Nizamabad
-
పడిపోయిన నువ్వుల ధర
మోర్తాడ్(బాల్కొండ): నువ్వుల ధర పడిపోవడంతో పంట సాగు చేసిన రైతుల ముఖాల్లో నవ్వులు కరువయ్యాయి. యాసంగి సీజన్లో సాగు చేసిన నువ్వులకు ఆశించిన ధర లభించడం లేదు. గతేడాదితో పోలిస్తే క్వింటాల్కు రూ.4వేల వరకు ధర పడిపోయింది. కరోనా కాలంలో నువ్వులకు గిరాకీ, ధర పెరగింది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్లో జిల్లాకు చెందిన రైతులు సుమారు రెండున్నర వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు అయినట్లు అంచనా. నువ్వులకు ప్రధాన మార్కెట్ పుణే కాగా అక్కడికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుండడంతో తెలంగాణ నువ్వులకు డిమాండ్ తగ్గింది. గతేడాది స్థానికంగా క్వింటాల్కు గరిష్టంగా రూ.13,700 చెల్లించిన వ్యాపారులు ఈ ఏడాది మాత్రం రూ.9,700 నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నారు. తెలంగాణలో సాగు చేస్తున్న నువ్వులకు డిమాండ్ తగ్గిపోవడంతో ధర పడిపోయిందని వెంకటేశ్ అనే వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. ఏకంగా రూ.4వేల వరకు ధర తగ్గిపోవడంతో నువ్వులు సాగు చేసిన రైతులకు లాభాలు పడిపోయి శ్రమకు తగిన ప్రయోజనం లేకుండా పోయింది. రూ.13,700 నుంచి రూ.9,700కు.. క్వింటాల్కు రూ.4 వేల వరకు తగ్గిన రేటు ప్రధాన మార్కెట్ మహారాష్ట్రలోని పుణేలో.. ఏపీ, గుజరాత్ నుంచి అక్కడికి దిగుబడులు తెలంగాణ నువ్వులకు తగ్గిన డిమాండ్ -
పహల్గాం ఘటన పిరికిపంద చర్య
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో బీజేపీ నగర శాఖ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించగా, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదుల చేతుల్లో హతమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. – ఖలీల్వాడి/సుభాష్నగర్ -
చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
నిజామాబాద్నాగారం: పీసీ పీఎన్డీటీ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి బద్దం రాజశ్రీ స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో బుధవారం జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు డివిజన్లలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. పీసీ పీఎన్డీటీ చట్టాన్ని అతిక్రమించే, అర్హతలేని వ్యక్తుల రిఫరెన్స్పై స్కానింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి స్కానింగ్ సెంటర్ రిజిస్టర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. బోధన్లో స్కానింగ్ యంత్రం ఉన్న ఆస్పత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలో కొత్తగా రెండు ఆస్పత్రుల్లో స్కానింగ్ యంత్రాలకు అనుమతించామన్నారు. సలహా సంఘం కమిటీ సభ్యులు వైద్యులు సుప్రియ, బిందు, హరిప్రియ, రేడియాలాజిస్ట్ శ్రావణి, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, సీడీపీవో సౌందర్య, ఎన్జీవో పద్మాసింగ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, మెప్మా డీఎంసీ మాధవీలత, నాగలక్ష్మి, వేణుగోపాల్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక బృందాలతో స్కానింగ్ సెంటర్ల తనిఖీ డీఎంహెచ్వో రాజశ్రీ -
ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలం పరిశీలన
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి మండల కేంద్రంతోపాటు మనోహరాబాద్, కొలిప్యాక్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల పరిఽధిలో ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలా న్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం (ముగ్గురు సభ్యులు) బుధవారం పరిశీలించింది. ఐదేళ్ల క్రితం స్థలాన్ని తమ బృందం పరిశీలించిందని, అయితే ఏవైనా మార్పులు జరిగాయా అని తెలుసుకునేందుకు మళ్లీ పరిశీలించి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. తొర్లికొండ శివారులోని చెరువు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాదిత స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందని స్థానిక అధికారులను ప్రశ్నించారు. ప్రతిపాదిత స్థలం ప్రస్తుత పరిస్థితిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపిస్తామని వారు తెలిపారు. వారి వెంట అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాద్రి, ఏడీ సర్వే అశోక్, డీఐ జగన్నాథ్, ఆర్ఐ ప్రవీణ్, సర్వేయర్లు రత్నాకర్, డానియల్ తదితరులున్నారు. -
వివాదాలకు శాశ్వత పరిష్కారం
రుద్రూర్: భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంతోపాటు రైతులకు భూములపై పూర్తి హక్కు లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతి చట్టంపై మో స్రా, చందూర్ మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులకు, పేదలకు మేలు కలుగు తుందని అన్నారు. భూ వివాదాల్లో కోర్టుకు వెళ్లే పే ద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుంద న్నారు. అసైన్మెంట్ భూములకు సంబంఽధించి కూ డా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. భూ భారతి చట్టంపై సలహాలు, సూచనలు చేయాలని రైతులను కోరా రు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి చట్టంలోని సెక్షన్లను వివరించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ కె లక్ష్మ ణ్, సింగిల్ విండో చైర్మన్లు సుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం భూ భారతి పోర్టల్పై సలహాలు, సూచనలు అందించాలి అవగాహన సదస్సుల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
కామారెడ్డి ఇన్చార్జి డీఈవోగా అశోక్
నిజామాబాద్ అర్బన్/బాన్సువాడ రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఈవోగా బుధవారం అదన పు బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డీఈవో పది రోజులపాటు సెలవులో వెళ్లడంతో అశోక్కు బాధ్యతలు అప్పగించారు. చదివిన బడిని చూసి మురిసిన అధికారి.. దేశాయిపేట్ జెడ్పీ హైస్కూల్ను ఇన్చార్జి డీ ఈవో అశోక్ సందర్శించారు. ఆయన స్వస్థ లం సోమేశ్వర్ గ్రామం. తాను చదువుకున్న దేశాయిపేట్ హైస్కూల్లో ఆయన కలియదిరిగారు. తాను ఇదే పాఠశాలలో ఏడో తర గతి వరకు చదువుకున్నట్లు తెలిపారు. యువవికాసం దరఖాస్తుల పరిశీలన వాయిదా నిజామాబాద్ సిటీ: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలనను వాయిదా వేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ను ఈనెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా వాయిదాపడింది. తదుపరి తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం సుభాష్నగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని టౌన్–2 ఏడీఈ ప్రసాద్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దుబ్బ ఏఎస్ 11 కేవీ ఎస్జీ ఫీడర్లో ఏబీ స్విచ్లు ఏర్పాటు కారణంగా ఉదయం 10 నుంచి 12 గంటల అంతరాయం ఏర్పడు తుందన్నారు. బైపాస్ రోడ్, గౌడ్స్ కాలనీ, గుమాస్తా కాలనీ, మహేశ్వరి భవన్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలుస్తుందని పేర్కొన్నారు. -
అనుభవాలు పంచుకొని..
సలహాలు స్వీకరించిడొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రైతు మహోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది. చివరి రోజు బుధవారం నిజామాబాద్తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కు పైగా స్టాల్స్ కిటకిటలాడాయి. రైతులు, వారు పండించిన ఉత్పత్తులతోపాటు వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులు, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా, రైతులు ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు కొనసాగిన వర్క్షాపులో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీ ణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు. స్టాళ్లను సందర్శించిన కలెక్టర్, కార్పొరేషన్ల చైర్మన్లు ముగిసిన రైతు మహోత్సవం ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు.. కిటకిటలాడిన స్టాళ్లు ఆధునిక సాగుపై సలహాలు, సూచనలు అందించిన శాస్త్రవేత్తలు, నిపుణులు నూతన పద్ధతులపై అనుభవాలను పంచుకున్న ఆదర్శ రైతులుముగింపు సందర్భంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడంతో స్థానిక రైతులతోపాటు జిల్లాకు ఆనుకొని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చిందని కలెక్టర్ అన్నారు. ఇక్కడ పరిశీలించిన అంశాలు, నూతన సాగు విధానాలను రైతులు గ్రామాలలోని సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
లింగంపేటలో మహిళ దారుణ హత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన అమ్ముల లక్ష్మి(40) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. లక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకున్న ఒక్కాగానొక్క కూతురు శిరీషకు పెళ్లి చేసి పంపడంతో లక్ష్మి మాత్రమే ఇంట్లో ఉంటోంది. ఈ నెల 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చీరతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లగా, బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి తలుపులు తెరిచి చూడగా లక్ష్మి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. మృతురాలి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ పరిశీలించారు. -
రావుల మధుకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి రావుల మధు పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ అధ్యాపకుడు వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో ‘ప్రిపరేషన్ డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నావెల్ నానో క్రిస్టలైన్ సిరియా బేస్డ్ ఎట్రోజీనియస్ క్యాటలిస్ట్ ఫర్ ది కటలిటీక్ ఎవాల్యూషన్ ఆఫ్ సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆరోమాటిక్ అమైన్న్స్’ అనే అంశంపై మధు పరిశోధన జరిపారు. బుధవారం నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టీ సవిత జోత్స్న ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, సైన్స్ డీన్ ఆచార్య కే సంపత్ కుమార్, బోయపాటి శిరీష, అధ్యా పకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలు ఖలీల్వాడి: నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా 50 మంది పోలీసులతో బుధవారం తనిఖీలు నిర్వహించారు. శాంతినగర్, ఖిల్లా, వర్ని చౌరస్తా, బాబన్ సహబ్ పహాడీ ఏరియాల్లోని అనుమానితుల ఇండ్లను డాగ్స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 17 వాహనాలను సీజ్ చేశారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, టీఎస్ఎస్పీ స్టాఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. కానిస్టేబుళ్లకు పదోన్నతి ఖలీల్వాడి: బాసర జోన్లో పనిచేస్తున్న పలువురు సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు బాసర జోన్ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధిలో మొత్తం 28 మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్ కల్పించగా, జిల్లాలో పని చేస్తున్న 15 మంది కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. వీరిలో కొందరిని జగిత్యాలకు బదిలీ చేశారు. -
అదిరేటి ‘హెయిర్’ స్టైల్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఫ్యాషన్కు కాదేదీ అనర్హం అనేది నానుడిగా మారిపోయింది. ఇక మహిళలే కాదు మగవాళ్లు, చిన్నారులు సైతం హెయిర్ స్టైల్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. హెయిర్ కేర్తోపాటు ట్రెండ్కు తగినట్లు ఫ్యాషన్గా కనిపించేందుకు నచ్చిన రీతిలో హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. బుధవారం నిజామాబాద్లో రైతు మహోత్సవ వేదిక వద్ద ఇద్దరు యువకులు, ఒక బాలుడు తమ హెయిర్ స్టైల్స్తో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. ఓ అగ్రికల్చర్ విద్యార్థి నెత్తి పైభాగంలో మొక్క మాదిరిగా పిలక వేసుకున్నాడు. మరో యువ అధికారి మహిళల జడ మాదిరిగా వెనుక పొడవైన జుట్టుతో కనిపించాడు. మరొక బాలుడు ఎడమవైపు పూర్తిగా జుట్టు లేకుండా మధ్యలో ఒత్తుగా ఉండేలా కటింగ్ చేయించుకున్నాడు. -
సెలవులొచ్చాయి.. పిల్లలు జాగ్రత్త!
ఖలీల్వాడి: ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాయి. గురువారం నుంచి పాఠశాలలకూ సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు ఇంటి పట్టున ఉండేందుకు ఇష్టపడరు. మధ్యాహ్నం వేళలో ఆటలాడుతూ ఎండదెబ్బకు గురయ్యే ప్ర మాదం ఉంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో పిల్లల కదలికలపై ఓ కన్నేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బండి ఇవ్వొద్దు.. బాధపడొద్దు పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చిన రోడ్లపై తిరుగనివ్వొద్దు. రోడ్డు ప్రమాదాలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రమాదం సంభవిస్తే పిల్లలతోపాటు తల్లిదండ్రులు, వాహన యజమానికి కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే మైనర్ డ్రైవ్ కేసులు మొదలయ్యాయి. ఆడపిల్లలను ఎక్కడా ఉంచొద్దు.. ఆడపిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. టీనేజీ పిల్లలను స్నేహితులు, తెలిసిన వారి ఇండ్ల వద్ద ఉంచొద్దు. ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు దృష్టిసారించాలి. గారాబం చేయకుండా వారికి అర్థమయ్యేలా ప్రేమతో చెప్పాలి. ఈతతో జాగ్రత్త.. పిల్లలు సరదాగా స్నానం చేసేందుకు చెరువులు, కా లువలు, బావుల వద్దకు వెళ్లాలని యోచిస్తారు. స్నా నం కోసం బయటికి వెళ్లకుండా తల్లిదండ్రులు జా గ్రత్త పడాలి.ఈత నేర్పించాలనుకుంటే మాత్రం తగిన శిక్షకుడు ఉండే స్విమ్మింగ్ పూల్కు పంపించండి. స్నేహితులెవరో తెలుసుకోండి.. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. వారికి ఉన్న అలవాట్లను తెలుసుకోవాలి. చెడు స్నేహాలతో బైక్లపై తిరగడం, సిగరెట్లు, మద్యం అలవాటు చేసుకునే ప్రమాదం ఉంది. వ్యసనాలకు బానిసై గొడవలు, దొంగతనాలు చేసే అవకాశాలుంటాయి. దీంతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. సెల్ఫోన్కు బానిసలను చేయొద్దు చాలా మంది పిల్లలు సెల్ఫోన్లలకు బానిసలవుతున్నారు. సెలవుల్లో ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఫోన్లతోనే గడుపుతారు. దీంతో పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. సెల్ఫోన్లకు బదులు ఆరుబయట ఆటలపై శ్రద్ధ కనబర్చేలా ఏర్పాట్లు చేయాలి. సెల్ వాడకంతో ఆన్లైన్లో వచ్చే గేమ్స్ ఆడి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. -
అన్నదాతలకు ఉపయోగకరం
వ్యవసాయం లాభసాటిదే... వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉందనేది అపోహ మా త్రమే. ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని పండుగ చేసుకొని లాభసాటిగా మార్చుకున్నారు. ప్రభుత్వం కూడా పంటలు సాగు చేస్తున్న రైతులకు మద్దతు ధర, బోనస్, రుణమాఫీ లాంటి పథకాలు అందిస్తోంది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి రైతు మహోత్సవం చక్కని వేదికగా మారింది. రైతులు కేవలం వరి పంటనే కాకుండా ఆరుతడి పంటలను పండించాలి. – జానయ్య, వీసీ, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సుభాష్నగర్/ డొంకేశ్వర్: జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతు మహోత్సవం స్టాళ్లను బుధవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో రైతు మహోత్సవం ఏర్పా టు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ప్రత్యేక ధ న్యవాదాలు తెలిపారు. రైతులు మార్కెట్లో డి మాండ్ ఉన్న పంటలతోపాటు దేశీ రకాలు, ఇతర లాభదాయకమైన పంటలను సాగు చేసి లాభాలు ఆర్జించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు చైర్మన్ను సన్మానించారు. మేలైన విత్తనాలు అందజేస్తాం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు మేలైన విత్తనాలు అందజేస్తాం. వచ్చే ఖరీ ఫ్ సీజన్కు 10లక్షల విత్తనాలు అందజేయాలని నిర్ణయించాం. రైతులు ప్రైవేటు కంపెనీల మాయమాటలను నమ్మి హైబ్రీడ్ విత్తనాలను వేసి దిగుబడిని నష్టపోతున్నారు. దీంతో పంటలు రోగాలను తట్టుకోవడం లేదు. – అన్వేశ్రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ -
ఆదర్శప్రాయుడు బుద్దె రాజేశ్వర్
బోధన్ : తుదిశ్వాస వరకు ప్రజలకు సేవలందించిన దివంగత బుద్దె రాజేశ్వర్ ఆదర్శప్రాయుడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బోధన్ మాజీ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త సీనియర్ నేత బుద్దె రాజేశ్వర్ సాలూర గ్రామాభివృద్ధికి, ప్రజా సేవలకు జ్ఞాపకార్థంగా గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేశ్వర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజేశ్వర్తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ చైర్మన్ పదవుల్లో సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించిన రాజేశ్వర్ తన వద్దకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వచ్చేవారని, ఏనాడూ వ్యక్తిగత పనులు కోరలేదన్నారు. రైతుల చిరకాల వాంఛ అయిన మంజీర నదిపై ఎత్తిపోతల పథకాన్ని పట్టుబట్టి సాధించాడని, ఆ ఎత్తిపోతల పథకానికి బుద్దె రాజేశ్వర్ పేరు పెట్టాలని సమష్టి ఆమోదంతో తీర్మానించాలని గ్రామస్తులను కోరారు. స్థలదాత ఇల్తెపు బొర్ర గంగారాం, విగ్రహదాత మిద్దెల రాజును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్ సతీమణి బుద్దె సావిత్రి, బోధన్, కోటగిరి ఏఎంసీ చైర్మన్లు చీల శంకర్, హన్మంతు, ఏసీపీ శ్రీనివాస్, టీపీసీసీ డెలిగెట్ బీ గంగాశంకర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగాడే పాండు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోగినేని నరేంద్రబాబు, మందర్నా రవి, పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇల్తెపు శంకర్, కోటగిరి మాజీ జడ్పీటీసీ హెగ్డొలి శంకర్, నాయకులు అల్లె రమేశ్, గణపతి రెడ్డి, బిల్ల రాంమోహన్, డాక్టర్ కౌలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
అగ్నివీరులు.. అవుతారా?
ఖలీల్వాడి: త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉన్న యువకులను ఇండియన్ ఆర్మీ ప్రోత్సహిస్తోంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు అగ్నివీర్ ఎంపికలు నిర్వహిస్తోంది. అగ్నివీరులుగా ఎంపికై న వారికి నాలుగేళ్లపాటు ఐదంకెల వేతనం అందిస్తోంది. అగ్నివీర్కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో గడువు తేదీని పొడిగించింది. అయితే ఈ ఉద్యోగం సాధించేందుకు గల అర్హతలు, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అర్హతలు: ● అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల వరకు ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ● ఫిజికల్ టెస్ట్లో 1600 మీటర్ల పరుగు, పుల్ అప్స్, జిగ్జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ పరీక్షల్లో అర్హత సాధించాలి. పరుగు పందెం.. అగ్నివీర్కు మొదటి పరీక్ష పరుగు పందెం. 1600 మీటర్ల పరుగును 5 నిమిషాల లోపు, అంతేకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఒకేసారి 300 మందికి పోటీ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మిగితా పరీక్షలకు అవకాశం ఉండదు. జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ : ● పొడువుగా వంకర టింకరగా ఉన్న కర్ర(చెక్క)పై అభ్యర్థులు కిందపడకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనినే జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్ అంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. ● పరుగెత్తుకుంటూ వచ్చి తొమ్మిది మీటర్ల గుంత అవతలి వైపు దూకాలి. దీనినే డచ్ పరీక్ష అంటారు. దీనికి కసరత్తు చేయాల్సి ఉంటుంది. పుల్ అప్స్ ఈ పరీక్షలో పాస్ కావాలంటే తప్పనిసరిగా 10 పుల్ అప్స్ తీయాల్సి ఉంటుంది. ఎక్కువగా తీస్తే బోనస్ మార్కులు కూడా వస్తాయి. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు ఎంపిక చేసే అధికారులు అభ్యర్థి వైపు చూస్తూ గట్టిగా అరుస్తారు. భయపడకుండా శ్వాస తీసుకుంటూ పుల్ అప్స్ చేయాలి. అర్హత పరీక్ష ఎంపికై న అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండియన్ ఆర్మీ కార్యాలయం నుంచి సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నవారు అధికారులు సూచించిన పత్రాలతోపాటు మెడికల్ టెస్ట్కు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అందిస్తారు. దీంతో భారతసైన్యంలో సైనికుడిగా శిక్షణ తీసుకుంటారు. నేరుగా భారత సైన్యంలో చేరే అవకాశం దరఖాస్తుకు రేపే చివరి తేదీ -
డిచ్పల్లి ఖిల్లాకు గుర్తింపు తెస్తా..
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డిచ్పల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయానికి ఎకో టూరిజం ద్వారా రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. త్వరలో బాసర టూరిజం సర్క్యూట్లో డిచ్పల్లి రామాలయాన్ని చేర్చుతామని వెల్లడించారు. బుధవారం డిచ్పల్లి రామాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రామాలయంపై తీసుకున్న ప్రతి నిర్ణయం విజయవంతమైందని, తాను నామినేషన్ వేసే ముందు ఈ గుడికి వచ్చి వెళ్లగా, ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు తెలిపారు. ఆలయాభివృద్ధికి ప్రత్యేక నిధులను తీసుకువస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం డిచ్పల్లి ఖిల్లా రామాలయం నూతన చైర్మన్గా జంగం శాంతయ్య, డైరెక్టర్లుగా నర్సారెడ్డి, జితేందర్, పోశె ట్టి, మాధురి, ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మలతో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల ప్రమా ణ స్వీకారం చేయించారు. నాయకులు బూస సుదర్శన్, పీ మహేందర్ రెడ్డి, నర్సారెడ్డి, రాములు, సాయిలు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఆరు గ్రామాల్లో రూ.11.69కోట్లతో.. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. మండలంలోని మిట్టపల్లి, రాంపూర్, నర్సింగపూర్, కమలాపూర్, డిచ్పల్లి, ఘన్పూర్ గ్రామాల్లో రూ.11.69 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, నాయకులు తారాచంద్, వాసు బాబు, ధర్మాగౌడ్, మురళి చిన్నయ్య, రామకృష్ణ, షాదుల్లా, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఎక్కపల్లి గ్రామానికి చెందిన ల్యాగల శోభ(45) అనే మహిళ బుధవారం ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలుగా శోభ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించేదని, ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో బాత్రూమ్ వద్ద ఉన్న కర్రకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భర్త పర్వయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ముగ్గురికి జైలు రెంజల్(బోధన్): డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబ డిన ముగ్గురికి జైలు శిక్ష విధించగా మరో ము గ్గురికి బోధన్ ద్వితీయ శ్రేణి అదనపు న్యాయమూర్తి జరిమానా వేసినట్లు ఎస్సై చంద్రమో హన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చే స్తుండగా తాగి వాహనాలు నడిపిన వారిని పట్టుకొని కేసు నమోదు చేసి బుధవారం కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి రెండు రోజుల జైలు, మరో ముగ్గురికి రూ. 4 వేల చొప్పున జరిమానా విధించారు. కిరాణా షాప్ యజమానికి.. ఖలీల్వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్దేశిత సమయానికి మించి కిరాణాదుకాణాన్ని తెరిచి ఉంచిన యజమాని షేక్ జుబేర్ హాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసీన్ ఆరా ఫత్ బుధవారం తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. -
సావెల్ ‘సహకారం’లో అక్రమాలు!
