఎవ్వరికీ పట్టకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు సర్కార్లో రాజధాని నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎవరి వాటాలు వారికి దక్కించుకునేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. జమ్మలమడుగు : తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్యాకింగ్ యూనిట్లో పని చేస్తున్న కార్మికులు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ గేటు వద్ద వారం రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తూ.. ఎవరూ లోనికి పోకుండా అడ్డుకుంటున్నారు. అయితే రెండు రోజుల నుంచి ఐసీఎల్ (అల్ట్రాటెక్) పరిశ్రమలో పని చేస్తున్న మెయింటెనెన్స్ కార్మికులు, ఇతర కార్మికులు తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు తమ పని చేయడం కోసం పరిశ్రమ వద్దకు వెళ్లారు. నిరసన చేస్తున్న కార్మికులు.. లోనికి వెళ్లవద్దు అంటూ అడ్డుకున్నారు. తమని ఎందుకు అడ్డుకుంటున్నారు, తమ పని చేసుకోనివ్వండి పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలిపోతే మా పరిస్థితి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్మికులు, నిరసన కారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. చెప్పేందుకే నీతులు కొనసాగుతున్న కూటమి ఎమ్మెల్యే వేధింపులు కార్మికులు పరిశ్రమలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ముప్పుతిప్పలు ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువు -
చదువుకొనేదెలా..!
●పెరిగిన ధరలు ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక పాఠశాల బాట పట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ (గురువారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.ఈ ఏడాది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో 10 నుంచి 20 శాతం వరకు ఫీజులు పెంచినట్లు తెలిసింది. అదే విధంగా పుస్తకాల ధరలు భారీగా పెరిగాయి. 6వ తరగతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, బూట్లు, టై వంటికి గతేడాది 6 వేలు ఉంటే.. ఈ ఏడాది రూ. 8 వేల దాకా అవుతోందని తల్లిదండ్రులు అంటున్నారు. వీటితోపాటు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు, అట్టలు వంటి అదనపు ఖర్చులు మరింత భారం అవుతున్నాయని వారు వాపోతున్నారు. ఇలా అన్ని కలిపి గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా రూ.5 వేలు నుంచి రూ.10 వేల దాకా ఖర్చు పెరిగిందని ఆవేదన చెందుతున్నారు. కడప ఎడ్యుకేషన్: జూన్ నెలంటేనే పేద, మధ్య తరగతి ప్రజల గుండె గుబేల్మంటుంది. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరూ చదువులకు సంబంధించి పుస్తకాలు, స్కూల్ యానిఫాం, బూట్లు, టై, బెల్ట్, బ్యాగులు ఇలా అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయాల్సి రావడంతో తల్లిదండ్రులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలా జూన్ నెలలో అన్ని రకాల వస్తువులను ఒకే సారి కొనుగోలు చేయాల్సి రావడంతో.. ఒక్కసారిగా ఆర్థిక భారం పడుతోంది. నర్సరీ మొదలుకుని కళాశాల విద్య వరకు వేలాది రూపాయలు పోసి చదువులను కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని, అయినా కానీ అప్పోసప్పో చేసి పిల్లలను బడిలో చేర్పించాల్సి వస్తోందనని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇవ్వకపోవడంతో మరింత ఆర్థిక భారం పడుతోందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు తెరిచేనాటికి పిల్లలకు తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ముందు నుంచే అడ్మిషన్లు ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్లు ప్రారంభించాయి. దీంతోపాటు వేసవి సెలవుల్లో తమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాఠశాలల్లో పని చేసే సిబ్బందికి కూడా అడ్మిషన్లకు సంబంధించి లక్ష్యం విధించి వేధించారు. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళళన చేసినా.. పట్టించుకునే వారు కరువయ్యారు. వ్యాపార కేంద్రాలుగా.. సరస్వతీ నిలయాలుగా విరాజిల్లాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. ఫలితంగా సగటు జీవి తన పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే గుండె గుబేల్మంటుంది. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులను బాగా చదివించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆశతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రుల చెవులు పిండి క్యాష్ చేసుకుంటున్నారు. అడ్మిషన్ ఫీజు మొదలుకుని టై, షూ, బెల్టులతోపాటు పుస్తకాల వరకూ అన్ని వారే సరఫరా చేస్తున్నారనే విమర్శలు మెండుగా ఉన్నాయి. కూలి పని చేసుకునే స్థాయి నుంచి.. కూలి పని చేసుకునే వాడి దగ్గరి నుంచి వ్యాపారం చేసుకునే వారి వరకు, అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను కాన్వెంట్ చదువులను చదివించాలని ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఏటా ఫీజులు పెంచుతున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన అధికారుల చేష్టలుడిగి ప్రవర్తించడంతో.. అది కాస్తా పేద, బడుగు, బలహీల వర్గాల వారికి పెనుభారంగా మారుతూ అప్పుల ఊబిలోకి వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమైనా... పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత లాగా.. సామాన్య, మధ్య తరగతుల వారు కూడా తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్లో చదివించాలనే ఆశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయినా సరే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకు పంపేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా అందిస్తున్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతోంది. అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల పుస్తకాల ధరలు: రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు 6 నుంచి 10వ తరగతి పుస్తకాలు: రూ. 8 నుంచి 12 వేల వరకు యూనిఫాం మూడు జతలు: రూ.1500 నుంచి 2 వేల వరకు షూ, టై, బెల్ట్ తదితర వస్తువులు: రూ.500 నుంచి 1000 వరకు మార్కెట్ ధరల కంటే అధికంగా.. విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో చేరిన తర్వాత విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు మొదలుకొని యూనిఫాం, టై, బెల్ట్, షూ వంటి వాటిని కచ్చితంగా కొనుగో లు చేయాల్సిందే. అదే అదునుగా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు సంబంధిత వస్తువులను వారి పాఠశాలలో ఏర్పాటు చేసుకుని బహిరంగ మార్కెట్ కంటే అధిక రేట్లతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విద్యార్థి సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. భయ పెడుతున్న బడి ఫీజు ప్రైవేటు, కార్పొరేట్లో భారీగా పెరిగిన వైనం తడిసి మోపెడు అవుతున్న స్కూల్ ఖర్చులు సామాన్యులకు భారంగా విద్య అయినా కాన్వెంటు వైపే మొగ్గు రేపు పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుంది. అపారమైన అనుభవంతోపాటు అర్హత గల ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ఇంగ్లిష్ మీడియం ఉంది. ప్రభుత్వం విద్యా సామగ్రి ఉచితంగానే అందిస్తుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఆర్భాటాలు చూసి తల్లిదండ్రులు మోసపోవద్దు. తమ ిపిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ, అధికారి -
మత్స్యశాఖ ఏడీగా నాగయ్య
కడప అగ్రికల్చర్: మత్స్యశాఖ ఏడీగా నాగయ్య నియమితులయ్యారు. ఆయన విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏడీగా కడపకు వచ్చారు. ఇక్కడ ఏడీగా పని చేస్తున్న రెడ్డెయ్యను నంద్యాలకు బదిలీ చేశారు. డీసీఓగా వెంకటసుబ్బయ్య.. జిల్లా సహకారశాఖ అధికారిగా వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. ఈయన నంద్యాల జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రొద్దుటూరులోని జిల్లా సహకార శిక్షణా కేంద్రం అధ్యాపకుడిగా ఎన్టీఆర్ జిల్లాలో పని చేసే శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్లో చైర్పర్సన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్తోపాటు మొత్తం ఆరుగురు సభ్యుల నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారన్నారు. మరిన్ని వివరాలకు 9440814416 నెంబరులో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా చంద్రానాయక్ కడప అగ్రికల్చర్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల పరంపర కొనసాగుతుంది. బదిలీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా వ్యవసాయ అధికారిగా చంద్రానాయక్ నియమితులయ్యారు. ఈయన అన్నమయ్య జిల్లా డీఏఓగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. వైఎస్సార్ జిల్లా డీఏఓగా పని చేస్తున్న అయితా నాగేశ్వరావు గుంటూరు డీఏఓగా బదిలీపై వెళ్లారు. అలాగే జిల్లా లోని పలువురు ఏడీలతోపాటు ఏవోలు కూడా జి ల్లాలోని పలు ప్రాంతాలకు బదిలీలు అయ్యారు. జిల్లా ఉద్యానశాఖ అధికారిగా.. జిల్లా ఉద్యానశాఖ అధి కారి రవిచంద్ర బాబు నియమితులయ్యారు. ఈయన కూడా అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తున్న సుభాషిణి అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా బదిలీపై వెళ్లారు. వీరితోపాటు జిల్లాలోని పలువురు మండల ఉద్యానశాఖ అధికారులు పలు మండలాలకు బదిలీ అయ్యారు. వీరితోపాటు జిల్లా హెడ్ఆఫీస్లో జిల్లా టెక్నికల్ హెచ్ఓగా పని చేస్తున్న జోతిర్మయి రాష్ట్ర హెడ్ఆఫీస్కు బదిలీకాగా ఆమె స్థానంలో హెడ్ఆఫీస్లో పని చేస్తున్న జీవన్ వస్తున్నారు. మార్కెటింగ్శాఖలో.. మార్కెటింగ్శాఖ డీడీగా లావణ్య బదిలీపై వచ్చారు. కడప మార్కెటింగ్శాఖ డీడీగా గతంలో పని చేస్తున్న శ్రీకాంత్రెడ్డిని కడప మార్కెట్యార్డు సెక్రటరీగా నియమించారు. -
‘సాక్షి’ కార్యాలయం వద్ద ఆందోళనపై ఫిర్యాదు
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్చింతకొమ్మదిన్నె: కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రజాస్వామికంగా ధర్నా చేయడం దారుణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, కడప రిపోర్టర్ దుర్గాప్రసాద్, చింతకొమ్మదిన్నె రిపోర్టర్ నాగమల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో సీఐ శివశంకర్ నాయక్ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి, క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణం అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సాక్షి కథనాలు ప్రచురిస్తుండటంతోనే కక్ష గట్టారని పేర్కొన్నారు. కడపలోని సాక్షి కార్యాలయం లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాలలో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారని, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతోపాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. దీనివల్ల సిబ్బంది ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా!
