Karnataka
-
పేదలను దోపిడీ చేస్తున్న సర్కార్
హొసపేటె: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, పాల ధరను నిరసిస్తూ విజయనగర బీజేపీ మండలం ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. బీజేపీ నేత శంకర్ మేటి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయినా ఎమ్మెల్యే లేదా అధికారులు పరిశీలించలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ శృతికి అందజేశారు. -
ఊరూరా శ్రీరామ నవమి వేడుకలు
సాక్షి,బళ్లారి: అఖిల ప్రపంచానికి ఆరాధ్యుడైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఊరులోనూ రామాలయం అందంగా సింగారించుకుంది. ఆలయాలను మామిడి తోరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయాల్లో కల్యాణవేదికలు ఏర్పాటు చేసి సీతారామ కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఆలయం శ్రీరామనామంతో మార్మోగింది. సీతారాములను అలంకరించి వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించగా భక్తులు భక్తితో వీక్షించి తరించారు. శ్రీసీతారామ ఆలయాలతో పాటు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, భజనలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. బళ్లారిలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయ సమీపంలోని శ్రీరామ దేవాలయం, మోతీ సర్కిల్ వద్ద ఉన్న సీతారామ ఆలయం, సత్యనారాయణపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మిల్లార్పేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, సిరుగుప్ప రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శివాలయాల్లో, అనంతపురం రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ సీతారామ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అష్టోత్తర, మహాపూజ, మంగళహారతులు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామ నామాన్ని జపిస్తూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయాల్లో అన్నప్రసాదాలు, బెల్లంతో తయారు చేసిన పానకాలు, పెసరబేడలు అందజేశారు. అంధ్రాలులో శ్రీరామ రథోత్సవం బళ్లారి నగర శివార్లలోని ఆంధ్రాలలో వెలసిన శ్రీ రామ దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కల్యాణం నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాదాలు అందజేశారు.సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలనుంచి భక్తులు తరలిరావడంతో ఆంధ్రాలు పరిసరాలు జనంతో నిండిపోయాయి. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆర్ వెంకటరెడ్డి, కార్పొరేటర్ ఎం.రామాంజినేయులు, ఆలయ కమిటీ సభ్యులు జయరాములు, రేణమ్మసీతమ్మ, వెంకటేశులు, శరణయ్య, ప్రభయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: రాయచూరు నగరంలోని రైల్వే స్టేషన్లో రామాలయం, కోటలోని బాలాంజనేయ, పాతాళాంజనేయ, బెట్టద్ రామాలయం,మంగళవార పేట మారుతీ ఆలయాల్లో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి అభిషేకాలు, అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య గీతా మందిర్, రామాలయంలో పూజలు చేపట్టారు. అనంతరం రథోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాయచూరు రూరల్లో పంచముఖి ఆంజనేయ స్వామి, ప్రాణ దేవర ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బసనగౌడ, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణం ఆలయాల్లో మార్మోగిన సీతారామ నామస్మరణ -
బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి
● మర్మాంగంపైకి కందిరీగలు ● దావణగెరె జిల్లాలో అమానుష ఘటన ● తొమ్మిది మంది అరెస్ట్ సాక్షి,బళ్లారి: బాలుడిని చెట్టుకు కట్టేసి దాడిచేసి అతనిపైకి కందిరీగలు విడిచిన అమానుష ఘటన దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నగిరి తాలూకా నల్లూర సమీపంలోని అస్తాపనహళ్లిలో నివసిస్తున్న 16 సంవవత్సరాల వయసున్న బాలుడు దొంగతనాలు చేస్తున్నాడని, మహిళల పట్ల అసభ్యప్రవరిస్తున్నాడనే ఆరోపణలతో స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టుక కట్టేసి విక్షణారహితంగా కొట్టారు. దుస్తులు ఉడదీసి మర్మాంగానికి కందరీగలను వదిలారు. దీంతో బాలుడు అపస్మారస్థితిలోకి వెళ్లడంతో కొందరు వ్యక్తులు స్పందించి ఆస్పత్రికి తరలించి,పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేసిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. జీపీ సభ్యుడి హత్య కేసులో నిందితుల అరెస్ట్హుబ్లీ: బీదర్ శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగిన జీపీ సభ్యుడు, వణ్ణికేరి నివాసి వైజినాథ్ హత్య కేసును పోలీసులు ఏడు గంటల్లోనే ఛేదించారు. ఈమేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బీదర్ నావదగేరి చెందిన ఇద్దరు, తాలూకాలోని వణ్ణికేరి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కీలక సూత్రాధారి పరారీలో ఉన్నాడని ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటి మీడియాకు తెలిపారు. వణ్ణకేరిలో జరిగిన ఎస్సీ,ఎస్టీ దౌర్జన్య కేసులో బాధిత కుటుంబాల తరపున వైజినాథ్ నిలబడటంతో అదే గ్రామానికి చెందిన వారు కక్ష పెంచుకొని హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించారని ఎస్పీ వివరించారు. డీఎస్పీలు శివన్నగౌడపాటిల్, ఎస్ఎన్ సనాధి నేతృత్వంలో నూతన నగర పోలీస్ స్టేషన్ సీఐ విజయ్కుమార్ బావగి, ఎస్ఐలు ప్రభాకర్ పాటిల్ సయ్యద్ పటేల్, అబ్దుల్ సమద్, హులెప్పలు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్చేశారని తెఇపారు. హనీట్రాప్పై ఆధారాలున్నాయి● బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ హుబ్లీ: సహకార శాఖ మంత్రి కేఎన్.