బాల్కొండ: మెండోరా మండలం సావెల్ సహకార సంఘంలో అక్రమాలు జోరుగా సాగాయి. సంఘంలో రూ.80 లక్షలు గోల్మాల్ జరిగాయంటూ ఆగస్టులో సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీవో శ్రీనివాస్రావు, సత్యనారయణ రావును విచారణ అధికారిగా నియామించారు. 8 నెలలుగా విచారణ చేపట్టిన అధికారి రూ.97లక్షలను స్వాహా చేసినట్లు నిగ్గు తేల్చారు. సావెల్ సహకార సంఘం పరిధిలో సావెల్, మెండోరా, కోడిచర్ల, చాకీర్యాల్ గ్రామాలు ఉన్నాయి. గత పాలక వర్గం హయాంలో రూ.35లక్షల నష్టాలు ఉంటే ప్రస్తుత పాలకవర్గం హయాంలో మరో రూ.45 లక్షలు చేరి మొత్తం 80 లక్షలకు చేరినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అంత కంటే ఎక్కువనే దుర్వినియోగం చేసినట్లు లెక్క తేలింది. ఎవరి వాటా ఎంత..! సావెల్ సహకార సంఘంలో జరిగిన అవినీతిలో ఎవరి వాటా ఎంత ఉందో తేల్చుటకు అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. సీఈవోగా విధులు నిర్వర్తించిన సురేందర్ రెడ్డి రూ.35 లక్షలు స్వాహా చేసినట్లు, అవి చెల్లించుట కోసం ముందే బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎరువుల సేల్స్మెన్ రూ.10 లక్షలు గోల్మాల్ చేసినట్లు అప్పుడే తేలింది. మిగిలిన రూ.52 లక్షల్లో పాలకవర్గం వా కూడ ఉన్నట్లు విచారణ అధికారి భావిస్తున్నారు. దీంతో పాలకవర్గ సభ్యులను కూడ బాధ్యులను చేస్తూ రికవరీ కోసం నోటీసులు కూడ జారీ చేశారు. సంఘంలో పెద్ద మొత్తంలో స్వాహ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రూ.97లక్షలు గోల్మాల్ అయినట్లు తేల్చిన విచారణ అధికారి రికవరీ కోసం నోటీస్లు జారీనోటీసులు జారీ చేశాం.. సావెల్ సహకార సంఘంలో రూ.97లక్షలు స్వాహా చేసినట్లు విచారణ అధికారి తేల్చారు. అందుకు బాధ్యులైన వారందరికీ నోటీసులను జారీ చేశాం. రికవరీ చేసి కేసులు నమోదు చేస్తాం. ఎవరి వాట ఎంత అనే దానిపై విచారణ సాగుతుంది. – శ్రీనివాస్ రావు, డీసీవో, నిజామబాద్ -
ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
నిజామాబాద్అర్బన్/డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఇంటర్ ఫలితాల్లో ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు సత్తాచాటాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకులాలకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జ్యోతిర్మయి ఎంపీసీలో 1000 మార్కులకు 956 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974 మార్కులు, ఒకేషనల్లో పూజ 974 మార్కులు సాధించారన్నారు. అలాగే ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోఫియా కుల్సుం బైపీసీలో 967 మార్కులు, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థిని మనస్విని 932 మార్కులు సాధించారన్నారు. నాగరంలోని మైనారిటీ జూనియర్ బాలుర కళాశాలలో ఎంపీసీ, సీఈసీ గ్రూపులో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. బైపీసీలో 23 మందికి గానూ 19మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఎంపీసీలో సయ్యద్ అర్శలాన్ ఎంపీసీ సెకండియర్లో 986, బైపీసీలో భార్గవ్ 989 మార్కులు సాధించినట్లు తెలిపారు. గురుకుల బాలికల ప్రతిభ.. డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల బాలికల ప్రతిభ కళాశాల (సీవోఈ) ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ మాధవీలత తెలిపారు. టి.లక్కీ ఎంపీసీ సెకండియర్లో 992మార్కులు, తోట కీర్తన బైపీసీలో 993 మార్కులు సాధించారన్నారు. అలాగే ఫస్టియర్లో అన్విత ఎంపీసీలో 464, శ్రీనిధి బైపీసీలో 433 మార్కులు సాధించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ నళిని తెలిపారు. సీహెచ్ సుస్మిత ఎంపీసీ సెకండియర్లో 950 మార్కులు, అమూల్య బైపీసీలో 978 మార్కులు సాధించారు. కావ్యకిశోరి ఎంపీసీ ఫస్టియర్లో 445, బైపీసీలో నవ్యశ్రీ 414 మార్కులు సాధించారు. నారాయణకు ర్యాంకులు నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ సెకండియర్ విద్యార్థినులు శ్రావణి 993, లవంగ వైష్ణవి 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో అయేషాఆఫీఫా 438, ఎంపీసీలో వరుణ్ 468 మార్కులు సాధించారు. వెక్టర్ జూనియర్ కళాశాల ప్రతిభ వెక్టర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో గౌరవ్శర్మ 466, మణిచంద్ర 466, బత్తుల వంశీ 466, ఆశ్రిత 466, మనస్విని 466 మార్కులు సాధించారు. ఎంపీపీ రెండో సంవత్సరంలో నిశాంత్రెడ్డి 991, బైపీసీ సెకండియర్లో శ్రీవర్షిని 989 మార్కులు సాధించారు. ‘అల్ఫోర్స్’కు ఉత్తమ మార్కులు అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన ఎం.యోగేష్ ఎంపీసీ ఫస్టియర్లో 467 మార్కులు, ముత్యం హరిక 464 మార్కులు సాధించారు. శ్రీజన్ 466, సోనాలిక 467, అంజన్నప్రియ 467, ప్రవళిక 467 మార్కులు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు పలువురికి ఉత్తమ మార్కులుఎంతో గర్వంగా ఉంది... కాకతీయ కళాశాలలో చదువుతూ ఎంపీసీ ఫస్టియర్లో 466 మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. కళాశాల డైరెక్టర్, అధ్యాపకులు ఎంతగానో సహకరించారు. తల్లిదండ్రుల ప్రోత్సహం మరువలేనిది. రెండో సంవత్సరంలో మరిన్ని మార్కులు సాధిస్తాను. – ఎం.హర్షిత, కాకతీయ కళాశాలవిద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ.. కాకతీయ కళాశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. యజమాన్యం ఎప్పటికప్పుడు ప్రణాళిక బద్దంగా సూచనలు, సలహాలు అందించడం, సందేహాలను నివృత్తి చేశారు. ఇదే ప్రోత్సహంతో ఎంపీసీ సెకండియర్లో 991 మార్కులు సాధించగలిగాను. – త్రిషచౌదరి, కాకతీయ కళాశాల -
చెరువులో పడి ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులోని గుండ్ల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన రమేష్(35) బతుకుతెరువు కోసం అంకాపూర్కు వచ్చి, పనిచేస్తున్నాడు. కాగ మంగళవారం బర్రెలను మేపుతుండగా చెరువులో పడిన బర్రెను కాపాడే ప్రయత్నంలో రమేష్ నీటిలోకి దిగాడు. చెరువులోని చేపల వల అతడికి తట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. వర్ని: మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆర్య రాకేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన తోగటి భమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి మామిడిపల్లిలోని వృద్ధాశ్రమానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళం ధ్వంసం చేసిఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బీరువాలోని 5తులాల బంగారం, 80గ్రాముల వెండిన దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. కులాస్పూర్ తండా, బాడ్సిలో అగ్నిప్రమాదం మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండా, బాడ్సి గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కులాస్పూర్ తండాలో బంతిలాల్కు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకుని పెళ్లి కోసం కొనుగోలు చేసిన కలప దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా, నిజామాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది మంటలార్పేశారు. ప్రమాదంలో సుమారు రూ.40వేల వరకు నష్టం జరిగినట్లు బంతిలాల్ పేర్కొన్నాడు. అలాగే బాడ్సిలో కోసిన వరి గడ్డికి నిప్పంటుకుంది. డయల్ 100కు గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్ఐ యాదగిరి గౌడ్, సిబ్బందితో అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇందల్వాయి నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. బదావత్ చత్రు గడ్డి, కె శ్రీనివాస్ పైపులు ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. సిర్నాపల్లి అడవుల్లో ఇసన్నపల్లి వాసి హత్య? రామారెడ్డి: కామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సిర్నాపల్లి అడవులలో ఏడు నెలల క్రితం హత్య చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులతో పాటు మృతుడి భార్యను రామారెడ్డి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య ఘటనలో ఆరు నుంచి ఎనిమిది మంది పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు గల్ఫ్కు వెళ్లినట్లుగా మృతుడి భార్య బంధువులను నమ్మించింది. మృతుడి అన్నకు అనుమానం రావడంతో రామారెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడు గల్ఫ్ దేశం వెళ్లలేదని, తమ్ముడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించిందని ఫిర్యాదు చేశాడు.మృతుడు గల్ఫ్ దేశం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ లేదనే సమాచారం పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ఎస్పీ నేరుగా రంగంలోకి దిగడంతో హత్య ఘటన కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
కుక్కల దాడిలో పసి బాలుడికి గాయాలు
ఆర్మూర్టౌన్: పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం ఉదయం శ్రేయన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి కుక్కను తరిమేసి, గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులు ఇప్పటిౖకైనా కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మద్నూర్లో లేగదూడలకు.. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు లేగదూడలపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గోశాలలోకి మంగళవారం ఉదయం కుక్కల గుంపు ప్రవేశించి లేగదూడలపై దాడి చేశాయన్నారు. దీంతో లేగదూడలకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. మరో రెండు లేగదూడలు పారిపోయాయని వాటి కోసం వెతుకుతున్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
బాల్కొండ: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘భూ భారతి’ అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ధరణిలో ఉన్న లోపాలను సరి చేస్తూ నూతన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ చట్టంలో రైతులకు ఇక్కడే న్యాయ సేవలు అందించే అంశం పొందుపరచబడి ఉందన్నారు. కోర్టుల చుట్టూ తిరగే అవకాశం లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. వారసత్వ హక్కుల కోసం సాదభైనామాను సులభతరంగా చేసుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణితో రైతులను దగా చేశారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుంకేట్ అన్వేష్రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ ఆర్డీవో రాజుగౌడ్, మండల ప్రత్యేకాధికారి స్రవంతి, తహసీల్దార్ గజనాన్, ఎంపీడీవో ఆనంద్ నరేశ్, ఏఎంసీ ఛైర్మన్ ముత్యంరెడ్డి, డైరెక్టర్ రవి పాల్గొన్నారు. మెండోరా మండల కేంద్రంలో.. బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని, మాట్లాడారు. రైతులకు భూ సమస్యలపై న్యాయ సేవలు భూభారతి చట్టం ద్వారా అందుతాయన్నారు. తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో వనజ, వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ముప్కాల్లో అవగాహన సదస్సు -
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి
తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భారత మహిళల కబడ్డీ టీం ప్రధాన కోచ్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. తెయూ క్యాంపస్లో మంగళవారం నిర్వహించిన యూనివర్సిటీ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి శ్రీనివాస్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చన్నారు. వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు సమప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యూనివర్సిటీల్లో ఎంతో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, డైరెక్టర్ కల్చరల్ అండ్ యూత్సెల్ డైరెక్టర్ లావణ్య, ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి, యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రొఫెసర్ కనకయ్య, సీహెచ్ఆరతి, స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, విద్యావర్థిని, పీఆర్వో పున్నయ్య, ఏఈ వినోద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలదే పైచేయి
నిజామాబాద్భూ సమస్యల పరిష్కారానికే.. భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లో uఇంటర్ ఫలితాల్లో బాలికలు మరోసారి పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 53.37 శాతం, రెండో సంవత్సరం ఫలితాల్లో 58.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు ఫస్టియర్లో 64 శాతం, బాలురు 41శాతం, సెకండియర్లో బాలికలు 70 శాతం, బాలురు 45 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 13,945 మంది పరీక్షలకు హాజరుకాగా 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ ఒకేషనల్లో 2,042 మందికి గాను 1,231 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు 15,056 మందికిగాను 8,035 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్లో 2,790 మందికిగాను 1,223 ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఓవరాల్గా 25వ స్థానంలో నిలిచింది. – నిజామాబాద్ అర్బన్న్యూస్రీల్ -
ఇందిరమ్మ, భూభారతిపై దృష్టి సారించాలి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంగళవారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మా ట్లాడారు. పైలట్ ప్రాజెక్టుగా భూ భారతి అమలువుతున్న రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వ రకు 5,905 దరఖాస్తులు అందాయని నాలుగు పైలట్ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మే మొదటి వారంలో హైదరాబాద్ మి నహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని 28 మండలాల్లో భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై.. వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తి చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్కు సూచించారు. లబ్ధిదారులకు తక్కువ ధరకు స్టీల్, సిమెంట్ ఇచ్చేవిధంగా త్వరలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 16వ తేదీన జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించా రని తెలిపారు. త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25శాతం ఎల్ఆర్ఎస్ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 30వ తేదీతో ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు ముగుస్తుందని, పొడిగించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమబద్ధీకరించని భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అను మతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకు స్టీల్, సిమెంట్ అందించేందుకు చర్యలు వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఐఏఎస్ కు ఎంపిక
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న జాదవ్ గోవింద్ కుమారుడు జాదవ్ సాయిచైతన్య యూపీఎస్సీ సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. గత సంవత్సరం సివిల్స్ లో ఐఎఫ్ఎస్ కు ఎంపికై న సాయి చైతన్య పట్టుదలతో చదివి మంగ ళవారం ప్రకటించిన సివి ల్స్ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. దీంతో డీజీపీ జితేందర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య లు హెడ్కానిస్టేబుల్ జాదవ్ గోవింద్, ఐఏఎస్ సాధించిన సాయిచైతన్య లను ప్రత్యేకంగా అభినందించారు. అభినందించిన డీజీపీ, సీపీ -
ఎస్ఆర్ కళాశాల హవా
నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో దొంతుల కీర్తి 993/1000 , పిట్టల సాయిశ్రీ (991), జి.గౌతమ్ (991), సహర్షరెడ్డి (990), జె.రాణి (990), ఆకుల శ్రీచందన (989), డి.భవ్య (989)మార్కులు సాధించారు. ఫస్టియర్లో ఏ.హర్షిణి 468/470, ఎన్.దినేశ్ (468), ఎస్.శ్రీజ (468), జి.శ్రీనిధిరెడ్డి (468), కె.సంజన (467) మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్లో.. డి.వైష్ణవి 993/1000 మార్కులు సాధించగా, ఫాతిమా(992), ఎం.హన్సిక(990), కె.రిడ్డి (990), రాథోడ్స్నేహ(986), ఆర్.రిషిక (981)మార్కులు సాధించారు. ఫస్టియర్లో.. ఎం.వైష్ణవి–438/440, కె.వైష్ణవి (437), హన్మిత (436), జోబియాఫాతిమా (436), ఎండీ రెహాన్ (436), టి.వైష్ణవి (435 మార్కులు సాధించారు. -
జిల్లా జడ్జిగా భరతలక్ష్మి బాధ్యతల స్వీకరణ
ఖలీల్వాడి: నిజామా బాద్ జిల్లా జడ్జిగా భరతలక్ష్మి మంగళవా రం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని లేబర్ కోర్టులో ప్రెసిడెంట్ ఆఫీసర్గా పని చేసిన భరతలక్ష్మి బదిలీపై జిల్లా కోర్టుకు వచ్చారు. ఇక్కడ పని చేసిన జడ్జి సునీతా కుంచాల పెద్దపల్లికి బదిలీ అయ్యారు. న్యాయమూర్తి భరతలక్ష్మికి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు స్వాగతం పలికారు. కొనుగోలు కేంద్రం తనిఖీ డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని గాదేపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. చిన్నయానం వద్ద ఎకో టూరిజం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వచ్చి న ఆయన కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి సన్నాలు, దొడ్డు రకం ధాన్యాన్ని, రికార్డులను పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులు, రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ వివరా లు తెలుసుకున్నారు. తేమశాతం యంత్రా లు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. వడదెబ్బ నుంచి రక్షించుకోవాలి నిజామాబాద్నాగారం: వడ దెబ్బ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘వాతావరణంలో మార్పులు – ఆరోగ్యంపై ప్రభావం’ పోస్టర్లను కలెక్టర్ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆవిష్కరించారు. ఎండల తీవ్రత పె రుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. పనిచేసే చోట్ల కార్మికుల కోసం యజమాను లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. డీఎంహెచ్వో రాజశ్రీ, మున్సిపల్ కార్పొరేష న్ కమిషనర్ దిలీప్, పీవోఎన్సీడీ డాక్టర్ సా మ్రాట్ యాదవ్, నాగలక్ష్మి, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలి
నిజామాబాద్ సిటీ : రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కొనసాగుతుండగా, రెండో రోజైన సోమవారం మహేశ్కుమార్ గౌడ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు వస్తున్న కొత్త పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రై తు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన కోసం రైతులను వియత్నాం, మలే షియా వంటి దేశాలకు స్టడీ టూర్లకు తీసుకెళ్లాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి రైతులు మూస విధానాలకు స్వస్తి పలికి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మమేకం కావాలన్నా రు. యువత వ్యవసాయంలోకి రావాలని, ఉద్యోగా ల కోసం దిగులు చెందొద్దని పేర్కొన్నారు. భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే ఎకరాకు రూ.40 వేలవరకు సంపాదించొచ్చని సూ చించా రు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, పీసీసీ డెలిగేట్ శేఖర్గౌడ్, వినయ్రెడ్డి, నగేశ్రెడ్డి, అగ్గుభోజన్న తదితరులు పాల్గొన్నారు. -
అగ్రి, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకొస్తాం
నిజామాబాద్ సిటీ: జిల్లాకు వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలలను తీసుకొస్తామని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. నందిపేట సెజ్ను పునరుద్ధరిస్తామని, సుదర్శన్రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించారన్నారు. అలాగే నిజాంసాగర్ కెనాల్ ఆధునీకరణ చేపట్టా రని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో మినీ స్టేడియం, సింథటిక్ ట్రాక్ నిర్మిస్తామని, ఎన్ఎస్ఎఫ్, ఎన్సీఎస్ఎఫ్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కుల సర్వేచేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చట్టం చేశామని అన్నారు. తెలంగాణలో అ మలవుతున్న సంక్షేమ పథకాలు, హామీలపై దేశమంతా చర్చ జరుగుతోందని, రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు. రైతు భరోసా, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, గ్యాస్ సిలిండర్కు రూ.500 రాయితోతోపాటు రేషన్దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీతో ప్రజలు సంతోషంగా ఉ న్నారన్నారు. పేదల కళ్లలో ఆనందం కోసమే ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏనా డూ రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. రైతులు వరి కుప్పలమీదే ప్రాణాలు వదిలిన ఘటనలను చూశామన్నారు. రైతులపై లాఠీచార్జి చేసి, వారి చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. తమ హయాంలో ఏం చేశారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలన్నారు. జిల్లాకు ప్రత్యేకించి వారు చేసిందేమైనా ఉందా అని మహేశ్కుమార్ ప్రశ్నించారు. మంత్రిగా ప్రశాంత్రెడ్డి జిల్లాకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఉనికి కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధించి అధికారంలోకి వస్తా మని మహేశ్గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. కాలానికి అనుగుణంగా వక్ఫ్బోర్డులో మార్పులు తెస్తే పర్వాలేదని, కానీ ఒక మతాన్ని హననం చేసేలా తక్కువచేసే సవరణలకు కాంగ్రెస్ అంగీకరించదన్నారు. వక్ఫ్బోర్డు బిల్లు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాను ఎక్కువగా దాని గురించి మాట్లాడనని స్ప ష్టం చేశారు. సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నాయకులు జావేద్ అక్రం, నగేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు పేదల కళ్లలో సంతోషం కోసమే సన్నబియ్యం పంపిణీ వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తాం రైతులపై లాఠీచార్జి చేసి బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ది.. ఉనికి కోసమే వరంగల్ సభ పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
కాకతీయకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఇంటర్ ఫలితాల్లో కాకతీయ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తాచాటారు. సెకండియర్ ఎంపీసీలో సఫాఅఖిల్ (992/1000) రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు, త్రిషాచౌదరి (991) ఐదో ర్యాంకు, ఆయేషా ఫాతిమా (988)ఏడో ర్యాంకు సాధించారు. అలాగే బైపీసీలో అమ్ముతుల్ మోహిరీనా (992/1000), జూనారీయా అంబేర్ (992) మార్కులతో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకులు సాధించగా, సోహాసనీలా (988)కు ఎనిమిదో ర్యాంకు దక్కింది. ఫస్టియర్లో.. ఎంపీసీలో బి.కావ్యశ్రీ (467/470) రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు, ఎం.హర్షిత (466), పి.నిత్యశ్రీ(466), ఎం.మృదుల(466), లాస్యశ్రీ(466) మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. కె.కీర్తి (465), ఎం.అశ్రిత(465) నాల్గో ర్యాంకు సాధించారు. , బైపీసీలో హనియా ఉమేమా(435/440), వి.ఇందు (435) మార్కులతో మూడోర్యాంకులు సాధించగా, తుబాఫాతిమా(434), రిమ్షా అనమ్(434), వై.శ్రీనిత్య(434) మార్కులతో నాల్గో ర్యాంకు సాధించారు. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆర్మూర్: ఆర్మూర్ పట్ట ణంలోని పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్ శ ర్మ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డొంకేశ్వర్లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించిన రూ.4 లక్షల 75 వేల బిల్లుల మంజూరు చేసేందుకు రూ.7,500 ఇవ్వాలని కాంట్రాక్టర్ను శ్రీనివాస్ డిమాండ్ చేసాడు. దీంతో కాంట్రాక్ట ర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం కాంట్రాక్టర్ రూ.7 వేలు ఇవ్వగా తీసుకుంటున్న శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు డీఎస్పీ శేఖర్గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సాధారణ ముస్లింల కోసమే వక్ఫ్ చట్ట సవరణ
సుభాష్నగర్: దేశంలోని సాధారణ ముస్లింల ప్ర యోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్బోర్డు చట్టాన్ని సవరించిందని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యా లయంలో సోమవారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్బోర్డు దేశంలోనే మూడో అతిపెద్ద భూమి కలి గిన సంస్థ అని, 2006లో 6లక్షల ఎకరాలు ఉండ గా, 2025 నాటికి 38లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం మా త్రం కేవలం రూ.9.90లక్షలు మాత్రమేనని అ న్నా రు. చట్టంలోని లొసుగులను అవకాశంగా మ ల్చుకుని ఓవైసీ సహా కాంగ్రెస్ ముస్లిం నేతలు వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్నారని విమర్శించారు. 1995లో పీవీ నర్సింహారావు వక్ఫ్బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కట్టబెట్టగా, 2013లో సోనియా గాంధీ వక్ఫ్ ట్రిబ్యునల్కు అవకాశమిచ్చిందన్నారు. సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలను వక్ఫ్ ట్రి బ్యునల్కు కల్పించారని ఆరోపించారు. వక్ఫ్ కింద ధరణి, భూభారతి వంటి సైట్లు ఏమీ పని చేయవని, వక్ఫ్తో ఇతర మతాలకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. వక్ఫ్బోర్డు దుర్వినియోగమైందని, దేశానికి ప్రమాదకరంగా మారిన చట్టాన్ని కేంద్రం సవరించిందన్నారు. ప్రభుత్వ భూములు వక్ఫ్ భూమి గా ఎలా మారుతుందని, వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పు ఎలా ఫైనల్ అవుతుందని ప్రశ్నించారు. ట్రి బ్యునల్లో అందరూ సున్నీ ముస్లిములే ఉంటారని, అ లాంటప్పుడు ఇతర మతాలు, ప్రజలు, సంస్థలు, రైతులకు ఎలా న్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం చేసిన చట్ట సవరణ ద్వారా ప్రజలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, వక్ఫ్ ఆదాయం కూడా పెంచేలా చట్టం చేశామని తెలిపారు. బీజేపీ ప్రజా శ్రేయస్సు కోసం నడిచే పార్టీ అని పేర్కొన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, పద్మారెడ్డి, నాయుడి రాజన్న, నాగరాజు, పంచరెడ్డి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. బోర్డు దేశానికే ప్రమాదకరంగా మారింది ఓవైసీ సహా కాంగ్రెస్ ముస్లిం నేతలు వక్ఫ్ ఆస్తులను దోచుకున్నారు ఎంపీ అర్వింద్ ధర్మపురి -
రైతు ప్రయోజనాలే పరమావధి
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సుభాష్నగర్: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలే పరమావధి అని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం పని చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పోచా రం శ్రీనివాస్రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో తుమ్మలో మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని, సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేలా మెళకువలు అందించేందుకు రైతుమహోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో సాగు చేసే పంటలు, ఆధునిక సాగుపై మూడురోజులపాటు శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్లో జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, మా నాల మోహన్రెడ్డి, కాసుల బాల్రాజ్, జంగా రాఘవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నగేశ్రెడ్డి, బాడ్సి శేఖర్గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, సీపీ సాయిచైతన్య, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ఎన్ గోపి, ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్శాఖ జేడీ మల్లేశం, డీడీ పద్మహర్ష, అనుబంధశాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఐదు జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతోపాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేయిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీతకు ఈనెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్లు నిర్మిస్తామని అన్నారు. రైతు మహోత్సవం ప్రారంభ సభావేదికపైనే జిల్లా ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ప్రసంగిస్తూ గన్నీ బ్యాగుల కొరత ఉందని మంత్రుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. రాకేశ్రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గన్నీ బ్యాగుల కొరత ఉందని చెబుతున్నారని అన్నారు. భూపతిరెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రాకేశ్రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరువురు మంత్రులు రాకేశ్రెడ్డిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. వేదికపై వాగ్వాదం సాగుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి ఆయిల్పామ్ సాగుపై ఆసక్తి చూపాలి రైతులకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు ఐదు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు -
రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావాలి
రాష్ట్రంలోని ప్రతి రైతు తలెత్తుకుని తిరిగే రోజు రావాలని, పంట పండించే రైతుకు బోనస్ ఇవ్వడంతో ప్ర భుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని, పెట్టుబడి ఖర్చు తగ్గించాలని, అధిక దిగుబడులు పెరగాలన్నారు. రైతులు అప్పుల నుంచి బయట పడేలా అధికారులు, ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పంటలకు బోనస్ ఇస్తే, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
తాడ్వాయి మండలంలో.. తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండలంలోని కాళోజివాడిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మల్లమారి రాకేష్ (25)కు ఐదేళ్ల క్రితం రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు అనూష్ ఉన్నాడు. రెండేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఇటీవల సంధ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రాకేష్ తీవ్ర మనస్థాపంతో బాధపడుతుండేవాడు. కాగా సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గల వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ ప్రాంతంలో అబ్దుల్ సలాం (37) నివసిస్తుండేవాడు. అతడి భార్య ఏడాది క్రితం మృతిచెందడంతో ఆమె తల్లితరపువారు సలాంపై కేసు వేశారు. దీంతో సలాం జైలుకు వెళ్లగా ఇటీవల బయటకు వచ్చాడు. తన పిల్లలను చూడడానికి అత్తగారింటికి వెళ్లిన సలాంను వారు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో సలాం వాట్సప్ స్టేటస్ పెట్టి, నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో..వర్ని: మండలంలోని చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. చందూర్ గ్రామానికి చెందిన అర్కల గోపాల్రెడ్డి ఆర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ముప్కాల్ మండలంలో.. బాల్కొండ: ముప్కాల్ మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నా గంపేట్ గ్రామానికి చెందిన ఏ లేటి గంగాధర్ అలియాస్ వకీ ల్ (49) కొంతకాలంగా తనకు ఎవరో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మానసికంగా బాధపడుతున్నాడు. మానసిక ప్రశాంతత కోసం ఈనెల 15న గ్రామస్తులతో కలిసి తిరుపతిలో శ్రీవారి సేవ చేయుటకు వెళ్లాడు. గంగాధర్ నిత్యం కల్లు తాగే అలవాటు ఉంది. తిరుపతిలో కల్లు లభించకపోవడంతో మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో పురుగులమందు తాగాడు. అనంతరం కొత్తపల్లికి గ్రామంలో ఓ ఇంటి వద్ద నీరు తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్మూర్లోని ఓ ప్రయివేలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
30 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్వాడి: ఎండుగంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని గంజ్ ప్రాంతంలో ఆటోనగర్కు చెందిన మొహమ్మద్ ఆయూబ్ వద్ద గంజాయి ఉన్నదనే సమాచారం మేరకు అతని వద్ద తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొహమ్మద్ ఆయూబ్ను విచారించగా మహారాష్ట్ర, నాందేడ్లోని బోకార్కు చెందిన ఫరూక్ఖురేషీ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి నవీపేట్ మండలం యంచ వద్ద ఫారూఖ్ఖురేషీతోపాటు నాందేడ్లోని బోకార్కు చెందిన యషేక్ ఫయీమ్, షేక్ సిద్ధిక్, జుబేర్ పఠాన్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి కారులో తనిఖీలు చేయగా అందులో 30కిలోల ఎండుగంజాయి దొరికినట్లు తెలిపారు. ఫారూక్ఖురేషీ ఆంధ్ర, ఛత్తీష్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి ఎండుగంజాయిని కొనుగోలు చేసి నిజామాబాద్, నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. 30.250 కిలోల ఎండు గంజాయి విలువ రూ.6లక్షల వరకు ఉంటుదన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎ క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రాంకుమార్, సిబ్బంది హమీద్, రాజన్న, రాంబచన్, సుకన్య, ఆశన్న, అవినాష్, శ్యాంసుందర్, సాయికుమార్ పాల్గొన్నారు. -
పదేళ్లు సదస్సులు మర్చిపోయారు
గత ప్రభుత్వం పదేళ్లలో రైతు సదస్సులు మర్చిపోయిందని, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రైతు సదస్సులు నిర్వహిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఇరిగేషన్ అధికారులు ఊసరవెల్లిలా ప్రవర్తించడంపై ఆయన మండిపడ్డారు. ఆదర్శ రైతు పథకాన్ని పున: ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రిని కోరారు. అవినీతికి పాల్పడ్డారు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 20, 21 ప్యాకేజీ పనులకు రూ.300 కోట్లు కేటాయిస్తే రైతులకు నీరందేదని, బీఆర్ఎస్ పైపుల ద్వారా సాగునీరు అందిస్తామని రూ.3వేల కోట్లు ఇచ్చి, అందులో రూ.2వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఆరోపించారు. పసుపు అధిక కుర్కుమిన్ వచ్చే వంగడాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చని తెలిపారు. కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరతతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్దే ఉంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి అన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అంచనా మేరకు కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా, బోనస్ త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. -
ఫసల్ బీమా అమలుచేయాలి
రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఫసల్ బీమా యోజన ప్రీమియం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. మండల కేంద్రాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని, యంత్ర పరికరాలు అందించాలన్నారు. ప్రాణహిత–చేవెళ్లకు నిధులు కేటాయించాలి.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ 20, 21, 22 ప్యాకేజీ పనులను అధిక ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి వెంటనే నిధులు కేటాయించాలని, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంత్రి ఉత్తమ్ను కోరారు. వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే రాకేష్రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. బోనస్ త్వరగా జమ చేయాలి రాష్ట్రంలో రైతులను ఆదుకునేలా నిర్ణయాలు, పథకాలను ప్ర భుత్వం అమలు చేయా లని ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. ధా న్యం బోనస్ డబ్బులు త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఫసల్ బీమాతో రైతులకు ప్రయోజనం చేకూరుతోందని, ఈపథకంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తిచేశారు. -