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రైవేట్ పాలసీలు ఎన్ని వస్తున్నా తపాలా పాలసీలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. తక్కువ చెల్లింపులతో ఎక్కువ బోనస్ ఇస్తారనే విశ్వాసం ఉంది. తపాలా శాఖలో పలు పాలసీలు ఉన్నా ప్రజల్లో అవగాహన ఆశించిన స్థాయిలో లేదు. జీవిత బీమా పథకం ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా దోహదపడుతోంది. 1884 ఫిబ్రవరి 1న కేవలం తపాలా శాఖలో ఉద్యోగం చేసే వారి కోసం ప్రారంభమైన పీఎల్ఐ(పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్)ను కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి తెచ్చారు.తపాలా బీమా పాలసీలను 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయస్సు గలవారు తీసుకోవచ్చు. రూ.50 లక్షల వరకు తీసుకునే సౌకర్యం ఉంది. పాలసీలు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించే సౌలభ్యముంది. ప్రధానంగా ఆరు రకాల పాలసీలు అమలవుతున్నాయి. వాటిలో సంతోష్, సువిధ, సుమంగళి, యుగళ్ సురక్ష, సురక్ష బాలాజీ పాలసీలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. దీనిపై తపాలా శాఖ అధికారులు సభలు, సమావేశం నిర్వహించి మరింత అవగాహన కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.పాలసీ వివరాలు..● ఎండోమెంట్ అస్యూరెన్స్(సంతోష్)ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంది. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత ఉంటుంది. ఏటా ప్రతి వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది.● కన్వర్టబుల్ హోల్లైఫ్ అస్యూరెన్స్(సువిధ)ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు, పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదు సంవత్సరాల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోత . ఏటా ప్రతి వెయ్యికి రూ. 72 చొప్పున బోనస్ లభిస్తుంది. ఐదు సంవత్సరాలు (ఆరు సంవత్సరాలు దాటరాదు) ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్లోకి మారవచ్చు. అప్పుడు బోనస్లు అదే పద్ధతిలో లభిస్తాయి. అయితే కన్వర్షన్ లేకపోతే అస్యూరెన్స్గా పరిగణిస్తారు.● యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ (సుమంగళ్)ఇది మనీ బ్యాక్ పాలసీ. ఈ పాలసీకి 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. పాలసీ కాలపరిమితి 15–20 సంవత్సరాలు, 15 సంవత్సరాల పాలసీపై 6,9,12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. 20 సంవత్సరాల పాలసీపై 8,12,16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్. ప్రతి ఏటా వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది.● జాయింట్ లైఫ్ అస్యూరెన్స్(యుగళ్ సురక్ష)21–45 సంవత్సరాల దంపతులు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. పాలసీ కాలపరిమితి 5–20 సంవత్సరాలు. పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. ఐదు సంవత్సరాలు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత, మరణానంతర ప్రయోజనాలు భాగస్వామికి లేదా వారి వారసులకు వెళ్తాయి. ప్రతి ఏటా వెయ్యికి రూ. 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో భార్యాభర్తల బీమా కవరేజీని పొడిగించుకోవచ్చు.● హోల్లైఫ్ అస్యూరెన్స్ (సురక్ష)ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులు. కనీస బీమా రూ. 20 వేలు, గరిష్ట బీమా రూ. 50 లక్షలు. ప్రీమియం చెల్లించే వయస్సును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకోవచ్చు. పాలసీ తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సదుపాయం. మూడు సంవత్సరాలు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం. ఐదేండ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాదు. ఐదేండ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లో కోత. ఏటా ప్రతి వెయ్యికి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 59 ఏళ్ల దాకా ఈ స్కీమ్ను ఎండోమెంట్ అస్యూరెన్స్ పాలసీల్లోకి మార్చుకోవడానికి వీలుంటుంది. పాలసీదారుకు వయసు 80 దాటితే లేదా పాలసీదారు చనిపోతే వారి వారసులకు బీమా సొమ్ము దానిపై బోనస్ ప్రయోజనాన్ని చెల్లిస్తారు.● చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా)పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకునే వెసులుబాటును కల్పించారు. పిల్లల వయస్సు తప్పనిసరిగా 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ. 3లక్షలు లేదా పాలసీదారు బీమా(సమ్ అస్యూర్డ్) ప్రకారం (ఏదితక్కువైతే అది) ఇస్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు (పిల్లల తండ్రి) వయస్సు 45 ఏళ్లు దాటరాదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వస్తాయి. రుణ సదుపాయం, సరెండర్ సౌకర్యం ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులే చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అయినప్పటికి వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి.పాలసీలు ఉపయోగకరం..తపాలాశాఖ ద్వారా అందే బీమా పాలసీలు ఎంతో ఉపయోగకరం. ఇతర బీమా సంస్థల నుంచి వచ్చే రాబడి కంటే మెరుగైన ఆదాయం వస్తుంది. అన్ని రకాల ఉద్యోగులు పీఎల్ఐ పాలసీలను అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చు.పాలసీలు తీసుకుంటే కుటుంబానికి భరోసా ఉంటుంది.– రాజేష్, తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలిపీఎల్ఐ పాలసీని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ పాలసీపై గ్రామాల్లో, నగరంలో విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పాలసీ తీసుకుంటే కుటుంబానికి జీవన రక్షగా ఉంటుంది.– మునాఫ్, పీఎల్ఐ డెవలప్మెంట్ మేనేజర్, కడప డివిజన్ప్రతి ఒక్కరి పాలసీ కుటుంబాలకు ఉపయోగకరంప్రజలు ప్రతి ఒక్కరు పాలసీలు తీసుకోవడం ద్వారా వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో మేలు చేకూరుతుంది. తపాలా శాఖ అందించే అనేక పీఎల్ఐ స్కీమ్లు ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకొని పాలసీలు తీసుకోవాలి.–విజయ్ భాస్కర్, అసిస్టెంట్ తపాలాశాఖ సూపరింటెండెంట్, కడప డివిజన్ -
స్టీల్ప్లాంట్ నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
మైలవరం : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం విషయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. 2019 జనవరిలో మండల పరిధిలోని కంబాలదిన్నె గ్రామం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని సోమవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి పద్మశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వేసిన శిలాఫలకం ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మాటలు చెబుతున్నారే తప్ప చేతల్లో మాత్రం ముందుకు రావడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాముల బ్రహ్మానందరెడ్డి, ఇర్ఫాన్ బాషా, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఉద్యమంలో ఆనాటి త్యాగధనుల జీవితాల నుంచి నేటి తరం స్ఫూర్తి పొందాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వీణా విజయరామరాజు ఎస్టీయూ భవన్లో వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ బాషా అధ్యక్షతన 79 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, వీణా విజయరామరాజు మరియు మఖ్దుం మొహిద్దీన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఏడు దశాబ్దాల ఉపాధ్యాయ ఉద్యమంలో వీణా విజయరామరాజు, మఖ్దుం మొహిద్దీన్, వి.పి. రాఘవాచారి, పెర్నా శ్రీరామ మూర్తి లాంటి నాయకులు ఉద్యమాల ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణను, ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా పెన్షన్, గ్రాట్యుటీ,క మ్యుటేషన్ , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పొందే సౌకర్యాన్ని అందించారన్నారు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కె. సురేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలగంగి రెడ్డిలు మాట్లాడుతూ నేటి నవతరం నాయకులు విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలన్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్, జిల్లా నాయకులు షేక్ సాజిత్, షేక్ సాదిక్, నాగేంద్రప్రసాద్, మహబూబ్ బాషా, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాసులు, బాలరాజు, కరీముల్లా, కస్తూరి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో రెండు వర్గాల మధ్య తోపులాట
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వ్యతిరేకంగా నాయకులు నగరంలోని ఐఎంఎ హాలులో సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించంగా షర్మిల వర్గీయులు సమావేశం లోపలికి వచ్చి షర్మిల నాయక త్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ నాయకత్వం వర్థిల్లాలి అంటూ మరో వర్గం వారు నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో నాయకుల మధ్య మాటామాటా పెరిగి కుర్చీలతో కొట్టుకునే వరకు వెళ్లింది. షర్మిల వర్గీయులు సుంకర పద్మశ్రీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు సుంకర పద్మశ్రీని సురక్షితంగా పంపించారు. -
‘షైనింగ్ స్టార్స్’తో ఉజ్వల భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘షైనింగ్ స్టార్స్–2025‘ అవార్డులు విద్యార్థుల ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో.. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్–2025 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల నగదు బహుమతి, సత్కారం చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, ఎమ్మెల్సీలు ఎం.వి. రామచంద్రారెడ్డి, బి.రాంగోపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ జయప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులు వేయాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల అభీష్టాన్ని గుర్తించి వెన్ను తట్టి ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆత్మ విశ్వాసంతో లక్ష్యం వైపు అడుగేస్తే లక్ష్యం చేరుకోవడం కష్టం కాదని తెలిపారు. జేసీ అదితిసింగ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయంతో.. లక్ష్యం వైపు అడుగులేయాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఆర్జేడీ ఎ. శ్రీనివాసులు, ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య, డీఈఓ షంషుద్దీన్ మాట్లాడారు. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 266 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20వేలు చొప్పున మంజూరైన రూ.53,20,000 మెగా చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అతిథులతో కలిసి విద్యాశాఖ అధికారులు, విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రశంసా పత్రాలు, పతకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల లెక్చరర్లు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ -
భూ తగాదా కేసులో ఏడుగురి అరెస్టు
చాపాడు : గత నెల 27న రాజుపాళెం గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహంలో గల ప్రభుత్వ బంజరు భూమి విషయమై తలెత్తిన ఘర్షణలో సోమవారం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, నలసింగ్ పెద్ద కుళ్లాయప్ప వర్గీయుల మధ్య గత నెల 27న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే శ్రీనివాసులు వర్గీయులను అరెస్టు చేయగా, సోమవారం నలసింగ్ పెద్దకుళ్లాయప్పతో పాటు అతని వర్గీయులైన మధు, పవన్, గంగయ్య, కిషోర్, బాబు, కృష్ణయ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయ మూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. తప్పిన పెను ప్రమాదంలింగాల : మండలంలోని లోపట్నూతల గ్రామానికి చెందిన వెంగళరెడ్డి సోమవారం తన బొలెరో వాహనంలో పులివెందుల నుంచి స్వగ్రామానికి వస్తుండగా, లింగాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బొలెరో వాహనం పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. లింగాలకు చెందిన ఆదినారాయణ రెడ్డి రోడ్డుపై స్కూటీని కుడివైపు తిప్పుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీ అకస్మాత్తుగా ఎదురుగా రావడంతో, ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో వెంగళరెడ్డి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బొలెరో అదుపు తప్పి రోడ్డుమీద నుండి పొలంలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆదినారాయణరెడ్డికి స్వల్ప గాయాలు కాగా, ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంకడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 3వ తేదీన గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స కోసం చేర్పించారు. అనంతరం 4వ తేదీన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు కోరారు. -
అంతుచిక్కని రహస్యం