రాజన్నపై హనిట్రాప్ జరిగిందన్న వ్యవహారంలో తన వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని బీజేపీ బహిష్కృత నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ నేతలను అంతం చేసిందే కాంగ్రెస్ అని అన్నారు. హనిట్రాప్ వెనుక రెండు పార్టీల్లోని మహానేతలు హస్తం ఉందన్నారు. తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. నాకు హాయ్ చెబితే బై అంటానని యత్నాళ్ అన్నారు. తనకు వ్యతిరేకంగా కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో యాగం జరిగిందని ఆరోపించారు. హుబ్లీలో కూడా ఓ యాగం చేశారని, అయితే తనకు ఎలాంటి హాని జరగదని జాతకంలో ఉందన్నారు. యాగం జరిగాక శత్రు సంహారం జరగలేదని, అయితే సిద్దరామయ్యకు కాళ్ల నొప్పులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉపాధి పనులను వినియోగించుకోండి హొసపేటె: ఉపాధి హామీ పథకం పనులను కూలీలు సద్వినియోగం చేసుకొని స్థానికంగా ఉపాధి పొందాలని జిల్లా పంచాయతీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రకాష్ వి. సూచించారు. కొప్పళ్ తాలూకాలోని ఇందరగి గ్రామ పంచాయతీ ఇందరగి గ్రామంలో హోసకరేలో జరుగుతున్న పూడిక తీత పనులను ఆయన పరిశీలించారు. రోజుకు రూ. 370 కూలీతో వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కూలీ 40 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వితేనే రూ. 370 చెల్లిస్తారన్నారు. కొలత తక్కువగా ఉంటే వేతనాలు తక్కువగా చెల్లిస్తామని తెలిపారు. ఉపాధి పనుల్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈత కొలను ప్రవేశ రుసుము రెట్టింపుహుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం పాలు, విద్యుత్, డీజిల్ ధరలు పెంచడంతో ఇప్పటికే ప్రజల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్ ఈతకొలను ప్రవేశ రుసుమును రెట్టింపు చేసింది. ఒకే పర్యాయం రూ.50 నుంచి రూ.100కు పెంచడంతో ప్రజలు కార్పొరేషన్పై మండిపడుతున్నారు. ఆరోగ్యం, వ్యాయమం కోసం రోజూ దాదాపు 500 మంది, సెలవు రోజుల్లో 600 మంది ఈత కొట్టేందుకు వస్తుంటారు. పెంచిన ధరతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయమై పాలికె కమిషనర్ రుద్రేష్ గాలి మాట్లాడుతూ ఈతకొలను నిర్వహణకు ప్రతినెల రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందన్నారు. ప్రవేశ రుసుము ద్వారా కేవలం రూ. లక్ష మాత్రమే సమకూరుతోందన్నారు. నిర్వహణ, సిబ్బంది వేతనాల ఖర్చును భరించడానికి ప్రత్యేక రుసుమును పెంచామని తెలిపారు. -
ఉద్యోగ మేళాతో ఉపాధి అవకాశాలు
బళ్లారిఅర్బన్: ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేయర్ ముళ్లంగి నందీష్ అన్నారు. స్థానిక డాక్టర్ రాజ్కుమార్ రోడ్డు పబ్లిక్ స్కూల్, కాలేజిలో క్యాడ్మ్యాక్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగులు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నైపుణ్యాన్ని సాధించాలన్నారు. ఆ విద్య సంస్థ ముఖ్యస్థుడు డాక్టర్ మహిపాల్, గ్యారంటీ పథకాల అమలు కమిటీ జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, జోగిన్ చంద్రప్ప, బట్టి ఎర్రిస్వామి, శేఖర్ సంగనకల్లు విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి రాయచూరురూరల్: మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సోమవారి పేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో నిర్వహించిన న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన 21వ వార్షికోత్సవంలో స్వామీజీ పాల్గొని పంచాక్షరయ్యకు ఉత్తమ వ్యక్తి అదర్శ అవార్డు అందించి మాట్లాడారు. న్యాయవాది నాగప్ప బడుగువర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు మహంతేష్ మస్కి, న్యాయవాది నాగప్ప ప్రతిష్టాన అధ్యక్షుడు తిప్పారెడ్డి, నాగరాజ్, అంబాపతిపాటిల్, మల్లికార్జున పాల్గొన్నారు. -
నీటి సమస్య తలెత్తకుండా చూడండి
హొసపేటె: కొప్పళ జిల్లాలోని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి, కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడి ఎస్ సూచించారు. కొప్పళ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి తాగునీరు, పశుగ్రాసం సమస్యలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. జిల్లా పంచాయతీ పరిధిలో నీటి సమస్య కనిపిస్తే తాలూకా పంచాయతీ కార్యనిర్వహాక అధికారులు స్వయంగా గ్రామాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నీటి సమస్యలు తలెత్తే గ్రామాల్లో ఏం చేయాలో అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఫోన్ చేసినప్పుడు, వారి స్పందించి వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలన్నారు. వడ్రంగి, కనకగిరి ప్రాంతంలో నీటి సమస్య సర్వసాధారణమైందన్నారు. ప్రజలకు తాగునీరు అందించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని, గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి కనిపిస్తే అధికారులు సమావేశం నిర్వహించి నీటి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. కొప్పళ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడి -
పార్టీలకు అతీతంగా సముదాయ అభివృద్ధి
●పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప హొసపేటె: అంతర్గత రిజర్వేషన్లను అమలు చేస్తామని, దాని గురించి ఎటువంటి సందేహం అవసరం లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప సూచించారు. హోస్పేటలోని ఏఆర్ఎస్ హోమ్స్టే ఆడిటోరియంలో మాదర చెన్నయ్య సేవా సమితి ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 1991 నుంచి 7 పర్యాయాలు ఎంపీగా ఈ సంఘం తరపున నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. సముదాయంలోని అందరూ ఎంపీలు అప్పటి ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్.మన్మోహన్ సింగ్లకు ప్రతినిధి బృందాన్ని పంపించి సముదాయం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముందు అడుగు వేసేందుకు కృషి చేశామన్నారు. అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని తెలిపారు. మాదార చెన్నయ్య స్వామీజీ, ఎంపీ గోవిందా కారజోళ, మాజీ మంత్రి నారాయణ స్వామి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులా?