ఆదర్శం ‘జేఎంకేపీఎం’ ఎఫ్పీవో
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం గ్రామాలకు చెందిన 600 మంది రైతులు ఎఫ్పీవో ఏర్పాటు చేసుకున్నారు. తమ ఊరి పేరులోని మొదటి ఆంగ్ల అక్షరంతో ‘జేఎంకేపీఎం’ అనే పేరు పెట్టుకున్నారు. మనోహరాబాద్ వద్ద 14 గుంటల భూమిలో ప్రయోగశాల, యంత్రాలతో కూడిన 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో గోదాం నిర్మాణం చేసుకున్నారు. ఇందులో పసుపు ఉడకబెట్టే, పాలిష్ చేసే, గ్రేడింగ్ చేసే, పసుపు పౌడర్ తయారు చేసే, పసుపు ప్యాకింగ్ చేసే, పసుపు ఆకుతో ఆయిల్ తీసే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. వీటితోపాటు కలిగోట్, జక్రాన్పల్లి గ్రామాల్లో పసుపు ఆకుతో ఆయిల్ తీసే మరో రెండు యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దేశవిదేశాల్లోని వివిధ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని అందుకు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పసుపు ఆయిల్ విషయానికి వస్తే ఫార్మా కంపెనీలకు, ఫ్లోర్లు, టాయిలెట్లు శుభ్రం చేసే రెండురకాల ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఈ ఏడాది రూ.100 కోట్లు, వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఎఫ్పీవో బాధ్యడు పాట్కూరి తిరుపతిరెడ్డి తెలిపారు. వీరు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శకులు అధికసంఖ్యలో దర్శించారు. -
తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చే యకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు నిరాకరించడంతో వాయిదా వేసినట్లు సమాచారం. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి తెయూ(డిచ్పల్లి): యూనివర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లతో సమానంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ధర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రకమిటీ పిలుపు మేరకు తెయూ క్యాంపస్లో నిరసన దీక్షలు చేపట్టిన తెయూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సోమవారం బాజిరెడ్డి జగన్ సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ల్లో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతి లో పని చేస్తున్న వారికి తగిన న్యాయం చేయకుండా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ కి మార్గదర్శకాలు జారీచేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు. వర్సిటీల్లో పని చేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. మేనేజ్మెంట్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి తెయూ(డిచ్పల్లి): మేనేజ్మెంట్ విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, మారుతున్న ధోరణులతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా అనుసరించాలని ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ‘ట్రెడిషనల్ ట్రెండ్స్’ అనే అంశంపై సాంప్రదా య దుస్తుల పోటీలను నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా అధ్యాపకులు వాణి, రాజేశ్వరి, ఈవెంట్ మేనేజర్లుగా వెంకటేష్, మౌనిక, నవిత వ్యవహరించారు. పోటీలో స్వరూప (ప్రథమ), ప్రేమ్కుమార్ (ద్వితీయ), సందీప్ (తృతీయ) బహుమతులు అందుకున్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువపత్రాలను అందజేశారు. ఎస్సైల బదిలీలుఖలీల్వాడి: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతిని, ఆర్మూర్ ఎస్సై–1 మహే ష్ను, మెండోరా ఎస్సై నారాయణను వీఆర్కు అటాచ్ చేశారు. సీసీఎస్లో పని చేస్తున్న రమే ష్ను ఆర్మూర్ ఎస్సై–1గా నియమించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచందా పీఎస్ ఎస్సై మాలిక్ రెహమాన్ను జక్రాన్పల్లి ఎస్సైగా బదిలీ చేశారు. రెండో టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ను మెండోరా ఎస్సైగా నియమించారు. జగిత్యాల్ వీఆర్లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్ను రెండోటౌన్ ఎస్సైగా బదిలీచేశారు. -
ఆకట్టుకున్న రైతు మహోత్సవం స్టాల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల విభాగాలు, పలువురు రైతుల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి సైతం పలువురు రైతులు వచ్చి తమ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ● నందిపేట మండలంలోని చింరాజ్పల్లి గ్రామానికి చెందిన 750 మంది రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకుని పసుపు, మిర్చి పంటలను మార్కెట్ చేసుకుంటున్నారు. వీరు ఏర్పాటు చేసిన స్టాల్లో వారి పంట ఉత్పత్తులను ప్రదర్శించారు. ● జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు 170 దేశీ వరి రకాల సేంద్రియ విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు. ● బీర్కూర్ మండలంలోని మల్లాపూర్కు చెందిన సత్యవతి అనే మహిళా రైతు సుభాష్ పాలేకర్ విధానంలో 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పసుపు, కంది, అరటి పంటలను ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. ఈ మహిళా రైతు స్టాల్ ఆకట్టుకుంది. ● ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు చెందిన తిరుమల్రెడ్డి అనే రైతు ‘నల్లమల హనీబీ పార్క్’ పేరిట తీసుకొచ్చిన నాణ్యమైన తేనె, అదేవిధంగా నిర్మల్కు చెందిన శ్రీనివాస్ అనే రైతు తీసుకొచ్చిన నాణ్యమైన తేనైపె పలువురు ఆసక్తి చూపారు. ● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెన్స్ ఏర్పాటు విషయమై ఏర్పాటు చేసిన స్టాల్ ఆకట్టుకుంది. ప్రతిఒక్కరూ ఇంటిపైన కూరగాయలు సేంద్రియ విధానంలో సాగు చేసుకుంటే ఆరోగకరమైన సమాజం నెలకొంటుందని సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసిన ఈ స్టాల్కు అనేకమంది వచ్చి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు ఈ స్టాల్ను సందర్శించి సందర్శకులకు టెర్రస్ గార్డెన్స్ ప్రాధాన్యత గురించి వివరించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు, రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు -
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
శతాబ్దాల చరిత్రకు, కళాచాతుర్యానికి, అపురూపమైన శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) డిచ్పల్లి మండలం డిచ్పల్లి ఖిల్లా రామాలయం. ఈ ఆలయం క్రీ.శ. 16 వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. డిచ్పల్లి గ్రామానికి చివర సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషీ, గోపురాల మీద ద్రావిడుల సంప్రదాయం కనిపిస్తుంది. ఈ దేవాలయం విజయనగర రాజుల శిల్పకళా రీతిని చూపుతోంది. పదహారో శతాబ్దం మధ్య కాలంలో రామరాయల హయాంలో దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. మరికొందరు.. ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో నిర్మితం కావచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ కట్టడాన్ని వైష్ణవులు నిర్మించారా?.. శైవులు నిర్మించారా? అన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. కాకతీయుల కాలంలోనే వైష్ణవులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని మరికొందరి అభిప్రాయం. గర్భగుడి వద్ద ఉన్న ముఖ ద్వారాలను పరిశీలిస్తే కాళీమాత విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో ఈ గుడి శైవులకు సంబంధించిందనే భావన కలుగుతుంది.ఆలయ గోడలపై గజకేసరి (ఏనుగుపై దాడి చేస్తున్న సింహం) చిత్రాలు మలచబడి ఉన్నాయి. విజయనగర రాజులు, కాకతీయ రాజ్యాన్ని స్వాధీన పరచుకున్నామని చాటడానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించి గజకేసరి విగ్రహాలను చెక్కించారన్నది చరిత్రకారుల అభిప్రాయం. డిచ్పల్లి రామాలయంలో 1947 వరకు ఎలాంటి విగ్రహాలు ఉండేవి కావు. గ్రామ సర్పంచ్ గజవాడ చిన్నయ్య గుప్తా అప్పట్లో రాజస్తాన్ నుంచి శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలను తెప్పించి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అప్పటి నుంచి ఈ చారిత్రక శిల్పకళా నిలయం రామాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ మూల విగ్రహాలను ఇతర దేవాలయాల్లా కాకుండా ఉప పీఠంపై ప్రతిష్టించారు. గర్భగుడి మధ్యలో ఎత్తయిన రాతి సింహాసనం ఉంది. సింహాసనం ఎడమ భాగాన మూల విగ్రహాలను ప్రతిష్టించక ముందు నుంచి.. రెండు విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అనువుగా నిర్ధారిత పరిమాణంలో రెండు సాంచలు (రంధ్రాలు) చేసి ఉన్నాయి. మొదట్లో దేవాలయం చేరడానికి మెట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో దేవాలయం చేరుకోవడానికి 125 మెట్లు నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. 1971 వరకు డిచ్పల్లి సర్పంచ్గా పని చేసిన గజవాడ చిన్నయ్య ఆలయం అభివృద్ధికి విశేష కృషి చేశారు. నిత్య నైవేద్యం, పూజలు చేయడానికి అర్చకుడిని ఏర్పాటు చేశారు. అర్చకుడి కుటుంబ జీవనోపాధికి రెండు ఎకరాల భూమిని దేవాలయం పేరిట ఏర్పాటు చేశారు.ఏటా రెండుసార్లు కల్యాణోత్సవాలు.. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాడ్యమి వరకు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. త్రయోదశి రోజు శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీసీతారామస్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఇలా ఏటా రెండుసార్లు స్వామి వారి కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆలయం దక్షిణ దిక్కున సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. చెరువు మధ్యలో మండపం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాతి కట్టడం.. ఆలయం చుట్టూ చక్కగా మలచిన రాతి స్తంభాలు ఉన్నాయి. స్తంభాల పీఠభాగాలు రెండున్నర మీటర్ల చుట్టు కొలతను కలిగి ఉంటాయి. దేవాలయం నిర్మాణం చాలా వరకు నల్లరాయితోనే చేశారు. ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అప్పట్లో గోపురం ఉండేది కాదు. కొద్ది సంవత్సరాల క్రితం సిమెంట్తో గోపురం నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఆలయానికి శిల్పకళలో అగ్రస్థానం లభిస్తుంది. గిచ్చు బొమ్మలు.. ఈ ఆలయం గోడలపై గిచ్చు (శృంగార) బొమ్మలు చెక్కి ఉన్నాయి. గతంలో నిజాం రాజు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని వర్తమానం రాగా, ఆయన ఈ బొమ్మలను చూసి ఎలా స్పందిస్తారోనని స్థానికులు వీటిపై సిమెంట్ పూశారు. అయితే పూర్వీకులు ఏ ఉద్దేశంతో వీటిని చెక్కారో తెలియదని, వాటిని అలాగే ఉంచాలని నిజాం రాజు ఆదేశించడంతో సిమెంట్ను తొలగించారు.అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యం ఆలయంపై గజకేసరి శిల్పాలతో పాటు ఇతర శిల్ప కళ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. నాట్యమాడుతున్న నెమళ్లు, పోట్లాడుతున్న జింకలు, పడగ విప్పిన నాగరాజు, విష్ణువు దశావతారాలు, ఐదు తలల ఆవు, తాబేలు (Tortoise) ఆకారం ఇలా పలు చిత్రాలు కనువిందు చేస్తాయి.ఆలయం పక్కనే చెరువు.. మధ్యలో మండపం డిచ్పల్లి ఖిల్లా రామాలయం (Dichpally Ramalayam) పక్కనే విశాలమైన చెరువు.. చెరువు మధ్యలో రాతి మండపం ఉన్నాయి. వేసవి కాలంలో చెరువులో నీళ్లు తగ్గిపోయిన తర్వాత.. ఈ రాతి మండపంలో అప్పటి కళాకారుల నృత్య ప్రదర్శనలు జరిగేవని పూరీ్వకులు తెలిపారు. రామాలయం నుంచి మండపానికి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయానికి వెళ్లడానికి సొరంగాలు ఉండేవని ప్రస్తుతం వాటిని మూసివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కృషితో.. ఆలయ పర్యాటకంలో భాగంగా చెరువులో బోటింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం త్వరలో చర్యలు చేపట్టనుంది.డిచ్పల్లి ఖిల్లా రామాలయం ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఉన్నది 11.4 టీఎంసీలే..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం గణ నీయంగా తగ్గింది. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి (2024 జూన్ నుంచి 2025 ఏప్రిల్ వరకు) 289 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. వరద, ఎస్కేప్ గేట్ల ద్వారా మిగులు జలాలను, కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆవిరితో కలుపుకుని మొత్తం 285 టీఎంసీల నీరు వెళ్లిపోగా ఈ ఏడాదిలో వచ్చిన ఇన్ఫ్లోలో మిగిలింది కేవలం 4 టీఎంసీలు మాత్రమే. ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ 5 టీంసీలు కాగా, వరద వచ్చే సమయానికి ప్రాజెక్టులో 7.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని కలుపు కుని ప్రస్తుతం ప్రాజెక్ట్లో 11.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 117 టీఎంసీలు గోదావరి పాలు ఈ ఏడాది ఇన్ఫ్లో కొనసాగిన సమయంలో వరద గేట్ల ద్వారా 108, ఎస్కేప్ గేట్ల ద్వారా 9 టీఎంసీలు మొత్తం 117 టీఎంసీల నీరు గోదావరికిలోకి వదిలేశారు. మొత్తం ఇన్ఫ్లో 289 టీఎంసీలు కాగా.. 117 టీఎంసీల నీరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. 172 టీఎంసీల నీరు మిగలగా అందులో వరద కాలువ ద్వారా 49 టీఎంసీలు విడుదల చేయగా 12 టీఎంసీల నీరు ఆవిరైంది. తాగు నీటి అవసరాలకు 6 టీఎంసీల నీటిని వినియోగించారు. ఆయకట్టుకు 101 టీఎంసీల నీటిని వినియోగించారు. దీనిలో సింహభాగం కాకతీయ కాలువకు విడుదల చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఏ కాలువ ద్వారా ఎంత నీటిని విడుదల చేశారో స్పష్టమైన లెక్కలు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 11.44 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, డెడ్ స్టోరేజీ 5 టీఎంసీలు పోగా మిగిలేది 6.44 టీఎంసీలు మాత్రమే. ఆవిరిపోను మిగిలిన నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. పూడిక కారణంగా ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 32 టీఎంసీలు తగ్గిపోయింది. భవిష్యత్లో మరింత పూడిక పేరుకుపోతే ప్రాజెక్ట్ కేవలం తాగు నీటి అవసరాలకే ఉపయోగపడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నీటి నిల్వసామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈ ఏడాది ఇన్ ఫ్లో 289 టీఎంసీలు గణనీయంగా తగ్గిన ఎస్సారెస్పీ నీటిమట్టం భారీ వరద వచ్చినా ఫలితం లేదు డెడ్ స్టోరేజీ పోను మిగిలేది 6.44 టీఎంసీలే.. -
ఆరుగురిపై మైనర్ డ్రైవింగ్ కేసులు
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో వాహనాలు న డుపుతూ పట్టుబడ్డ ఆరుగురు మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్ర సాద్ తెలిపారు. నగరంలోని కంఠేశ్వర్ బైపా స్ ఎక్స్ రోడ్, దుబ్బ బైపాస్ ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో ఆదివారం తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్లు ధ రించని 371మంది వాహనదారులతోపాటు రాంగ్రూట్లో వాహనం నడుపుతున్న 36 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. తనిఖీల్లో ఆర్ఐ(ఏఆర్) శేఖర్, ఎస్సైలు రమేశ్, సుమన్, రహమతుల్లాతోపాటు 25మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. భూ భారతితో వివాదాలకు శాశ్వత పరిష్కారంపెర్కిట్/డొంకేశ్వర్(ఆర్మూర్): భూ భారతి చట్టంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూభారతిపై ఆలూ ర్, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా అసలైన హక్కుదారుకు భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోందని, మే మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పో ర్టల్ అందుబాటులోకి వస్తుందన్నారు. రెవె న్యూ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి దర ఖాస్తులు స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపనున్నట్లు పేర్కొన్నారు. భూ వివాదాల్లో కోర్టులకు వెళ్లే పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందుతుందన్నారు. ఆధార్కార్డు మాదిరిగానే ప్రతి రైతుకు భూములకు సంబంధించిన భూధార్ కార్డు కేటాయిస్తామని తెలిపారు. సదస్సులో జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజాగౌడ్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వివాహ వేడుకలో ఉమ్మడి జిల్లా నేతలు నిజాంసాగర్: జిల్లా కేంద్రంలోని సత్య కన్వె న్షన్లో ఆదివారం జిల్లా పరిషత్ మాజీ చైర్మ న్ దఫేదార్ శోభ రాజు దంపతుల పెద్ద కూ తురు కీర్తన వివాహం జరిగింది. వ్యవసా యశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రె డ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారె డ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్రాజ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, ఏనుగు రవీందర్రెడ్డి, సౌదాగర్ గంగారాం, జనార్దన్ గౌడ్, అరుణతార, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఖలీల్వాడి: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యక్రమానికి హాజరైన పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన స్థానిక ప్రజలు మంటలను ఆర్పివేస్తే ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు పి.నర్సింగ్ రావు, మధుసూదన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సీపీ పోతరాజు సాయిచైతన్య -
ఆ గ్రామాల్లోనే ఇందిరమ్మ
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం భారీగా ఉన్నా పనుల్లో పురోగతి అంతంత మాత్రమే కనిపిస్తోంది. సాంకేతిక అనుమతులు ఇవ్వడంలో జాప్యం, గృహ నిర్మాణ సంస్థలో అరకొర సంఖ్యలో ఉద్యోగులు ఉండడం, వారిపై తీవ్రమైన పనిభారం తదితర కారణాలతో ఆశించిన వేగం కనిపించడం లేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. జిల్లాలోని 31 గ్రామాల్లో 2,762 ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఆమోదం తెలిపారు. ఇందులో 654 ఇళ్ల నిర్మాణ పనులు మొదలు కాగా, 107 మాత్రం బేస్మెంట్ దశకు వచ్చాయి. ఇప్పటి వరకు తొలి విడత సాయం రూ.లక్ష చొప్పున కేవలం 65 మంది ఖాతాల్లో జమయ్యాయి. వాస్తవానికి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తొలి విడతలో కేవలం ఎంపిక చేసిన గ్రామాలలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండగా ఇతర గ్రామాల్లో అనుమతి ఇవ్వక పోవడంతో భారీ లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ సంస్థను ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఇద్దరు డీఈలు, ఇద్దరు ఏఈలతోనే నెట్టుకువస్తోంది. అదనంగా ఇంజినీర్లను నియమించి చెల్లింపుల్లో వేగం పెంచడం, మంజూరు ఇస్తేనే ఆశించిన విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇతర గ్రామాల్లో విస్తరణకు నోచుకోని ఇళ్ల పథకం మొదటి దశలో 65 మందికి మాత్రమే అందిన రూ.లక్ష సాయం పని భారం పెరిగింది గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం తీవ్రమైంది. గతంలో నియోజకవర్గానికి ఒక ఏఈ, మండలానికి ఇద్దరు ముగ్గురు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. – సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ ఏఈఈ -
పాఠశాలల కుదింపు ప్రయత్నాలను విరమించుకోవాలి
నిజామాబాద్ అర్బన్: పాఠశాలల కుదింపు ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. శామ్యూల్ హితవు పలికారు. జిల్లా కేంద్రంలో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటైన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ప్రజల పిల్లలందరికీ నాణ్యమైన ఉచితమైన విద్యనందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విద్యా రంగ లక్ష్యాలు నెరవేరాలంటే కామన్ స్కూల్ విద్యా విధానం ఒకటే పరిష్కార మార్గమని, ఈ విధానాన్ని అమలు చేయాలని డాక్టర్ డీఎస్ కొఠారి కమిషన్ 1966లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని తెలిపారు. కానీ నేటికీ ప్రభుత్వాలు కామన్ స్కూల్ విధానం అమలు చేయాలనే ఆలోచన చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా కామన్ స్కూల్ విధానంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కౌన్సిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వార్షిక కౌన్సిల్స్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య అధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజీ డీటీఎఫ్ కార్యకలాపాలపై కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై సుదీర్ఘంగా కౌన్సిల్లో చర్చించిన అనంతరం నివేదికను ఏకగ్రీవంగా కౌన్సిల్ ఆమోదించింది. డీటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కామన్ స్కూల్ విధానం అమలు చేయాలి డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ -
చిన్నారులను బలిగొన్న లారీ
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ● ఒకరికి తీవ్రగాయాలుఆర్మూర్టౌన్: వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తు న్న ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారి బైపాస్ మార్గంపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓంకార్(14), భానుప్రసాద్(11) అనే ఇద్దరు బాలురు దుర్మరణం చెందగా విశ్వనాథ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన బంజ విశ్వనాథ్, లక్ష్మి దంపతుల కుమారుడు ఓంకార్ జక్రాన్పల్లి మండలం అర్గుల్ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓంకార్ ఇంటి పక్కనే ఉండే స్నేహితుడు భానుప్రసాద్తో కలిసి ఉదయం వరకు ఆడుకున్నారు. కాగా, విశ్వనాథ్ పెర్కిట్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓంకార్, భాను ప్రసాద్ను తీసుకొని బైక్పై బయలుదేరాడు. పెర్కిట్ జాతీయ రహదారి బైపాస్ మార్గం వద్ద రోడ్డు దాటుతుండగా నిర్మల్ వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. భానుప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు విశ్వనాథ్, ఓంకార్ను పోలీసులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఓంకార్ మరణించాడు. విశ్వనాథ్ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఇరుకుటుంబాల వారు తమ పిల్లలు ఇక లేరని తెలుసుకొని గుండెలవిసేలా విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. -
వక్ఫ్బోర్డు సవరణపై సుప్రీంలో పిటిషన్ వేశా
నిజామాబాద్ సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ ముస్లిం సమాజాన్ని బలహీనపర్చే కుట్ర పన్నారని, అందులో భాగమే వక్ఫ్ బోర్డ్ స వరణ అని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సల హాదారు మహ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. బీజే పీ ప్రభుత్వ చర్యను ముస్లిం సమాజం తీవ్రంగా వ్య తిరేకిస్తోందన్నారు. వక్ఫ్బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అ నంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వక్ఫ్బోర్డు ఆ స్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవా లని చూస్తోందని, వక్ఫ్బోర్డు చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్బిల్లును అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామన్నారు. రాహుల్గాంధీ ఆదేశాలతో తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దా ఖలు చేశానని, దానిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిందని తెలిపారు. ఈ కేసును సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ బృందం వాదిస్తోందన్నారు. ముస్లిం సమాజాన్ని బలహీనపర్చే కుట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ -
అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది..పార్టీ పని అయిపోయిందని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని.. ఖబర్దార్ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటేనని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలియకుండా మాట్లాడితే వారికి తగిన గుణపాఠం చెబుతామని మండిపడ్డారు. ఆదివారం మండలంలోని రాంనగర్, శాస్త్రినగర్, శ్రీనగర్ గ్రామాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందన్నారు. కల్వాకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓడించినా సిగ్గురాలేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ చంద్రశేఖర్ గౌడ్, గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, అగ్గు భోజన్న, ఒడ్డెన్న, నగేష్, శ్రీనివాస్, మోహన్, రాంజేంద్ర ప్రసాద్, కిరణ్, రాజు, దత్తన్న, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే.. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి -
ఫ్రూట్ సలాడ్ కోసం వెళ్తే రూ. లక్ష మాయం
బాన్సువాడ : ఫ్రూట్ సలాడ్ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి రూ. లక్ష నగదును పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి శనివారం బాన్సువాడలోని ఓ బ్యాంకులో రూ. లక్ష నగదును డ్రా చేసుకుని ఫ్రూట్ సలాడ్ తాగేందుకు కూల్డ్రింక్ దుకాణానికి వెళ్లాడు. ఫ్రూట్ సలాడ్ తాగుతున్న సమయంలో చేతిలో ఉన్న నగదు కవరును టేబుల్పై పెట్టి సలాడ్ తాగి కవర్ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అక్కడికి రాగా నగదు ఉన్న కవర్ కనిపించలేదు. అక్కడున్న సీసీ కెమెరాను పరిశీలించగా ఓ యువకుడు కవరును తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కేసు నమోదు రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్లో మూడు గడ్డివాములు దగ్ధమైన ఘటనలో నందిగామ ప్రవీణ్పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున సంగోళ్ల వినోద్, పట్ల సాయిలు, నరోజి లచ్చయ్య గడ్డివాములకు నిప్పంటించి ప్రవీణ్ పారి పోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు లేకుండా టేకు చెట్ల నరికివేత ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేసిన ఘటనపై కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేశారన్న సమాచారం మేరకు కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, సెక్షన్ ఆఫీసర్ గోపాల్ పరిశీలించారు. నాలుగు చెట్లను నరికి టేకు దుంగలను ఓగదిలో ఉంచిన దానిని పరిశీలించడంతో పాటు, నరికి వేసిన టేకు చెట్ల కొలతలను తీసుకున్నారు. నరికిన టేకు దుంగల విలువ సుమారు రూ. 30 వేల వరకు ఉంటుందన్నారు. టేకు దుంగలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని డీఆర్వో తెలిపారు. -
దొడ్డు వడ్లు కొంటలేరు సారూ!
సిరికొండ: కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం వడ్లు కొంటలేరు సారూ అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్లో ఎక్కువ మంది రైతులు సన్న రకం వడ్లను సాగు చేయగా, కొద్ది మంది రైతులు దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. ముషీర్నగర్, తూంపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో దొడ్డు రకం వడ్లకు అనుమతి రాక కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. దొడ్డు రకం వడ్లను ఎండబెట్టి కుప్పలు పోసి ఉంచామని, అకాల వర్షాల నుంచి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నామని ముషీర్నగర్కు చెందిన బట్టు లింబా అనే రైతు వాపోయారు. -
ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండగ
ధర్పల్లి: దుబ్బాకలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇంటికొక్క బోనం చొప్పున, డప్పుచప్పుళ్ల నడుమ మహిళలు, యువకులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా పెద్దమ్మ గుడికి తరలి వెళ్లారు. పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దరఖాస్తుల ఆహ్వానంరుద్రూర్: మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం(ఇంగ్లీ్ష్ మీడియం)లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రత్యేకాధికారిణి బి.శ్యామల తెలిపారు. ఆరో తరగతిలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయ ని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు స్కూల్ బోనాఫైడ్, ఆధార్ కార్డు, కుల, ఆదాయ, జనన, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొ టోలు జతపర్చాలని పేర్కొన్నారు. అర్హత, సీట్ల కే టాయింపులో అనాథలు, తల్లి, తండ్రి లేని వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేస్తామన్నారు. -
బొప్పాపూర్లో పోలీసులకు చేదు అనుభవం
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్లో మహిళ మృతి విచారణకు వెళ్లిన పోలీసులకు చేదు అను భవం ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగవ్వ(50) ఆదివారం ఉదయం మృతి చెందింది. మహిళది సహజ మరణం కాదంటు మండల కేంద్రంలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయమై విచారణ నిమిత్తం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్లారు. అప్పటికే శవయాత్ర కొనసాగుతోంది. శవయాత్రను అడ్డుకున్న పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దింపుడు కళ్లెం దాటిన తర్వాత ఆపితే గ్రామానికి అరిష్టం వస్తుందని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టంకు అంగీకరించేది లేదంటూ శ్మశాన వాటికలో దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళ సహజంగానే మరణిస్తే పోలీసులతో ఎందుకు వాగ్వాదానికి దిగారు. పోస్ట్మార్టం చేయడానికి అంగీకరించక పోవడం అనుమానానికి తావిస్తోంది. పోలీసులు మహిళ ఎలా మృతి చెందిందనే విషయమై గ్రామంలో విచారణ చేపడుతున్నారు. -
విజేతలకు సీపీ సన్మానం
నిజామాబాద్ అర్బన్: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నగర అగ్నిమాపక శాఖ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఆయా విభాగాలలో విజేతలుగా ని లిచారు. వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన లక్ష్మీమేఘన(9వ తరగతి), డ్రాయింగ్ పోటీలలో వైభవి(7వతరగతి) విజేతలుగా నిలిచారు. ఆదివారం పోలీసు కమిషనర్ సాయిచైతన్య.. మెమోంటోలతో విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కో–కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గొప్ప కార్యం ఉపనయనాలు’
నిజామాబాద్ రూరల్: వేద రక్షణ కోసం ధార్మిక వికాసానికి ఉచిత ఉపనయన సంస్కారం నిర్వహించడం గొప్ప కార్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. 23న సుభాష్నగర్ శ్రీ రామాలయంలో 21 మంది వటువులకు ఉచిత ఉపనయ సంస్కార మహోత్సవానికి ఆహ్వానిస్తూ నిర్వాహకులు జయంత్ కుమార్, రొట్టె సురేష్ శర్మలు ఆదివారం అర్బన్ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. గొప్ప కార్యం చేయడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఉచిత ఉపనయనాల మహోత్సవానికి బ్రాహ్మణ బంధువులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. డంపింగ్ యార్డులోని మంటలను అరికట్టండి బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారు మున్సిపల్ డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సబ్కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. ఆదివారం పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలను మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణతో కలిసి పరిశీలించారు. జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. మంటలు చెలరేగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వనజీవి రామయ్యకు ఘన నివాళులు ఆర్మూర్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. నేటి యువతరం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పర్యావర ణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలన్నారు. కార్యద ర్శి రాస ఆనంద్, గౌరవ సభ్యుడు కాంతి గంగారెడ్డి, చరణ్ రెడ్డి, విజయసారథి, పట్వారి గోపి కృష్ణ్ణ, రాధా కిషన్, ప్రాజెక్ట్ చైర్మన్ పట్వారి తులసి, ఖాందేశ్ సత్యం, మారుతి, నరేష్ తదితరులున్నారు. ప్రారంభమైన ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్, బాలికల పాఠశాల, బాలుర, పెర్కిట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నేడు శివాలయంలో ప్రత్యేక పూజలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ఆలయ పరిసర ప్రాంతాల్లో పల్లకిసేవ నిర్వహించనున్నట్లు కమిటి సభ్యులు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మాక్లూర్: సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు మంజూరైన లబ్ధిదారులకు ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్రావు చెక్కులను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన బి సత్యెమ్మకు రూ.12 వేలు, కృష్ణానగర్కు చెందిన నాగేశ్వర్రావుకు రూ.60 వేలు మంజూరయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్రెడ్డి సూచన మేరకు ఆ చెక్కులను వెంకటేశ్వర్రావు లబ్ధిదారులకు అందజేశారు. నాయకులు జాఫర్, అలీమ్, స్వామి, శ్రీను, రాజు, పార్టీ మీడియా మండల కన్వీనర్ జైల్సింగ్ పాల్గొన్నారు. -
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం
నిజామాబాద్ సిటీ: ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకం సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న చరిత్రాత్మిక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 17వ డివిజన్ అంబేడ్కర్నగర్లో దళితులతో కలిసి వారి ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలన్నారు. నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నాయకులు రత్నాకర్, జావెద్ అక్రమ్, పంచరెడ్డి సుదర్శన్, స్థానిక నాయకలు పాల్గొన్నారు. ముప్పై ఏళ్ల కల నెరవేరింది నిజామాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం భాషా పండితుల 30 ఏళ్ల కల నెరవేర్చిందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నగ రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున పదోన్నతులు లభించినందుకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున వేతనాలు అందింస్తోందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే విద్యా వ్యవస్థ ఎంతో మెరుగుపడిందన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. కురుమ సంఘ భవనం ప్రారంభం నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కురుమ సంఘం కమ్యూనిటీ హాల్ను నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి షబ్బీర్ అలీ ప్రారంభించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో అన్ని కులాలు, అన్ని మతాలవారికి సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ఎజెండా అన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
రాజంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ అనిత గణేశ్లకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడైన మాలోత్ చిన్న(3) శనివారం సాయంత్రం ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్పై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు ట్రాక్టర్ గేర్ను న్యూట్రల్ మార్చడంతో కదిలింది. ట్రాక్టర్ ట్రాలీతోపాటు రివర్స్లో వెనక్కి వెళ్తుండడంతో భయాందోళనకు గురైన బాలుడు ట్రాక్టర్పై నుంచి కింది దూకే ప్రయత్నంలో టైర్ కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. నీట మునిగి వృద్ధురాలు..మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేటలో కోలాపురం లక్ష్మి(62) అనే వృద్ధురాలు ఆదివారం నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం చెరువులో శవమై తేలింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ..మాక్లూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతను అనారోగ్యానికి గురికావడంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. -
నాణ్యతా ప్రమాణాలు హుష్కాకి..!