కడప కార్పొరేషన్ : కడప మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో ఏముంది...హాలు తాళాలు ఎవరి వద్ద ఉన్నాయి...కౌన్సిల్ హాలును తెరవకుండా ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంసమవుతున్నాయి. మేయర్ సురేష్ బాబు తన విచక్షణాధికారంతో వేదికపై ఉన్న కుర్చీలను తొలగించడంతో కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి గత రెండు సమావేశాల్లో రచ్చ రచ్చ చేసి హంగామా సృషించారు. తనకు మేయర్తో సమానంగా వేదికపై కుర్చీ వేసేవరకూ సమావేశాలు జరుగనివ్వనని హెచ్చరించారు. దీంతో ముజువాణి ఓటుతో మేయర్ అన్ని అంశాలను ఆమోదించారు. ఇప్పటికి సుమారు నాలుగు నెలలుగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరగలేదు. కమిషనర్ మనోజ్రెడ్డి కౌన్సిల్ హాలులో ఎక్స్ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు ఏర్పాటు చేసి తాళాలు తన వద్ద ఉంచుకున్నారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గతంలోనే కౌన్సిల్ హాలును తెరిపించాలని కోరితే కమిషనర్ తన వద్ద తాళాలు లేవని చెప్పినట్లు సమాచారం. తాజాగా 3 నెలలు పూర్తయిన నేపథ్యంలో అత్యవసరంగా కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరపాల్సిన ఆవశ్యకత ఉందని, కౌన్సిల్ హాలులో కనీస వసతుల కల్పనకు పరిశీలించాల్సి ఉన్నందున దానిని వెంటనే తెరిపించాలని మేయర్ సురేష్ బాబు స్వయంగా తన లెటర్ హెడ్లో కమిషనర్ను కోరారు. మేయర్ ఇచ్చిన లేఖను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు సోమవారం కమిషనర్ మనోజ్రెడ్డికి అందజేశారు. అయితే కమిషనర్ సమావేశం జరిగే రోజునే కౌన్సిల్ హాలు తెరుస్తామని, అంతవరకూ తెరిచే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. కుర్చీ చుట్టూ తిరుగుతున్న రాజకీయం కడప నగరపాలక సంస్థలో ప్రజల ఓట్లతో గెలుపొందిన మేయర్, కార్పొరేటర్లకు తగిన గౌరవమిచ్చి వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా పాలన చేయాల్సిన కమిషనర్, ఇతర అధికారులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్. మాధవి ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలను కక్షసాధించడంలో కమిషనర్ భాగస్వాములైనట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏర్పాటు చేసుకున్న వాటర్ప్లాంట్లను తొలగించడం, ఆక్రమణల పేరిట ఆ పార్టీ నాయకుల షాపులను తొలగించడం, వార్డు సచివాలయాల్లో కార్పొరేటర్లకు ఏర్పాటు చేసిన కుర్చీలు, ఛాంబర్లను తొలగించడం వంటి వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కమిషనర్ ఆదేశాలతోనే ఇవన్నీ జరిగినట్లు కార్పొరేటర్లు భావిస్తున్నారు. మహానాడు సందర్భంగా కడపలో విచ్చలవిడిగా వారం రోజులపాటు ఫ్లెక్సీలు, హోర్డింగులు, వెలసినా కార్పొరేషన్కు మాత్రం రూపాయి ఆదాయం కూడా సమకూరలేదు. సామాన్య టీడీపీ నేతలు వినతులు ఇవ్వడానికి వస్తే లేచినిలబడి వినయ విధేయతలు చూపుతున్న కమిషనర్, కార్పొరేటర్లు వినతులు ఇవ్వడానికి పోతే కనీసం లేచి నిలబడలేదన్న విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం మేయర్కు తప్ప ఆయనతో సమానంగా ఎక్కడా ఎవరికీ కుర్చీలు ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే కడప నగరపాలక సంస్థలో అందుకు విరుద్దంగా మేయర్కు మాట మాత్రమైనా చెప్పకుండా... తనకే అన్ని విచక్షణాధికారాలు ఉన్నట్లు కమిషనర్ అత్యుత్సాహంతో మేయర్తో సమానంగా వేదికపై ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కమిషనర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా అవేవీ ఆయన పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కమిషనర్ ఇలా చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అదే గనుక నిజమైతే దానిపై మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఏ విధంగా స్పందిస్తారో...ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ తాజాగా మున్సిపల్ కౌన్సిల్ హాలు తెరిపించాలని కోరిన మేయర్ అంగీకరించని కమిషనర్... సర్వత్రా విమర్శలు -
ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకుడు రఘనాథరెడ్డి కడప ఎడ్యుకేషన్ : ఎస్జీలటీకు వెబ్ కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలనే విషయంలో ప్రభుత్వ పెద్దలు మొండి వైఖరి విడనాడాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు అనే నినాదంతో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.ఇందులో దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా 25 మంది నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తన తీరు ఇప్పటికై నా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతారన్నారు. పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో డీఈఓ కార్యాలయాల ముట్టడి జరిగినప్పటికీ ప్రభుత్వంలో కానీ, అధికారుల్లో కానీ ఎలాంటి చలనం రాకపోవడం దారుణం అని విమర్శించారు. కడప జిల్లా ఐక్యవేదిక నాయకుడు మోపురి వెంకట శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఆలోచించి రేపు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు గుజ్జల తిరుపాల్, రమేష్బాబు, శంకర్రెడ్డి, ఇబ్రహీం, సంగమేశ్వర్రెడ్డి, కొండారెడ్డి, అబ్దుల్లా, ఖాదర్ బాషా, లెక్కల జమాల్ రెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, అమరనాథరెడ్డి తదిరులు పాల్గొన్నారు. -
సాక్షిపై దాడి అప్రజాస్వామికం
కడప అర్బన్: కడప సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా, దాడి చేయడం అప్రజాస్వామికమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సాక్షి బ్రాంచ్ మేనేజర్ హరినాథ్రెడ్డి, బ్యూరో ఇన్చార్జి బాలకృష్ణారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్ వెన్ను శ్రీనివాసరావు, స్టాఫ్ రిపోర్టర్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కడపలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎిస్పీ వెంకటేశ్వర్లును వారు కలిసి వినతి పత్రం అందజేశారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయినా టీడీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడం దారుణమని అన్నారు. కడపలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన టీడీపీ దుండగులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. టీడీపీ నాయకులు చేసిన హంగామా సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ప్రత్యక్ష సాక్షులు సైతం ఉన్నారన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమ కార్యాలయం వద్ద ధర్నా చేయడంతో పాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. ఈక్రమంలో కడపలోని డీఎస్పీ కార్యాలయంలోకి కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించారు. వినతిపత్రం ఇచ్చే సమయంలో ఫొటోను తీసుకునేందుకు కూడా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బంది అనుమతించకపోవడం గమనార్హం. సాక్షి కార్యాలయం వద్ద దాడులకు సంబంధించి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కార్యక్రమంలో సాక్షి దినపత్రిక సభ్యులు, సాక్షి టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.కొవ్వొత్తులతో నిరసనసాక్షి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ కడపలోని కడప– పులివెందుల రహదారిలో చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సాక్షి యూనిట్ కార్యాలయం సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన చేపట్టారు.ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు మంచిది కాదని, ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. -
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, పగలు కొన్ని రోజులు, చీకటి కొన్ని రోజులు ఉంటాయని, ఇచ్చిన హామీలు ఏడాది పూర్తయినా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, రాష్ట్రంలో మంత్రి లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన పులివెందుల సబ్ జైలులో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూటమి నాయకులు ఎల్లో తోరణాలు కట్టడం దారుణమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు తోరణాలు కట్టారని వైఎస్సార్సీపీ నాయకులు డీఎస్పీ, కమిషనర్లనకు వినతి పత్రాలు కూడా అందజేశారన్నారు. అయినా కూడా పట్టించుకున్నా పాపానపోలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని ఇది అధికారులు గుర్తుపెట్టుకుని పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బ్యానర్లు, తోరణాలు తొలగిస్తే దానికి సంబంధించిన కేసు పెట్టకుండా 307 కేసు పెట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలోరాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకతీతంగా పనిచేసి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అరెస్టు చేసి ఉంటే ఎవరూ ఉండేవారు కాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సునీల్ కుమార్, వీరప్రతాప్రెడ్డి, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారమే కొమ్మినేని అరెస్ట్ కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారమే సాక్షి ఛానెల్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిందని వైఎస్సార్సీపీ జి ల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. సోమ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాక్షి ఛానెల్ డిబేట్లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వాటిని సాక్షి ఛానెల్కు, డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్కు అంటగట్టడం సరికాదన్నారు. దీనికి సాక్షి యాజమాన్యం, కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం సాక్షి కార్యాలయాల వద్ద ఆందోళనలు, దాడులు చేయించి కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి -
అమానుషం.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై టీడీపీ దౌర్జన్యం
రాష్ట్రంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. నిరసనకారుల ముసుగులో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను సాక్షికి ఆపాదిస్తూ సాక్షి కార్యాలయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసి ‘సాక్షి’పై దాడులకు దిగుతుంది పచ్చపార్టీ. ఆ వ్యాఖ్యలతో సాక్షి మీడియాకు సంబంధం లేకపోయినా అసత్య ఆరోపణలతో దాడులకు పాల్పడుతుంది పచ్చదండు. సాక్షిపై అసత్య ఆరోఫణలు అనేవి కేవలం దాడులు చేసేందుకే అనే విషయం తేటతెల్లమైంది. టీడీపీ గూండాల దాడితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర బట్టబయలైంది. విజయవాడ సాక్షి మీడియా కార్యాలయం పై టిడిపి పార్టీ రౌడీల దాడుల పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదుసాక్షి మీడియా కార్యాలయం పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్డీసీపీ సరితకు వినతిపత్రం అందించిన విజయవాడ బ్రాంచి మేనేజర్ యశోధరాజు, సాక్షి పేపర్, టీవీ ప్రతినిధులుకర్నూలు:సాక్షి పత్రిక మీడియా కార్యాలయంపై టీడీపీ రౌడీల దాడులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయులురాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి మీడియా పై దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరిన జర్నలిస్టుల సంఘాల నేతలుకర్నూలు ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీనివాస్ ఆచారికి వినతి పత్రాన్ని అందించిన సాక్షి మీడియా పాత్రికేయులు సాక్షి కార్యాలయాలపై టీడీపీ కుట్రపూరిత దాడులు👉 ఏపీలో అన్ని జిల్లాల్లో సాక్షి కార్యాలయాలపై టీడీపీ కార్యకర్తల భౌతిక దాడులు 👉టీడీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాడులకు కుట్ర👉రాళ్లు, కర్రలతో దాడులు చేస్తన్న టీడీపీ గూండాలు👉దాడులకోసం ఉదయం నుంచి టీడీపీ మూకల మోహరింపు👉పథకం ప్రకారం ఆర్గనైజ్డ్గా సాక్షి కార్యాలయాలపై దాడులు👉విజయవాడ, మంగళగిరి, వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళంలో దాడులు👉సాక్షి బోర్డులు ధ్వంసం చేసి, ఆఫీసుల్లోకి వెళ్లేందుకు యత్నం👉అన్ని జిల్లాల్లో సాక్షి ఆఫీసులపై దాడులు చేయాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు👉రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న అధికార పార్టీ👉రాష్ట్ర చరిత్రలో ఏ మీడియాపైనా జరగని రీతిలో టీడీపీ నేతల దాడులు మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ దౌర్జన్యం👉సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం👉మంగళగిరి సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు దౌర్జన్యం👉. టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు కలిసి సాక్షి కార్యాలయం బోర్డు ధ్వంసం👉బోర్డున ధ్వంసం చేసిన మాదిగ కార్పోరేషన్ చైర్మన్ శిరీష్👉అడ్డుకునేందుకు పోలీసులు యత్నం, వాగ్వాదంఆందోళన పేరుతో విజయవాడ, మంగళగిరి, తిరుపతి, కడప, శ్రీకాకుళం, అనంతపురంలోని సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. రేణిగుంట సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ గూండాల బీభత్సం సృష్టించారు. రేణిగుంటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి దిగారు. అదే సమయంలో సాక్షి కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు.అనంతపురంలోని సాక్షి కార్యాలయంపై సైతం టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. నిరసనకారల ముసుగులో సాక్షి కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు.. సాక్షి బోర్డు తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. శ్రీకాకుళం, కడప సాక్షి కార్యాలయాల వద్ద కూడా పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఆందోళన పేరుతో సాక్షి కార్యాలయాలపై దాడులకు దిగారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు. -
ఏపీ ఈఏపీ సెట్లో మెరిశారు
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో గత నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తమ్మ ర్యాంకులు సాధించి పలువురి ప్రశంసలు పొందారు. ఇంజనీరింగ్ విభాగంలో... జిల్లాలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 13084 మంది రిజిస్టర్ చేసుకోగా 12554 మంది పరీక్షలు రాయగా ఇందులో 8545 మంది క్యాలిఫై అయ్యారు. ఇందులో బాలురు 4931 మంది, బాలికలు 3614 మంది క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్,ఫార్మసీకి సంబంధించి... అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీకి సంబంధించి జిల్లాలో 3424 రిజిస్టర్ చేసుకోగా 2286 మంది పరీక్ష రాశారు. ఇందులో 2835 మంది క్వాలిఫై అయ్యారు. బాలురు 804 మందికాగా బాలికలు 2031 మంది ఉన్నారు. రాష్ట్రస్థాయిలో జశ్వంత్రెడ్డికి 16వ ర్యాంకు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో కడప భాగ్యనగర్ కాలనీకి చెెందిన మొలకల జశ్వంత్రెడ్డి మెరిశాడు. రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మొలకల రాజకిషోర్రెడ్డి, శ్రీలతల కుమారుడు జశ్వంత్రెడ్డి 1 నుంచి 5వ తరగతి వరకు కడప నారాయణ ఈ టెక్నో స్కూల్లో చదివాడు. 6 నుంచి 10వ తరగతి వరకు నారాయణ ఒలంపియాడ్లో చదివాడు.ఇంటర్మీడియట్ను విజయవాడ కానూర్లోని నారాయణలో పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్లో 211వ ర్యాంకు సాధించాడు. గతంలో విడుదలైన జేఈఈ మెయిన్స్లో 777వ ర్యాంకు సాధించాడు. దీంతోపాటు విట్లో 36వ ర్యాంకు, తెలంగాణా ఎంసెట్లో 38వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. జశ్వంత్రెడ్డి ర్యాంకు రావడంతో తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజకిషోర్రెడ్డి సొంత గ్రామం వీరపునారయణపల్లె మండలం అనిమెల గ్రామం. అయితే ఆయన కడపలో స్థిరపడ్డారు. రాజకిషోర్రెడ్డి ప్రస్తుతం విజయవాడ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బండిరీ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నారు. మెరిసిన కృష్ణహర్షిత్ ఏపీ ఈఏసీ సెట్ పలితాల్లో కడప ఎన్జిఓ కాలనీకి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకును సాధించి మెరిశాడు. మంచాల ఈశ్వర్, రాధికల కుమారుడు కృష్ణహర్షిత్ చదువులో బాగా రాణిస్తూ ఇటీవల విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కూడా 197వ ర్యాంకును సాధించాడు. చైన్నె ఐఐటీలో ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి.. సాప్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణ హర్షిత్ తండ్రి మంచాల ఈశ్వర్ సిద్దవటం మండలం మాధవరం జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. కృష్ణ హర్షిత్కు ర్యాంకు రావడం పట్ల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