హుబ్లీ: ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే బీజేపీ కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోందని, దీంతో రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని మాజీ సీఎం, ఎంపీ బసవరాజ్ బొమ్మై అన్నారు. హావేరిలో ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ 45వ సంస్థాపన దినంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి అమలు చేయడంతో ఎవరికి స్వాతంత్ర ఉండేది కాదన్నారు. దీంతో విద్యార్థులతో ప్రారంమైన పోరాటాలు పూర్తిగా క్రాంతిగా మారి ఏబీ వాజిపేయి నేతృత్వంలో అద్వాని సహా అందరు ఉధ్యమంలో పాల్గొన్నారన్నారు. అంతకు ముందు 1925లోనే ఆర్ఎస్ఎస్ స్థాపన అయిందని గుర్తు చేశారు. 45 ఏళ్ల పాటు పార్టీ ప్రస్తానం సాగడం ప్రతి కార్యకర్తకు గర్వకారణం అన్నారు. కాంగ్రెస్తో ఓబీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి తాండవం ఆడుతుంతోందని సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. -
చుక్కనీరు లేక ఆర్డీఎస్ వెలవెల
రాయచూరు రూరల్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఆర్డీఎస్( రాజోలి బండ డైవర్షన్ అనకట్ట) చుక్కనీరు లేక వెలవెలపోతోంది. మాన్వి తాలుకాలోని రాజోలి వద్ద నిర్మించిన ఈ ఆనకట్టలో నీరు ప్రవహించక ఏడాది అయ్యింది. 1966లో తుంగభద్ర నదికి అడ్డంగా 31 అడుగుల ఏత్తుతో 2690 మీటర్ల పొడవుతో అనకట్ట(గోడ) నిర్మించారు. నదికి లక్ష క్యూసేక్కుల నీరు వదలినప్పుడు 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. కర్ణాటకలోని మాన్వి, రాయచూరు తాలుకాల్లో 10 వేల ఏకరాలకు ఈ ఆనకట్ట ద్వారా సాగునీరు అందుతుంది. ఏపీలోని మంత్రాలయం, మాదవరం, తుంగభద్ర, తెలంగాణలోని శాంతినగర్, ఐజ ప్రజల దాహార్తి తీర్చుతోంది. అయితే ఆర్డీఎస్లో నీటి ప్రవాహం లేక ఆయకట్టు భూములు నెర్రెలు పోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతోంది. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడం, ఇసుక మాఫీయా తవ్వకాలు చేపట్టడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఘనంగా బీజేపీ సంస్థాపన దినం రాయచూరురూరల్: యాదగరి, రాయచూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, జిల్లాధ్యక్షుడు వీరన గౌడ, యాదగిరిలో నగరసభ అధ్యక్షురాలు లలిత బీజేపీ జెండాలను ఆవిష్కరించారు. పండిత్ దీన్ దయాళ్, శివ ప్రసాద్ ముఖర్జి, భారత మాత చిత్ర పటాలకు పూజలు జరిపారు. మహాత్ముడి అదర్శాలను ఆలవర్చుకోవాలి రాయచూరు రూరల్: మహాత్ముడి అదర్శాలను విద్యార్థులు అలవర్చుకోవాలని అక్కమహదేవి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శాంత దేవి పిలుపునిచ్చారు. మహాత్ముడి ఆలోచనలు అనే అంశంపై కలబుర్గిలోని శరణేశ్వరి రేష్మ మహిళా కళాశాలలలో గాంధీ స్మారక నిధి, బెంగళూరు, యన్యన్యస్, యవజన సేవా సర్వీస్ శాఖల ఆధ్వర్యంలో జరిగిన విచారణ సంకీర్ణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహాత్ముడి పోరాటాలు, ఆయన పాటించిన నైతిక విలువలపై విద్యార్థులు అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో సిద్దరామయ్య, ప్రిన్సిపాల్ గీతా, జావేద్ జాందార్, భారతి, అశోక్ కుమార, మహేష్, ఉదయ్ కుమార్, ధర్మణ్ణ, అబ్దుల్, అబిదా బేగం, శివలీల పాల్గొన్నారు. వ్యక్తి అనుమానాస్పద మృతిపై సీఐడీ విచారణరాయచూరు రూరల్: నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లోలో లాకప్డెత్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. ఓ కేసులో విచారణ కోసం తీసుకువచ్చిన వీరేష్ అనే వ్యక్తి మృతి చెందగా అది లాకప్డెత్గా మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు కేసును సీఐడీకి అప్పగించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యులనే విషయంపై ఎస్పీ పుట్టమాదవయ్యతో ఆదివారం సీఐడీ అధికారులు సమావేశమై చర్చించారు. అంతకుముందు సీఐడీ అధికారులు పోలీస్స్టేషన్లోని సీసీకెమెరాలను పరిశీలించారు. ధరల పెంపుపై బీజేపీ నిరసనకోలారు: ధరల పెరుగుదల, బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారన్నారు. శాసన సభ సమావేశాల నుంచి 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండు చేయడం చట్టవిరుద్దమన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకును భద్ర పరచుకోవడం కోసం ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 4 శాతం రిజర్వేషన్లు తీసుకు వచ్చారన్నారు. పెంచిన ధరలను తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. -
నేటి నుంచి బీజేపీ జనాక్రోశ యాత్ర
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు సోమవారం నుంచి ప్రజావేశ యాత్రను జరుపనున్నారు. ఆదివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సంస్థాపనా దినోత్సవంలో రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. మైసూరులో నాడదేవత చాముండేశ్వరి దేవికి పూజలు చేసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జనాక్రోశ యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కూడా యాత్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులకు అధికార మదం ఎక్కువై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్త వినయ్ సోమణ్ణది ఆత్మహత్య కాదు హత్య, సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తా: యడ్డి బీజేపీ నాకు అన్నింటినీ ఇచ్చిందని, మునుముందు పార్టీ బలోపేతానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని మాజీ సీఎం యడియూరప్ప చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఏ వనరులు లేని రోజుల్లో ఊరూరా తిరిగి బీజేపీని బలోపేతం చేశానని చెప్పారు. ఎన్నో గెలుపు ఓటములను చూశామని, ఏనాడు నమ్మిన ధైర్యం, సిద్ధాంతాన్ని విడచిపెట్టలేదని అన్నారు. విజయేంద్ర వెల్లడి -
పండ్లకు రారాజు, మామిడి పండ్లు అనగానే నోట్లో నీళ్లూరడం సహజం. అందరూ ఎంతో ఇష్టపడే మామిడి పండ్లు ఈ వేసవిలో ఇంకా మార్కెట్లోకి రావడం లేదు. దీంతో మామిడి ప్రియులు కళ్లుకాయలు కాచేలా నిరీక్షించాల్సి వస్తోంది.