నిజామాబాద్నాగారం: హడావుడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం కాంట్రాక్టర్లకు అలవాటైపోయింది. అందుకే రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు తదితర పనుల్లో కనీస నాణ్యత ప్రమాణాలు కనిపించడం లేదు. పది కాలాలు ఉండాల్సిన నిర్మాణాలు కొన్ని రోజులకే వాటిలోని డొల్లతనం బయటపడుతోంది. పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్భండార్ నుంచి దాస్నగర్ వరకు వెళ్లే రహదారికి ఇరుపక్కలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారే గానీ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. డ్రైనేజీ నిర్మాణంలో నాసిరకం కంకర, ఇసుక వాడుతున్నారు. స్లాబ్ వేసిన తర్వాత క్యూరింగ్ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ కోసం తవ్విన మట్టినే మళ్లీ మాత్రమే వాడుతున్నారు. మొరం వాడటం లేదు. నీళ్లు కూడా సక్రమంగా పెట్టడం లేదు. అలాగే గోల్హనుమాన్ నుంచి వీక్లీ మార్కెట్ వరకు వెళ్లే రహదారిలో, వంద ఫీట్ల రోడ్డులో డ్రైనేజీలు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే నిర్మిస్తున్నారు. మాణిక్భండార్ నుంచి దాస్నగర్ వరకు డ్రెయినేజీల నిర్మాణం పనుల్లో కనిపించని నాణ్యత పర్యవేక్షించని అధికారులు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి నగరంలో మాణిక్భండార్ నుంచి దాస్నగర్ వరకు డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణం అంతా నాసిరకంగా ఉంది. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. స్లాబ్లపై నీరు పోయడం లేదు. మొరం వేయడం లేదు. నాసికరం పనులు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తాం. – గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అఖిల భారత రైతు కూలీ సంఘం -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
బోధన్: తనపై ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కక్షసాధింపు చర్యలను మానుకుని నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించగా షకీల్ హాజరై మాట్లాడారు. తనతోపాటు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టెర్రరిస్ట్తో వ్యవహరించినట్లు తన ఇంటికి 300 మంది పోలీసులను పంపించి ఆడపిల్లలు, చిన్న పిల్లలని చూడకుండా భయానక వాతావరణం సృష్టించి ఇబ్బందులకు గురి చేశారన్నారు. రూ.వందల కోట్ల రైతుల ధాన్యం దండుకుని దుబాయి పారిపోయినట్లు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలు ఏవీ తన వద్ద లేవన్నారు. ఏడాదిన్నర కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిపై ఎమ్మెల్యేను నిలదీయాలని ప్రజలను కోరారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యేతో బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలన సువర్ణాధ్యాయం పదేళ్ల కేసీఆర్ పాలన దేశచరిత్రలోనే సువర్ణాధ్యాయమని షకీల్ అన్నారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీంద్రయాదవ్, గిర్దావర్ గంగారెడ్డి, నర్సింగ్రావు, శ్రీరాం, సంజీవ్, గోగినేని నర్సయ్య, భూంరెడ్డి, శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధిపై ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డితో చర్చించేందుకు సిద్ధం బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ -
సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని వినతి
నిజామాబాద్ రూరల్: రూరల్ పరిధిలోగల మహాలక్ష్మీనగర్ కాలనీ–2 డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కాలనీవాసులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని కంఠేశ్వర్ బైపాస్ వద్ద గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సీసీ రోడ్లు లేవని, అదేవిధంగా డ్రైనేజీలు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీ వాసులు మహేష్ రెడ్డి, సాయిలు, రవి, నామసింగ్, మూర్తి, మహేందర్, సత్యనారాయణ, మధు, గజ్జెల శంకర్, గంగాధర్, నాగరాజు శర్మ .హరిష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా
మోపాల్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అండగా ఉంటామని పార్టీ నియోజకవర్గ నాయకులు బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నగర శివారులోని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాసంలో మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ , కాంగ్రెస్ నాయకులు జగన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కార్యకర్తలను బీఆర్ఎస్ కాపాడుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుపొంతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు సిద్ధార్థరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రూప్సింగ్ బీఆర్ఎస్లో చేరారు. నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ఎడపల్లి(బోధన్): పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన పైలట్ గ్రామంలోనే నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు ఇళ్లు కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. అందుకు నిదర్శనమే జిల్లాలోని ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. ఈ గ్రామంలో 128 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, అందులో 50 శాతం అనర్హులే కావడం విశేషం. లిస్టు బయటపెట్టిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లతో జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిరుపేదలకు దక్కాల్సిన ఇళ్లు.. అనర్హులకు మంజూరయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు లబ్ధిదారుల జాబితాను జీపీ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని గ్రామ కార్యదర్శితోపాటు ఎంపీడీవోను కో రగా, జాబితాను బహిర్గతం చేయడం కుదరదని తే ల్చిచెప్పినట్లు తెలిసింది. దీంతో గ్రామస్తులు జిల్లాస్థాయి అధికారి ద్వారా జాబితాను సేకరించగా అస లు విషయం బయటపడింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఐడీ నంబర్ 209875/ 2713888, 2082560 గల వ్యక్తులు జైతాపూర్ వాసులు కాకపోయి నా ఇళ్లు మంజూరు చేశారు. ఐడీ నంబర్ 5012883, 4787 506, 1911135, 1906291, 5606656, 10525 70, 2993051, 3305306, 1202490, 1183243 గల ఐదు కుటుంబాల్లో అత్తాకోడళ్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఐడీ నంబర్ 1548319, 3709213లో ఓ వ్యక్తికున్న ఇద్దరు భార్యల పేరిట ఇళ్లు మంజూరయ్యాయి. ఐడీ నంబర్ 200168, 3723934 గల వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు. వీరి భార్యల పేరిట కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలనూ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పథకం పక్కదారి పట్టకుండా చూడాల్సిన ఇందిరమ్మ కమిటీలు చోద్యం చూస్తున్నాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన విషయం అధికారుల దృష్టికి వచ్చినా స్పందన కరువైంది. అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు పైలట్ గ్రామంలో 50శాతం అనర్హులు.. లబ్ధిదారుల జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలు బయటపెట్టిన గ్రామస్తులు కలెక్టర్కు నివేదిస్తాం.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కొందరికి ఒకే కుటుంబంలో రెండు ఇళ్లు మంజూరైన విషయం వాస్తవమే. విచారణ చేపట్టి వాటిని తొలగించడానికి కలెక్టర్కు నివేదిస్తాం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఆర్టీసీ ఉద్యోగి పేరు ఇప్పటికే తొలగించాం. ఇంకా అనర్హులుంటే విచారణ జరిపి వారి పేర్లనూ తొలగిస్తాం. – నగేశ్, పంచాయతీ కార్యదర్శి, జైతాపూర్ -
నేటి నుంచి రైతు మహోత్సవం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం నుంచి బుధవారం వరకు రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. వ్యవసాయ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమం పురస్కార గ్రహీతలైన అ భ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు వేదిక కా నుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇందుకోసం సుమారు 150 స్టాల్స్ ఏర్పా టు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాస్త్రవేత్తలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహిస్తారని, అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి మూడు రోజులపాటు కార్యక్రమం వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్ల ప్రదర్శన గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి -
రేపటి నుంచి రైతు మహోత్సవం
నిజామాబాద్అర్బన్: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం నిర్వహించనున నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు శనివారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న రైతుమహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొని వారు పండించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని, సహజ పద్ధతుల్లో పంటల సాగు, యాంత్రీకరణ, అధునాతన వంగడాలు, పసుపు ఆధారిత ఉత్పత్తులతోపాటు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 150 వరకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయం, అను బంధ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, బ్యాంకు లు, స్టార్టప్ కంపెనీలు, ఎఫ్పీవోలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు సాగు రంగంలో అవలంబించాల్సిన ఆధునిక విధానాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన పద్ధతులు, పెట్టుబడులను తగ్గించుకోవడం, అధిక లాభాలను అందించే పంటల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. ప్రగతిశీల అవార్డు గ్రహీత రైతులు తమ అనుభవాలను తోటి రైతులతో పంచుకుంటారని తెలిపారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన రైతు మహోత్సవ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతు మహోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వ్యవసాయ కమిషనరేట్ నుంచి హాజరైన ఏడీఏలు హుస్సేన్బాబు, వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్న శాస్త్రవేత్తలు సుమారు 150 స్టాళ్ల ఏర్పాటు గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు ఆదేశంఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి సుభాష్నగర్: జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి కోరారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ద్వారా లాభసాటి వ్యవసాయం, రైతుకు అధిక దిగుబడి వచ్చే అంశాలు, డ్రోన్ వ్యవసాయం, వివిధ రకాల వంగడాలకు సంబంధించిన స్టాళ్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గోర్కంటి లింగన్న, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ
నిజామాబాద్అర్బన్: జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అ నుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు, తాగునీ టి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎ స్ చౌహాన్తో కలిసి సంబంధిత శాఖల మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క శనివారం వీడియో కా న్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల వివరాలను కలెక్టర్ హనుమంతు వివరించారు. యాసంగిలో జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటికే 3.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు. ఇందులో ఎక్కువ మొత్తం సన్న ధాన్యం ఉండగా, దొడ్డు రకం ధాన్యం కేవలం 12 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు ధాన్యం కొను గోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. డిఫాల్ట్ లేని రైస్ మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయిస్తూ, మిల్లుల వద్ద దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకున్నామ న్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమా ర్, డీఆర్డీవో సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హనుమంతు వెల్లడి కొనుగోళ్లపై వీసీ ద్వారా సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, సీతక్క -
స్విమ్మింగ్పూల్లో యువకుడి మృతి
మృతుడు మెదక్ జిల్లా చేగుంటవాసి భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న స్విమ్మింగ్పూల్లో మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి చెందిన యువకుడు శనివారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేగుంట మండల కేంద్రానికి చెందిన తిరుపతి సంజయ్ అలియాస్ లాల్ (21) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెర్వులోని బంధువుల ఇంటికి వచ్చాడు. వారితో కలిసి పెద్దమల్లారెడ్డిలో ఉన్న ప్రైవేట్ స్విమ్మింగ్పూల్లో ఈత కొట్టేందుకు వచ్చాడు. ఈత కొడుతుండగా తలకు గాయమై ఫిట్స్ రావడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే సంజయ్ను ఒడ్డుకు తీసుకొచ్చి 108లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, సంజయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి మంజుల ఉంది. మృతదేహాన్ని చేగుంటకు తరలించారు. అపరిశుభ్ర హోటళ్లకు జరిమానా నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్ సిబ్బందితో కలిసి నగరంలోని పలు హోటళ్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న టీ హోటళ్లు అపరిశుభ్రంగా ఉండడంతో వారికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. కంఠేశ్వర్ బైపాస్లోని లహరి హోటల్లో పాడైపోయిన చికెన్ను గుర్తించి, నిర్వాహకులకు రూ. 10 వేల ఫైన్ వేశారు. ముబారక్నగర్, కుమార్గల్లి, ఖలీల్వాడీల్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టి రూ.45 వేల జరిమానా విధించినట్లు ఏఎంసీ జయకుమార్ తెలిపారు. వారి వెంట శానిటరీ ఇన్స్పెక్టర్లు షేక్ షాదుల్లా, కృష్ణ, జవాన్లు, సిబ్బంది ఉన్నారు. ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఆటో బో ల్తా పడి విద్యార్థులకు గా యాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్లోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు తరగతులు ముగించుకొని రోజూ మాదిరిగానే ఆటోలో మొత్తం 9 మంది ఇంటికి బయల్దేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో సాత్విక్, శ్రీవల్లి అనే విద్యార్థులకు గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. డ్రైవర్ రోజూ టాటాఏస్ వ్యాన్ తీసుకువచ్చేరని అది రిపేర్కు వెళ్లడంతో ఆటో తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పీడీఎస్యూ నాయకులు మమత, వినోద్, సిద్ధు గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కీచక ఉపాధ్యాయుడిపై మరో కేసు రామారెడ్డి: పోక్సో కేసులో బెయిల్పై వచ్చి బాధితులను బెదిరించిన ఉపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. రామారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు మహేశ్పై ఇటీవల విద్యార్థినులు షీటీంకు సమాచారం ఇచ్చారు. షీ టీం సభ్యులు విచారణ చేసి రెండ్రోజుల క్రితం మహేశ్పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై బయటికి వచ్చిన మహేశ్ .. బాధితులను తీవ్రంగా బెదిరించగా శనివారం మరో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
అక్రమార్కులకు శిక్ష పడాలి
ఖలీల్వాడి: అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారికి శిక్ష పడేలా చూడాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ పీ లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాదక ద్రవ్యాల కేసులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమందు, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకై న్ మొదలైన మాదకద్రవ్యాల కేసులో ముద్దాయిలకు శిక్ష పడేలా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధకంతో విద్యార్థులు, యువకులకు తోడ్పాటును అందించనట్లవుతుందని తెలిపారు. అనంతరం నూతనంగా నియామకమైన కామారెడ్డి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీ సూర్యప్రసాద్ను సత్కరించారు. సమావేశంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీసు రాజేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ గౌడ్, రాజారెడ్డి, డీ సూర్యప్రసాద్, బంటు వసంత్, దామోదర్ రెడ్డి, కావేటి శేషు, శ్రీనివాస్ ఖాందేశ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జీ రామకృష్ణ, భూసారపు రాజేశ్ గౌడ్, అశోక్ శివరాంనాయక్, చిదిరాల రాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జికి సన్మానం బదిలీపై వెళుతున్న జిల్లా జడ్జి సునీతా కుంచాలను ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య మాట్లాడు తూ విధి నిర్వహణలో భాగంగా జిల్లా జడ్జిగా ఎంతో సామరస్యంగా ఎన్నో కేసులలో జీవితా కారాగార శిక్ష విధించారన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనర్సయ్య -
ఏకచక్రేశ్వరుడి సన్నిధిలో గజ్జె పూజ
బోధన్: బోధన్ ఏకచక్రేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ నాట్యతరంగిణి కూచిపూడి నృత్యాలయం విద్యార్థుల తొలి గజ్జె పూజ వేడుకలు ఆద్యంతం వైభవంగా సాగాయి. నృత్యాలయం వ్యవస్థాపకులు, నాట్యచార్యులు కర్ణం శ్రీనివాస్, సతీమణి కర్ణం తిరముల నేతృత్వంలో కూచిపూడి నాట్యం నేర్చుకునే శిష్యుల గజ్జె పూజ వేడుకను శాసీ్త్రయబద్ధంగా నిర్వహించారు. 13 మంది బాలికలు ఏకచక్రేశ్వరుడి సన్నిధిలో గజ్జెలు ధరించి తొలి అడుగులు వేశారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ శ్రీ జ్ఞాన సరస్వతీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ టీ స్వప్నరాణి మధురమైన గాత్రం, విశ్వనాథ్ మాస్టర్ మృదంగ వాద్యం మధ్య గజ్జెలు ధరించిన బాలికలు నృత్య ప్రదర్శనతో విశేషంగా ఆకట్టుకున్నారు.ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, ప్రముఖ యోగా మాస్టర్ మాధవీలత, పట్టణ ప్రముఖులు గజ్జె పూజ వేడుకను తిలకించారు. -
రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలి
నిజామాబాద్నాగారం: రాజ్యాంగ వ్యతిరేక వీడీసీలను నిషేధించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం పక్షాన ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తాళ్లరాంపూర్లో గౌడ, గీతా కుటుంబాలను వీడీసీలు సాంఘిక బహిష్కరణ, మహిళలను గుడిలోకి రానివ్వకుండా అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈతవనాన్ని తగలబెట్టడం లాంటి ఆటవీక, అనాగరిక చర్యలకు పూనుకున్న వీడీసీలను నిషేధించి, బాధ్యులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వీడీసీల ఆగడాలు, అరాచకాలు మితిమీరి పోతున్నాయన్నారు. తాళ్లరాంపూర్ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందించకపోవడం సి గ్గుచేటని, ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నా యని ఆరోపించారు. ఈత వనం నష్టపరిహారం చె ల్లించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. 25న చలో తాళ్లరాంపూర్ పేరిట ఆర్మూర్ ఆర్డీవో ఆఫీసు ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ది వెంకటరాం, రమేశ్ బాబు, నూర్జహాన్, ప్రభాకర్, సుధాకర్, విఠల్ గౌడ్, న ర్రా రామారావు, బాస రాజేశ్వర్, విఠల్ రావు, బు స్సా శంకర్, అల్గొట్ రవీందర్, ధర్మేందర్, చంద్రశే ఖర్, సాయికుమార్, మాయావర్ రాజేశ్వర్, పద్మ, శ్యామ్, నీరడి లక్ష్మణ్, కోయేడి నర్సింలు గౌడ్, శ్రీరా మ్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధుల డిమాండ్ -
న్యాయవాదుల సహకారం మరువలేనిది
ఖలీల్వాడి : జిల్లా న్యాయసేవాధికార సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో న్యాయవాదుల సహకారం మరువలేనిదని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో బార్ అధ్యక్షుడు మామిల్ల సాయారెడ్డి అధ్యక్షత ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె మా ట్లాడారు. ఉద్యోగరీత్యా బదిలీపై వచ్చానని, బదిలీపై వెళ్లడం సహజమని, పదవికి న్యాయం చేశా మా లేదా అనేదే ముఖ్యమని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ తరఫున కక్షిదారులకు న్యాయ సేవలు అందించడంలో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. బార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సాయారెడ్డి, మాణిక్ రాజు మాట్లాడుతూ లోక్ అదాలత్లను విజయవంతం చేయడంలో న్యాయవాదులు క్రీయాశీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం జడ్జి పద్మావతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీప్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు చర్యలు
● సీపీ సాయి చైతన్య వర్ని/రుద్రూర్: నేరాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైత న్య పేర్కొన్నారు. వర్ని, రుద్రూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో సౌకర్యా లు, సమస్యలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి, గేమింగ్ యాప్స్, సైబర్ నేరాల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్సైలు సాయన్న, మహేశ్ ఉన్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ మాచారెడ్డి: మేన మామను బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన మేనల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన జీడిపల్లి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి షట్టర్లను నిర్మించాడని తన మేనల్లుడు ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గురిజాల మధుసూదన్రెడ్డి సోషల్ మీడియాతోపాటు పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావని మధుసూదన్రెడ్డిని అడిగిన నరసింహారెడ్డిని చంపుతానని బెదిరించి, తప్పుడు ప్రచారం చేయకుండా ఉండాలంటే రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామంలో బొగ్గుల వీరయ్యకు చెందిన నివాసపు ఇల్లు శనివారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై దేవుని మండపం వద్ద వెలిగించిన దీపం అంటుకొని మంటలు ఎగిసిపడినట్లు బాధితులు వెల్లడించారు. ఇల్లు పూర్తిగా దగ్ధమై బియ్యం, వంట సామ గ్రి,బట్టలు, నిత్యవసర వస్తువులు పూర్తిగా బూడిదైనట్లు వెల్లడించారు. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. -
ఆపన్నహస్తం అందించండి
జక్రాన్పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన యువకుడు పసుల ఆకాశ్ ఈ నెల 11న బైక్పై వస్తుండగా నూర్సింగ్ తండా వద్ద మరో వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆకాశ్కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్లోని సరోజిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్లోని నరాలు చిట్లిపోయాయని, కుడి కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఆపరేషన్ కోసం రూ. 6లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అంత స్థోమత లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో ఇడ్లీ సెంటర్తో ఉపాధి.. ఆకాశ్కు భార్య మౌనిక, ఐదేళ్ల లోపు పాప, ఓ బాబు ఉన్నారు. ఆకాశ్ ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కొంత వరకు అప్పులు చేసి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఉద్యోగం రాలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో ఇటీవల కలిగోట్లో చిన్న ఇడ్లీ సెంటర్ ప్రారంభించాడు. ఇడ్లీ సెంటర్ ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆకాశ్ రో డ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలు కావడంతో కుటుంబం దిక్కుతోచనిస్థితికి చేరింది. ప్ర స్తుతం ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే డబ్బులు సమకూర్చుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆకాశ్కు మెరుగైన వై ద్యం కోసం పడకల్ గ్రామస్తులు, యువకులు తమవంతుగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరికొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. ఆర్థికసాయం చేయదల్చిన దాతలు ఆకాశ్ సోదరుడు పసుల రవి సెల్ నంబర్కు 91823 98298కు ఫోన్పే చేయగలరు. రోడ్డు ప్రమాదంలో పడకల్ యువకుడికి తీవ్ర గాయాలు చికిత్సకు సుమారు రూ.6లక్షల వరకు అవసరం దాతల కోసం బాధిత కుటుంబ సభ్యుల ఎదురుచూపు -
భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు రుద్రూర్/ వర్ని : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని, రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పేర్కొన్నారు. రుద్రూర్, వర్ని మండలాల్లో భూ భారతి చట్టంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. భూములకు సంబంఽధించిన వివాదాలను తొలగించి, పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు.ఽ ధరణి పోర్టల్లో లేని పలు సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ధరణిలో ఏదైనా అభ్యంతరం ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేదని, భూ భారతి చట్టం ప్రకారం తహసీల్దార్ స్థాయిలో న్యాయం జరగకపోతే ఆర్డీవోకు, అక్కడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపారు. వివిధ గ్రామాల రైతులు భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరలోనే గ్రామాల వారీగా సదస్సులు ఏర్పాటు చేసి ఆర్జీలు స్వీకరించి పరిష్కారిస్తామన్నారు. భూ భారతి చట్టంలోని సెక్షన్లు, వాటి వివరాలు, ప్రయోజనాలను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్లు తారాబాయి, సాయిలు, ఎంపీడీవోలు వెంకటేశ్, భీమ్రావ్, మాజీ జడ్పీటీసీ నరోజి గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, విండో వైస్ చైర్మన్ తోట అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు తొర్లికొండ విద్యార్థులు
జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శశికుమార్, గంగోత్రి జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్మల్లో జరిగిన 68వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అండర్–17 బేస్బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ నెల 22 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో శశికుమార్, గంగోత్రి పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జీ ఎంఈవో శ్రీనివాస్ అభినందించారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలి తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్లో విడుదలైన 1, 3, 5వ సెమిస్టర్స్, ఎల్ఎల్బీ 1, 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.500 లు, దరఖాస్తు ఫారానికి రూ.25 లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 26 వరకు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్www. telangana university. ac. in ను సందర్శించాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి రుద్రూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఆయా పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. రుద్రూర్ హైస్కూల్లో 1965 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులతో రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ)ని ఏర్పాటు చేయగా.. అందుకు సంబంధించిన లోగోను జేటీసీ శనివారం ఆవిష్కరించారు. అనంతరం రైడ్స్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడంపై సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రైడ్స్ కార్యక్రమాలకు మామిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రైడ్స్ ద్వారా తోడ్పాటు అందిస్తామన్నారు. -
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఇందూరు విద్యార్థుల సత్తా
నిజామాబాద్అర్బన్: జేఈఈ మెయిన్స్– 2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఆలిండియా లెవల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన మేఘన (824), సంకీర్త్ (1,750), భానుప్రతాప్ (3,820), ప్రవీణ్ (7,456), అరవింద్ (11,246), వేదస్కర్ (12, 385), నికేతన్(21,519), హాసిని (30,243), అమృత్ వర్ష్ (39,052), ఎండీ ముద్దస్సర్ (43,733), ఎస్ తనూజ (44,161), ఎం భవ్య శ్రీ (48,472) ర్యాంకు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంటర్తోపాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ, మెడికల్, ఎంసెట్లలో రాణించడమే లక్ష్యంగా విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్తోపాటు తొ లి ప్రయత్నంలోనే డైరెక్ట్గా ఐఐటీ, జేఈఈ మె యిన్స్ పరీక్షల్లో విద్యార్థులు జాతీయస్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు, ప్రిన్సిపాల్ రణదీష్, వైస్ ప్రిన్సిపాల్ సందీప్ కులకర్ణి తదితరులున్నారు. ఎస్ఆర్ కళాశాలకు ర్యాంకులు.. నగరంలోని ఎస్ఆర్ జూనియ ర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. బాదా వత్ సురేశ్ ఎస్టీ విభాగంలో ఆ లిండియా 98వ ర్యాంకుతోపా టు జిల్లా మొదటి ర్యాంకు సా ధించినట్లు కళాశాల డీజీఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన ఆకాశ్ (1813), బీ సాయి పవ న్ (3248), సచిన్ (3333), అఖిల (3828), ఇపుల్ (4329), శివసాయి (4721), భరత్ (6839), వా సు (6876), అక్షద్ (8071), సాయిచరణ్ (9873) ర్యాంకులు సాధించారన్నారు. 10 వేలలోపు 12 మంది, 20 వేలలోపు 26 మంది ఆలిండియా ర్యాంకులు సాధించారు. 96 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన పంచమహాల్కర్ రియా ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 2627 ర్యాంకు సాధించినట్లు ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన వేములపల్లి హర్షిత్ (3205), పీ అఖిల్ (4922), వీ గగన శ్రీ (9389), ఎం అజయ్ (9601), కే భాస్కర్ (14,738), పుట్ట రఘునాథ్ (17,899) ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. 10వేల లోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో రియా 99.62 శాతం పర్సంటైల్ సాధించిందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవి గౌడ్, శేఖర్, శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వెక్టర్ కళాశాల విద్యార్థులకు.. నగరంలోని వెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. మామిడి నిషాంత్ రెడ్డి (1450), వినాయక్ జోషి (7054), చంద్రవదన్ రెడ్డి (7696) ఆలిండియా ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికైనట్లు తెలిపారు. 9 మంది కాకతీయ విద్యార్థులకు ఆలిండియా ర్యాంకులు ఎస్ఆర్ కళాశాల విద్యార్థికి ఎస్టీ విభాగంలో 98వ ర్యాంకుసంతోషంగా ఉంది ఇంటర్తోపాటు తొలి ప్రయత్నంలోనే జేఈఈ మెయిన్స్లో ఆలిండియా 824 ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. అద్భు తమైన ర్యాంకు సాధించడానికి కళాశాల యాజమాన్యం ఎంతగానో తో డ్పాటు అందించింది. కాకతీయ ఉపాధ్యాయ బృందం ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ మంచి విద్యాబోధన అందించింది. – మేఘన, 824 ర్యాంకు, కాకతీయ కళాశాల -
పెరుగుతున్న ఫిర్యాదులు