టిడ్కో ఇళ్ల సమీపంలో పశువధ కేంద్రం గుర్తింపు
మదనపల్లె రూరల్ : మండలంలోని తట్టివారిపల్లె పంచాయతీ ఎర్రగానిమిట్ట వద్ద టిడ్కో ఇళ్లకు ఉత్తరం వైపున ఉన్న పాత కోళ్లఫారం షెడ్డులో రహస్యంగా పశువులను వధిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. శానిటోరియం వద్ద ఆవును వధిస్తున్నారనే సమాచారం మేరకు..స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కోళ్లఫారం షెడ్ వద్దకు చేరుకున్నారు. జంతు వధశాలను గుర్తించి సమాచారం ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి ఆదేశాలతో తాలూకా పోలీసులు అక్కడకు చేరుకుని వధించేందుకు సిద్ధంగా ఉన్న 6 కోడెదూడలు, 1 దేశవాళీ ఆవు, 4 జెర్సీ ఆవులను గమనించి, వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ లోపు విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బండి ఆనంద్, భగవాన్, వి.నారదరెడ్డి, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు షెడ్ వద్దకు చేరుకున్నారు. బక్రీద్ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో...డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ..గోవధ జరగకుండా చూస్తామని, దీనిని అరికట్టేందుకు డివిజన్ పరిధిలో మూడు చెక్పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా గోవులను రహస్యంగా శానిటోరియం వద్దకు తరలించి, వధిస్తుంటే పోలీసులు ఎందుకు అరికట్టలేకపోయారని ప్రశ్నించారు. జంతు వధశాలలో స్వాధీనం చేసుకున్న గోవులను తీసుకువచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలపాలని బీజేపీ, వీహెచ్పీ, భజరంగదళ్ నాయకులు నిర్ణయించగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని పుంగనూరురోడ్డులోని నాగదేవత గోశాల ట్రస్ట్కు పశువులను తరలించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు సమీపంలో పశువధ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించగా కట్టివేసిన 10 పశువులను గుర్తించామన్నారు. పాత కోళ్లఫారం జాకీర్హుస్సేన్కి చెందినదిగా గుర్తించి, సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట గోహంతకులను అరెస్ట్ చేయాలని ధర్నాకు పూనుకోవడంతో పోలీసులు బండి ఆనంద్, వి.నారదరెడ్డి, భగవాన్, మోహన్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఆవులు, కోడెదూడలు గోశాలకు తరలింపు -
మాన్యువల్ విధానంలోనే బదిలీలు జరపాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్ విధానంలోనే జరపాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశాయి. అలా కాని పక్షంలో ఎంతదూరమైనా పోవడానికి సిద్ధమని ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేశాయి. జిల్లాలో ఎస్జీటీలకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యానువల్ ముద్దు అనే నినాదంతో ఆదివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు.మాన్యువల్ కౌన్సెలింగ్ జరపాలనే ఏకై క నినాదంతో జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార విషయమై గతంలో సంఘాలు ధర్నాకు పిలుపును ఇచ్చినప్పుడు కమిషనర్ మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు మాట తప్పి ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని ప్రకటించడం సబబుగా లేదన్నారు. గతంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మోపురు శివారెడ్డి, ఇలియాస్బాష, నర్రెడ్డి సంగమేశ్వర్రెడ్డి, సురేష్ బాబు,గుజ్జల తిరుపాల్,బండి విశ్వనాథరెడ్డి,లక్ష్మి రాజా, పాలేం మహేష్, శ్యాంసుందర్ రెడ్డి, ఖాదర్ బాషా, చెన్నయ్య, కొండారెడ్డి, బత్తిని నాగేశ్వరరావు, రామాంజనేయులు, ప్రవీణ్ కిరణ్, శివశంకర్ రెడ్డి,సజ్జల రమణారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఏబీ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ● ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నేడు డీఈఓ కార్యాలయ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని డీఈఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈఓ కార్యాలయం ముట్టడి -
బాబు మార్కు రాజకీయానికి.. ఆ ముగ్గురు బలి!
రాజంపేట : గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం ఓటమిపాలై, పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని..ఇన్చార్జి పదవి విషయంలో అధిష్టానం వెనకడుగు వేసిన తరుణంలో ఆయన ఆ పార్టీకి గుడ్బై చెప్పడంతో.. చంద్రబాబు రాజకీయంలో మరో నేత బలయ్యారనే వాదన ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. దివంగత మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు బాటలో సుగవాసి కూడా చేరిపోయారనేది ఇప్పుడు కూటమి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలానుగుణంగా రాజకీయాలు చేస్తారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. వాడుకోవడం పక్కన పెట్టడం, విభజించి పాలించడం లాంటి విధానాలతో రాజంపేట టీడీపీ వర్గ విభేదాలకు నిలయంగా మారిపోయిందని రాజకీయ పరిశీలకుల భావన. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న నేతలను తన కష్ట కాలంలో బాగానే ఉపయోగించుకున్నప్పటికి, అందలమెక్కిన తర్వాత వారిని డస్ట్బిన్లో వేసే విధానం పార్టీ ఆవిర్భావం నుంచి రాజంపేట టీడీపీలో కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. అయ్యో.. పసుపులేటి బ్రహ్మయ్య.. రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వెలుగు వెలిగిన నేత బలిజ సామాజికవర్గానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తోపాటు చంద్రబాబునాయుడు పాలనలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అపార అనుభవం కలిగిన నేత. 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో ఓటమిపాలవుతారని తెలిసి కూడా, పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకురాకపోతే పసుపులేటి బ్రహ్మయ్య పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అన్ని విధాలుగా నష్టపోయారు. మానసికంగా ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతి చెందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మయ్య గురించే పట్టించుకోలేదన్న అంశం బహిరంగ అంశం. ఆయన వర్గీయులు చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు. ఆయన తనయులకు రాజకీయంగా చంద్రబాబు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన ఉంది. రాజకీయ ప్రయోగంలో బత్యాల బలి.. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో బలిజ సామాజిక వర్గాల్లో పట్టుకల్గిన నేత బత్యాల చెంగల్రాయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో బత్యాల చెంగల్రాయుడుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ పదవి తప్ప మరో పదవి రాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసే నాథుడు కరువైన దుస్థితిలో రైల్వేకోడూరు నుంచి బత్యాలను తీసుకొచ్చి రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేయించారు. వైఎస్సార్సీపీ చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బత్యాల రాజంపేట రాజకీయాలకు దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వేకోడూరుకే బత్యాలను పరిమితం చేశారు. అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం.. టీడీపీకి పనిచేసిన సీనియర్లకు, కార్యకర్తలకు అధిష్టానం వైఖరిపై నమ్మకం సన్నగిల్లుతోంది. తమను వాడుకోవడమే కానీ, తమకు చేసేదేమీలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాల సుబ్రమణ్యంలు రాజకీయ వ్యవహారంలో సమిధలుగా మారిన తీరుతెన్నులను తమ్ముళ్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. రాజంపేటలో టీడీపీకి బలిజ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తోంది. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని బలిజలు దిగమింగుకోలేకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ పార్టీ రాదన్న ఆందోళన, టీడీపీకి వస్తున్న ప్రజావ్యతిరేకతను చూసి తమ్ముళ్లు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్చార్జి ఫైనల్పై అధిష్టానం కసరత్తు.. టీడీపీ ఎన్నికల అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గుడ్బై చెప్పడంతో రాజంపేట టీడీపీ వర్గాలు కుదేలయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదికే టీడీపీకి షాక్ తగిలే సరికి అధిష్టానం ఉలిక్కి పడిందని కొందరు నేతలు అంటున్నారు. ఇన్చార్జి విషయంలో తేల్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చేసింది. ఇప్పటికే ఇన్చార్జి రేసులో చమర్తి జగన్మోహనరాజు, మేడా విజయశేఖర్రెడ్డి ఉన్నారు. తాజాగా బత్యాలకే ఇన్చార్జి ఇవ్వాలని, చమర్తి రాజకీయాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. ఎవరంతట వారు తమ నేతకే ఇన్చార్జి అని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇన్చార్జి కుర్చీ రెడ్డి సామాజికవర్గానికి అప్పగించాలని టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. యూజ్ అండ్ త్రో పాలిట్రిక్స్ రాజంపేటలో ఇన్చార్జి రగడ క్యాడర్లో అధిష్టానంపై సన్నగిల్లుతున్న నమ్మకం -
నేడు ‘డయల్ యువర్ కలెక్టర్’
కడప సెవెన్రోడ్స్: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు నేడు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లావ్యాప్తంగా స్వచ్ఛభారత్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా గ్రామ పంచాయతీల వారీగా పెండింగ్లో ఉన్న జీతాలు తక్షణమే ఇవ్వాలంటూ స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనుంది.దీనిని జయప్రదం చేయాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం రూ. 10,000 అమలు చేయాలన్నారు. కార్మికులకు పని చేసేందుకు అవసరమైన పనిముట్లు, రక్షణ దుస్తులు అందించాలన్నారు. కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోండి కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమ వారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. ‘ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా సమర్పించుకోవచ్చునన్నారు. 1340 మెట్రిక్ టన్నుల యూరియా రాక కడప అగ్రికల్చర్: ఉమ్మడి కడపజిల్లాకు 1340 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు తెలిపారు. ఇందులో కడప జిల్లాకు 950 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 550 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు, 400 మెట్రిక్ టన్నులు మార్కె ఫెడ్కు కేటాయించి నట్లు తెలిపారు. అలాగు అన్నమయ్యజిల్లాకు 390 మెట్రిక్ టన్నులు రాగా ఇందులో 120 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు, 270 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించినట్లు ఆయన తెలిపారు. -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చాపాడు : మండలంలోని బద్రిపల్లె గ్రామానికి చెందిన ఏనుగు సావిత్రి (40) ఆదివారం కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న సావిత్రి ఈ నెల 3న పురుగుల మందు తాగింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త లక్ష్మీరెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జర్మనీలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివిన పూర్వ విద్యార్థి భోగం హరీష్కుమార్ వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈనెల 11వ తేదీన జర్మనీలో నీ కెమ్నిట్జ్లో వరల్డ్ ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. భోగం హరీష్కుమార్ 83 కిలోల ఓపెన్ విభాగంలో పాల్గొననున్నారు. ఇతనికి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పవర్ లిఫ్టింగ్ కోచ్ బాల గోవిందు తివారి అభినందనలు తెలిపారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి కమలాపురం : మండల పరిధిలోని కొండాయపల్లెకు చెందిన ఉపాధి కూలీ చిట్టిబోయిన ఓబులేసు (62) వడదెబ్బతో మృతి చెందినట్లు ఏపీఓ పార్థ సారధి తెలిపారు. శనివారం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఓబులేసు కళ్లు తిరుగుతున్నా యని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, వివాహిత కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం మృతుని నివాసానికి చేరుకుని మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు సాయినాథ శర్మ తనయుడు మణికంఠ శర్మ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తి ఆత్మహత్య రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణానికి చెందిన కుతుబుద్దీన్ (40) అనే వ్యక్తి విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి పట్టణం రవిహాల్ వెనుక భాగంలో నివాసం ఉండే కుతుబుద్దీన్ రోజు వారి కూలికి వెళతాడు. వచ్చిన కూలి డబ్బులతో పూటుగా మద్యం తాగేసి కుటుంబాన్ని పట్టించుకొనేవాడు కాదు. దీంతో చేసేది లేక అతని భార్య తన నలుగురు పిల్లలతో కలసి వేరుగా కాపురం ఉంటోంది. దీంతో మనస్థాపానికి గురై శనివారం రాత్రి మద్యంతో పాటు విషద్రావణం తాగి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఫీల్ట్ అసిస్టెంట్లకు తీవ్ర గాయాలు