బెంగళూరు జయమహల్ రోడ్డులో మామిడి స్టాల్ (ఫైల్) సాక్షి బెంగళూరు: ఎండాకాలం రాగానే మామిడి పండ్లు తినొచ్చనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ ఈ దఫా ఆశ ఇంకా తీరేలా లేదు. మామూలుగా మొదట రామనగర మామిడి, ఆపై కోలారు జిల్లా మామిడి కాయలు, పండ్లు మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి దిగుబడి భారీగా క్షీణించినట్లు అంచనా. ఎంత అంటే 30 నుంచి 50 శాతం వరకూ పడిపోయింది. మార్కెట్లో లభిస్తున్న కొద్దిపాటి పండ్లు కూడా పొరుగున ఏపీ నుంచి వస్తున్నాయి. 15– 20 రోజుల్లో కన్నడనాడు తోటల మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి నుంచే రావాలి మరి సాధారణంగా మార్చి నెల ప్రారంభం కాగానే రాష్ట్రంలో మొదటి మామిడి (రామనగర జిల్లా మామిడి) మార్కెట్లో లభ్యం అవుతుంది. అయితే పలు కారణాల వల్ల తోటల్లో పూత, పండ్లు దిగుబడి బాగా తగ్గిపోయింది. కొన్నిచోట్ల మామిడి పండ్ల కోతకు రైతులు సిద్ధమవుతున్నారు. రామనగర నుంచి ఈ ఏడాది సుమారు 1.65 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రామనగర జిల్లా నుంచి సింధూర, రసపురి, మల్లిక, బాదామి, తోతాపురి, మలగూబా, నీలం జాతుల మామిడి ఏప్రిల్ నుంచి జూలై వరకు నోళ్లను తీపి చేస్తాయి. ఇక కోలారు జిల్లా మామిడి పండ్లు జూన్ నుంచి ఆగస్టు వరకు విపణిలో ఉంటాయి. కోలారు నుంచి ఎక్కువగా సింగపూర్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. కొప్పళ మామిడి ప్రత్యేకం మామిడి పండ్లలో విశిష్ట జాతికి చెందిన మామిడిని కొప్పళ జిల్లాలో సాగు చేస్తున్నారు. కేసర్, బాదమి, రత్నగిరి జాతుల పండ్లు నోరూరిస్తాయి. వాటిని సాగుదారులు అధిక ధరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులకు అమ్మేస్తారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. వేచి చూడాలి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గిపోయింది. మండుటెండలే కారణమని రైతులు, హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు మామిడిని తెప్పిస్తున్నందున సహజంగానే రవాణా చార్జీలు , ఇతర పన్నులు కలిపి ధరలు చుర్రుమంటున్నాయి. స్థానిక మామిడి పండ్లు వస్తే ధరలు దిగిరావచ్చు. అందుకు కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. రాష్ట్రంలో ఇంకా మార్కెట్లోకి రాని పండ్లు మ్యాంగో ప్రియుల్లో అసహనం మరో 15–20 రోజులు తప్పదు! బాగా క్షీణించిన దిగుబడి -
పెద్ద హనుమంతుని శోభాయాత్ర
కోలారు: శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామసేన ఆధ్వర్యంలో కోలారు గాంధీవనంలో బృహత్ వేదిక మీద బాల రాముని మూర్తిని ప్రతిష్టించి మూడు రోజుల పాటు రామోత్సవం నిర్వహించారు. ఆదివారం రోజున నగరంలో శోభాయాత్రను నేత్రపర్వంగా జరిపారు. సినీ నటుడు వశిష్టసింహ ప్రారంభించారు. వశిష్టసింహ మాట్లాడుతూ ధర్మరక్షణ కార్యం నేడు అత్యంత ఆవశ్యకమన్నారు. సమాజంలో హిందూ ధర్మ మహత్వాన్ని తెలియజేయాలన్నారు. సమాజంలో యువత దారి తప్పకుండా జాగ్రత్త వహించాలన్నారు. విశ్వంలో హిందూ ధర్మం వంటి పురాతన ధర్మం మరొకటి లేదు. బృహత్ హనుమాన్ విగ్రహంతో కూడిన శోభాయత్ర నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.రాఘవ మఠంలో నవమి శోభ బనశంకరి: బెంగళూరు జయనగర ఐదోబ్లాక్లో వెలసిన నంజనగూడు శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో శ్రీరామోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం, బంగారు తొట్టెలలో శ్రీరామునికి అలంకారం, పల్లకీ ఉత్సవం, గజవాహనోత్సవం తదితరాలను భక్తజనం మధ్య కనులవిందుగా నిర్వహించారు. మఠం సిబ్బంది, భక్తులు ఉత్సవంలో పాలొన్నారు. కోలారులో నవమి కోలాహలం -
సాధ్విగా మారిన యువతి
సాక్షి, బళ్లారి: సంపన్న కుటుంబానికి చెందిన యువతి అన్నింటినీ త్యజించి సన్యాసినిగా దీక్ష స్వీకరించింది. యాదగిరి నగరంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా స్థిరపడిన మార్వాడీ కుటుంబానికి చెందిన నిఖిత (26) సన్యాస దీక్షను తీసుకుంది. ఈ సందర్భంగా నగరంలో వైభవంగా ఆమెను ఊరేగించారు. తరువాత జైన సన్యాసినులు ఆమెకు దీక్షను ఇచ్చారు. ఎన్నో కఠిన నియమాలతో కూడిన దీక్షను ఆచరించేందుకు కుమార్తెను తల్లిదండ్రులు కన్నీటితో సాగనంపారు. ఈఎంఐ గొడవ.. బ్యాంకు ఉద్యోగిపై దాడి బనశంకరి: రుణం కంతు చెల్లించాలని అడిగినందుకు బ్యాంకు సిబ్బంది మీద దౌర్జన్యం చేసిన ఘటన అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నాగరబావి రెండోస్టేజ్ బీడీఏ కాంప్లెక్స్లో దాడి చోటుచేసుకుంది. వివరాలు.. బైక్ కొనడానికి ప్రైవేటు బ్యాంక్ ద్వారా రమేశ్ అనే వ్యక్తి రుణం తీసుకున్నాడు. గత రెండునెలలుగా రమేశ్ ఈఎంఐ కట్టలేదు. దీంతో సొమ్ము వసూలు చేయడానికి బ్యాంకు ఉద్యోగి బీఎం చందన్ వెళ్లాడు. వెంటనే పెండింగ్ సొమ్ములు కట్టాలని కోరగా గొడవ మొదలైంది. కోపోద్రిక్తుడైన రమేశ్ నా ఇంటికే వచ్చి రగడ చేస్తావా అని రాయి తీసుకుని చందన్ మీద దాడి చేశాడు. బాధితుడు అన్నపూరేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. నేడే వైరముడి సంభ్రమంమండ్య: ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైరముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ మండ్య తాలూకాలోని హోళలు గ్రామంలో కమాను నిర్మాణం చేశారు. నేడు సోమవారం మేలుకోటె కొండపై దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతుంది. జిల్లా ట్రెజరీలో భద్రపరచిన బంగారు, వజ్ర వైరముడి, రాజముడి అలంకారాలు, ఇతర ఆభరణాలను ఇదే మార్గంలో కొండ మీదకు తరలిస్తారు. ఇందుకు దేవాదాయ, పోలీసు సిబ్బంది సన్నాహాలు చేశారు. భద్రా నిధులు ఇవ్వాలని కోరాం: డీకే శివాజీనగర: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇతర రాష్ట్రాల ప్రతినిధులను పిలిపించి చర్చలు జరిపి, పరిష్కరిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి భరోసా ఇచ్చారని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఆదివారం సదాశివనగర తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడిన ఆయన, భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు గతంలో ప్రకటించిన రూ.5,300 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిమండలి ముందు ప్రవేశపెట్టినట్లు తెలిపారన్నారు. భద్రా అప్పర్ ప్రాజెక్ట్కు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో అన్ని నిధులు ఇవ్వాలని విన్నవించామన్నారు. మేకెదాటు, కళసా బండూరి, అప్పర్ భద్రా ప్రాజెక్ట్లు చాలా అవసరమని చెప్పామన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం తుమకూరు: హోం మంత్రి జీ.పరమేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో వడ్డీ వ్యాపారుల వేధింపులకు సామాన్యుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... మండ్యకు చెందిన ముజీబ్ అనే పండ్ల వ్యాపారి ఇక్కడ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండ్యలో పండ్ల వ్యాపారం చేసే ముజీబ్ మీటర్ వడ్డీకి అప్పులు ఇచ్చే వారి నుంచి రూ.10 లక్షల వరకూ అప్పులు చేశాడు. సకాలంలో వాయిదాలు కట్టకపోవడంతో రుణదాతలు వేధించసాగారు. దీంతో తుమకూరుకు వచ్చాడు. సెల్ఫీ వీడియోలో బాధలు చెప్పుకుని పురుగుల మందును తాగాడు. సురేష్, చన్నెగౌడ, రాజన్న అనేవారు సతాయిస్తున్నారని, తన మరణానికి వారే కారణమని చెప్పాడు. అతన్ని జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. -