సిరికొండ: పాలనలో పారదర్శకతకు బాటలేయాలి.. అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి.. అవినీతిని కాగడపెట్టి తరిమేయాలి.. ప్రజాధనం దు ర్వినియోగం కాకుండా పరిరక్షించాలి.. అనే సంకల్పంతో అమలులోకి వచ్చిన ఏకై క చట్టం సమాచార హక్కు (సహ)చట్టం. కానీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో స.హ. చట్టం అమలుకు ఏర్పడిన సమాచార కమిషన్ సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. సాధారణ సమాచా రం అయితే ఇస్తున్నారు కానీ అవినీతి గల సమా చారం లోపాలు గల సమాచారం ఇవ్వడం లేదు. అధికారుల కప్పదాటు వైఖరి సమాచార హక్కు చట్టం సెక్షన్ 6 ద్వారా వచ్చిన దరఖాస్తులను సదరు ప్రజా సమాచార అధికారులు పట్టించుకోవడం లేదు. సెక్షన్7(1) ప్రకారం 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో స.హ.చట్టంపై శిక్షణ పొందుతున్న అధికారులు నిబంధనలను మాత్రం పాటించడం లేదు. జక్రాన్పల్లి మండలానికి చెందిన ఓ దరఖాస్తుదారుడు ఆర్మూర్ విద్యుత్ డివిజన్ కార్యాలయానికి స.హ. దరఖాస్తు చేస్తే అది నిజామాబాద్ డివిజన్కు చెందిన సమాచారం కావున సెక్షన్ 6(3) ప్రకారం ఐదు రోజుల్లో దరఖాస్తును బదిలీ చేయాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదని సమాచారం ఇచ్చారు. స.హ. చట్టం ప్రాథమిక అంశాలు తెలిసిన కూడా సదరు పీఐవో సహ చట్టం గురించి నాకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ కార్యాలయాలు సమాచారం ఇవ్వడం లేదంటు ఇటీవల కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగితే సామాన్య పౌరుల పరిస్థితి ఏంటని స.హ. ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో చాలా కార్యాలయాలు 4(1) బీకి చెందిన 17 అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించడం లేదు. జిల్లా శాఖలో మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్ష సమావేశాలు జరగడం లేదు. నిజామాబాద్ జిల్లా విద్యా శాఖలో సమాచారం ఇవ్వడంలో అధికారులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఓ విషయంలో గతంలో వచ్చిన తీర్పులను అన్ని విషయాలు జోడిస్తూ సెక్షన్8 ని సాకుగా చూపి సమాచారం ఇవ్వడంలో సదరు పౌరసమాచార అధికారిణి సహాయ నిరాకరణ చేస్తున్నారు. సమాచార కమిషనర్లు లేక గుట్టలుగా పెరుగుతున్న అప్పీళ్లు, ఫిర్యాదులు సమీక్షలు లేవు, కానరాని 4(1) బి సమాచారం ఉమ్మడి జిల్లాలో స.హ. చట్టం సమాధిపై మూడు ఉదాహరణలు చాలు. ఉమ్మడి జిల్లాలో స.హ. చట్టం అమలు అధ్వాన స్థితి గురించి. ప్రజలకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పిన స.హ. చట్టం రెండు దశాబ్దాలుగా ఎన్నో అక్రమాలను బయటపెట్టింది. కానీ ఇది నాణానికి ఒక పార్శ్యం మాత్రమే. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో స.హ. చట్టం అమలు తీరు అధ్వానంగా ఉంది. సాధారణ సమాచారం కూడా సరిగా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో సమాచార కమిషనర్లు లేక అధికారులు స.హ. చట్టానికి విలువ ఇవ్వడం లేదు. మరో పక్క కమిషన్లో అప్పీళ్లు, ఫిర్యాదులు కొండల్లా పెరిగి సామాన్య పౌరులకు సమాచారం అందని ద్రాక్షగా మారింది.గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2023లో సమాచార కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో కమిషన్ ఖాళీ అయింది. అప్పటి వరకు ఉమ్మడి జిల్లా నుంచి 371 అప్పీళ్లు, 232 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించక పోవడంతో అప్పీళ్లు, ఫిర్యాదులు కొండల్లా పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణ సమాచార కమిషన్లో సమాచార కమిషనర్ల నియామకం గురించి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి 476 అప్పీళ్లు, 283 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. కమిషనర్లు లేకపోవడంతో స.హ. చట్టానికి విలువ లేకుండా పోతోంది. ఉమ్మడి జిల్లాలో ప్రజా సమాచార అధికారులు సమాచారం ఇవ్వడంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు.కమిషనర్లను నియమించాలి రాష్ట్రంలో సమాచార కమిషనర్ల నియామకం గత రెండేళ్లుగా జరగలేదు. దీంతో స.హ. చట్టం పక్కాగా అమలు కావడం లేదు. 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదు. 4(1)బి 17 అంశాలు స్వచ్ఛందంగా వెల్లడించడం లేదు. – మహేందర్గౌడ్, స.హ. రక్షణ వేదిక జిల్లా కోకన్వీనర్స.హ. చట్టానికి విలువేది జిల్లాలో అన్ని శాఖల ప్రజాసమాచార అధికారులకు శిక్షణ ఇస్తున్నా కనీస ప్రాథమిక అంశాలను కూడా పాటించడం లేదు. సమాచారం కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. దరఖాస్తు బదిలీ నిర్ణీత సమయంలో చేయడం లేదు. – భాస్కర్, స.హ. రక్షణ వేదిక ప్రతినిధి -
యువతిని వేధించిన యువకుడి అరెస్ట్
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని సోషల్ మీడియాలో వేధించిన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామానికి చెందిన అలీమ్ బేగ్ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు బోథ్ ఎస్సై ఎల్ ప్రవీణ్కుమార్ తెలిపారు. యువతిని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అలీమ్బేగ్ వేధిస్తున్నాడని తెలిపారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు అలీమ్బేగ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అలీమ్బేగ్పై రౌడీషీట్ ఉన్నట్లు పేర్కొన్నారు. రెంజల్ పోలీస్స్టేషన్లో నాలుగు కేసులు ఉన్నాయన్నారు. డిచ్పెల్లి పోలీస్స్టేషన్లో 2023లో అలీమ్బేగ్ వద్ద నుంచి 17 బైక్లు రికవరీ చేసినట్లు తెలిపారు. నాటు తుపాకులతో పాటు ఇద్దరి అరెస్టుతాడ్వాయి: మండలంలోని కన్కల్ గ్రామంలో నాటు తుపాకులతో తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన తిల్ పీత్య మహేందర్సింగ్, తిల్ పీత్య ఇందర్సింగ్ మండలంలోని కన్కల్లో కొంతకాలంగా నివసిస్తూ లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు శుక్రవారం తాడ్వాయిలోని కల్లు డిపో వద్ద నాటుతుపాకులతో తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకొని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఎల్లారెడ్డి: పట్టణంలోని గ్యాస్ గోదాంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అగ్నిమాపక అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని హెచ్పీ గ్యాస్ గోదాంలో అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ అధికారులు వినోద్, నరేందర్ తదితరులున్నారు. -
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
ఖలీల్వాడి: గుండెపోటుతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై గంగాధర్ శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన బాచుపల్లి భానుచందర్(36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మూడో టౌన్ పరిధిలోని రైతు బజార్ వద్ద ఉన్న వైన్స్ దుకాణం ఎదురుగా ఆటోను నిలిపి పాటలు వింటున్నాడు. ఆటోలో మూడు గంటల పాటు అతను కదలకుండా ఉండడాన్ని గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. లారీని ఢీకొన్న మరో లారీభిక్కనూరు: మండల సమీపంలోని టోల్ప్లాజా వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టోల్ప్లాజా వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా ఢీకొన్నది. ఈ ఘటనలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో కామారెడ్డికి తరలించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేతనాగిరెడ్డిపేట: మండలంలోని గోలి లింగాల సమీపంలో ఉన్న మంజీరా నది నుంచి గురువారం రాత్రి ఇసుక ను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్టు కొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గోలిలింగాలకు చెందిన కోడె గంగారాం, తొంట సిద్ధిరాములు, పిట్ల సత్యనారాయణ, పుట్ల సంతోష్, కాంచనపల్లి లింగాగౌడ్, పుట్ల కిష్టయ్య ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు యత్నిస్తుండగా సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్లను సీజ్చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రైల్వేస్టేషన్లో ఒకరిపై దాడి ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉన్న కుభీర్ మండలానికి చెందిన కుంచెపు బాబుపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో దాడి చేసినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్ వద్ద బాబుతో అనవసరంగా గొడవ పడి మెడపై బ్లేడ్తో దాడి చేశాడన్నారు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నిందుతుడి పరారీలో ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒకరిపై పోక్సో కేసు నమోదుతాడ్వాయి: తాడ్వాయి పోలీసు పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. తన ఇంటి ఎ దుట ఉన్న మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడన్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం పెద్దకొడప్గల్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యమైన ఘటన పెద్దకొడప్గల్ మండలం రతన్సింగ్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తె లిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంక ట్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం మతిస్థిమితం కో ల్పోయాడు. పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి తిరిగి వ చ్చేవాడు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన వెంకట్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజాపాలన పేరుతో పోలీసు పాలన
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో పోలీసు పాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన నడుస్తోందని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ ఇటీవల భీమ్గల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చినపుడు ఏమి జరిగిందో ప్రజలంతా చూశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. మహిళలకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ఇస్తామన్న పింఛన్లు, బాల్కొండ నియోజకవర్గంలో రూ. రెండు లక్షల రుణమాఫీ అందరకీ రాలేదని మంత్రిని అడిగితే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ చేశారన్నారు. తనను, కేసీఆర్ను డౌన్ డౌన్ అంటూ దాడికి సిద్ధమయ్యారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ వారిని ఏమాత్రం అదుపు చేయకుండా, కేవలం ప్లకార్డులు పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేసి తీవ్రంగా కొట్టారని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇన్చార్జి సునీల్రెడ్డి పోలీసులను ఆదేశించి తనపై, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 30 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టించాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామని వెల్లడించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
200 సైలెన్సర్ల ధ్వంసం
ఖలీల్వాడి: వాహన సైలెన్సర్లు మార్చి శబ్ధ కాలుష్యానికి కారకులవుతున్న యువకులపై నగర పోలీసులు కొరడా ఝలిపించారు. వాహనాల తయారీ కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా మాడిఫైడ్ సెలెన్సర్లను అమర్చుకుని కొందరు నగరంలో తిరుగుతున్నారు. ఆయా వాహనాలు రోడ్లపై వెళ్తుంటే భారీ శబ్ధం వెలువడుతుంది. దీంతో గుండెజబ్బులు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులు ఆందోళనకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 200 వాహనాలకు ఉన్న మాడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటినీ శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. వాహనదారులకు జరిమానాలు విధించి వాటిని రోడ్డు రోలర్తో తొక్కించినట్లు ఏసీపీ తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. మైనర్లకు తల్లి దండ్రులు వాహనాలను ఇవ్వొద్దని అన్నారు. శబ్ధ కాలుష్యం ఏర్పడితే జరిమానా, జైలు శిక్ష విధిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు ప్రసాద్, శేఖర్, ఎస్సై సుమన్, రహిమాతుల్లా సిబ్బంది ఉన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పిట్లం: ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పిట్లం మండలం సిద్ధాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడకు చెందిన కె బుచ్చయ్య చారి(42) పిట్లం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని పిట్లం నుంచి బాన్సువాడకు బైక్పై వెళ్తుండగా సిద్ధాపూర్ శివారులోని చెరువు కట్ట ప్రాంతంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..భిక్కనూరు: లారీని వెనుక నుంచి ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండలం కల్వరాలకు చెందిన శ్రీనివాస్(42) బీబీపేటలో ఉన్న బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా జంగంపల్లి శివారులో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
ఖలీల్వాడి: గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు డిచ్పల్లి పరిధిలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 40 ఏళ్ల వరకు ఉంటాడని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఫొటో ఆధారంగా ఎవరికై నా సమాచారం తెలిస్తే 8712658591 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. జీవితంపై విరక్తితో మరొకరు.. కామారెడ్డి క్రైం: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివోళ్ల చిన్నగంగయ్య(55) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించేవాడు. గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో మరొకరు..
పెద్దకొడప్గల్: పనిచేస్తున్న ప్రాంతంలో వెలగని బల్బును సరిచేస్తున్న ఓ వ్యక్తికి విద్యుదాఘాతం సంభవించి మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి తండా శివారులో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్కు చెందిన గజానన్(25) తండా శివారులోని ఇటుక బట్టీలో ఐదు నెలలుగా కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేకువ జామున పనిచేస్తున్న ప్రదేశంలో వెలగని బల్బును సరిచేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ
సుభాష్నగర్: దేశం, ధర్మం కోసం పని చేస్తున్న ఏౖకైక పార్టీ బీజేపీ అని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న జనార్దన్ గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అధ్యక్షతన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసే వరకూ కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాడాలని, అప్పుడే రాష్ట్రంలో హిందువులు అనుకున్న విధానాలు అమలవుతాయని అన్నారు. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. కానీ హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. త్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలకు, వక్ఫ్బోర్డు సవరణతో పేద ముస్లిములకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలు ఏకమైనా.. మోదీని ఏం చేయలేవని, దేశమంతా బీజేపీ వైపే ఉందన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యత మాదే.. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషితోనే విజయం సాధ్యమైందని, భవిష్యత్తులో బీజేపీ, బీజేపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు బాధ్యతను తాము తీసుకుంటామని ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీల గెలుపు కార్యకర్తలకు అంకితమని వారు అన్నారు. ఎమ్మెల్సీల గెలుపులో కార్యకర్తల కృషి ఎమ్మెల్సీల గెలుపులో కార్యకర్తల కృషి వెలకట్టలేనిదని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు పార్టీపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపిడి స్రవంతిరెడ్డి, న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్, మాదాసు స్వామి యాదవ్, పద్మారెడ్డి, బుస్సాపూర్ శంకర్, కొండా ఆశన్న పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్, రాకేశ్రెడ్డి -
భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం
నిజామాబాద్ రూరల్: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కడం పట్ల రైల్వే స్టేషన్ రోడ్డు అఖిల భారతీయ భగవద్గీత కేంద్ర ప్రచార మండలి(గీత భవనం) కార్యవర్గ సభ్యులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. గీత భవనం ప్రధాన కార్యదర్శి మేడిచర్ల ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. శతాబ్దాలుగా దేశ నాగరికత విషయంలో చైతన్యాన్ని పెంపొందించిన పవిత్ర గ్రంథాలకు సుదీర్ఘ కాలం తర్వాత గుర్తింపు రావడం గొప్ప విశేషమని కొనియాడారు. అధ్యక్షుడు ఎం ఎస్ నరసింహ చారి, కోశాధికారి ఆరెట్టి లక్ష్మీ నారాయణ, వెంకట స్వామి, చంద్ర శేఖర శర్మ, బొడ్డు దయానంద్, గంగాధర్, షేర్ల దయానంద్, జీఎం శంకర్, నరేందర్ రావు షిండే తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు చేరిన ఐద్వా బస్సు యాత్ర
నిజామాబాద్ సిటీ: ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర జిల్లాకు చేరింది. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నాందేవాడ సీపీఎం కార్యాలయానికి వచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడమేనన్నారు. అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఫులే, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు అరుణజ్యోతి, ఆశలత, సాయిలీలతోపాటు జిల్లా నాయకులు సుజాత, అనిత, రజియా, మాధవి, కళావతి, స్వప్న పాల్గొన్నారు. -
డబుల్ ఇళ్ల పంపిణీ ఎప్పుడో?
● ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయని వైనం ● ఆగ్రహించి ఇళ్లల్లోకి చొరబడిన స్థానికులు ● ఇళ్లు సీజ్ చేసి, తాళాలు వేసిన అధికారులుధర్పల్లి: పేదల సొంతింటి కల నెరవేరేస్తామంటూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం నిరుపేదల ఆశలను ఆవిరి చేశాయి. నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో వృథాగా ఉండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ధర్పల్లి మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కొక్క ఇంటికి రూ.6 లక్షల చొప్పున రూ.2.88 కోట్లు కేటాయించారు. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చిన్నపాటి పనులు చేయాల్సి ఉంది. ఇళ్లు పంపిణీకి నోచుకోక వృథాగా ఉంటున్నాయి. అర్హులను గుర్తించే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఇళ్లలో డ్రైనేజీలు, రోడ్డు నిర్మాణం, విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఈ సమస్యను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామానికి చెందిన నిరుపేదలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి వినతి పత్రాలను కూడా అందజేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, అర్హులను గుర్తించి ఇళ్లను పంపిణీ చేయాలని నిరుపేదలు కోరుతున్నారు. ఇళ్ల ఆక్రమణ.. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో పది రోజుల క్రితం అసహనానికి గురైన 30 మంది నిరుపేద కుటుంబాలు ఇళ్లల్లోకి ప్రవేశించి, సామగ్రిని భద్రపరచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఇళ్ల పంపిణీ చేయకుండా చొరబడడం చట్ట విరుద్ధమని ప్రజలకు వివరించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఇళ్లల్లోకి చొరబడిన వారిని అధికారులు సముదాయించి బయటకు పంపించారు. అనంతరం రెవెన్యూ అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీజ్ చేసి తాళాలు వేశారు. కిరాయికి ఉంటున్నాం మాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కిరాయికి ఉంటూ జీవిస్తున్నాం. బీడీలు చుట్టగా వచ్చిన డబ్బులతోనే ఇంటి కిరాయి కట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. గతంలో చాలాసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. – సబ్బని లక్ష్మి, ధర్పల్లి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ధర్పల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో డ్రైనేజ్, సీసీ రోడ్డు, కరెంట్, మంచినీటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పనులు కాలేవు. త్వరలోనే అసలైన అర్హులను గుర్తించి ఉన్నతాధికారుల సమక్షంలోనే పంపిణీ చేస్తాం. అప్పటివరకు ఎవరు ఇళ్లను ఆక్రమించొద్దు. అది చట్టరీత్యా నేరం అవుతుంది. – మాలతి, తహసీల్దార్ , ధర్పల్లి -
మాజీ సీఎం కేసీఆర్ను కలిసిన బీఆర్ఎస్ మహిళా నేతలు
మోపాల్/ఇందల్వాయి: మాజీ సీఎం కేసీఆర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి ఇందల్వాయి మాజీ జెడ్పీటీసీ గడ్డం సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్ చామకూర విశాలినీరెడ్డి ఎర్రవల్లి ఫామ్హౌజ్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా తాజా రాజకీయ పరిస్థితులను కేసీఆర్కు వారు వివరించారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి మోపాల్: మండలంలోని బాడ్సి సొసైటీ పరిధిలోగల బైరాపూర్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకుడు ఇందల్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. గ్రామంలో దాదాపు 70 శాతం నుంచి 80 శాతం వరకు వరి కోతలు పూర్తయ్యాయని, నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. కోతలు పూర్తయిన రైతులు వర్షాలు కురుస్తాయని ఆందోళనకు గురవుతున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే బైరాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఇందల్ నాయక్ హెచ్చరించాడు. పశువులకు టీకాలు వేయించాలి కమ్మర్పల్లి: పాడి రైతులు తమ పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని కమ్మర్పల్లి మండల పశు వైద్యాధికారి రాజశేఖర్రావు అన్నారు. శుక్రవారం ఉప్లూర్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించి 72 గోజాతి, 109 గేదె జాతి పశువులకు టీకాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, అబార్షన్లు అవడం వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. ఇందల్వాయి ఎస్సైగా సందీప్ బాధ్యతల స్వీకరణ ఇందల్వాయి: ఇందల్వాయి మండల ఎస్సై గా పని చేసిన బి.మనోజ్ బదిలీపై వెళ్లడంతో వీఆర్ నుంచి వచ్చిన జి.సందీప్ నూతన ఎస్సైగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేందుకు కృషి చేస్తానని ఎస్సై సందీప్ తెలిపారు. ఎల్వోసీ అందజేత ఇందల్వాయి: మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన లక్కాకుల శ్రీనివాస్ అనే వ్యక్తికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఐదు లక్షల రూపాయల ఎల్వోసీని ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి బాదిత కుటుంబానికి శుక్రవారం అందజేశారు. ఎల్వోసీ మంజూరు పట్ల వారు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు సుధాకర్, కర్సం మోహన్, ఆశిష్ తదితరులు ఉన్నారు. వేద రక్షణకు ఉపనయనాలు నిజామాబాద్ రూరల్: వేద పరిరక్షణకు పిల్లల్లో భక్తి వికాసం పెంపొందించడానికి సామూహిక ఉచిత ఉపనయనాలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందూరు నగర బ్రాహ్మణ బంధువుల ఆధ్వర్యంలో సుభాష్ నగర్ శ్రీ రామాలయం ప్రాంగణంలో ఈ నెల 23న 21 మంది వటువులకు ఉపనయన సంస్కార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంథని జయంత్ కుమార్, రొట్టె సురేష్ శర్మలు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన కర పత్రాలను శుక్రవారం రామాలయంలో ఆవిష్కరించారు. రామాలయం కమిటీ కార్యదర్శి శోభా నవీన్ రెడ్డి, చంద్ర శేఖర శర్మ, అనురాధ, వీణ తదితరులున్నారు. -
రైతు కష్టం రోడ్డు పాలు
నిజామాబాద్ రూరల్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం లారీలలో లోడ్ చేసిన తర్వాత అలాట్మెంట్ అయిన రైస్ మిల్లులకు తరలించే లోపు సగం వరి బస్తాలు రోడ్డుపైనే పడిపోతున్నాయి. లారీల పరిమితికి మించి నింపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణంలో లారీలకు కట్టిన తాడు వదులై సంచులు కిందపడి పగిలిపోయి ధాన్యం రోడ్డుపాలవుతోంది. శుక్రవారం డిచ్పల్లి మండలం ధర్మారం వద్ద, డిచ్పల్లి మండల కేంద్రంలో రెండు లారీల తాడులు తెగిపోవడంతో ధాన్యం బస్తాలు కిందపడిపోయాయి. లారీ డ్రైవర్ గమనించి మళ్లీ ధాన్యం బస్తాలను లోడ్ చేయించాల్సి వచ్చింది. కానీ ఈలోపే స్థానికులు సగం గింజలను మాయం చేశారు. కొన్ని రోడ్డుపైనే పోయాయి. ఈ కారణంగా రైతు నష్టపోవాల్సి వస్తోంది. లారీలలో పరిమితికి మించి నింపుతున్న వరి బస్తాలు.. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్న వైనం పట్టించుకోని అధికారులు -
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
డిచ్పల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. నడిపల్లి ఫాస్టరేట్ సీఎస్ఐ చర్చి, బర్థిపూర్, విక్టోరియా హాస్పిటల్, కొరట్పల్లి, డిచ్పల్లి ఖిల్లా, దూస్గాం, ముల్లంగి(ఐ), ఘన్పూర్, కమలాపూర్, యానంపల్లి చర్చిలతో పాటు ధర్మారం(బి) గ్రామంలోని ప్రసిద్ద లూర్ధుమాత చర్చిలో గుడ్ ప్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు సందేశాలు విన్పించారు. పలువురు క్రైస్తవులు శిలువను మోశారు. నిజామాబాద్ రూరల్: గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు శిలువ మరణానికి సంబంధించి క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రై డే ఆరాధన ఉపవాస దీక్షల మధ్య ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల నుండి తిరిగి ప్రారంభమైన ప్రార్థనలో సిలువపై యేసు మరణాన్ని గుర్తు చేసుకున్నారు.గుడ్ ప్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు సందేశాలు విన్పించారు. -
నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
డిచ్పల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మారం(బి), బర్థిపూర్, మెంట్రాజ్పల్లి, దేవుపల్లి, దేవునగర్, నడిపల్లి, అమృతాపూర్ గ్రామాలోల్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన/ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విజయవంతం చేయాలని ఆయన కోరారు. దాశరథి పురస్కారానికి ప్రేమ్లాల్ ఎంపిక నిజామాబాద్ రూరల్: జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్లాల్ ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడని సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి దశరథి ఆర్గనైజషన్ కన్వీనర్ సతీష్రావు ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్లో పురస్కార ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా కవులు అభినందనలు తెలిపారు. -
హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి మురళి
బీవోసీ రాష్ట్ర అధ్యక్షులు అనురాధ మోపాల్: కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి, ఆదర్శ కమ్యూనిస్టు జెల్ల మురళి అని ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణాల కార్మిక సంఘం(బీవోసీ) రాష్ట్ర అధ్యక్షులు అనురాధ అన్నారు. శుక్రవారం నగర శివారులోని బోర్గాం(పి) శ్రామికనగర్ గూడెంలో జెల్ల మురళి సంస్మరణ సభ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దోపిడీ వర్గ వ్యతిరేక విధానాలపై మురళీ పోరాడి శ్రామికుల పక్షాన నిలబడ్డారని తెలిపారు. పీడిత ప్రజలకు సమాన అవకాశాలు ఇవ్వాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరుకున్నారన్నారు. ఆయన జీవించిన కాలం కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, నాయకులు వేల్పూర్ భూమయ్య, ఎన్ దాసు, నీలం సాయిబాబా, మల్లికార్జున్, పరుచూరి శ్రీధర్, సాయిబాబా, సూర్య శివాజీ, శివకుమార్ పాల్గొన్నారు. -
మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
సిరికొండ: సిరికొండ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా మారుస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. తాటిపల్లిలో రెండున్నర కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్, చీమన్పల్లిలో రూ.2 కోట్లతో పీహెచ్సీ, కుర్దుల్పేట్లో రూ.20 లక్షలతో జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేసి మైలారంలో సీసీ రోడ్లను ప్రారంభించారు. చీమన్పల్లి, తాటిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చీమన్పల్లి గ్రామస్తుడైన మాజీ ఎమ్మెల్యేను 40 ఏళ్లుగా సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యేగా గెలిపించినా ఈ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బ్యాంకు ఏర్పాటు చేయిస్తానని, చెక్డ్యాంలు మంజూరు చేయిస్తానని తెలిపారు. తాటిపల్లికి వెళ్లే మార్గంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని, నిధులు త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్, డీఎంహెచ్వో రాజశ్రీ, డీసీసీ కార్యదర్శులు భాస్కర్రెడ్డి, ఎర్రన్న, చందర్నాయక్, ఉమ్మాజీ నరేష్, మండలాధ్యక్షుడు బాకారం రవి, సొసైటీ చైర్మన్ గంగాధర్, బాకారం సంతోస్, దేగాం సాయన్న, రాజారెడ్డి, రవినాయక్, సంతోష్నాయక్, బన్నాజీ, అంబర్సింగ్, నర్సింగ్, నర్సారెడ్డి, ప్రసాద్, బాల్రాజ్నాయక్, లింగారెడ్డి, లక్ష్మణ్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేకుల్పల్లి భూపతిరెడ్డి -
జిల్లా జడ్జి సునీతకు సన్మానం
ఖలీల్ వాడి: జిల్లా జడ్జి సునీతా కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశ మందిరంలో న్యాయవాదులు శుక్రవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. మూడున్నరేళ్లలో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, డిఫెన్స్ కౌన్సిల్స్ రాజ్కుమార్ సుబేదార్, ఉదయ్ కృష్ణ, ప్రమోద్, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాది టక్కర్ హన్మంత్ రెడ్డి సరస్వతి మాత రాగి విగ్రహం అందజేసి శాలువాతో జడ్జిని సన్మానించారు. వినాయక కల్యాణ మహోత్సవం నిజామాబాద్ రూరల్: సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని గాయత్రినగర్ వద్ద గల సిద్ధి వినాయక స్వామి దేవాలయం 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మచ్చ చంటయ్య మాట్లాడారు. భక్తులకు అన్నదానం చేశారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
నిజామాబాద్ రూరల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కేంద్రంలోని కోటగల్లి సొసైటీ చైర్మన్ కొట్టాల రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో సాయినగర్ ఆకుల పాపయ్య రోడ్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని సొసైటీకి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. నాణ్యమైన వరి ధాన్యం తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, సీఈవో వంశీకృష్ట, రైతులు హన్మాండ్లు, గంగాధర్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన ఖలీల్వాడి: నిజామాబాద్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఖానాపూర్ ఆర్కే ఇండస్ట్రీస్లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు, యాజమాన్యానికి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించినట్లు ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు శుక్రవారం తెలిపారు. అగ్గిమాపక సిబ్బంది కె.సుమన్, బి.కిరణ్ కుమార్, ప్రశాంత్ గౌడ్, సురేందర్, కార్మికులు పాల్గొన్నారు. -
కమ్మర్పల్లిలో ఈదురు గాలులు