అట్లూరు : కడప–బద్వేలు ప్రధాన రహదారిపై లింగాలకుంట మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు పోరుమామిళ్ల మండలం రౌతుపల్లె ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బత్తిన రమణయ్య, పోరుమామిళ్ల మండలం గానుగపెంటకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ రామమోహన్ ఇరువురు అట్లూరు మండలం కామసముద్రంలో జరిగే అంకాలమ్మ తిరునాలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా బద్వేలు వైపు నుండి కడపకు వెళ్తున్న కారు, ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. దీంతో ఇరువురు ఫీల్డ్ అసిస్టెంట్లు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
తంబళ్లపల్లె : తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 48 ఎర్రచందనం దుంగలు, ఒక మోటార్ సైకిల్ను స్వాఽధీనం చేసుకున్నారు. టాస్కుఫోర్సు పోలీసుల కథనం మేరకు వివరాలు.. టాస్కుఫోర్సు డీఎస్పీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవులు, ఆర్ఎస్ఐ మురళీధర్రెడ్డి బృందంగా శనివారం అటవీశాఖ అధికారులు జయప్రసాదరావు, మోహన్రెడ్డి, సబీన్తాజ్ల సహకారంతో వేపూరికోట ఫారెస్టుబీట్ పరిధిలో డంపింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం తంబళ్లపల్లె మండలం అన్నగారిపల్లె సమపంలోని వంకగట్టు వద్ద అనుమానాస్పదంగా పారిపోతున్న వారిని వెంబండించారు. ములకలచెరువు మండలం సోంపల్లి ఆర్.సుధాకర్(43), రాజుగారిపల్లెకు చెందిన ఈ.లక్ష్మిపతినాయుడు (27), పెద్దమండ్యం మండలం కురవపల్లెకు చెందిన మల్లికార్జున(39) గుర్రంకొండ మండలం మఽధ్యాహ్నంవారిపల్లెకు చెందిన సురేందరరెడ్డి (39) నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాలు తనిఖీ చేయగా 48 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని దీంతో పాటు ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ఫోర్సు పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏరువమ్మ గుడిలో చోరీవీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి పంచాయతీ రాచపల్లి సమీపంలో ఉన్న ఏరువమ్మ దేవత గుడిలో శనివారం రాత్రి చోరీ చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి పూజలు చేసేందుకు వెళ్లగా ఆలయం తాళాలు పగులకొట్టి గుడిలో ఉన్న బీరువాను సైతం పగులగొట్టారు. 48 దుంగలు, మోటారు సైకిల్ స్వాధీనం -
చోరీ కేసుల్లో దొంగ అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను చిన్న చౌక్ పోలీసులు ఆదివారం కడప ఎయిర్పోర్ట్ వద్ద అరెస్టు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కడప మోచంపేటలోని చిలకల బావికి చెందిన షేక్ అక్బర్ ఆలీ ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నాడు. కడప నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై దాదాపు 20 కేసులకు పైగానే ఉన్నట్లు తెలిపారు. దొంగతనం కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో గోవా, ఢిల్లీ ప్రాంతాల్లో వెళ్లి తలదాచుకుంటూ తిరిగి మళ్లీ కడపకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఎన్జీవో కాలనీ, మత్యుంజయకుంట, అక్కాయపల్లెలో చోరీలకు పాల్పడి దొరికిన బంగారు నగ లు తీసుకొని పారిపోతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి సిబ్బందితో నిందితుడు అక్బర్ ఆలీని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 40.160 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.40 గ్రాముల బంగారు నగలు స్వాధీనం -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : క్రమశిక్షణతో ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో టెన్త్, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలీయ విద్యార్థులకు నగదు, ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రమణ్యం మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. ఏ పనినైనా ఇష్టపడి చేయాలని సూచించారు. తమ బిడ్డలు ఉన్నత స్థానాల్లో నిలబడితే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవన్నారు. పద్మశాలీయ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అవ్వారు వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు అవ్వారు సుబ్బరాయుడు మాట్లాడుతూ పద్మశాలీయ విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశంతో గత 19 సంవత్సరాలుగా నగదు ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎంసీ వెంకటసుబ్బయ్య, రాటాల గోపి, బీవీ సుబ్బారాయుడు, పుత్తా శివరామయ్య, బోడగల వెంకటరామయ్య, గొట్టుముక్కల వెంకటరమణయ్య, సోమా శంకర్, అవ్వారు వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం -
11న రాజంపేటలో ఢిల్లీరైలుకు హాల్టింగ్
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ఈనెల 11న ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డిని ఆహ్వానించారు. ఆదివారం ఆకేపాటికి ఆహ్వానపత్రికను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాఽథరెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరామిరెడ్డి గోపాల్రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, పీ.చంద్రశేఖర్రెడ్డి, శ్రీకాంత్. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, డిప్యూటీ చైర్మన్ జకియాఖాన్, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ రైలు స్టాపేజి కార్యక్రమానికి హాజరవుతరన్నారు. ఆకేపాటిని కలిసిన వారిలో గుంతకల్ రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి, కడప కమర్షియల్ సూపర్వైజరు జనార్ధన్ తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిపై మున్సిపాలిటీ పరిధిలోని గోపిరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య (60) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మీదుగా నెల్లూరు వైపు వెళుతున్న లారీ గోపిరెడ్డిపల్లె సమీపంలో నెల్లూరు నుంచి ఇంటి సామానుతో వస్తున్న గూడ్స్ ఆటోను, అలాగే జీవీ సత్రం నుంచి మైదుకూరు వైపు వస్తున్న ప్రయాణికుల ఆటోను ఒకే సారి ఢీ కొంది. సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉప్పుగుంటపల్లెకు చెందిన వెంపర్ల చిన్న వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ నారాయణ, గూడ్స్ ఆటోలోని డ్రైవర్ మహమ్మద్ బాషా, షేక్షావలి, సింధూర మేషా అనే వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని అర్బన్ సీఐ కేవీ రమణారెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు
కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో జూన్ 1వ తేదీన సయ్యద్ చాంద్ బాషా అనే యువకుడిని తాళ్లతో కట్టేసి క్రూరంగా హత్య చేసిన కేసులో మృతుడి మామతో పాటు భార్య , అత్త, బావమరిదిని అరెస్టు చేశారు. మరొక బావమరిదిని జువైనల్ హోంకు పంపినట్లు చిన్న చౌక్ సీఐ జి.ఓబులేసు తెలిపారు. కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో సీఐ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. చాంద్ బాషా అలియాస్ చాను హత్య అనంతరం పారిపోయిన నిందితులపై నిఘా ఉంచారు. ఆదివారం సాయంత్రం వాటర్ గండి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో మృతుడి మామ షేక్ మహబూబ్ బాషా , భార్య ఆయేషా, అత్త షేక్ ప్యారి, బావమరిది షేక్ మొహమ్మద్ రఫీ ఉన్నారు. ఈ కేసులో మరొక బావమరిది బాలుడు కావడంతో అతనిని జువైనల్ హోమ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు సంతానమని తెలిపారు. 2016 ఆగస్టు 25న ఆయేషాతో వివాహం కాగా ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. దీంతో ఆయేషా గతంలో మృతుడిపై ఫిర్యాదు చేయడంతో గృహ హింస కేసు కూడా నమోదు చేశారు. రామకృష్ణ నగర్లో ఆయేషా పేరు మీద ఉన్న రేకుల షెడ్డును మృతుడు ఇతరులకు అమ్మడంతో మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ కారణంగా ఆయేషా కుటుంబ సభ్యులు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అశోక్ నగర్లో రసూల్ అనే వ్యక్తి ఇంటిలో శుభ కార్య ఉండగా అక్కడికి వస్తాడని తెలుసుకొని పథకం రచించారు. ఆ ప్రకారం వేచి చూసి రసూల్ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకు రాగానే అక్కడే వేచి ఉన్న నిందితులు చాన్బాషాను మెడ పట్టుకుని బలవంతంగా ఇంటిలోనికి తీసుకెళ్లి, రెండు చేతులు కాళ్లు కట్టేశారన్నారు. ఆ తర్వాత ఇంటిలోకి ఎవరిని రానీకుండా అడ్డుకొని బలమైన మచ్చు కత్తితో చాంద్బాషాను అతి ఘోరంగా మెడ మీద ఐదు చోట్ల బలంగా నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య కేసులోనిందితులను అరెస్టు చేసిన చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఖాదర్బాషా ,నాగరాజు, మాధవరెడ్డి, మహిళా కానిస్టేబుల్ శ్రీదేవి, మహిళా హోంగార్డు జి.ప్రభావతిలను కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించినట్లు సీఐ తెలిపారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. జువైనల్ హోంకు ఒకరి తరలింపు కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు వెల్లడి -
భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ’యోగా’
కడప అర్బన్: యోగా భవిష్యత్తు తరాలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఓ అద్భుతమైన మార్గదర్శి, ’దిక్సూచి’ లా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏ.ఆర్, సివిల్, ఇతర విభాగాలు, ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ’యోగాంధ్ర – 2025’ కార్యక్రమానికి జిల్లా ఎస్.పి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే పోలీస్ సిబ్బంది అనారోగ్య సమస్యలు రాకుండా యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం తో జీవించవచ్చని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మానసిక దృఢత్వానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుష్ విభాగం నుండి హాజరైన యోగా శిక్షకులు ప్రసాద్, జ్యోతి లకు జిల్లా ఎస్.పి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డీఎస్పీ.భావన, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పులివెందుల డీఎస్పీ బి.మురళినాయక్, ఆయుష్ డి స్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ డాక్టర్ మురళి పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలో మాదక ద్రవ్యాల నిరోధానికి తమ వంతు క్రియాశీల పాత్ర పోషిస్తామని పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఆదివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని యోగాంధ్ర వేదికపై ఈగల్ (ఎలైట్ యాంటి–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్ మెంట్ ) ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవుతామంటూ’ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ -
వైఎస్సార్సీపీ నేతపై దాడి
పుల్లంపేట : పుల్లంపేట మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీసీపీ నాయకుడు, అనంతంపల్లి సహకార బ్యాంక్ మాజీ సింగిల్ విండో ప్రెసిడెంటు సుదర్శన్రెడ్డిపై శనివారం రాత్రి పుల్లంపేట పోలీస్స్టేషన్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుల్లంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, కుమార్రెడ్డి, పుల్లంపేట సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి నాయకులు దాడి చేయడం పరిపాటిగా మారింది. ప్రశాంతంగా ఉన్న పుల్లంపేట మండలంలో కూటమి నాయకులు దాడి చేయడంతో సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పుల్లంపేట ఎస్ఐ తెలిపారు. -
ఉత్సాహంగా ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా సాగింది. శనివారం జరిగిన మ్యాచ్లో చిత్తూరు, అనంతపురం జట్లు విజయం సాధించాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 44.4 ఓవర్లలో 208 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని సాయి సూర్య తేజ 80, యజ్ఞేశ్వర్ 51 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రెడ్డి ప్రకాష్ అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. తేజ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 23.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ 86 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తేజ రెడ్డి 62 పరుగులు చేశాడు. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో.. వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన వేరొక మ్యాచ్లో కడప జట్టుపై 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 35.2 ఓవర్లలో 151 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని ఎస్ఎండీ అయూబ్ 52, వాసు దేవరాజు 36 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 4, కామిల్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 152 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 22.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 78 పరుగులు చేశాడు. కడప జట్టులోని ఆదిల్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు. -
నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నాం. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. – జె. ఉమామహేష్, మరియాపురం, కడప ఉచిత బస్సు ప్రయాణం హుళక్కేనా? 18–49 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా దాని గురించి పట్టించుకోవడం లేదు. అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ఏ పథకం ఎప్పుడు ఇచ్చేది తేది ప్రకటించి మరీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పారు. అదీ చేయలేదు. – పత్తి రాజేశ్వరి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, కడప ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెలా ఆడ బిడ్డ నిధి పేరుతో రూ.1500 లు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన ఏడాది అయినా దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి నెలా రూ.1500 ఇస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో ఏడాది క్రమం తప్పకుండా రూ.45 వేలు వచ్చేది. ఇప్పుడేమో రూ.1500 లేదు, అప్పుడిచ్చే రూ.18 వేలు లేకుండా పోయింది. –కానాల విజయ, గృహిణి, ఎకోపల్లె గ్రామం, దువ్వూరు మండలం -