జగదభిరాముడు శ్రీరాముడే
మండ్య/ తుమకూరు: సుందర రామా.. సుగుణభిరామా, సుగుణధామ సూర్యామయ సోమా.. అని భక్తి తన్మయత్వంలో ప్రజలు శ్రీరామనవమిని ఆచరించారు. రాజధానితో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భక్తిరసం పొంగిపొర్లింది. శ్రీరాముడు జన్మదినోత్సవమైన నవమిని పలుచోట్ల మరింత వినూత్నంగా జరిపారు. బెంగళూరులో రామాంజనేయ ఆలయం నుంచి పిల్లలు, పెద్దలు మనోహరంగా నృత్యం చేస్తూ శోభాయాత్ర సాగించారు. మండ్య నగరంతో పాటు జిల్లాలో రామ, హనుమ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. నెహ్రు నగరలో ఉన్న రామమందిరంలో రాముల వారికి ప్రత్యేక అలంకారం, అర్చనలు జరిపారు. భక్తులకు పానకం, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓళిగల నైవేద్యం తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలోని హులియూరు వద్ద లింగప్పనపాళ్యలో నవమి వేడుకలు కోలాహలంగా సాగాయి. రాముల దేవాలయం నుంచి స్వామివారి ఊరేగింపును నిర్వహించారు. ఓళిగలు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక బెళగావిలో హిందూ సంఘాలు భారీ ఆర్భాటంగా ఊరేగింపులు చేశారు. నవమి సందర్భంగా చిక్కమగళూరులో ఎద్దులబండ్ల పందేలు అలరించాయి. వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు అట్టహాసంగా శోభాయాత్రలు -
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.వివరాల ప్రకారం... బెంగళూరులోని బీటీఎం లేఅవుట్లో గురువారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. వారిలో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, మరో మహిళ.. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అనంతరం, సదరు ఆగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి బాధితురాలు ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తామే స్వయంగా చర్య తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025ఇదిలా ఉండగా.. బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల సాధారణంగా మారాయి. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో ఓ యువతి వేధింపులకు గురైంది. ఆమె బుక్ చేసుకున్న క్యాబ్లోకి బలవంతంగా ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించారని ఆరోపించారు. కమ్మనహళ్లి నివాసి అయిన ఆ మహిళ ఏదో విధంగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 27న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆ మహిళ తన స్నేహితుడిని తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ భయంతో క్యాబ్ నుంచి దిగాలని నిర్ణయించుకున్నప్పుడు నిందితుల్లో ఒకరు ఆమెను వెంబడించాడు. మరొకరు ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నించారు. ఆ మహిళ సహాయం కోసం కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. -
టెక్కీనని చెప్పి రెండో పెళ్లి
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్కు ఆరు నెలల క్రితం ఇన్స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.రోజూ ఆఫీసుకు డ్రాప్సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు. దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.భార్యను గొంతుకోసి హతమార్చిన భర్తబొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు. ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది. -
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్ కోచ్ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితడు సురేశ్ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.ఇలా గుట్టురట్టుఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్ఫోన్ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది. -
భూ వాతావరణంలోకి పోయెమ్–4
సాక్షి, బెంగళూరు: అంతరిక్ష వ్యర్థాల నిర్వహణలో ఇస్రో మరోసారి తన ఘనతను చాటింది. అంతరిక్ష ప్రయోగాల కోసం వినియోగించిన వ్యోమనౌక సంబంధిత భాగాలు అక్కడే అంతరిక్ష చెత్తగా పేరుకుపోకుండా వాటిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియను ఇస్రో మరోసారి విజయవంతంగా పూర్తిచేసింది. అంతరిక్షంలో ఉపగ్రహాల వంటి వస్తువుల అనుసంధానం(డాకింగ్), విడతీత(అన్డాకింగ్) కోసం వినియోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్(పీఎల్ఎల్వీ–సీ60)లోని పైభాగం(పీఎల్4) అయి న పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పరిమెంటల్ మాడ్యూల్ (పోయె మ్–4)ను విజయవంతంగా తిరిగి భూవాతావరణంలోకి తీసు కొచ్చారు. తర్వాత దానిని ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 8.03 గంటలకు హిందూమహాసముద్రంలో పడేలాచేశామని ఇస్రో శని వారం వెల్లడించింది. అంతరిక్ష నుంచి జాగ్రత్తగా కక్ష్య తగ్గిస్తూ సముద్రంలో పడేసే పనిని ఇస్రో వారి సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టేనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్(ఐఎస్4ఓఎం) విభాగం పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్ 30న రెండు స్పేడెక్స్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వ్యోమనౌక ద్వారా 475 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో చేర్చారు. అదే కక్ష్యలోనే పోయెమ్–4ను ప్రవేశపెట్టారు. తర్వాత నెమ్మదిగా 350 కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి తీసుకొచ్చారు. పోయెమ్–4 మొత్తంగా 24 పేలోడ్లను వెంట తీసుకెళ్లింది. ఇందులో 14 ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి. ప్రస్తుతం అన్ని పేలోడ్లు సక్రమంగా పని చేస్తున్నాయి. వాటిని నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తూ అంతరిక్ష డేటాను పంపిస్తున్నాయి. -