కమ్మర్పల్లి: మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఉప్లూర్, నాగాపూర్లో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మండల కేంద్రంలో ఆకుల బాలకృష్ణకు చెందిన మామిడి తోటలో కాయలు నేలరాలి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. రేపు ఎంజేపీ గురుకుల ప్రవేశపరీక్ష నిజామాబాద్అర్బన్: మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ఈ నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో సత్యనాథ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలల్లోని 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో 2,611 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని, విద్యార్థులు హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్నగర్: నగరంలోని 33/11 కేవీ వినాయక్నగర్, తిలక్గార్డెన్, సుభాష్నగర్, ఎన్హెచ్బీ సబ్స్టేషన్లలో నెలవారీ మరమ్మతుల దృష్ట్యా శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం కలుగుతుందని టౌన్ ఏడీఈ ఆర్ చంద్రశేఖర్, టౌన్–2 ఏడీఈ ఆర్ ప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక్నగర్, హనుమాన్ జంక్షన్, ఓల్డ్ హౌసింగ్ బోర్డు కా లనీ, 100 ఫీట్ల రోడ్డు, ఐపీఎస్ స్కూల్ ఏరి యా, గూడెం, తుల్జాభవానీ ఆలయం, సా యికృపానగర్, యోగేశ్వర్ కాలనీ, ఇంద్రాణి స్కూల్, దత్తాత్రేయ ఆలయం, శ్రీనగర్ కాలనీ, కోటగల్లి, యెండల టవర్స్, గాయత్రినగర్, పద్మానగర్, మదీనా, ఫులాంగ్ మసీ ద్, పాటిగల్లి తదితర కాలనీల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదా రులు సహకరించాలని చంద్రశేఖర్ కోరారు. పోలీస్ స్టేషన్ల తనిఖీ ఖలీల్వాడి: నగరంలోని మూడు, నాలుగు టౌన్లతోపాటు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్లు, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలుపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఎవరైనా గంజాయికి బానిసలైతే వారికి కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయాలని సూ చించారు. సీపీ వెంట ట్రైయినీ ఐపీఎస్ సాయికిరణ్ పత్తిపాక, ఏసీపీ ఎల్ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సౌత్ రూరల్ సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు గంగాధర్, శ్రీకాంత్, ఎండీ ఆరిఫ్ తదితరులు ఉన్నారు. 30 వరకు ‘భూ భారతి’ అవగాహన సదస్సులు నిజామాబాద్ అర్బన్: ‘భూ భారతి’ చట్టంపై జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రా జీవ్గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది వరకే ఆయా మండలాలకు అవగాహన సదస్సుల నిర్వహణకు సంబంధించి సమావేశ వేదికలు, సమయాలను నిర్దేశించినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లోనే అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాగునీరు, ధాన్యం కొనుగోళ్లపై ‘కంట్రోల్ రూం’ ● టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు నిజామాబాద్అర్బన్: జిల్లాలో ఎక్కడైనా తా గునీటి సమస్య తలెత్తినా, ధాన్యం కొనుగో లు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులుంటే ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6644 కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని సూచించారు. కార్యాలయాల పని దినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిర్యాదులను స్వీకరించి తక్ష ణమే వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య ఉంటే 7382844951, ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులుంటే 7382844769 ఫోన్ నంబర్లకు వాట్సాప్ చేయాలని సూచించారు. idocnizamabad@gmail.comకు మెయిల్ ద్వారా కూడా సమాచారం అందించాలని పేర్కొన్నారు. 21 నుంచి కిసాన్ మేళా నిజామాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో ‘కిసాన్ మేళా’ నిర్వహించనున్నట్లు వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మేళాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభిస్తారని, మూడు రోజులపాటు జరిగే ఈ మేళాలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు, వారి ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచనున్నట్లు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాను విజయవంతం చేయాలని కోరారు. -
భారతీయ సంస్కృతి గొప్పది
రెంజల్: భారతీయ సంస్కృతి శ్రేష్టమైందని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. రుషీ పరంపర గొప్పదని, పూర్వీకులు అందించిన ఆచార వ్యవహారాలను పాటించి, దీపాలు ఆర్పే పాశ్చాత్య సంస్కృతిని తరిమివేయాలని సూచించారు. రెంజల్ మండలం కందకుర్తిలో శుక్రవారం నిర్వహించిన విగ్రహాల ప్రతిష్ఠాపన ఉత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రవచించారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షం ద్వారా జీవితం ధన్యమవుతుందన్నారు. అంతకు ముందు గ్రామంలో పలు విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. కా ర్యక్రమంలో పిట్ల కృష్ట మహరాజ్, మంగిరాములు మహరాజ్, సీతారాం త్యాగి మహరాజ్, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సుందర్రెడ్డి, తిప్పేస్వామి, మోహన్రెడ్డి, ప్రసాద్, సోమయాజులు, దుర్గారెడ్డి, సుధాకర్రెడ్డి, లింగం, చంద్రశేఖర్, నిమ్మల ప్రసాద్, గురచరణం, శివకుమార్, ఎమ్మెల్యేలు రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి పాల్గొన్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి -
భూ భారతిపై అవగాహన అవసరం
డిచ్పల్లి/మోపాల్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలలో శుక్రవారం వేర్వేరుగా నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతుల కు చేకూరే ప్రయోజనాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్య లు ఉన్న రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించా రు. మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరి స్తారని తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువు లోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్కు అధికారాలు కల్పించారని వివరించారు. ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులు.. గ్రామాల్లోనే రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం ప్రదర్శిస్తారని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి ప్రతి గ్రామంలో గ్రామపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరి భూమికి భూధార్ సంఖ్య కేటాయిస్తారని, దీంతో భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయన్నారు. సదస్సులలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, తహసీల్దార్లు ప్రభాకర్, రామేశ్వర్, ఏవోలు సుధామాధురి, సౌమ్య, డీటీ శ్రీకాంత్, ఆర్ఐలు సంతోష్, రాజేశ్వర్, సొసైటీ చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ‘సాదాబైనామా’కు త్వరలో మార్గదర్శకాలు ఆధార్ తరహాలో భూధార్ సంఖ్య కేటాయింపు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు -
ప్రైవేటు గాలం
ఆశలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీలు ఇలా..శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లో uధర్పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుమలత (పేరు మార్చాం) అనే గర్భిణిని అదే గ్రామానికి చెందిన ఓ ఆశ కార్యకర్త జిల్లా కేంద్రంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి డెలివరీ కోసం తీసుకువచ్చారు. సదరు గర్భిణికి నెలలు నిండడంతోపాటు పిండం అడ్డం తిరిగిందని, సిజేరియన్ చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు సిజేరియన్కు ఒప్పుకొని, రూ.80 వేల వరకు అన్ని ఖర్చులతో ప్యాకేజీ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో నుంచి సదరు ‘ఆశ’కు 30 శాతానికి పైగా కమీషన్ను అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ● గైనిక్ ఆస్పత్రుల్లో రిఫరల్ దందా ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగ్గిన సాధారణ ప్రసవాలు ● ప్రైవేట్లో పెరుగుతున్న సిజేరియన్లు ● ఆర్ఎంపీ, పీఎంపీల మాదిరిగానే ఆశ కార్యకర్తలకు కమీషన్లు ● చోద్యం చూస్తున్న వైద్యారోగ్యశాఖ గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు డెలివరీకి తీసుకెళ్తే మీకేం వస్తుంది. అదే మా ఆస్పత్రికి పంపిస్తే డెలివరీ కోసం చెల్లించే ఫీజులో 30 నుంచి 40 శాతం వరకు కమీషన్ ఇస్తాం. ఎక్కువ మందిని పంపిస్తే ఇంకా ఎక్కువ కమీషన్ ఇస్తాం. – ఓ ఆశ కార్యకర్తతో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడి మాటలు నిజామాబాద్నాగారం: జిల్లాలోని ప్రైవేటు గైనిక్ ఆస్పత్రుల్లో రిఫరల్ దందా జోరుగా సాగుతోంది. మొన్నటి వరకు ఈ దందాలో ఆర్ఎంపీ, పీఎంపీలే ప్రముఖ పాత్ర పోషించేవారు. తాజాగా ఈ మా ర్గంలోకి ఆశ కార్యకర్తలూ ప్రవేశించినట్లు తెలుస్తోంది. మహిళలు గర్భం దాల్చిన నుంచి డెలివరీ అయ్యే వరకు వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఏ చిన్న సమస్య ఎదురైనా ఆశ వర్కర్లను ఆశ్రయిస్తున్నారు. ఆశ వర్కర్ల సూచనలు తప్పక పాటిస్తున్నారు. డెలివరీ సమయంలోనూ వారి ద్వారానే ఆస్పత్రులకు వెళుతుంటారు. దీన్నే అదనుగా చేసుకొన్న ప్రైవేటు గైనిగ్ ఆస్పత్రులు.. ఆశవర్కర్లకు కమీషన్ ఆశ చూపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న పలువురు ఆశ వర్కర్లు.. గర్భిణులను ప్రైవేటుకే తరలిస్తున్నారు. ప్రైవేటులో ఫుల్.. సర్కారుకు నిల్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడీ, ద్వారకానగర్, పోచమ్మగల్లీ, ప్రగతినగర్, హైద్రాబాద్రోడ్, బోధన్రోడ్, తదితర ప్రాంతాల్లో కలిపి 70 పైగా ప్రైవేట్ గైనిక్ ఆస్పత్రులున్నాయి. బోధన్, ఆర్మూర్లో పదుల సంఖ్యలో గైనిక్ ఆస్పత్రులు ఉన్నాయి. ఏ ఆస్పత్రుల్లో చూసినా రిఫరల్ దందా జోరుగా కొనసాగుతోంది. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎలాగూ రిఫరల్ చేస్తూనే ఉన్నారు. వీరికి తోడు కొన్ని నెలలుగా ‘ఆశ’ కార్యకర్తలు సైతం రిఫరల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలీవరీల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేకంగా నిఘా పెట్టడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య తగ్గి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలీవరీలు పెరిగాయి. కొన్ని నెలలుగా పట్టించుకునే వారు లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీల మాదిరిగానే ఆశలకు ప్రోత్సాహకాలు అందిస్తూ మఽభ్యపెడుతున్నారు. హోటళ్లలో బిర్యానీలు తినిపిస్తూ మాయమాటలు చెప్పి కమీషన్ల పేరిట ఆశ చూపుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫరల్స్ పెరిగాయి. ఏ ఆస్పత్రిలో చూసినా సిజేరియన్లు పోటాపోటీగా సాగుతున్నాయి. కాగా, సాధారణ డెలివరీ చేస్తే కేవలం రూ. 25 వేల లోపు ఫీజు ఉంటుంది. అదే సిజేరియన్లు చేస్తే కుటుంబసభ్యులను భయపెట్టి మరీ రూ. 60 వేల నుంచి రూ.80 వేల వరకు, అవసరమైతే రూ. లక్ష వరకు కూడా వసూలు చేస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. న్యూస్రీల్కొరవడిన నిఘా..జిల్లాలోని ప్రైవేట్ గైనిక్ ఆస్పత్రులపై నిఘా కొరవడింది. గత కలెక్టర్, డీఎంహెచ్వోల సమన్వయంతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి పలుమార్లు సమీక్షించడంతో ప్రైవేటులో సిజేరియన్లు తగ్గాయి. ఏడాదిగా నిఘా తగ్గడంతో సిజేరియన్లు అమాంతం పెరిగాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చర్యలు తప్పవు ఆశ కార్యకర్తలు ప్రైవేట్ ఆస్పత్రులకు గర్భిణులను డెలివరీల కోసం రిఫర్ చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలున్నాయి. ఆశ కార్యకర్తలు డెలివరీల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే తీసుకురావాలి. ఇప్పటి నుంచి మరింత నిఘా పెడతాం. – బీ రాజశ్రీ, డీఎంహెచ్వో -
‘ఓపెన్’ అక్రమాలకు కళ్లెం పడేనా?
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో చూచిరాతలు, మాస్ కాపీయింగ్కు పాల్పడిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది కూడా పరీక్షల్లో అక్రమాలకు కొందరు చక్రం తిప్పుతున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు(డీవో), ఇన్విజిలేటర్లను తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు విద్యాశాఖ అధికారుల వద్ద పావులు కదుపుతున్నారు. కాగా, ప్రతి ఏడాది వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా చేసేందుకు పోటీ ఎక్కువగా ఉంటోంది. వేసవిలో వచ్చే సంపాదిత సెలవుల (ఈఎల్స్) కోసం ఉపాధ్యాయులు పోటీ పడుతుంటారు. పరీక్షా కేంద్రాల్లో చూచిరాతలనూ ప్రోత్సహిస్తుంటారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలో 17, కామారెడ్డి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్ల జాబితా పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఏడాది కూడా జాబితాను పబ్లిక్ డొమైన్లో ఇంకా పెట్టలేదు. గత మూడేళ్లుగా జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లోని పరీక్షా కేంద్రాల్లో పాత వారినే సీఎస్, డీవోలుగా నియమిస్తున్నారు. ఈ సెంటర్లకు సంబంధించి వేల్పూర్, జక్రాన్పల్లి, ఆర్మూర్, భీంగల్కు చెందిన దాదాపు 10 మంది ఉపాధ్యాయులు ఐదేళ్లుగా డ్యూటీలు చేస్తున్నారు. ఇందులో ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘానికి చెందిన డివిజన్ నాయకుడు చక్రం తిప్పుతున్నాడనేది బహిరంగ రహస్యంగా చెప్పవచ్చు. అలాగే ప్రతి కేంద్రంలో అవసరానికి మించి ఎక్కువ మందికి డ్యూటీలు వేయడంతో వారిలో చాలా మంది కేంద్రాలకు రాకుండానే డ్యూటీ సర్టిఫికెట్లు పొందుతూ సంపాదిత సెలవులు పొందుతున్నారు. గత మూడేళ్లుగా పై నాలుగు మండలాల ఎంఈవోలు తీసిన ఉత్తర్వు కాపీలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తే అవకతవకలు బయటపడుతాయని ఉపాధ్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని బాలికల పాఠశాలలో గతేడాది 13 మంది ఇన్విజిలేటర్లకు డ్యూటీ వేయగా అందులో 10 మందికి గత మూడేళ్లుగా సెంటర్లు మారుస్తూ డ్యూటీ వేస్తున్నారు. జిల్లాలో చాలా కేంద్రాల్లో పాత వారికే డ్యూటీలు వేస్తూ చూచిరాతలు నడిపిస్తున్నట్లు సమాచారం. రేపటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు సమన్వయకర్తలు చెప్పిన వారికే చీఫ్ సూపరింటెండెంట్, డీవో విధులు మూడేళ్లుగా అనుకూలమైన వారే ఇన్విజిలేటర్లు పైరవీలకు పెద్దపీట వేస్తున్న విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో 4,600 మంది అభ్యర్థులు పరీక్షలు రాయన్నునారు. డీఈవో ఆధ్వర్యంలో సీఎస్లు, డీవోలకు అవగాహన కల్పించాం. శనివారం ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పిస్తారు. ప్రశ్నపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేర్చాం. ఈసారి ఈఎల్స్ ఇవ్వడం లేదు. కొందరు ఇన్విజిలేటర్లను కూడా మార్చాం. చూచిరాతలు అరికట్టేలా చర్యలు తీసుకుంటాం. – రవీందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్రూ.600ల చొప్పున వసూలు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పరీక్షా కేంద్రాలలో సింహభాగం కేంద్రాలు చూచిరాతలకు అడ్డాగా మారాయి. గతేడాది ఆర్మూర్ పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.600 వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సర తప్పిదాలు పునరావృతం కాకుండా ఇటీవల అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఈసారైనా చూచిరాతలకు పుల్స్టాప్ పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే. -
ఆర్టీసీ బస్టాండ్లో షటర్ వివాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ముందు శుక్రవారం ఓ షటర్ వ్యవహారంలో వివాదం చోటుచేసుకుంది. 20 ఏళ్ల క్రితం నుంచి బస్టాండ్ ముందు షటర్ వేసుకుని టీ వ్యాపారం చేసుకుంటున్నామని తమదే ఆ షటర్ అని ఓ మహిళ తెలిపింది. ఆ షటర్ను ఆర్టీసీ యూనియన్కు కేటాయించినట్లు నాయకులు తెలిపారు. ఆ షటర్ తమదేనంటూ ఇరు వర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఆర్టీసీ అధికారులు విచారణ జరుపుతారని పోలీసులు వారికి నచ్చజెప్పి గొడవను సద్దుమనిగించారు.రోడ్డుపైనే ధాన్యం ఆరబోతలింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, శెట్పల్లి, భవానిపేట, ఒంటర్పల్లితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రోడ్డుపైనే ధాన్యం ఆరబోశారు. రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కళ్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దగ్ధమైన ఈత వనాల పరిశీలన గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలో ఈదుల్ల వాగు వద్ద ఇటీవల దగ్ధమైన ఈత వనాన్ని శుక్రవారం పరిశీలించినట్లు ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ తెలిపారు. సుమారు 300 ఈత చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాద వశాత్తు దగ్ధమయ్యాయా, ఎవరైనా దహనం చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డి ఎకై ్సజ్ ఎస్సై జగన్మోహన్, సిబ్బంది ఉన్నారు. -
నిధుల్లేక.. పనులు సాగలేక..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం చేపపిల్లల ఉత్పత్తి కోసం పనులను ప్రారంభించారు. కానీ నిధులు లేక పనులు ముందుకుసాగడం లేదు. ప్రాజెక్ట్ దిగువన 42 ఎకరాల విస్తీర్ణంతో 250 సిమెంట్ కుండీలతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. కానీ పని చేసే సిబ్బంది మాత్రం ఏడుగురు మాత్రమే ఉన్నారు. చేప పిల్లల కేంద్రంలో ప్రతి సంవత్సరం చేప పిల్లల ఉత్పత్తి చేయుటకు రూ.8లక్షల నిధులు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడ రావడం లేదు. గతేడాది కేవలం చివరి నిమిషంలో లక్ష రూపాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో చేప పిల్లల ఉత్పత్తి మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. 2 టన్నుల తల్లి చేపలు అవసరం.. ప్రస్తుతం చేపపిల్లల ఉత్పత్తి కోసం అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కోసం ముందుగా చెరువుల నుంచి తల్లి చేపలను దిగుమతి చేసుకుంటారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి 2టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. కిలోకు 100 రూపాయాల చొప్పున మత్స్యకారుల నుంచి కొనుగోలు చేయాలి. అ లెక్కన రెండు టన్నులకు 2లక్షల రూపాయాలు, రవాణా ఖర్చులు 50వేలు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ చిల్లి గవ్వ కూడ ఇవ్వ లేదు. దీంతో తల్లి చేపలను ఎలా కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల కేంద్రానికి దగ్గరలో ఉన్న చెరువుల్లో ప్రస్తుతం నీరు నిండుగా ఉంది. తల్లిచేపలను వలలతో వేటాడితే ఎక్కువ నీరున్నా చెరువుల్లో చిక్కవు. దీంతో బోధన్, నవీపేట్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మే 2వ వారం నుంచి తల్లి చేపలను తీసుకురావాల్సి ఉంటుంది. గతంలో పని చేసిన ఎఫ్డీవోలు జేబులోనుంచి ఖర్చు చేసి ఇప్పటికీ డబ్బులు రాకా నానా అవస్థలు పడుతున్నారు. అందుకే చేప పిల్లల కేంద్రంలో పని చేయాలంటే అధికారులు జంకుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఇబ్బందులు తల్లి చేపల కోసం పైసలు కరువు నిధులు రావడం లేదు.. పోచంపాడ్లోని జాతీయ చేపపిల్లల కేంద్రానికి నిధులు రావడం లేదు. ప్రభుత్వానికి పలుమార్లు నివేదించాం. ఇక్కడ పని చేసే అఽధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు కూడ జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. –ఆంజనేయ స్వామి, ఏడీ, మత్స్యశాఖ, నిజామబాద్ -
విశ్రాంత ఉద్యోగులు సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి
నిజామాబాద్ నాగారం: విశ్రాంత ఉద్యోగులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. సుభాష్నగర్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్– రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ నిర్మించిన పెన్షనర్స్– సీనియర్ సిటీజన్ భవనంను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షనర్స్, సినీయర్ సిటిజన్స్ యోగక్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవనానికి ధన్పాల్ లక్ష్మిబాయి– విఠల్గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంద కుర్చీలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, మహిళా–శిశు సంక్షేమ, వయో వృద్ధుల శాఖ జిల్లా అధికారిణి రసూల్బి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు, మదన్ మోహన్, ఈవీఎల్ నారాయణ, హమీద్, శిర్ప హనుమాండ్లు, రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ పరిశీలన నిజామాబాద్అర్బన్: నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పరిశీలించారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థుల అభిప్రాయాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కార్యదర్శి బుగ్గారెడ్డి, ముప్ప గంగారెడ్డి, మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
గంజాయి బానిసలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
మోర్తాడ్: గంజాయి మత్తుకు బానిసైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సీపీ సాయిచైతన్య సిబ్బందిని ఆదేశించారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. అంతకుముందు గౌరవ వందనం స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ.. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మత్తు పదార్థాల నిరోధన కోసం కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్, భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, సర్కిల్ ఎస్సైలు మహేష్, అనిల్రెడ్డి, విక్రమ్, రాము తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ
నిజామాబాద్నాగారం: ఆల్ ఇండియా సీనియర్ ఇంటర్ జోనల్ జాతీయ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు కాంస్య పతకాలు సా ధించారు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఈనెల 14నుంచి 16వరకు పోటీలు జరుగగా, జిల్లా క్రీడాకారులు సౌత్ జోన్ జట్టు తరపున ఆడి ప్రతిభ చూపారు. ఈసందర్భంగా క్రీడాకారులు వినయ్ (మిట్టపల్లి), మహిళల విభాగంలో వైశాలి (అక్లూర్), సౌమ్యరాణి (పందిమడుగు), మౌనిక (కారేపల్లితండా), నేహ శ్రీ (ధర్మారం) తృతీయస్థానంలో నిలిచారు. దీంతో సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ అనౌకర్, జాయింట్ సెక్రెటరీ శోభన్ బాబు వారికి కాంస్య పతకాలు, ట్రోఫీ అందజేసినట్లు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ తెలిపారు. -
కృత్రిమమేధ ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం
తెయూ(డిచ్పల్లి): కృత్రిమమేధ ద్వారా సమాజంపై అనుకూలత కంటే ప్రతికూల ప్రభావం పడుతోందని తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ అధ్యాపకుడు, సోషల్సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ అన్నారు. పీస్ జర్నలిజం స్టడీస్ అంశంపై సౌత్కొరియా దేశ రాజధాని సియోల్లో హెచ్డబ్ల్యూపీఎల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ వర్క్షాప్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై జూమ్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ ద్వారా సృష్టించిన వీడియోలు వైరల్ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా తయారయ్యాయన్నారు. వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. సమాజాన్ని అశాంతికి గురిచేసే అంశాలపై నియంత్రణకు ప్రత్యేక మెకానిజం అవసరమన్నారు. పౌరుల హక్కుల రక్షణకు, వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన విధంగా చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వందకుపైగా ప్రతినిధులు హాజరయ్యారు. తెయూ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్, సోషల్సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్ -
తిమ్మాపూర్లో చోరీకి యత్నం
దుండగుడిని పట్టుకున్న గ్రామస్తులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోగల ఓ ఇంట్లో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించగా, ఓ దుండగుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుందకు చెందిన ఇద్దరు యువకులు కడమంచి రమేష్, శ్రీకాంత్ గురువారం ఉదయం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి పాత ఇంటిలో ఉంచిన ట్రాక్టర్కు సంబంధించిన పాత ఇనుప సామాన్లను చోరీ చేసేందుకు యత్నించారు. వెంటనే ఇంటి యజమాని వారిని గుర్తించి కేకలు వేశారు. గ్రామస్తులు ఇంటి వద్దకు వచ్చి నిందితులను పట్టుకునేందుకు యత్నించగా ఒకరు పారిపోగా రమేష్ గ్రామస్తులకు చిక్కాడు. గ్రామస్తులు వివరాలు సేకరించి అతడిని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్మూర్లో పోలీసుల తనిఖీలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో గురువారం నిషేధిత మ త్తు పదార్ధాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గు ర్తించేందుకు శిక్షణ పొందిన డాగ్స్వ్కాడ్ ద్వారా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్తోపాటు హోటల్స్, దుకాణాలను సిబ్బంది తనిఖీ చేశారు. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ మాట్లా డుతూ.. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా సుమన్ నిజామాబాద్ అర్బన్: ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ సుమన్ నియమితులయ్యారు. నగరంలోని టీఎన్జీవోఎస్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల జాయింట్ యాక్షన్కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్గా సుమన్ను సభ్యులు ఎన్నుకున్నారు. ఫోన్ కొడితే ఆర్టీసీ బస్సుల సమాచారం ఖలీల్వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్లోని బస్సు వేళల వివరాల కోసం ప్రయాణికులు ఫోన్ కొడితే సమాచారం అందించనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం కోరారు. రీజియన్ పరిధిలోని నిజామాబా ద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపో ల పరిధిలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇలా.. ఆర్మూర్–73828 43133 బోధన్–98495 00725 నిజామాబాద్–99592 26022 బాన్సువాడ–94911 05706 కామారెడ్డి–73828 43747 -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిపించాలి
ఆర్మూర్టౌన్: ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు జ రిగే చూడాలని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ అన్నా రు. ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్స్, ఎంసీహెచ్ సూపర్వైజర్లతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించాలని, రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. -
తెయూలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో గురువారం హనుమాన్ జన్మోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అంతకుముందు క్యాంపస్ ఆవరణలోని హనుమాన్ ఆలయం వద్ద రిజిస్ట్రార్ యాదగిరి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ సంపత్కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్, ప్రొఫెసర్ కనకయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం నిర్వహించిన శోభాయాత్రలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాషాయ జెండాలు చేతబట్టి నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్, అశోక్, సభ్యులు అక్షయ్, మనోజ్, శివ, వినోద్, సంతోష్, రాకేష్, సాయినాథ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
● ‘భూ భారతి’ చట్టంతో రైతుల భూములకు భరోసా ● కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ● మూడు మండలాల్లో అవగాహన సదస్సులు కమ్మర్పల్లి/మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ నూతన ఆర్వోఆర్ ( రికార్డ్ ఆఫ్ రెవెన్యూ) చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండల కేంద్రాల్లో భూ భారతి చట్టంపై గురువారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు క్షుణ్ణంగా వివరించారు. వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తెచ్చిందన్నారు. రైతుల భూములకు భరోసా లభిస్తుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చనున్నట్లు తెలిపారు. మే మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తారని వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో భూ భారతి చట్టంపై సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తారని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. భూ వివాదాల విషయంలో అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని చెప్పారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాదిలోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి ద్వారా మూడంచెల వ్యవస్థ ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులను కేటాయిస్తారన్నారు. వ్యవసాయ భూములతోపాటు, వ్యవసాయేతర, మిగతా అన్ని రకాల భూముల వివరాలు రెవెన్యూ కార్యాలయంలో న మోదై ఉన్నాయన్నారు. ఇది వరకు ఉన్న ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ప్రస్తుతం రికార్డుల ని ర్వహణ ఉంటుందని తెలిపారు. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా ప రిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో ఏదై నా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్లో ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను నవీకరణ చేస్తారని తెలిపారు. సదస్సులో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు ఆంజనేయులు, కృష్ణ, ఎంపీడీవో తిరుమల, ఏఎంసీ చైర్మన్ నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, డైరెక్టర్లు బూత్పురం మహిపాల్, లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, వ్యవసాయాధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించొద్దుభూ సమస్యలు, లోటుపాట్ల సవరణ వంటి వాటి కోసం రైతులు మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వొద్దన్నారు. అసైన్మెంట్ భూములకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని పేర్కొన్నారు. అనంతరం ఆయా అంశాలపై రైతులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. నూతన చట్టంలో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు చేయవచ్చన్నారు. -
అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు
ఖలీల్వాడి : నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో అక్రమ వడ్డీ వ్యాపారుల ఇళ్లు, కా ర్యాలయాలపై పోలీసులు గురువారం దా డులు నిర్వహించారు. ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సోదాలు చేశారు. ప్రభు త్వ అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ఫైనాన్స్లు ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యా పారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ వడ్డీ దందా నిర్వహిస్తున్నారనే ఫిర్యా దులు రావడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. సోదాల్లో భాగంగా నిజామాబాద్ డివిజన్లో 27 ఫైనాన్స్ నోట్స్, 543 ప్రామిసరీ నోట్స్, ఒక వాహనం, రూ.53.09లక్షల నగదు, ఆర్మూర్ డివిజన్లో 4 ఫైనాన్స్ నోట్స్, 610 ప్రామిసరీ నోట్స్, 21 సేల్ డీడ్స్, 5 బాండు పేపర్లు, రూ.2.76లక్షల నగదు, బోధన్ డివి జన్లో 282 ప్రామిసరీ నోట్స్, 22 సేల్ డీడ్స్, రెండు వాహనాలు, 25 బాండ్ పేప ర్లు, రూ.12.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జడ్జిల బదిలీలు ఖలీల్ వాడి : జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ గురువారం హైకోర్టు రిజి స్ట్రార్ (విజిలెన్స్) ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ ఆర్మూర్ జడ్జి నసీమా సుల్తానా నాగర్కర్నూల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు బదిలీ కాగా, బోధన్ సీనియర్ సివిల్ జడ్జి దేవాన్ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని 15 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఎల్బీ నగర్ లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి సీనియర్ సివిల్ జడ్జిగా ఆర్మూర్కు బదిలీ అయ్యారు. నిజామాబాద్ లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి పద్మావతి సికింద్రాబాద్ లోని 11వ మెట్రోపాలిటన్కు బదిలీ కాగా, నిజా మాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు హైదరాబాద్ లోని ఒకటవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ గా బదిలీ అయ్యారు. 17వ సివిల్ కోర్టు అడిషనల్ జడ్జి కాంచన రెడ్డి బోధన్ సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. పశువుల సంరక్షణకే వ్యాధి నివారణ టీకాలు ● జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్రెడ్డి ఆర్మూర్ : పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి సోకకుండా సంరక్షించేందుకే వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని రోహిత్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, పశువైద్యం అందుతున్న విధివిధానాలపై పాడిరైతులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల 15 వరకు పశువులకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, రాధ, దివ్య, శ్రీనివాస్, అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కృతజ్ఞత సభ పోస్టర్ ఆవిష్కరణ నిజామాబాద్ అర్బన్ : స్కూల్ అసిస్టెంట్లు గా ప్రమోషన్లు పొందిన తెలుగు, హిందీ, ఉ ర్దూ భాషోపాధ్యాయులంతా ప్రభుత్వానికి కృతజ్ఞత చాటుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పేర్కొన్నా రు. ఈ నెల 20న న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్న రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కృతజ్ఞత సభ పోస్టర్ను తన కా ర్యాలయంలో డీఈవో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమోషన్లు పొందిన వారంతా బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లా విద్యాశాఖను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ జమీలుల్లా, కేవీ రమణాచారి, రాష్ట్ర సహాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, సంఘ బాధ్యులు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్కు రూ.3.50 కోట్లు