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వడం వల్లే మరణాలు
జమ్మలమడుగు : అధికారుల నిర్లక్ష్యంతో పెన్నానదిలో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. దీంతో పెన్నాలో ఎక్కడ ఎంత లోతు ఉందో తెలియక నీటిలోనికి దిగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. పెన్నా నదిలో ఈతకు దిగి మృతి చెందిన వారి కుటుంబీకులను శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ పెన్నానదిలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిగాయన్నారు. ఇరవై అడుగుల లోతు వరకు కూడా ఇసుకను తవ్వేశారన్నారు. ప్రస్తుతం పెన్నానదిలో నీరు వచ్చి చేరిందని, ఎక్కడ ఎంత లోతు ఉందో ఎవరికి తెలియని పరిస్థితి ఉందన్నారు. పెన్నానది బ్రిడ్జి సమీపంలోనే గతంలో చాలా మంది మరణించారని గుర్తు చేశారు. మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడ ప్రమాదానికి సంబంధించిన సూచిక బోర్డులు కూడా పెట్టకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పెన్నానది ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంత లోతు గుంతలు ఉన్నాయో గుర్తించి అక్కడ ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సంఘటనను జిల్లా కలెక్టర్ శ్రీధర్కు ఫోన్ చేసి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వివరించారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే
కడప ఎడ్యుకేషన్ : ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఐక్య వేదిక నాయకులు సంగమేశ్వరరెడ్డి, శివారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దలు మాటిచ్చారు.. మాట నిలుపుకోండంటూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదట ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం చెప్పిందన్నారు. మరి ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ అంటున్నారు ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ ఈనెల 8 వ తేదీన కడప డీఈఓ కార్యాలయ ముట్టడి చేయనున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్–257, ఏపీటీఎఫ్ 1938, ఆపస్, వైఎస్సార్టీఎఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీ, ఎస్టీ సంఘం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.కదం తొక్కిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక -
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా రెడ్డి ప్రసాద్
వల్లూరు (చెన్నూరు) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా తనను ఎంపిక చేసినట్లు చెన్నూరుకు చెందిన రెడ్డి ప్రసాద్ తెలిపారు ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రూ. కోట్ల విలువైన స్థలం ఆక్రమణ అట్లూరు : అధికార పార్టీ నేతల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయం పక్కనే గుంతపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబరు 948లో 10.38 ఎకరాలు(పది ఎకరాల 38 సెంట్లు విస్తీర్ణం) ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి సెంటు సుమారు రూ.10 లక్షల వరకూ విలువ చేస్తుంది. అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేత అనుచరుడికి ఆ భూమిపై కన్ను పడింది. ఇంకేముంది అదును కోసం ఎదురు చూశాడు. శనివారం బక్రీద్ పండుగ సెలవు అలాగే ఆదివారం కూడా సెలవు దినం కావడం ఆయనకు కలిసి వచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి స్థలంలో సుమారు 50 సెంట్ల మేర అంటే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే మేర స్థలంలో యంత్రాలతో చదును చేయించుకున్నాడు. ఎవరూ అడ్డు లేకపోవడంతో శనివారం ఆ స్థలంలో నిర్మాణం కోసం సామగ్రిని తరలించాడు. ఇంత విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలకు ఏర్పాట్లు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. హెచ్చరిక బోర్డును లెక్క చేయని వైనం.. గుంతపల్లి రెవెన్యూ పొలంలోని సర్వే నెంబరు 948లో 10.38 ఎకరాలు విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్టు తమకు కాదనుకున్నారేమో బోర్డును సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలు ఆక్రమించడం గమనార్హం. చర్యలు తీసుకుంటాం.. సర్వే నంబరు 948లో విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి అనుచరుడు కబ్జాకు పాల్పడిన విషయమై బద్వేలు తహసీల్దార్ ఉదయ్భాస్కర్రాజును వివరణ కోరగా నెల రోజులుగా తాను అందుబాటులో లేనని, నిన్ననే విధుల్లో చేరానని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్బాకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగర శివార్లలోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, రోడ్డు ప్రమాదాల మూలంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు భద్రత కమిటీలోని ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసి ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో మాట్లాడి మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
● పథకాల పేర్లు మార్చి.. ఆచరణలో మరిచి..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేదు. చెప్పిన మాట చెప్పినట్లుగా అమలు చేయడమే లక్ష్యంగా గడిచిన ఐదేళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు పని చేసింది. కొనసాగించింది. కేలండర్ విడుదల చేసి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామన్న విషయాన్ని తేదీలతో సహా బహిర్గతం చేసి.. సరిగ్గా ఆ తేదికి అమలు చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతమైంది. జిల్లాలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 9,82,554 మందికి రూ.8,857.42 కోట్లు వేశారు. సామాన్య కుటుంబాలకు కామధేనువులా వైఎస్ జగన్ సర్కార్ కాపాడింది. ఎన్నికల్లో అంతకంటే ఎక్కువగా అందిస్తామని సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశ పెట్టిన టీడీపీ ప్రజల్ని మభ్యపెట్టింది. చంద్రబాబు సర్కార్ కూడా ఆ పథకాలు ద్వారా చెల్లింపులు చేస్తారని భావించి మోసపోయారని విశ్లేషకులు వివరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఊదరగొట్టారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్కు గ్యా రెంటీ’ అన్నారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నమ్మించారు. అధికారం కోసం ముఖానికి అబద్ధాల హామీల ముసుగు వేసుకున్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలు మరోమారు సీఎం చంద్రబాబు చేతిలో దగాకు గురయ్యారు. ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు కాలేదు. నాటి మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. తల్లికి వందనమంటూ చెప్పి.. శఠగోపం పెట్టారు. నిరుద్యోగ భృతి అందని ద్రాక్ష పుల్లనలా ఉండిపోయింది. కర్షకుల కన్నీరు తుడుస్తానంటూ పెట్టుబడి సాయం మాటే మర్చిపోయారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు రూ. 1500 ఇస్తామన్న మాట ఊసేలేదు. వెరసి నమ్మి మోసపోయామంటూ మహిళాలోకం ఆక్రోశం చెందుతోంది. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలంటూ.. ‘ప్రతి ఇంటికి ఉద్యోగం.. లేదంటే, నిరుద్యోగ భృతి రూ.3 వేలు తప్పకుండా ఇస్తాం ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ అని ఎన్నికల హామీల్లో ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఏడాదైంది, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి ఇప్పటికీ ప్రభుత్వం రూ.36 వేలు బకాయి ఉన్నట్లే. దారిద్య్రరేఖకు దిగువనున్న వారు జిల్లా వ్యాప్తంగా 5,82,633 కుటుంబాలు ఉన్నాయి. బీపీఎల్ కుటుంబాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువకులంతా నిరుద్యోగ భృతికి అర్హులే. అలాగే అమ్మఒడి పథ కం ద్వారా నాలుగేళ్లలో వైఎస్ జగన్ సర్కారు రూ. 1,337.4 కోట్లు చెల్లించారు. కాగా, ఆ స్థానంలో తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ వర్తింపజేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీగా ప్రకటించారు. ఏడాదిగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు శఠగోపం పెట్టారు. ఊరిస్తున్న ఉచిత బస్సు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళాలోకం ఇకపై ఎక్కడికెళ్లినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చును’ అని హామీ ఇచ్చారు. ఇదిగో అదిగో సంక్రాంతి, ఉగాదికి అమలు చేస్తామని ఊరిస్తూ వచ్చారు. జిల్లాలో ప్రజారవాణాలో ఉన్న 590 బస్సుల ద్వారా ప్రతి రోజు 1.29 లక్షల మంది సరాసరిగా ప్రయాణం చేస్తున్నారు. వారిలో 30 శాతం మంది మహిళలు ప్రతి రోజు ప్రయాణిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే 38,700 మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఏడాదైనా వారికి ఉచిత బస్సు ప్రయాణం అవకాశం దక్కలేదు. మరోవైపు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం రూ.5 వేల స్థానంలో రూ.10 వేలు చేస్తామని ప్రకటించారు. ఆపై ఉన్న ఉపాధి కూడా లేకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా 10,890 మంది సచివాలయ వ్యవస్థ పరిధిలో ఉన్న వలంటీర్లు నిరుద్యోగులయ్యారు. అలాగే మరో 366 మంది రేషన్బండ్ల ఆపరేటర్లు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ బిల్లులు బాదుడే.. బాదుడు అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచబోమని, తగ్గిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాగా, అసలు కంటే కొసరు అధికంగా ఉండేలా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ వాడకం కంటే డబుల్ బిల్లు వినియోగదారులకు వస్తోంది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జెస్ట్మెంట్(ఎఫ్పీపీసీఏ) కింద జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం కోట్లలో భారం మోపింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో ప్రతి నెలా వడ్డనకు ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కాలంలో సర్దుబాటు చార్జీలకు తోడుగా అక్టో బర్ నెల నుంచి ఏ నెలకు ఆనెల సర్దుబాటు పేరుతో యూనిట్కు 91 పైసల చొప్పున భారం వేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సుమారు రూ.15 కోట్లను వసూలు చేయనున్నట్లు విద్యుత్ అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ఊరువాడ చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. అసలు కంటే కొసరు రూపంలో ముక్కుపిండి రాబట్టుతున్నారు. సామాన్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు మళ్లీ మోసం నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 2014–19లో కూడా ఇలాగే చెప్పి ఎన్నికల ముందు రెండు నెలలు ఇచ్చారు. –భూమిరెడ్డి భాస్కర్, బీఎస్సీ, బీఈడీ, నిరుద్యోగి, లింగాలదిన్నెపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం అన్నదాత సుఖీభవ కోసం ఎదురుచూపులు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ద్వారా మూడు విడతల్లో పంట సాగు సమయానికి డబ్బులు అందేవి. –సీవీ సుబ్బారెడ్డి, రైతు, పడమర అనంతపురం, చాపాడు మండలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుంటే.. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు ఎన్నికల హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు రైతు భరోసా పేరిట ఐదేళ్లలో రూ.1,191.03 కోట్లు నేరుగా అందించారు. కర్షకులకు అండగా నిలవాలన్న ఆలోచన చంద్రబాబు సర్కారు చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 2,10,481 మంది రైతులు సుఖీభవ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా రూ.420.96 కోట్లు రైతులకు అందించాల్సి ఉంది. పీఎం కిసాన్ సాయం నిధుల ద్వారా ఇప్పటికీ కేవలం రూ.2 వేల చొప్పున మాత్రమే రైతులకు నేరుగా లభించింది. అంటే కేవలం రూ.42.09 కోట్లు మాత్రమే వర్తించింది. దాదాపు రూ.380 కోట్లు ఇంకా లభించాల్సి ఉంది. ఆ దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేయడం లేదని కర్షకులు మండిపడుతున్నారు. పథకాల పేర్లు ఘనంగా పెట్టారు, కానీ అమలులో చిత్తశుద్ధి లేదని పలువురు వాపోతున్నారు. ఆడబిడ్డ నిధి పథకం కూడా అదే పరిస్థితి. 18 ఏళ్లు నిండిన యువతి నుంచి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి చెల్లిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఊరువాడ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదు. ప్రతి మహిళకు రూ.18 వేలు బకాయి ఉన్నట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని మునుపటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు భావిస్తే, చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా పాలిస్తూ ఏకంగా మహిళలోకాన్ని వంచిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కడపలో బక్రీద్ సందేశం ఇస్తున్న ముఫ్తీ న్యామతుల్లా సాహెబ్, భక్తులతో కలిసి నమాజ్ చేస్తున్న పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ వైఎస్ జగన్ సర్కార్లో.. న్యూస్రీల్ అటకెక్కిన 50 ఏళ్లకే పెన్షన్ వాగ్దానం అందని ద్రాక్షలా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి విద్యుత్ చార్జీలు పెంచమంటూనే బాదుడే బాదుడు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మోసం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.15 వందలు ఉత్తిదే రైతుకు పెట్టుబడి సాయం ఊసేలేదు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు అమలు కాని సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు ఏడాది పాలనపైమండిపడుతున్న ప్రజలు, విపక్షాలు -
పంట కాలువ పూడ్చి.. ఆపై ఆక్రమించి!