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలి
బళ్లారి అర్బన్: అన్ని రంగాల్లో అత్యంత వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని 13 జిల్లాలను కలిపి ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత జనగణ సమాఖ్య సంస్థాపక జాతీయ అధ్యక్షుడు ఎన్.గంగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముండ్లూరు రామప్ప మీటింగ్ హాల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని 6 జిల్లాలు, ముంబై కర్ణాటకలోని 7 జిల్లాలను కలిపి మొత్తం 13 జిల్లాలతో కొత్త రాష్ట్రాన్ని ప్రకటిస్తేనే ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి నోచుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల అభివృద్ధినే ఇప్పటి వరకు వచ్చిన పాలకులు చేశారన్నారు. ఇప్పటికై నా ప్రత్యేక రాష్టాన్ని ప్రకటించాలని ఒత్తిడి చేశారు. అలాగే 4 జిల్లాలతో కూడిన కేఎంఎఫ్ కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల పాలక మండలి మొదటి నుంచి బళ్లారిలో ఉంది. ప్రస్తుతం కొందరు రాజకీయ నేతలు తమ పబ్బం గడుపుకోడానికి విజయనగర జిల్లాకు మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు బీ.నాగేంద్ర బళ్లారి ఇన్చార్జి మంత్రిగా ఉన్న వేళ కొళగల్లు గ్రామం దగ్గర మెగా డైరీ ఏర్పాటు చేయాలని భూమిని మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదన్నారు. తక్షణమే అక్కడ కేటాయించిన 20 ఎకరాల్లో మెగా డైరీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
గ్యారెంటీలతో ఖజానా లూటీ
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయాన్ని పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఉచితంగా ఇవ్వడం ద్వారా ఖజానాను లూటీ చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్కు 36 పైసలు, పాల ధర లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ ధరలు పెంచండం తగదన్నారు. పాల రైతులకు రూ.662 కోట్ల బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్కు కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందన్నారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు దిగజార్చారని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, నాగరాజ్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు. -
ఏఐడీఎస్ఓ కార్యకర్తల ర్యాలీ
రాయచూరు రూరల్ : రాయచూరులో రెండు రోజుల పాటు ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నగరంలోని మహిళా సమాజ్ నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో సంచరిస్తూ ఏఐడీఎస్ఓ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అంతకు ముందు కర్ణాటక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర సంచాలకుడు శశిధర్ మాట్లాడారు. దేశంలో మనమంతా ఒక్కటే అని చాటి చెప్పి కళలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు, పేద ధనికులు అనే భావాలను విడనాడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, సరోజ, చంద్ర గిరీష్, వీరేష్, మహేష్, చెన్నబసవలున్నారు. రాష్ట్రానికి ఎయిమ్స్ ప్రతిపాదన లేదురాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేస్తున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాధవ్ రాష్ట్రానికి ఎలాంటి ఎయిమ్స్ ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. శుక్రవారం లోక్సభలో దావణగెరె లోక్సభ సభ్యురాలు ప్రభా మల్లికార్జున్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు కాదు కదా రాష్ట్రానికే ఎయిమ్స్ కేటాయింపు విషయంలో ఎలాంటి చర్చ, ప్రతిపాదన జగరలేదని వివరించారు. న్యూఢిల్లీలో రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించిన నేపథ్యంలో మహాత్మ గాంధీ మైదానంలో 1060 రోజుల పాటు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయిందని ఆందోళనకారులు వాపోయారు. విద్యా శాఖాధికారిగా ఈరణ్ణ కోస్గిరాయచూరు రూరల్: రాయచూరు తాలూకా విద్యా శాఖాధికారి(బీఈఓ)గా ఈరణ్ణ కోస్గి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాయచూరు తాలూకా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయచూరు డయట్లో అధ్యాపకుడిగా, అక్షర దాసోహ అధికారిగా విధులు నిర్వహించానన్నారు. తాలూకా స్థాయిలో పాఠశాలల అభివృద్ధికి తోడు ఉపాధ్యాయులకు సరైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు చేపట్టిన ఈరణ్ణ కోస్గిని మహంతేష్, నందీష్, తాయిరాజ్, కృష్ణ, రాఘవేంద్ర, వెంకటేష్, గూళప్పలు అభినందించారు. పుట్పాత్పై ఆక్రమణల తొలగింపురాయచూరు రూరల్ : నగరంలో పుట్పాత్ను ఆక్రమించి పెట్టుకున్న డబ్బా అంగళ్లు, హోటళ్లు, తోపుడుబండ్ల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. శనివారం కేంద్ర బస్టాండ్ నుంచి నగరసభ కార్యాలయం రోడ్డు, జైల్ రోడ్డు, ఏక్ మినార్ రోడ్డు, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమాధికారి కార్యాలయం రోడ్డులో సూపర్ మార్కెట్ వరకు రహదారికి ఇరు వైపులున్న వాటిని తొలగించారు. ఈ విషయంపై వీధివ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఏసుమిత్ర బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయ వ్యవస్థను కల్పించి తొలగించాలని అధికారులకు విన్నవించారు. కారు, బైక్ ఢీ.. ఒకరి మృతిహుబ్లీ: కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్ చోదకుడు అక్కడే మరణించిన ఘటన ధార్వాడ హైకోర్టు వద్ద జాతీయ రహదారిలో జరిగింది. మృతుడిని తాలూకాలోని తేగూరుకు చెందిన హనుమేష్ నాయక్(42)గా గుర్తించారు. తేగూరు గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో హనుమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అయినా చికిత్స ఫలించక మృతి చెందాడు. గరగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
లోకాయుక్త వలలో సీడీపీఓ