● మెడికల్ కాలేజ్, ఎంసీహెచ్లలో అభివృద్ధి పనులకు నిధులు ● వైద్యవిభాగాలను తనిఖీ చేసిన డీఎంఈ ● నాలుగు గంటలపాటు సుదీర్ఘ పరిశీలన ● మాతాశిశు సంరక్షణ క్రిటికల్ కేర్లో రెండు లిప్టుల ఏర్పాటు చేస్తాం ● డీఎంఈ నరేంద్రకుమార్ వెల్లడి నిజామాబాద్ నాగారం : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఎంసీహెచ్, మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.3.50 కోట్లు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ వెల్లడించారు. మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ విభాగంలో నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేయడంతోపాటు జీజీహెచ్ను అధునాతనంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, ఎంసీహెచ్, మెడికల్, నర్సింగ్ కాలేజీలను గురువారం రాష్ట్ర ఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్తో కలిసి డీఎంఈ పరిశీలించారు. సుమారు నాలుగు గంటలపాటు ఆస్పత్రిలో పర్యటించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై క్షేత్ర పర్యటనలో ఉన్న కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో గూగుల్ మీట్ ద్వారా సంప్రదించి చర్చించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో జీజీహెచ్ పనితీరు ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఈ మేరకు జీజీహెచ్ను సందర్శించినట్లు తెలిపారు. విడుదలైన నిధుల నుంచి రూ.కోటి 50 లక్షలతో జీజీహెచ్లో డ్రెయినేజీ వ్యవస్థ, ఆవరణలో పరిశుభ్రత, భవనానికి గ్లాసులు తదితర మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.30 లక్షలతో నర్సింగ్ కాలేజ్ భవనానికి మరమ్మతులు చేసి పీజీ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. వారి వెంట వైస్ ప్రిన్సిపాల్స్ జలగం తిరుపతిరావు, నాగమోహన్, ఎంఎస్ఐడీసీ ఈఈ కుమార్, సూపరింటెండెంట్ నాగరాజు, ప్రొఫెసర్లు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. -
జోరు పెంచిన బీఆర్ఎస్
● భీమ్గల్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం● ప్రజాసమస్యలపై పోరాటానికి తగ్గేదే లేదంటున్న గులాబీ శ్రేణులు ● రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సభకు లభించిన స్పందన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు ఎక్కడంటూ గులాబీ పార్టీ నిలదీతలను జిల్లా లో ఉధృతం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి 16 నెలలు గడిచినప్పటికీ హామీలను అమ లు చేసే విషయంలో ఏమీ పట్టనట్లు ఉంటు న్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. జిల్లాలో బా ల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్ర శాంత్రెడ్డి ప్రజాసమస్యల విషయమై కార్యాచరణను ముమ్మరం చేశారు. ప్రజా సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ స్పీడ్ పెంచా రు. రైతుల ఆత్మహత్యలపై గత జనవరిలో బీ ఆర్ఎస్ అధ్యయన కమిటీ వచ్చిన నేపథ్యంలో మెండోరా మండలం బుస్సాపూర్లో నిర్వహించిన సభకు రైతుల నుంచి భారీ స్పందన వ చ్చింది. రైతులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుంటే రేవంత్ సర్కార్ సోయిలేకుండా వ్యవహరిస్తోందని ఆ సభలో బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలపై పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పోరుబాట పట్టిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. నాయకత్వం పిలుపు మేరకు జిల్లాలో వరుసగా రైతు రుణమాఫీ, ఎల్ఆర్ఎస్, ధాన్యం బోనస్, రైతుబంధు అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. దీక్షాదివస్నూ నిర్వహించి కార్యకర్తలను ముందుకు నడిపించారు. కాంగ్రెస్ హామీలపై రగడ.. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్లో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో హామీల విషయ మై రగడ నెలకొంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్ హామీలను ప్రస్తావించా రు. తులం బంగారం, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, కౌలు రైతులకు రూ.15 వేలు, భూ మిలేని నిరుపేదలకు రూ.12 వేలు, పోడు ప ట్టాలు, అమరుల తల్లిదండ్రులకు రూ.25 వేల పింఛన్, నిరుద్యోగ భృతి రూ.4 వేలు, వృద్ధులకు రూ.4 వేల పింఛన్ తదితర హామీలను ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశాంత్రెడ్డి నిలదీశారు. ఆడబిడ్డలు హామీల గురించి అడుగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పాలని వేముల అన్నారు. దీంతో మంత్రి జూపల్లి స్పందిస్తూ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అ ప్పులపాలైందని, వడ్డీలు కట్టడానికే సరిపోతోందని కౌంటర్ ఇచ్చారు. అప్పులు రహస్యంగా చేయరని, బడ్జెట్లో ప్రకటించే చేస్తారని, అప్పుల పేరు చెప్పి హామీల అమలును గాలికొదిలేయడం సరికాదని ప్రశాంత్రెడ్డి అన్నారు.ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీతలు హామీల అమలు ఎక్కడ? : ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత ప్రభుత్వంలో అప్పులయ్యాయి : మంత్రి జూపల్లికార్యకర్తల్లో ఊపు..కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం భీమ్గల్ సభలో బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తు లం బంగారం ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో పోలీసులు అనూ హ్యంగా లాఠీచార్జి చేశారు. దీంతో ఎమ్మె ల్యే ప్రశాంత్రెడ్డి కార్యకర్తలకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ, ఇకపై ప్రజల పక్షాన పోరు మరింత ఉధృతం చేస్తామంటూ ప్రశాంత్రెడ్డి ప్రకటించడంతో కార్యకర్తల్లో మరింత ఊపు వచ్చింది. -
న్యాయవాదుల సహకారం మరువలేనిది
మాట్లాడుతున్న జిల్లా జడ్జి సునీత కుంచాలఖలీల్వాడి : కోర్టులో న్యాయవాదుల సహకారం మరువలేనిదని జిల్లా జడ్జి సునీత కుంచాల పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో జడ్జి మాట్లాడారు. మూడున్నరేళ్ల పదవీకాలంలో న్యాయాన్ని కక్షిదారులకు అందించడంలో న్యాయ వాదుల సహకారం వెలకట్టలేనిదన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల లక్ష్యం కక్షిదారులకు న్యాయసేవలు త్వరితగతిన అందించడమేనని అ న్నారు. వేలాది మంది మహిళలు, బాలికలకు ఆత్మరక్షణ కోసం ఇప్పించిన తైక్వాండో శిక్షణ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం నిజామాబాద్ మహిళా లోకపు చైతన్యశీలికి దక్కిన అరుదైన గౌరవంగా ఆమె అభివర్ణించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయిరెడ్డి మాట్లాడు తూ బార్ అండ్ బెంచ్ సమన్వయంతో మెరుగైన న్యాయ ఫలితాలు కక్షిదారులకు అందించడంలో ముందుభాగాన నిలిచామన్నారు. అనంతరం జిల్లా జడ్జి సునీతను ఘనంగా సన్మానించారు. బార్ ప్ర ధాన కార్యదర్శి మాణిక్ రాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షు లు దిలీప్, సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, న్యాయవాదులు రమాదేవి, ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్, రమేశ్, కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ రావు, కిరణ్కుమార్ గౌడ్, మాజీ పీపీ మధు సూదన్ రావు, టక్కర్ హన్మంత్ రెడ్డి, అజార్ కిషన్ రావు, వీ భాస్కర్, పరుచూరి శ్రీధర్ పాల్గొన్నారు. వీడ్కోలు సమావేశంలో జిల్లా జడ్జి సునీత కుంచాల -
గతేడాది కంటే ఎక్కువే..
బాల్కొండ : లక్ష్మి కాలువ ద్వారా విడుదలవుతున్న నీటిని ఈ నెల 9న అధికారులు నిలిపివేశారు. అయి తే మెండోరా మండలం బుస్సాపూర్, నల్లూర్, ము ప్కాల్ మండలం కొత్తపల్లి, నల్లూర్ గ్రామాల్లో వరి పంటలు ఇంకా కోతకు రాలేదు. ఒక్క తడి నీరంది తే చాలు పంటలు గట్టెక్కుతాయి. ఇదే విషయాన్ని అధికారులకు చెబితే ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుతం చుక్క నీరు వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు లీకేజీ నీటికి అడుగడుగునా అడ్డుకట్ట వేసి తూముల వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా 100 క్యూసెక్కు ల నీటిని వదిలినా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉ న్నతాధికారులు స్పందించి లక్ష్మికాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో గతేడాది కంటే ఎక్కు వ నీరు నిల్వ ఉంది. గతేడాది ప్రాజెక్ట్లో 8.9 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ప్రస్తుతం 11.44 టీఎంసీల నీరుంది. అయినా ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు పంటలను కాపాడేందుకు అధికారులు నీటి విడుదలను చేపట్టడం లేదని రైతు లు ఆరోపిస్తున్నారు. లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల కోసం హెడ్ రెగ్యులేటర్ ఎత్తిపోగా, లక్ష్మి లిప్టును వినియోగించి నీటి విడుదల చేపట్టొచ్చు. కానీ, ప్రాజెక్ట్ అధికారులు ఆ దిశగా కృషి చేయడం లేదని తెలుస్తోంది. చివరి తడికి నీరు అందించకుంటే సుమారు వెయ్యి ఎకరాల మేర పంట ఎండిపోతుందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు పట్టించుకోవాలి 100 క్యూసెక్కుల నీరు మూడ్రోజులు వదిలినా మా పంటలకు నీరు అందుతుంది. ప్రాజెక్ట్లో కూడా నిరుడు కంటే ఎక్కువగానే నీరుంది. పాలకులు పట్టించుకొని పంటలను కాపాడాలి. – గౌతం, రైతు, బుస్సాపూర్నీటిని విడుదల చేయాలి నీరందక వరి పంట ఎండిపోతుంది. ఒక్క తడి అందిస్తే పంటలు గట్టెక్కుతాయి. ఏటా ఇదే తిప్పలు అవుతుంది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలి. – గంగారాం, రైతు, బుస్సాపూర్ -
జిల్లాలో ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’
ఖలీల్వాడి: జిల్లాలో ఇక నుంచి ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్లు వాహ నాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించేవారమని, ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు చో టుచేసుకుంటున్నాయని, ఇక నుంచి మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిని ఎంవీ ఐ యాక్ట్–2019, సెక్షన్ 199–ఏ ప్రకారం కోర్టులో హాజరుస్తామని పేర్కొన్నారు. వాహన యజమానికి న్యాయస్థానం మూడే ళ్ల జైలు శిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధిస్తుందని తెలిపారు. వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్ 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత ఉండదని, వాహనం రిజిస్ట్రేషన్ను సంవత్సరం వరకు రద్దవుతుందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సీపీ సూచించారు. ● వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు ● తల్లిదండ్రులు, వాహన యజమానికి జైలు శిక్ష ● వాహన రిజిస్ట్రేషన్ రద్దు -
ఇసుక చల్లడంతోనే వివాదం ముదిరిందా..?
మోర్తాడ్: భీమ్గల్లో పోలీసులు లాఠీచార్జీ చేయడానికి కొందరు వ్యక్తులు ఇసుక చల్లడమే కారణమని తెలుస్తోంది. కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి తన వాహనం ఎక్కుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై ఇసుక చల్లి కనిపించకుండా చేయడంతో స్వల్ప లాఠీచార్జి చేసినట్లు తెలిసింది. ఇసుక చల్లిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు వీడియోలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇసుకను చల్లి పోలీసులకు కనిపించకుండా చేయడం ద్వారా మంత్రి కాన్వాయ్కు ఏదైనా హాని తలపెట్టాలని చూశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కావాలనే ఉద్రిక్తతలను సృష్టించేందుకు ఇసుక చల్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నారు. -
మంజీర తీరాన ఆధ్యాత్మిక శోభ
బోధన్: సాలూర మండలం మందర్నాలో బుధవారం అనంత విభూషిత జగద్గురు రామానందచార్య దక్షిణ పీఠం నానీజ్ధాం పీఠాధిపతి స్వామి నరేంద్రచార్య పాదుక దర్శన కార్యక్రమాన్ని జిల్లా స్వ–స్వరూ్ప్ సాంప్రదాయ్ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. మహారాష్ట్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి నామ స్మరణతో సభ మారుమోగింది. గ్రామ శివారులోని కాశీనాథ శివాలయం వద్ద స్వామి వారి పాదుకాలకు పూజ చేసి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో ఉంచి శోభాయాత్రను ప్రారంభించారు. వేదిక పై గురుపూజ, ఉపాసక దీక్ష, మంగళహారతి వేడుకను నిర్వహించారు. అనంతరం నానీజ్ధాం పీఠం ప్రతినిధులు ప్రవచనాలు చేశారు. సమాజంలో ఆధ్మాత్మిక జ్ఞానం, సామాజిక సేవా దృక్పథం పెంపొందించి లోక కల్యాణార్థం స్వామి వారి పాదుకా దర్శన కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు కకసాహేబ్ వన్సారే, సుధాకర్ అడ్కినే, లోచన్ రౌత్ సాహేబ్, గోవింద్ ఉపాసే, సాయినాథ్ ఖథాల్, సాయి ముప్డి, గంగాధర్, మందర్నా రవి, ప్రదీప్ గుప్తా, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీకి తాళం వేసిన రైతులు
రుద్రూర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గ న్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, హమాలీల కొరత ఉందని ఆరోపిస్తూ మండలంలోని ఎ త్తొండ సొసైటీకి రైతులు బుధవారం తా ళం వేసి ఆందోళన చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో సమస్యల గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచి రోజులు గడుస్తున్నాయని, అకా ల వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోయే ప్ర మా దం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రంలో సమస్యలను పరిష్కరించి గన్నీ బ్యాగులను, హమాలీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.డంపింగ్యార్డ్లో బోర్ పాయింట్ల గుర్తింపు నిజామాబాద్ సిటీ: నగర శివారులోని నాగా రం డంపింగ్యార్డులో బోర్ వేసే పాయింట్లను గుర్తించారు. ఈమేరకు బుధవారం జియాలజిస్ట్ బృందం సభ్యులు నిఖిత్ పర్వీన్, హరీష్, ధర్మయ్య యార్డును పరిశీలించి, రెండు చోట్ల బోర్ పాయింట్లను గుర్తించారు. త్వరలోనే బోర్లు వేసి నీటి వసతి కల్పించనున్నట్లు ఏఎంసీ జయకుమార్ తెలిపారు. మున్సిపల్ శానిటేషన్ సూపర్వైజర్ సాజిద్అలీ, డంపింగ్యార్డు ఇన్చార్జి ప్రభుదాస్, మున్సిపల్ ఏఈలు ఇనాయత్కరీం, సల్మాన్ ఖాన్, సూపరింటెండెంట్ రాకేశ్ తదితరులు ఉన్నారు. జిల్లాకు నేడు డీఎంఈ రాక నిజామాబాద్నాగారం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్, టీజీ ఎమ్ఐడీసీ సీఈ దేవేందర్ గురువారం జిల్లా కేంద్రానికి రానున్నారు. జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగాన్ని వారు పరిశీలించనున్నారు. సద రు విభాగాలను గతేడాది డిసెంబర్లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. కానీ లిప్టులు, ఇతర పరికరాలు అందుబాటులో లేకపోవడంతో సంబంధిత అధికారులు భవనాన్ని అలాగే ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రానికి అవసరమైన నాలుగు లిప్టులు, ఇతర పరికరాలను వారు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. తదుపరి జీజీహెచ్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆధునిక సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతుండడంతో ఆనందానికి దూరమవుతున్నారని, ఉమ్మడి కుటుంబ సంస్కృతి కొనసాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన లక్కారం తవ్వన్న ఉమ్మడి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మంత్రి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల ఇన్చార్జీలు పొద్దుటూరి వినయ్రెడ్డి, ముత్యాల సునీల్రెడ్డి, డీఎస్వో అరవింద్రెడ్డి, సవిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, మారుతిరెడ్డి, రవిగౌడ్, కాశీరాం, కొంతం మురళీధర్ తదితరులు ఉన్నారు. -
ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చేపట్టండి
ఖలీల్ వాడి: ఎకై ్సజ్ శాఖలో బదిలీలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు ప్రొబేషనరీ అండ్ ఎకై ్సజ్ ఉమ్మడి జిల్లా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రికి హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ విన్నవించారు. ఎనిమిదేళ్ల నుంచి బదిలీలు జరగలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించి, ఎలక్షన్ కోడ్ ఉండటంతో ఎకై ్సజ్ శాఖలో బదిలీలు ఆలస్యమైనట్లు చెప్పారు. మే నెలలో బదిలీలు చేయాలని కమిషనర్కి చెప్పినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ రవి కుమార్, సెక్రెటరీ చంద్రమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భోజన్న, ప్రెస్ సెక్రటరీ ఉత్తమ్, జాయింట్ సెక్రెటరీ మంజుల తదితరులున్నారు. -
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
నిజామాబాద్నాగారం: అంగన్వాడికి వచ్చే బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సిబ్బందికి సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపం నివారించడానికే జాతీయ పోషణ పక్షం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ఏడవ జాతీయ పోషణ పక్షం–2025 కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమాధికారి షేక్ రసూల్బీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ హాజరై మాట్లాడారు. పిల్లల్లో ఉబకాయాన్ని తగ్గించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండే విధంగా చూసుకోవాలన్నారు. జిల్లా ఆయుష్ కో–ఆర్డినేటర్ సాయగౌడ్, డీఎంహెచ్వో రాజశ్రీ, అధికారులు పాల్గొన్నారు. మెడికల్ షాపు లైసెన్స్ రద్దు నిజామాబాద్నాగారం: నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న గిరిజా మెడికల్ దుకాణం లైసెన్సును రద్దు చేసినట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. మెడికల్ దుకాణంలో ఫార్మసిస్టు, రికార్డులు లేకపోవడం, ఎప్పటికప్పుడు రోజువారీగా నమోదు చేయాల్సిన బిల్స్ కూడా ప్రాపర్గా నమోదు కాకపోవడాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే లైసెన్సును రద్దు చేసి తాత్కాలికంగా మెడికల్ షాపును మూసివేసినట్లు తెలిపారు. -
చెత్తకు నిప్పు.. చెట్లకు ముప్పు
వేల్పూర్: మండలంలోని అమీనాపూర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్ట డంతో సమీపంలోని హరితహారం చెట్లు దెబ్బ తింటున్నాయి. దీంతో అవి మొదళ్ల వద్ద కాలి బలహీనమై బలమైన గాలులు వీస్తే విరిగిపోయే స్థితికి చేరుకున్నాయి. వేల్పూర్ నుంచి 63వ నంబర్ జాతీయ రహదారి వరకు దివంగత వేముల సురేందర్రెడ్డి యాభై ఏళ్ల క్రితం మొక్కలు నాటించగా వృక్షాలుగా మారాయి. వీటికి తోడు 2016లో మాజీ సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మోతె గ్రామానికి వచ్చినప్పుడు మోతె నుంచి వేల్పూర్ మీదుగా 63 నంబరు జాతీయ రహదారి వరకు వేలాది మొక్కలు నాటారు. వాటిని పదేళ్ల పాటు హరితహారం కార్యక్రమం ద్వారా నీరుపోసి సంరక్షించగా భారీ చెట్లుగా రూపుదిద్దుకున్నాయి. రహదారికి ఇరువైపులా పంటలకు నీడ వచ్చి దిగుబడి రాకుండా చేస్తున్నాయని కొందరు నరికి వేస్తుండగా, మరికొన్ని చోట్ల వృక్షాల మొదళ్ల వద్ద చెత్తను తగులబెడుతున్నారు. దీంతో చెట్ల మొదళ్లు కాలిపోయి బలం కోల్పోతున్నాయి. అధికారులు స్పందించి చెట్లకు నిప్పు పెట్టకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు కీలక బలం
ఆర్మూర్టౌన్: న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు కీలక బలమని, న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పర గౌరవంతో పనిచేస్తేనే ప్రజలకు సమర్థవంతమైన న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ కోర్టులోని న్యాయవాదుల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి జడ్జి హాజరై మాట్లాడారు. నూతన కార్యవర్గం న్యాయవాదుల బార్ అసిసియేషన్ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణా స్వీకారం చేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి, అడిషనల్ జడ్జి సరళరాణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జక్కుల శ్రీధర్, జెస్సు అనిల్, ఉపాధ్యక్షుడు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జెల, చైతన్య, సంయుక్త కార్యదర్శి గంగారాం, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
రజతోత్సవ సభపై విస్తృత ప్రచారం
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఈనెల 27వ తేదీన సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం తరహాలో విస్తృతంగా వాల్రైటింగ్ చేయిస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జనం ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో వాల్ రైటింగ్ను చేయించారు. ఎన్నికల్లో వాల్ రైటింగ్ చేయాలంటే ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవి సాధారణ రోజులు కాబట్టి ఇంటి యజమాని అనుమతితో వాల్ రైటింగ్ను నిర్వహిస్తున్నారు. వేల్పూర్లో చేసిన వాల్ రైటింగ్ను ఇటీవల బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి స్వయంగా పరిశీలించారు. అలాగే సభకు జనంను ఎక్కువగా తరలించడానికి కార్యకర్తలు కుల సంఘాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల ప్రచారం తలపించేలా వాల్ రైటింగ్ చేయిస్తుండటంపై పలువురు చర్చించుకుంటున్నారు. – మోర్తాడ్ -
పోలీసుల అత్యుత్సాహం
నిజామాబాద్అర్బన్: సమస్యను విన్నవించుకునేందుకు కలెక్టరేట్కు వచ్చిన ఓ వృద్ధురాలి విషయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శ్రీనగర్కు చెందిన సరస్వతి అనే వృద్ధురాలు తన సమస్య ను ఉన్నతాధికారులకు తెలిపేందుకు బుధవారం కలెక్టరేట్కు వచ్చింది. అదే సమయంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం ప్రారంభం కానుండటంతో పోలీసులు ఆమెను చు ట్టుముట్టి ఇక్కడికి రావొద్దంటూనే బలవంతంగా బ యటికి తీసుకెళ్లారు. ఆటోను పిలిపించి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో ఆర్టీసీ బస్టాండ్కు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఎండలో తిప్పలు పడుతూ అధికారులను కలిసేందుకు తాను వస్తే పోలీసులు వెనక్కి పంపించేశారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలి కానీ ఇలా సమస్యను విన్నవించుకోవడానికి వచ్చిన వృద్ధురాలిని వెనక్కి పంపించడమేమిటని పలువురు చర్చించుకున్నారు. -
బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. తులం బంగారం ఏమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఒక దశలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తోసుకుంటూ సభా వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. చెక్కుల పంపిణి వేదిక బయట కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గు మిగూడి బల ప్రదర్శనకు దిగారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారిని సముదాయించడానికి పోలీసులు ఎంతో శ్రమించారు. స్వల్ప లాఠీచార్జి చేయడంతో కార్యక్రమంఅనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మొదట పోలీసు అధికారులు ఫోన్లో ప్రశాంత్రెడ్డితో మాట్లాడి ధర్నా కార్యక్రమం విరమించాలని కోరారు. చివరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి భీమ్గల్కు చేరుకుని లాఠీచార్జి చేసినట్లు, కావాలని గాయపరిచినట్లు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రశాంత్రెడ్డి తన నిరసనను విరమించి వెళ్లిపోయారు. ఉద్యమాలు మాకు కొత్త కాదు ఉద్యమాలు బీఆర్ఎస్కు కొత్త కాదని ఉద్యమంతోనే తమ పార్టీ పురుడుపోసుకుందని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. ధర్నా ముగించి వెళ్లే ముందు కార్యకర్తలు, నాయకులతో ఆయన మాట్లాడారు. లాఠీచార్జి చేసిన పోలీసులను వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్గల్: బైక్పై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ పండరి ఈ నెల 10న అంజని గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తున్నాడు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడాన్ని గమనించని అతను వాటిపై ప్రయాణించడంతో కిందపడిపోయాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తాడ్కోల్లో మరో వ్యక్తి..బాన్సువాడ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్కు చెందిన కుర్మసాయిలు (51) గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 9న కుమార్తె వివాహం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సాయిలు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు నిజామాబాద్కు తరలించిగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు సీఐ పేర్కొన్నారు. -
ఉద్యానవన పంటలతో రైతులకు లాభాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధిహామీ పథకంలో ఉద్యానవన పంటలను పెంచుకునే అవకాశముందని, ఉద్యానవన పంటలు రైతులకు ఎంతో లాభదాయకమని డీఆర్డీవో సురేందర్ అన్నారు. ఆయన బుధవారం తాడ్వాయి శివారులో ఉద్యానవన పంటలో భాగంగా వేసిన మునగ పంట పెంపకంను పరిశీలించారు. మొక్కల పెంకం, మునక్కాయల దిగుబడిని రైతును అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి సుమారు వేయి మొక్కల చొప్పున రెండు ఎకరాలలో రెండువేల మొక్కలను నాటామని, క్వింటాల్ మునగ కాయకు మార్కెట్లో రూ. 2వేలు వస్తాయని రైతు సమధానం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 400ఎకరాలలో ఉద్యానవన పంటలను పెంచుకునేందుకు అవకాశముందని, ఆసక్తిగల రైతులు ముందుకు రావాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశముందని తెలిపారు. అనంతరం మండలపరిషత్ కార్యాల యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డు అసిస్టెంటులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పండ్ల తోటల పెంపకం నిమిత్తం ప్రతిగ్రామం నుంచి ఒకరి నుంచి ఐదుగురి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో కృష్ణగౌడ్, టెక్నికల్ అసిస్టెంట్లు స్వామి, మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి డీఆర్డీవో సురేందర్ -
నేటి నుంచి భూ భారతి సదస్సులు
మోర్తాడ్(బాల్కొండ): ధరణి స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ పనితీరు, భూ ముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోర్తాడ్లో గురువారం మొదటి అవగాహన సదస్సు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు హాజరుకానున్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని మండల కేంద్రాల్లో భూ భారతి అమలుపై రైతుల భాగస్వామ్యంతో సమావేశాలను నిర్వహించనున్నారు. అవగాహన సదస్సు నిర్వహించే ముందు రోజు గ్రామాల్లో దండోరా వేయించను న్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, తహసీ ల్దార్ల పర్యవేక్షణలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వం భూములకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరిస్తామని చెబుతోంది. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే దీనిని తీసుకువచ్చామంటోంది. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సుల ద్వారా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే వీలు ఏర్పడనుంది. ఈ నెలాఖరు వరకు మండల కేంద్రాల్లో నిర్వహణ మోర్తాడ్ నుంచి శ్రీకారంసందేహాలను నివృత్తి చేసేందుకే.. కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్పై సందేహాలను నివృత్తి చేసేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా సమావేశాలకు హాజరు కావాలి. ఎలాంటి అనుమానాలు ఉన్నా వాటికి సమాధానం రాబట్టుకోవాలి. – కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్ -
23 వరకు డిగ్రీ ప్రాక్టికల్స్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రాక్టికల్ / ప్రాజెక్టు పరీక్షలను ఈ నెల 16 నుంచి 23 వరకు నిర్వహించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కె సంపత్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో ప్రాక్టికల్స్/ ప్రాజెక్టు పరీక్షలు నిర్వహించి వెంటనే మార్కులను ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాల్సిందిగా కంట్రోలర్ తెలిపారు. పూర్తి వివరాలను తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కామర్స్లో డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో పరిశోధక విద్యార్థిని కె రంజిత పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. తెయూ కామర్స్ అధ్యాపకులు, రిజిస్ట్రార్ యాదగిరి పర్యవేక్షణలో ‘అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ – ఏ స్టడీ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణస్టేట్’ అనే అంశంపై రంజిత పరిశోధన పూర్తి చేసి సి ద్ధాంత గ్రంథం మంగళవారం సమర్పించారు. రంజిత గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ లో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొ ఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరం రంజితను వీసీ యాదగిరిరావు,రిజిస్ట్రార్ యాదగిరి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ డీన్ రాంబాబు, అధ్యాపకులు శ్రీనివాస్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. పరిమితికి మించి ప్రయాణం చేయొద్దు ఖలీల్వాడి: ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణం చేపటొద్దని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ ప్రసాద్ ఆటో డ్రైవర్లకు సూచించారు. నగరంలోని ట్రాఫిక్ పీఎస్లో ఆటో డ్రైవర్లకు పలు అంశాలపై సూచనలు చేశారు. డ్రైవర్ సీటు పక్కన మరో సీటు పెట్టవద్దని, విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకోరాదని, నంబర్ల ప్లేట్ లేని ఆటోలను నడపరాదని సూచించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. ఇన్చార్జి మంత్రిని కలిసిన సీపీ నిజామాబాద్అర్బన్/ ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును సీపీ సాయిచైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యలపై స్పందించాలని కోరు తూ టీయూడబ్ల్యూజే ఐజే యూ నాయకులు ఇన్చార్జి మంత్రికి వినతిపత్రం అందజేశారు. -
ఇదేం పద్ధతి..?