సాక్షి టాస్క్ఫోర్స్ : చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో టీడీపీ వర్గీయులు రైతుల పొలాలకు నీటిని అందించాల్సిన పంట కాలువను పూడ్చి తమ పొలంలో కలిపేసుకున్నారు. ఈ ఆక్రమణను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దాలమర్రి గ్రామంలోని ఆయకట్టు భూములకు పాపాఘ్ని నది నుంచి పెద్ద కాలువ ద్వారా నీరు వస్తుండేది. ఈ కాలువ కుమార్లకాల్వ వద్ద నుంచి ఉండేది. అయితే అద్దాలమర్రికి చెందిన టీడీపీ వర్గీయులు కొందరు కాలువను పూడ్చి తమ పొలంలో కలుపుకుంటే విస్తీర్ణం పెరుగుతుంది.. పైగా తమ ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఎవరు అడ్డు వచ్చినా తమకేమీ భయం లేదని భావించి ఏకంగా జేసీబీని రప్పించుకొని కాలువను పూడ్చేశారు. కొందరు రైతులు వెళ్లి ఇదేమి న్యాయం.. పూర్వ కాలం నుంచి గ్రామంలోని రైతులందరికీ సాగునీరు అందించే కాలువ ఎలా పూడుస్తారని నిలదీశారు. దీంతో తమకు రెవెన్యూ అధికారులు చెప్పడంతోనే పూడ్చేశాం. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోయారు. ఈ విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని అయినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు.చక్రాయపేట మండలంలో టీడీపీ వర్గీయుల ఆక్రమణ పర్వం -
టీడీపీని వీడిన సుగవాసి
సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గ నేతలను వ్యూహాత్మకంగా దూరం పెడుతోందా.. ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా చేస్తోందా అంటే ఔను అనే విశ్లేషకులు జవాబిస్తున్నారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యంలకు కరివేపాకు సామెతను వర్తింపజేశారు. యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేశారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో బలిజ సామాజిక వర్గ నేతలను క్రమేపీ దూరం చేశారు. ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత లేకుండా చేశారు. వెరసి టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని దివంగత మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాల సుబ్రహ్మణ్యం తెంచుకు న్నారు. ఆయన శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ అంశం ఉమ్మడి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాడు చక్రం తిప్పి..జిల్లాలో బలిజ సామాజికవర్గాన్ని తెలుగుదేశం పార్టీ క్రమేపీ దూరం పెడుతోంది. ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలంతా కనుమరుగయ్యారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. ఎన్నికల్లో కోరి రామచంద్రయ్యను రప్పించుకున్నారు. ఎన్నికల తర్వాత విస్మరిస్తూ వచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య అప్పుడప్పుడు కన్పించడం ఆరంభించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మనస్తాపం చెందిన సుగవాసి కుటుంబం తెలుగుదేశం పార్టీ వైఖరిపై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మనస్తాపం చెందారు. సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి సహచరుడిగా మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు ఉన్నారు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లో రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా పని చేశారు. అలాంటి రాజకీయ చరిత్ర ఉన్న పాలకొండ్రాయుడు అనారోగ్యంతో మృతి చెందితే.. ఆయన కుటుంబ పరామర్శకు రాలేదు. జిల్లాలో మహానాడు చేపట్టినా ఆ కుటుంబం వరకూ పోయి వద్దామనే ఆలోచన లేకపోయింది. మరోవైపు రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేసి ఓడిపోతే, కనీసం ఇన్చార్జిగా కూడా కేటాయించలేదు. అటు అధిష్టానం వద్ద ఇటు స్థానికంగా మర్యాద లేకుండా పోయింది. పొమ్మనకుండా పొగబెట్టడంతో టీడీపీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెంచుకోవాల్సి వచ్చిందని పలువురు వివరిస్తున్నారు. ● బత్యాల కనుమరుగు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఇటీవల కాలంలో పూర్తిగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లలో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు బత్యాలకు ప్రాధాన్యత లభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చెంగల్రాయుడును రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ వ్యవహరిస్తూ వస్తోంది. మరోవైపు సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట నుంచి తప్పించే క్రమంలో.. బత్యాలకు ప్రాధాన్యత లభించిందా అంటే అదీ లేదు. కాగా, పరిశీలకుడిగా కడపకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన దుర్గా ప్రసాద్రావును నియమించారు. దుర్గా ప్రసాద్ మీద ప్రేమతో వేశారంటే తప్పులో కాలేసినట్లేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014లో కడప టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుర్గాప్రసాద్కు తర్వాత ఇన్చార్జి పదవి అప్పగించలేదు. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పదవి ఆర్.శ్రీనివాసులరెడ్డికి అప్పగించారు. బలిజ సామాజిక వర్గనేతల్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బలిజ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్కు అప్రాధాన్యత ఎన్నికల్లో ముందు పెట్టుకొని,ఆపై పక్కన పెట్టిన టీడీపీ నేతలు ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బాలసుబ్రహ్మణ్యం పాలకొండ్రాయుడు మృతి తర్వాత పరామర్శ లేకపోవడం రాజంపేట ఇన్చార్జి ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన వైనం -
విత్తన ఎంపికే కీలకం
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతో పాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపిక జరిగితేనే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకుని అటు వ్యవసాయ అధికారులతోపాటు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదలుకుని దిగుబడి వరకు పెట్టిన పెట్టుబడి ఖర్చుతో రైతుల కష్టం నేలపాలు అవుతుంది. దీంతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోతారు. పంటలు సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు కచ్చితంగా వ్యవసాయ, శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి ఉంది. ప్రారంభమైన ఖరీఫ్ సీజన్.. ఏడాది ముందస్తు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,28,084 హెక్టార్లలో వివిధ పంటలు సాగు కానున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీతో మంజూరు చేసింది. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన సిద్దవటం, చెన్నూరు. కమలాపురం, చాపాడు తదితర మండలాల పరిధిలో నీటి వసతి ఉన్న వారు వరినారు సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేసే రైతులు స్థానిక వ్యవసాయ అధికారులు సర్టిఫైడ్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు కచ్చితంగా బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిణామాలను మనం పలు చోట్ల చూస్తునే ఉన్నాం. ఈ నేపథ్యంలో వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు.. ● వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి. ● బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ● ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటిన విత్తనాలను ఎలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. ● కొనుగోలు చేసే విత్తనాల ప్యాకెట్ల నుంచి సంచిపైన సీల్ ఉందా, లేదా అని ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. ● రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. ● విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలక శాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ● మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. విత్తన కొనుగోలులో సరైన జాగ్రత్తలు పాటించాలి నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు పంట కాలం పూర్తయ్యే వరకు బిల్లులు భద్రం ఖరీఫ్లో 1,28,084 హెక్టార్లలో సాగుమొలక శాతం పరీక్షించాలి.. రైతులు ఎవరైనా బయట డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో లైసెన్సులు ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల మొలకశాతం చెక్ చేసుకోవాలి. మొలకశాతం తక్కువగా ఉన్న విత్తనాలను కొనుగోలు చేయవద్దు. మొలకశాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. – డాక్టర్ వీరన్న, ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, కడపబిల్లులు కచ్చితంగా తీసుకోవాలి.. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసే రైతులు కచ్చితంగా బిల్లులు అడిగి తీసుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు రైతులు బిల్లులను భద్రంగా దాచుకోవాలి. పంటలో పూత పిందె, దిగుబడిలో తేడా వస్తే స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ప్రాణం తీసిన ఈత సరదా
జమ్మలమడుగు : సరదాగా ఈత కొట్టేందుకు పెన్నా నదిలోని నీటిలోకి దిగిన తండ్రీ కొడుకులు దుర్మరణం చెందిన సంఘటన శనివారం జమ్మలమడుగు మండలంలో జరిగింది. వివరాలు ఇలా..తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుక చెందిన మనోహర్ (38), అతని కుమారుడు డియోల్ (17) పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సోదరి ప్రమీలా రాణి ఇంటికి వచ్చారు. శనివారం పర్యాటక కేంద్రమైన గండికోటను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ముద్దనూరు– జమ్మలమడుగు రహదారిలోని పెన్నానదిలో నీటిని చూసి ఈత కొట్టేందుకు దిగారు. బ్రిడ్జి సమీపంలో గుంత ఉన్న విషయం వారికి తెలియదు. తొలుత మనోహర్ నీళ్లలోకి దిగగానే అక్కడ పెద్ద గుంత ఉండటంతో అందులో పడిపోయాడు. గమనించిన కుమారుడు డియోల్ తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించి అతను కూడా అదే గుంతలో కూరుకుపోయి గల్లంతయ్యారు. తమ కళ్లెదుటే తండ్రీ కొడుకులు నీళ్లలో గల్లంతు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో తండ్రి, కుమారుడి మృతదేహాలను బయటికి తీశారు. ఇద్దరి మృతదేహాలను చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లింగప్ప తెలిపారు.పెన్నానదిలో దిగి తండ్రీ తనయుల దుర్మరణం -
లక్ష సౌర గృహాలే లక్ష్యం
కడప కార్పొరేషన్: జిల్లాలో లక్ష గృహాలకు సోలార్ రూఫ్ టాప్ అమర్చడమే లక్ష్యంగా పని చేయాలని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.రమణ అన్నారు. స్థానిక విద్యుత్ భవన్లోని తన చాంబర్లో బ్యాంకర్లు, అధికారులు, సంస్థాపన వెండర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు నిబంధనలు సులభతరం చేశామని, వీటిని ప్రజలకు తెలియజేసి అవగాహన పెంచాలన్నారు. సిబిల్ స్కోర్ను బట్టి బ్యాంకులు రుణాలు వేగ వంతం ఇస్తాయని తెలిపారు. ఒక్క కిలో వాట్ కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 120 యూనిట్ల విద్యుత్తు, రెండు కిలోవాట్ల కెపాసిటీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందన్నారు. వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పొంది సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకర్స్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.జనార్దన్, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ యల్లారెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు మధుసూదన్, హరిసేవ్య నాయక్, భరణి క్రిష్ణ, ప్రసాద్రెడ్డి, డీఈఈ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ప్రారంభమైన డీఎస్సీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఆన్లైన్ పరీక్ష శుక్రవారం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులంతా నిర్ణత సమయానికంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని అధికారులు కేంద్రం వెలుపలనే క్షుణంగా తనిఖీ చేశారు. ఒరిజినల్ హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించన తర్వాతే లోపలికి అనుమతించారు. మొదటి రోజు కడప, ప్రొద్దుటూరు కేంద్రాలలో ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 1781 మంది అభ్యర్థులకు గాను 1584 మంది హాజరు కాగా 197 మంది గైర్హాజరైనట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉదయం కడపలోని కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం, అన్నమాచార్య, స్విస్ట్లతోపాటు ప్రొద్దుటూరులోని సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 936 మంది అభ్యర్థులకు గాను 862 మంది హాజరు కాగా 74 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం కడపలో అన్నమాచార్య, కేఓఆర్ఎం, కేఎల్ఎంతోపాటు ప్రొద్దుటూరులో సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 845 మంది అభ్యర్థులకు గాను 722 మంది హాజరు కాగా 123 మంది గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలకు కేటాయించిన డిప్యూటీ కలెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ కడపలోని కేఎస్ఆర్ఎంతోపాటు స్విస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలను తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని డీఈఓ తెలిపారు. -