రాయచూరు రూరల్: లోకాయుక్త వలలో సీడీపీఓ వనజాక్షి చిక్కిన ఘటన యాద గిరిలో చోటు చేసుకుంది. యాదగిరి సీడీపీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వనజాక్షి అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న సహాయకురాలి అటెండెన్సు పుస్తకంలో హాజరును సక్రమం చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం యాదగిరి ఆర్టీసీ బస్టాండ్లో రూ.80 వేలు లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారి ఇనాందార్ ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటనపై సీఐ సంగమేష్, సిద్దరాయ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బళ్లారిలో వర్షం .. ప్రజల్లో హర్షం బళ్లారిటౌన్: నగరంలో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గత నెల రోజులుగా ఎండ తీవ్రతతో సతమతమవుతుండగా రెండు మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండటంతో ప్రజలకు వేసవి ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. కాగా సాయంత్రం కూడా మళ్లీ వర్షం కురవడంతో నగరవాసులకు ఉక్కపోత నుంచి ఊరట కలిగింది. భర్తను చంపిన భార్య అరెస్ట్సాక్షి,బళ్లారి: అక్రమ సంబంధం వ్యామోహంలో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బెళగావి జిల్లా శహాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త శివనగౌడ పాటిల్ అనే వ్యక్తిని భార్య శైల దారుణంగా హత్య చేసి ఏమీ తెలియనట్లుగా నటించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో రుద్రప్ప, శైల మధ్య ఏర్పడిన అక్రమ సంబంధంతో రుద్రప్ప సహాయంతో భర్తను హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య హుబ్లీ: బీదర్ శివారు ప్రాంతంలోని చిక్కపేటె అలియాబాద్ రింగ్ రోడ్ సమీపంలో ఢాబా వద్ద శుక్రవారం రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య జరిగింది. ఆ తాలూకాలోని వక్కికేరి నివాసి, గ్రామ పంచాయతీ సభ్యుడు వైజనాథ దత్తాత్రేయ(50) హతుడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తల, కడుపు భాగంలో మారణాయుధాలతో నరికి, చాకుతో పొడిచి దారుణంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఘటనపై నూతన నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
ఆదర్శప్రాయుడు బాబూ జగ్జీవన్ రామ్
బళ్లారిటౌన్: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని, బాబూజీ వ్యక్తిత్వం, జీవిత చరిత్రను తెలుసుకుని యువత వారి ఆదర్శాలు, గుణగణాలను అలవరుచుకోవాలని జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాలికె మేయర్ ముల్లంగి నందీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 5న ఈ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడి రాజకీయ నేతగా ఎదిగారని గుర్తు చేశారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమైరా, నేతలు చిదానందప్ప, టి.పంపాపతి, అధికారులు మల్లికార్జున, బీ.నాగరాజు, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల మైదానం నుంచి వివిధ శాఖల స్తబ్ద చిత్రాలతో ప్రారంభించిన భారీ ఊరేగింపు వివిధ రహదారుల గుండా సాగి దొడ్డనగౌడ రంగమందిరానికి చేరుకుంది. సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నేత బళ్లారి రూరల్ : సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్ అని బళ్లారి కాంగ్రెస్ ప్రముఖుడు వెంకటేశ్ హెగ్డె తెలిపారు. శనివారం భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రతిమకు పూలమాలలు వేసి మాట్లాడారు. భారత చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం దాదాపు 30 ఏళ్లు మంత్రిగా పని చేసిన ఘనత బాబూజీకే దక్కిందన్నారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో అత్యంత చిన్న వయస్సులో మంత్రి పదవి పొందిన వ్యక్తి బాబూజీ అని గుర్తు చేశారు. ఉప ప్రధానిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహనీయుడు జగ్జీవన్ రామ్. అప్పటి ఆహార సమస్యను సవాలుగా తీసుకొని పరిష్కార దిశగా మార్గాలను అన్వేషించిన వ్యక్తిగా బాబూజీకి పేరుందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబ్కేర్, బాబూ జగ్జీవన్ రామ్ ఈ దేశానికి పెద్ద ఆస్తి అని నేటి యువత తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రముఖులు ఎం.ఎరుకులస్వామి, మల్లికార్జున, బళ్లారి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు టి.ఆనంద్, ప్రముఖులు రాజ, తిప్పేస్వామి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. హరిత విప్లవ సృష్టికర్త జగ్జీవన్ రామ్ బళ్లారి రూరల్ : ఆహార శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడిగా బాబూ జగ్జీవన్ రామ్ పేరొందారని దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్ తెలిపారు. శనివారం దావణగెరెలో రాధమ్మ చెన్నగిరి రంగప్ప స్మారక రంగమందిరంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంటనరానితనాన్ని రూపుమాపడానికి సమానత్వ సమాజం కోసం శ్రమించిన వ్యక్తిగా బాబూజీ కృషి చేశారన్నారు. 8 సార్లు లోక్సభ స్థానానికి ఎన్నికై ఎక్కువ కాలం మంత్రిగా పని చేశారన్నారు. ముఖ్యంగా అప్పట్లో దేశంలోని ఆహార కొరత సమస్యకు తనదైన శైలిలో పరిష్కారం చూపారన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా విశిష్ట సేవలను అందించారన్నారు. జిల్లాధికారి రాజ్యాంగ సందేశాన్ని చదివి ప్రమాణం చేశారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ప్రొఫెసర్ రామచంద్రయ్య జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడారు. కార్యక్రమంలో దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, ఏఎస్పీ విజయకుమార్ బి.సంతోష్, దుడా కమిషనర్ హులమని తమ్మణ్ణ, దళిత ప్రముఖులు మల్లేశ్, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు. బాబూజీ ఆదర్శాలను అలవర్చుకోవాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో బాబూజీ ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖా మంత్రి బోసురాజు అన్నారు. శనివారం బాబూ జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద జరిగిన బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూల మాలలు వేసి మాట్లాడారు. అనంతరం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఎమ్మెల్సీ వసంత్ కుమార్ ప్రసంగిస్తూ భారత దేశంలో దళిత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహా నేత బాబూజీ అన్నారు. కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించడంతో పాటు దేశంలో అహార పదార్థాల కొరత ఏర్పడినప్పుడు హరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి అన్నారు. స్టేషన్ సర్కిల్లో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లాఽధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, సీఈఓ రాహుల్ తుకారాం పాండే, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో పూలమాలలు వేశారు. -
బాలా హోటల్పై పోలీసు దాడులు