ఇందిరమ్మ ఇళ్లు.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. పక్కన ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, వ్యవసాయ కమిషన్ సభ్యడు గడుగు, సబ్ కలెక్టర్ వికాస్● ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాలో పర్యటించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్య క్రమాలు, పథకాలపై సమగ్రంగా చర్చించారు. ఆర్మూర్లో సన్నబియ్యం లబ్ధిదా రు ఇంట్లో భోజనం చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్గల్లో లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం పెర్కిట్(ఆర్మూర్): పేద, సామాన్య ప్రజల కడు పు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రేషన్ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న ఇంట్లో సన్నబియ్యంతో మంత్రి బుధవారం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించి మార్కెట్లో సన్న బియ్యం కొనుగోలు చేసుకునే వారన్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నీటి సరఫరా తీరుపై ఇన్చార్జి మంత్రి జూపల్లి అసహనం ●● మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్లు ఎందుకు రాలేదు..? ● కలెక్టర్ను ప్రశ్నించిన మంత్రి ● సమస్యలను తెలుసుకునేందుకు టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయండి ● సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్అర్బన్: జిల్లాలో వేసవి సీజన్కు సంబంధించి తాగునీటి సరఫరా తీరుపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశా రు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లాస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు పి సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, జిల్లాస్థా యి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకాగా, వ్యవసాయం, తాగునీటి సరఫరా, మార్కెటింగ్, పౌరసరఫరాలు, హౌసింగ్, భూ భారతిపై సమగ్రంగా చర్చించారు. భీమ్గల్లో నీటి సమస్య ఉందని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి మంత్రికి తెలుపగా, సంబంధిత అధికారి ఎవరని ఆయ న ఆరా తీయగా, సదరు అధికారి అందుబాటులో లేడు. దీంతో కలెక్టర్ను మంత్రి ప్రశ్నించగా.. మండల, మున్సిపాలిటీల స్పెషల్ ఆఫీసర్లను సమావేశానికి పిలవలేదని, కేవలం జిల్లా స్థాయి అధికారులను మాత్రమే పిలిచామని ఆయన సమాధానమివ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, మిషన్ భగీరథకు సంబంధించి నీటి సరఫరా రికార్డు నమోదవుతోందా.. అని అధికారులను ప్రశ్నించగా, వారు సరైన సమాధా నం చెప్పలేదు. నీటి సరఫరాకు సంబంధించి ని ధులను ఎలా కేటాయిస్తు న్నారని, ప్రతి వెయ్యి లీటర్లకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. లీటర్ల చొప్పు న కాదని.. పనిచేసే సిబ్బంది చొప్పున నిధులు కేటాయిస్తు న్నామని అధికారులు సమాధానమివ్వగా ఇదేమి పద్ధతి అని ప్రశ్నించారు. వెంటనే ఫోన్లో సంబంధిత కమిషనర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారం రో జుల్లో ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నీటిసరఫ రాకు సంబంధించిన స మస్యలను తెలుసుకునేందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ఏ ర్పాటు చేయాలన్నారు. అలాగే అన్ని శాఖల కు సంబంధించి మరో టో ల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటే బాగుంటుందని కలెక్టర్కు సూచించారు. వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల ద్వా రా రక్షిత మంచి నీటిని సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. అధికారులు వాస్తవ నివేదికలు ఇవ్వాలన్నారు. పౌరసరఫరాలు.. ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని, జిల్లా నుంచి ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాలకు సన్న బియ్యం సరఫరా చేస్తుండడం అభినందనీయమని మంత్రి అన్నారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ మంత్రికి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం అయిన వెంటనే రైతులకు పూర్తి వివరాలతో రసీదులు అందించాలని మంత్రి ఆదేశించారు. భూ భారతి.. ధరణి కారణంగా ఇబ్బందులు పడిన రైతులకు ఊరట కలిగేలా భూ భారతిని ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని, మండల, గ్రామ స్థాయిలో రైతులతో సదస్సులను నిర్వహించేందుకు నిర్ణీత షెడ్యుల్ ఖరారు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను రెండు రోజుల్లో అందించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ పక్షం రోజుల్లో మంజూరయ్యే లా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహె ర్ బిన్ హందాన్, వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యు డు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ..సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగేలా పర్యవేక్షించాలని, రేషన్ డీలర్ల ఖాళీలను నెల రోజుల్లోగా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. రేషన్ దుకాణాలకు సరైన నిష్పత్తిలో కోటా కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేయాలని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, అక్రమాలకు తావిస్తే రికవరీ చే యిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మా ణం చేపట్టే ఆర్థిక స్థోమత లేని పేదలకు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఇళ్లను నిర్మించి ఆ తరువాత బిల్లులను మహిళా సంఘాలకు అందించేలా చొరవ చూపాలని ఆదేశించారు. -
అల్ప్రాజోలం పట్టివేత
నిజామాబాద్రూరల్: నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ సమీపంలో ఉన్న హను మాన్ ఆలయం వద్ద కిలో అల్ప్రాజోలం, రూ. 3.50 లక్షల నగదును మంగళవారం స్వాధీ నం చేసుకున్నట్లు ట్రెయినీ ఐపీఎస్ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు గంధం శ్రీనివాస్ కారులో వచ్చి జీజీ కాలేజ్ సమీపంలో అల్ప్రాజోలం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రూరల్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు ఎవరెవరికి విక్రయించాడనే వివరాలు సేకరించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కు చెందిన బొట్లకుంట కాటమయ్య గౌడ్, మల్లి అనిల్గౌడ్, ఇడిగి శ్రీనివాస్కు అల్ప్రాజోలం విక్రయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అప్పటికే మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు వెళ్లిపోవడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడితో ఫోన్ చేయించి వారు రాగానే అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలో అల్ప్రాజోలం, రూ.3.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన బాట
మోర్తాడ్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసనబాట చేపట్టారు. మూడు నెలల నుంచి వేతనాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై నిరసన తెలుపుతూ బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి మండలాల వారిగా అధికార యంత్రాంగానికి వినతిపత్రాలు అందించారు. దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లాలోని 530(పునర్విభజన చేయడానికి ముందు ఉన్న) గ్రామ పంచాయతీలకు గాను 275 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గడిచిన జనవరి నెల నుంచి వేతనాలు అందక పోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు ఇతరత్రా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు పనులు చూపడంతో పాటు హరితహారం, నర్సరీల నిర్వహణ ఇతరత్రా పనులు చేస్తున్నా తమ శ్రమకు గుర్తింపు లేదని వారు వాపోయారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. మూడు నెలలుగా అందని వేతనాలు ఇబ్బందుల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వం స్పందించాలి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. ఎన్నో ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కూలీలకు, ప్రభుత్వ యంత్రాంగానికి వారధిగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లను నెరవేర్చాలి. – రామరాజు, ఫీల్డ్ అసిస్టెంట్, తొర్తి -
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
సాక్షి, నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విషయంలో వివాదం తలెత్తింది. తులం బంగారం ఎక్కడంటూ ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మంత్రి జూపల్లి గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. మంత్రి కాన్వాయ్కు అడ్డు తగిలి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు రాహుల్ గాంధీ' అనే క్యాప్షన్ ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్పై భ్రమలు తొలగిపోయాయి
వేల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, అందుకే తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరా మండలం సోన్పేట్ మాజీ సర్పంచ్ గోలిప్రకాశ్, దూదిగాం మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్, వారి అనుచరులు వేల్పూర్లో మంగళవారం వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని మోతె, బుస్సాపూర్ లాంటి అనేక గ్రామాలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ఉద్యమానికి అండగా నిలబడ్డాయన్నారు. కేసీఆర్ వెంట తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్రెడ్డి ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి నడిచారని గుర్తుచేశారు. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణాను అనేక రంగాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డి అనేక హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కారని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీ కమలాకర్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, మాజీ సర్పంచులు నర్సయ్య, గంగారెడ్డి, రాజారెడ్డి, గంగారెడ్డి, యాదగిరిగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
పీజీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ 1, 3వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ టీ సంపత్, పీఆర్వో ఏ పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity.ac. inలో పొందుపర్చినట్లు కంట్రోలర్ తెలిపారు. కీ బోర్డులో గిన్నిస్ రికార్డునిజామాబాద్నాగారం: జిల్లాకు చెందిన సుభాష్చంద్రబోస్ కీ బోర్డు ప్లేయింగ్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. విజయవాడ కీ బోర్డు ప్లేయింగ్ అండర్ హెల్ మ్యూజిక్ స్కూల్ ఈ నెల 14న నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఈ ఘనత సాధించారు. సుభాష్ చంద్రబోస్ జిల్లాలో ఎంపీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ వర్క్షాప్కు తెయూ అధ్యాపకుడికి ఆహ్వానంతెయూ(డిచ్పల్లి): దక్షిణ కొరియా రాజధాని సియోల్కు చెందిన హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్డబ్ల్యూపీఎల్) సంస్థ ‘పాత్రికేయ విద్య’ అనే అంశంపై నిర్వహించనున్న వర్క్షాప్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ యూనివర్సిటీ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్కు ఆహ్వానం పంపింది. వివిధ దేశాల నుంచి పలువురు ఆచార్యులు పాల్గొనే ఈ వర్క్షాప్ ఈ నెల 17న జరుగనుంది. వారం రోజుల ముందే ఈ ఆహ్వానం అందడంతో సమయాభావంతో సియోల్ వరకు రాలేనని, ఆన్లైన్లో హాజరై ప్రసంగించేందుకు అనుమతించాలని చంద్రశేఖర్ సంస్థ నిర్వాహకులను కోరారు. దీనికి ఆ సంస్థ ఆమోదం తెలుపడంతో ఈ నెల 17న సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు జరిగే వర్క్షాప్లో ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆన్లైన్లో హాజరై ప్రసంగించనున్నారు. దరఖాస్తుల ఆహ్వానంనిజామాబాద్రూరల్: జెండా బాలాజీ దేవ స్థానంలో ధర్మకర్తలుగా సేవలందించేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 22వ తేదీ వరకు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. -
అమాత్యా.. పురపాలికపై కరుణ చూపరూ?
మోర్తాడ్ : భీమ్గల్ పట్టణానికి రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు(బుధవారం) రానున్నారు. పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పట్టణంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారిస్తారా అనే విషయంపై పుర ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.● మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని వార్డుల్లో మురికి కాలువల సౌకర్యం లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ● పున:ప్రారంభమైన బస్సు డిపోలో బస్సులు, అధికారులు, ఉద్యోగులను కేటాయించకపోవడంతో కాగితాలకే పరిమితమైంది. ● 100 పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ● విద్యుత్ లైన్ కొత్తది వేసి సరఫరాలో లోపాలను సరిదిద్దాలి. ● తహసీల్దార్ భవనం కూల్చి ఆ స్థలాన్ని మార్కె ట్ కోసం కేటాయించారు. మార్కెట్ స్థలంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో రోడ్లపైనే కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న భీమ్గల్ పట్టణంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజల సమస్యలు నేడు భీమ్గల్కు మంత్రి జూపల్లి కృష్ణారావు రాక పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రజల వేడుకోలు సమస్యల పరిష్కారానికి ఎదురుచూపులు -
తల్లి చేపలను అందించాలి
బాల్కొండ: చేప పిల్లల కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం కావాల్సిన చేప పిల్లలను చెరువుల నుంచి మత్స్యకారులు అందించాలని జిల్లా మత్స్యశాఖ ఏడీ అంజనేయస్వామి అన్నారు. మంగళవారం మెండోరా మండలం పోచంపాడ్ వద్ద గల జాతీయ చేప పిల్లల కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుత సంవత్సరం సకాలంలో చేప పిల్లల ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చేపపిల్లల ఉత్పత్తి కోసం తల్లి చేపల సేకరణ ప్రారంభిస్తామన్నారు. అందుకు మత్స్య సహ కార సంఘాలు సహకారమందించాలన్నారు. తల్లి చేపలకు కిలోల చొప్పున ధర చెల్లిస్తామన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం నాటికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎఫ్డీవో దామోదర్, సిబ్బంది ఉన్నారు. -
హమాలీల కొరతతో ఇబ్బందులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ఈ సీజన్లో సుమారు 240 కేంద్రాలను ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలకు కేటాయించింది. మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు ఆలస్యం కావడంతో హమాలీలు, ఇతరాత్ర ఏర్పాట్లలోనూ జాప్యం జరిగింది. సొసైటీలు ఎప్పటిలాగే వారికి కేటాయించిన కేంద్రాల అవసరాలకు అనుగుణంగా హమాలీలకు దళారుల ద్వారా అడ్వాన్సులు చెల్లించి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. నేటికీ హమాలీల కొరత కారణంగా అనేక కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగడం లేదని పౌరసరఫరాలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పింక్ బుక్ నిండాలి.. వారి పాపం పండాలి..
డిచ్పల్లి: ఇకపై కేసీఆర్ 3.0 వర్షన్ చూస్తారని, బీఆర్ఎస్ పార్టీ మునపటి పార్టీ కాదని, అందరి లెక్కా తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నా రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు కొందరు పోలీసులు గు లాంగిరీ చేస్తున్నారని వారి పేర్లన్నీ పింక్ బుక్లో రాస్తున్నామని, పింక్ బుక్ నిండాలి.. వారి పాపం పండాలని హెచ్చరించారు. ఇకపై తాను సైలెంట్ గా ఉండనని, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూ స్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి డిచ్ప ల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవిత పలు వ్యాఖ్యలు చేశారు. ప్రా ణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక సంక్లిష్ట పరిస్థితులను, ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. కేసీఆర్ కానీ గులాబీ జెండా కానీ లేకపో తే తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఇప్పుడు అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీకి వెళితే మీ తెలంగాణలో 20 పర్సెంట్ సర్కారు నడుస్తుందట కదా అని అడుగుతున్నారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్లను కొట్టివేస్తే న్యూయార్క్లో చర్చ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు తెచ్చానని చెబుతున్నారు.. కానీ కేవలం గెజిట్ మాత్రమే ఇచ్చారని బోర్డుకు చట్టబద్ధత లేదన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదిస్తేనే ఏబోర్డుకై నా చట్టబద్ధత వస్తుందని, ఈ విషయమై ఎంపీ అర్వింద్ ను తాను హెచ్చరించినట్లు కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ హిందు త్వం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రూరల్ నియోజకవర్గానికి పట్టిన శని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అని ధ్వజమెత్తారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన అ బద్దపు హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు అదే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమని కేసీఆర్ను వేడుకుంటున్నారని తెలి పారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం కానీ అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని తమతో కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. కేసీఆర్ స్థానంలో కవిత ఉంటే ప్రభుత్వాన్ని తప్పక పడగొట్టేదని బాజిరెడ్డి అన్నారు. సీ ఎం రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇసు క, ఇటుక, మొరంతో పాటు ధాన్యం సంచుల్లో కూ డా బరితెగించి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రూ.150 కోట్ల అభి వృద్ధి పనులకు తాను జీవోలు తెచ్చానని, పాత జీవోలకు శంకుస్థాపనలు చేయడానికి భూపతిరెడ్డి సిగ్గుపడాలని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ లు ప్రసంగించారు. మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఊరూరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపు2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లిన బాజిరెడ్డి గోవర్ధన్తో తాను మాట్లాడి రూరల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి నిలబడేలా ఒప్పించానని తెలిపారు. కేసీఆర్ వెన్నంటి ఉండి బాజిరెడ్డి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరురా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సక్సెస్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. వరంగల్ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్ర లో నిలిచిపోవాలన్నారు. -
పగలు డంప్.. రాత్రి జంప్
మోర్తాడ్: ఇసుక అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్గా భీమ్గల్ నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కప్పలవాగు, పెద్దవాగుల శివారు నుంచి కొందరు ఇసుకాసురులు పగటి పూట ట్రాక్టర్లతో డంప్ చేసి రాత్రిపూట పెద్ద పెద్ద లారీల్లో పొరుగు ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని చూస్తున్నా అక్రమార్కులు తమ బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా బడాభీమ్గల్ శివారులోని వాగు నుంచి ఇసుకను ఒక చోట డంప్ చేయగా శనివారం అధికారులు సీజ్ చేశారు. అసలు విషయానికొస్తే కొన్ని నెలల నుంచి పగటి పూట స్థానిక అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు కొందరు వ్యాపారులు అధికారుల నుంచి అనుమతి పొందుతున్నారు. తవ్విన ఇసుకను కొందరి విక్రయించి, పెద్ద మొత్తంలో నిలువ చేస్తున్నారు. ఈ నిలువలను రాత్రిపూట ఒక్కో లారీ లోడ్కు రూ.40వేల వరకూ వసూలు చేసుకొని తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమ దందాలో ఒక్కటైన నాయకులు ఇసుక అక్రమ రవాణాపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో ఆయా గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒక్కటైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇసుక తరలించేందుకు గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహించే వేలం పాటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పాల్గొని తక్కువ ధరకు టెండర్ ఒకే చేసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారిని కూడా ఈ అక్రమ దందాలో భాగస్వాములను చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నా.. అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకునే అంశంలో చేతులు కలిపినట్లు బలంగా వినిపిస్తుంది. భీమ్గల్ మండలంలోని వివిధ గ్రామాలలో జోరుగా ఇసుక దందా సాగడమే కాకుండా అక్రమ వ్యాపారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇసుక అక్రమ దందాకు కేరాఫ్గా భీమ్గల్ కప్పలవాగు, పెద్దవాగుల నుంచి పగలు నిల్వ చేసి రాత్రి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారులు అధికారులు దాడులు చేస్తున్నా ఆగని ఇసుక రవాణా -
అంబేడ్కర్ను అవమానిస్తే తిప్పికొడతాం
నిజామాబాద్ సిటీ: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ అంబేడ్కర్ను ఎవరు అవమానించినా తిప్పికొడతామని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి అన్నారు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నాయకులు అంబేడ్కర్ను అవమానించారని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధి పేరిట బీజేపీ నాయకులు తాకడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఫులాంగ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్పై పార్లమెంటులో హోంమంత్రి అవమానకరంగా మాట్లాడినా ప్రధాని మోదీ ఖండించలేదన్నారు. అమిత్షాపై చర్యలు తీసుకోలేదంటేనే బీజేపీ అంబేడ్కర్పై చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హత్య చేసిన వారే సానుభూతి తెలిపినట్టు బీజేపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహాల శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టారని ఎద్దేవా చేశారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామగ్రామానా తీసుకెళ్లి అంబేడ్కర్ ఆశయాలను వివరిస్తామన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ప్రపంచమంతా అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తే దేశ ప్రధాని మాత్రం పార్లమెంటులో నివాళులర్పించలేదన్నారు. సమావేశంలో నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, నాయకులు రత్నాకర్, రేవతి, విపుల్ గౌడ్, వేణురాజ్, లింగం, నరేందర్, విజయ్ పాల్ రెడ్డి, కోనేరు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం -
వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలి
● ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ నిజామాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వక్ఫ్ బిల్లు ముస్లిం సమాజాన్ని అణచివేయడానికి దోహదపడుతుందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు నూతన బిల్లుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు చెరువులోపడి వృద్ధుడి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణ శివారులోని గుండ్ల చెరువులో ప్రమాదవశాత్తు పడి కుంట గంగా మోహన్రెడ్డి(65) మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మంగళవారం గుండ్ల చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన కుంట గంగామోహన్రెడ్డి ప్రమాదవశాత్తు చెరువులో పడి చెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. మృతుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి పాల్గొన్నాడని స్థానికులు తెలిపారు. గంగామోహన్రెడ్డి అంత్యక్రియల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. దుబాయ్లో రెడ్డిపేటవాసి..రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన బట్టు సురేశ్(42) అనే వ్యక్తి దుబాయ్లో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సురేశ్కు ఈ నెల 12న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు దుబాయ్లో ఉన్న బట్టు శంకర్, నవీన్ ప్రయత్నిస్తున్నట్లు గల్ఫ్ సంఘ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండ సురేందర్రెడ్డి కోరారు. అడవిపంది దాడి.. ఒకరికి గాయాలుఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన కొనగోళ్ల సాయిబాబా అనే వ్యక్తిపై అడవిపంది దాడి చేసినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. సాయిబాబా తన పొలానికి వెళ్తున్న సమయంలో అడవిపంది దాడి చేయడంతో చేతు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన సాయిబాబాను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు. అటవీశాఖ అధికారులు బాధితుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బైక్ను ఢీకొన్న లారీ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అతివేగంగా వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లా కేంద్రానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ వద్ద కామారెడ్డి–సిరిసిల్లా ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నాగుల వినోద్ కుమార్ (30) చేపలు పట్టడం, కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. చేపల పని మీద తన స్నేహితుడు జక్కుల దేవేందర్తో కలిసి బైక్పై కామారెడ్డికి బయల్దేరారు. ఉగ్రవాయి మైసమ్మ స్టేజీ సమీపంలోకి రాగానే బైక్ను లారీ ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చికిత్స పొందుతూ వినోద్ కుమార్ మృతి చెందాడు. దేవేందర్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. మృతుడి తల్లి సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
జిల్లా జడ్జి కుంచాల సునీత బదిలీ
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా జడ్జి సునీ తా కుంచాల పెద్దపలి జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. ఆమె స్థా నంలో హైదరాబాద్ నుంచి జీవీఎన్ భరతలక్ష్మీ రానున్నారు. అలాగే బోధన్ అదనపు జిల్లా జడ్జి రవికుమార్ గద్వాలకు బదిలీ అయ్యారు. నేడు ఇన్చార్జి మంత్రి పర్యటన నిజామాబాద్అర్బన్: జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే సమీక్షాసమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, సన్నబియ్యం లబ్దిదారుని ఇంటిలో భోజనం చేస్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మున్సి పాలిటీ పరిధిలో, అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో జూపల్లి పాల్గొని తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. ఆలయ హుండీ లెక్కింపు నిజామాబాద్ రూరల్: మండలంలోని సారంగాపూర్ హనుమాన్ ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. మొత్తం రూ.60,476 ఆదాయం సమకూరినట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు తెలిపారు. ఎండోమెంట్ పరిశీలకులు కమల, ఎన్.రాములు, శశికుమార్రాందాసి, ప్రశాంత్కుమార్, పారాయణ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. ధాన్యం బోనస్ దారి మళ్లింపుపై విచారణరుద్రూర్: కోటగిరి సింగిల్ విండో పరిధిలో సన్నధాన్యం బోనస్ డబ్బులు అనర్హుల ఖాతాలో జమ చేశారనే ఫిర్యాదుపై సహకార అధికారులు మంగళవారం విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంబర్సింగ్ రాథోడ్, సీనియర్ ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్, జూనియర్ ఇన్స్పెక్టర్ ఎండీ అలీం కోటగిరి విండోకు వచ్చి విచారణ చేపట్టి, వారం క్రితం నోటీసులు అందుకున్న వారి వివరాలు సేకరించారు. బుధవారం కూడా విచారణ కొనసాగుతుందని, అవసరమైతే రైతుల వద్ద కూడా సమాచారాన్ని సేకరిస్తామని అధికారులు వెల్లడించారు. నేత్ర వైద్యశాలలకు నోటీసులు నిజామాబాద్నాగారం: వైద్యుడు లేకున్నప్పటికీ కాంపౌండర్ కంటి పరీక్షలు చేయడం, మందుల రాయడంపై జిల్లా వైద్యారోగశా ఖాధికారులకు ఫిర్యాదు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన డీఎంహెచ్వో రా జశ్రీ ఆదేశాల మేరకు విచారణ అధికారులు డాక్టర్ సుప్రియ, వేణు తదితరులు నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి శ్రీరామా నేత్ర వైద్యశాల, గిరిజా ఆస్పత్రిని తనిఖీలు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది తప్పును అంగీకరించినట్లు సమాచారం. విచారణ నివేదికను డీఎంహెచ్వోకు ఈ నెల 11వ తేదీన అందడంతో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో నోటీసులకు జవా బు ఇవ్వాలని ఆదేశించారు. రేషన్లో ప్లాస్టిక్ బియ్యం అవాస్తవం సుభాష్నగర్: రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నా యంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జి ల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖ ని పెద్దపల్లి జిల్లాలోని తిలక్నగర్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలలో కొన్ని వీడియోలు ప్రచారం చేశారని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సన్న బియ్యం పథకంపై ప్రజలలో ఆందోళన సృష్టించేలా తప్పుడు ప్రచారం చేస్తే చట్ట ప్రకా రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.