చీనీ చెట్ల నరికివేత
కొండాపురం : మండలంలోని యనమలచింతల గ్రామానికి చెందిన మండ్ల ప్రసాద్ చీనీ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు 41 చెట్లు శుక్రవారం నరికేశారని తాళ్ల ప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండ్ల ప్రసాద్ చీనీ తోటలో 130 చీనీ మొక్కలు ఉన్నాయని, వాటిలో 41 మొక్కలను గురువారం నరికినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించి రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.గంజాయి విక్రేతల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని దువ్వూరు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు.. గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ సీవీ.సురేంద్రరెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి శుక్రవారం దాడులు నిర్వహించారు. దాడిలో హుస్సేన్ బాషా, సంతోష్, కార్తీక్లను అరెస్టు చేసి వారి నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
అదును.. పదును
● జిల్లాలో కురుస్తున్న వర్షం ● లోతు దుక్కులతో భూసారం పెంపు ● చీడపీడలు, కలుపుమొక్కలకు చెక్ ● భూగర్భ జలాల నిల్వకు అవకాశం కడప అగ్రికల్చర్: ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల సాగులో రైతులకు కలుపు సమస్య దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుపు యాజమాన్య ప్రక్రియ వర్షం కురిసినప్పటి నుంచే చేపడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. వర్షం కురవగానే భూమిలోని కలుపునకు సంబంధించిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. తక్షణం లోతు దుక్కులను చేపడితే చాలా మటుకు కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. పంటల సాగు సమయానికి మీద మీద రెండు సార్లు దుక్కులు(సేద్యాలను) చేస్తే కలుపు మొక్కలు దాదాపు నివారించుకోవచ్చ. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,28,084 హెక్టార్లలో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ అధికారులు నిర్దేశించారు. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వాతావరణ మార్పుతోపాటు రుతుపవనాల ఆగమనంతో జిల్లాలో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఆరుతడి పంటలైన సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, ెపెసలు, మినుములు, పత్తి, వేరుశనగ, సన్ఫ్లవర్, సోయాబీన్ తదితర పంటలు సాగు చేయాల్సి ఉంది. మారిన వ్యవసాయ పద్ధతులతో వివిధ పంటల్లో కలుపు నివారించేందుకు రైతులు పలు రకాల మందులపై ఆధార పడుతున్నారు. విత్తనం వేశాక, పైరు పెరిగే దశలో మందుల వాడకంతో కలుపు నివారణ చేపడుతున్నారు. ఇలా కలుపు మందులను పిచికారి చేయడం ద్వారా భూమి సారవంతం కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కలుపు మందులపై ఆధార పడే ముందు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంటల నూర్పిడి తరువాత.. పంటల నూర్పిడి తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా అలాగే వదిలేస్తారు. దీంతో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. కావున ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో రైతులు పంటలు సాగు చేసుకునే సమయానికి లోతు దుక్కులను చేపడితే బోలెడు లాభాలు ఉన్నాయి. లోతు దక్కులు చేయడం వల్ల భూమి పైపొరలు కిందకి, కింద పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. అలాగే లోతు దుక్కలను చేపట్టడం వల్ల భూమిలో ఉండే పురుగులు, కలుపు మొక్కల నివారణ జరుగుతుంది. వేసవిలో చాలా మంది రైతులు పశువులు, ఆవులు, గొర్రెల పెంట, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం చేస్తారు. ప్రస్తుతం దున్నుతున్న దుక్కులతో అవన్నీ భూమిలో కలిసిపోయి భూమి సారవంతంగా మారుతుంది. దీంతోపాటు భూమి ఎక్కువకాలం తేమను కలిగి ఉంటుంది. రైతులు లోతు దక్కులు చేపట్టాలి ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం పదునుతో రైతులు తమ బీడు భూములను లోతుగా దక్కులు చేసుకోవాలి. దీంతో వ్యవసాయ భూమి సారవంతంగా మారుతుంది. లోతు దుక్కులతో భూమిలో ఉన్న చీడపీడలతోపాటు కలుపు నివారణతో నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. దీంతోపాటు భూమిలో తేమ శాతం పెరుగుతుంది. – అయితా నాగేశ్వరావు, జిల్లా వ్యవసాయ అధికారి పంటలు లేనప్పుడే.. వేసవిలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగు లు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలో.. నేల, చెత్తాచెదారం, కోయ కాడల్లో ఎక్కవకాలం గడపుతాయి. అలాగే తెగుళ్లను కలుగ చేసే శిలీంద్రా లు భూమిలోపల ఆశ్రయం పొందుతా యి. వీటి శీలింద్ర భీజాలు భూ మిలో నిల్వ ఉంటాయి. ప్రస్తుతం కురిసిన వర్షంతో లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ దశలో భూమిలోని చీడ పురుగు కోశా లు, గుడ్లు, లార్వాలు పక్షు లు, కొంగలు, కాకులు తిని నాశనం చేస్తాయి. దీంతోపాటు కులుపునకు సంబంధించిన విత్తనాలు కూడా చనిపోతాయి. -
● వలంటీర్ల సేవలు అమూల్యం
● హామీ ఇచ్చి.. విస్మరించి.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే వలంటీర్లలో విద్యార్హతలను బట్టి తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత పొందేలా చర్యలు తీసుకుంటామంటూ ఊరూరా తిరిగి హామీలు ఇచ్చారు. అయితే ‘ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న..’ అన్న చందంగా అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడారు. పైగా ప్రజల్లో జగన్ చేసిన మంచి పనులను లేకుండా చేయడం ద్వారా ఆయన ముద్ర చెరిపి వేసేందుకు సచివాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించే చర్యలకు సిద్ధం కావడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప సెవెన్రోడ్స్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టింది. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు చేసింది. పాలనను ప్రజల ఇంటి ముగింటకు చేర్చింది. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ఉంటే.. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్ర చిరస్థాయిగా ఉంటుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎలాగైనా ఆ ముద్ర చెరిపేయాలని కుట్ర పన్నుతోంది. ఇందుకోసం ఏకంగా ఆ వ్యవస్థల ఎత్తివేత దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. సచివాలయ వ్యవస్థను క్రమేణా కనుమరుగు చేయాలని చూస్తోంది. దీంతో చెంతకు చేరువైన పాలన మళ్లెక్కడ దూరమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విప్లవాత్మక మార్పు ఎన్టీ రామారావు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారు. అప్పట్లో అది ఓ విప్లవాత్మకమైన మార్పు. దాని కొనసాగింపుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి.. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పాలన తీసుకు రావడం ద్వారా ఇతర రాష్ట్రాలకు రోల్మోడల్గా నిలిచారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటి తలుపు తట్టాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవస్థ ప్రజలకు తప్పింది. ఏ చిన్న పనైనా వలంటీర్కు చెబితే ఇట్టే పరిష్కారమయ్యేది. మైఖేల్ క్రిమేర్, ఫ్రెంచ్–అమెరికన్ ఎకానమిస్ట్ ఈస్తర్ డఫ్లో వంటి నోబెల్ బహుమతి గ్రహీతలు సైతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాల తీరును పరిశీలించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, మహిళా సాధికారత తదితర అంశాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా సచివాలయాలను కనుమరుగు చేసే చర్యలకు పాల్పడుతోంది. బాపూజీ కల సాకారం దిశగా... మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాాజ్య సాకారం కోసం 2020 అక్టోబరు 2వ తేదీన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లాలో 423 గ్రామ సచివాయాలు, 226 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ శాఖలకు చెందిన 536 రకాల ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అత్యధిక సేవలు కేవలం 15 నిమిషాల నుంచి 72 గంటల్లోనే ప్రజలకు అందేవి. ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్ను నియమించారు. వీరికి ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్లు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, లా నేస్తం, చేదోడు, చేయూత, ఈబీసీ నేస్తం, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కు సంబంధించిన సాయం, వివాహ రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ అప్డేషన్, ఇసుక బుకింగ్ వంటి అనేక సేవలు ప్రజలకు అందజేయడంలో వలంటీర్లు ఎంతో కీలకంగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని తీసు కొచ్చినా.. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం మొదలు, వారితో దరఖాస్తు చేయించి లబ్ధి పొందేందుకు వలంటీర్లు ఎంతో సహకరించారు. వైఎస్సార్సీపీ హయాంలో గ్రామ స్వరాజ్యం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఏర్పాటు ఇంటి ముంగిటకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జగన్ ముద్ర చెరిపేసేందుకు కూటమి కుట్ర ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థకు మంగళం సచివాలయాల ఎత్తివేతకు పన్నాగం పేదల సంక్షేమంపై నీలినీడలు సచివాలయ, వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దనే అందడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తప్పిపోయింది. ఇందువల్ల తమ పనులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే అధికారులకు లంచాలు ఇచ్చే అవసరం తప్పింది. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఇంటింటి సర్వే నిర్వహించడంలో వలంటీర్ల కృషి మరువలేనిది. ముఖ్యంగా కరోనా విజృంభించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో కూడా.. వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వేతోపాటు పెన్షన్లు, ప్రభుత్వ ఆర్థికసాయం, మాస్క్లు, శానిటైజర్లు, మందులు వంటివి అందజేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు కరోనా అంటే వణికిపోయినా.. ఆ రోజుల్లో ఇంటింటికీ తిరిగి అమూల్యమైన సేవలు అందించారు. వలంటీర్ల సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం వారిని సత్కరించి గౌరవించింది.