సాక్షి,బళ్లారి: నగరంలోని పేరుగాంచిన బాలా హోటల్లో పోలీసు బృందం తనిఖీ చేసింది. శనివారం సాయంత్రం బాలా హోటల్ను జిల్లా ఎస్పీ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ, సీఐలు పరిశీలించి అక్కడ నడుపుతున్న స్పా కేంద్రాన్ని, గదులను పరిశీలించారు. స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక వంటి అసాంఘిక కార్యకలాపాలు నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఇక్కడ స్పా మసాజ్ చేయిస్తుండటం వెలుగు చూసింది. మహిళలను స్పా పేరుతో లైంగికంగా ఉపయోగించుకుంటున్నట్లు బయట పడింది. బళ్లారికి చెందిన ఎం.డీ. మతిల్, ముంబైకి చెందిన మీనజ్ అనే మహిళ ఈ స్పా నడుపుతూ లైంగికంగా మహిళలను ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ముగ్గురు మహిళలను రక్షించారు. ఈ దాడుల్లో గాంధీనగర్ సీఐ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మసాజ్ పేరుతో వేశ్యావాటిక తనిఖీలో వెలుగు చూసిన వైనం ఐదుగురి అరెస్ట్, ముగ్గురు మహిళలకు విముక్తి -
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
బళ్లారిఅర్బన్: నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఉపయోగపడతాయని, ప్రతి రోజు క్రీడలకు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని మేయర్ ముల్లంగి నందీష్ సూచించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం అందరూ మొబైల్ ఫోన్కు బానిసలుగా మారి శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో సోమరితనంతో వెనుకబడి పోయారన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా తీరిక చేసుకొని నిర్ణీత సమయంలో వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారిస్ సుమైరా, అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ కార్యదర్శి జీవై తిప్పారెడ్డి, ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా క్రీడా ధ్వజంతో ఆకర్షణీయమైన పరేడ్ను నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆచరించారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, డీహెచ్ఓ డాక్టర్ యల్లా రమేష్బాబు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ఎంఏ అసీఫ్, యువజన సేవా క్రీడా శాఖ అధికారి కే.గ్రేసీ, వివిధ తాలూకాల అధ్యక్షులు, పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు ప్రత్యామ్నాయం చూపండి
హొసపేటె: నగరంలోని హంపీ రహదారిలో ఉన్న అనంతశయనగుడి వద్ద చేపడుతున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇళ్లు కోల్పోయిన వారికి నగరంలో స్థలాలను కేటాయించాలని ఎమ్మెల్యే గవియప్ప సంబంధ అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అధికారులు, అనంతశయన గుడి ప్రజలతో సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయే లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా తగిన ప్రదేశంలో తగిన కొలతల ఇంటిని అందించాలని నిర్ణయించామన్నారు. స్థలాన్ని సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వానికి గరిష్ట పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతశయనగుడి గ్రామస్తుల రాకపోకలకు వీలుగా సప్తాంజనేయ ఆలయ సమీపంలో ఒక చిన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధిత అధికారులు, రైల్వే మంత్రితో చర్చించి ఆమోదం పొందుతామని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ వివేక్, తహసీల్దార్ శృతి, డీఎస్పీ మంజునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నివేదికలోని కొన్ని అంశాలు..
సాక్షి, బెంగళూరు: ప్రతి గర్భిణి పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని కలలు కంటుంది. కానీ ఆస్పత్రుల్లో వివిధ కారణాల వల్ల వారి కలలు ఛిద్రమయ్యాయి. తల్లీ బిడ్డల అనుబంధం శాశ్వతంగా ఆవిరైంది. కన్నడనాడును ఎక్కువగా వేధిస్తున్న సమస్యల్లో గర్భిణులు, బాలింతల మరణం ఒక్కటి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంగా ఎక్కువసంఖ్యలో మరణించడం కలలకం రేపింది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో రాష్ట్రంలో మొత్తం 464 మంది మహిళలు ప్రసవానికి ముందు, లేదా ప్రసవానంతరం మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 70 శాతం మరణాలను ఆపగలిగేవి అని ప్రభుత్వానికి రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక వెల్లడించింది. దీంతో వైద్యశాఖ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఈ ఏడాది మరణాలను కలిపితే 550 దాటుతుందని అంచనా. గత నవంబర్లో బళ్లారి నుంచి.. గత ఏడాది నవంబర్లో బళ్లారి జిల్లా ఆస్పత్రిలో 5 మంది బాలింతలు వరుసగా చనిపోయారు. 9 నుంచి 11 తేదీల మధ్య జరిగిన సిజేరియన్ శస్త్రచికిత్సల తరువాత అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో మరణించారు. తరువాత ఉత్తర కర్ణాటక జిల్లాల వ్యాప్తంగా మృత్యుకేకలు అధికమయ్యాయి. దీంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ మరణాలపై పూర్తి స్థాయి తనిఖీ జరగాలని అందుకోసం ప్రభుత్వం ఒక విస్తృత రాష్ట్ర స్థాయి తనిఖీ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు వాణివిలాస్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సవితా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. ఆరోగ్య మంత్రి ఏమన్నారు కమిటీ విచారణ జరిపి ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు స్పందించారు. ఈ మరణాలకు కేవలం రింగర్ లాక్టేట్ (ఆర్ఎల్) ద్రావణం మాత్రమే ఒక్కటే కారణం కాదని, మరిన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు. పనిభారం ఎక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రులకు ఒత్తిడి తక్కువగా ఉన్న తాలూకా ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిని బదిలీ చేస్తామన్నారు. మొత్తానికి ప్రతి తాలూకా ఆస్పత్రికి ఇద్దరు నిపుణులైన వైద్యులు, ఒక పీడియాట్రీషియన్, ఒక అనస్థీసియా నిపుణుడు ఉండేలా చూస్తామన్నారు. మధ్యంతర నివేదికలోని కొన్ని సిఫారసులు ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు. 70 శాతం బాలింతల మరణాలను అరికట్టి ఉండవచ్చు సర్కారీ ఆస్పత్రుల్లో వసతుల లేమి బాలింతల మరణాలపై కమిటీ మధ్యంతర నివేదిక గత ఏడాది కుదిపేసిన మృత్యుహేల 70 శాతం గర్భిణులు, బాలింతల మరణాలను తప్పించవచ్చు గ్లూకోజ్గా ఎక్కించే రింగర్ లాక్టేట్ ద్రావణంలో సమస్యల వల్ల 18 మంది మరణించారు. బళ్లారి 5, రాయచూరులో నలుగురు, బెంగళూరులో ముగ్గురు, ఉత్తర కన్నడ, యాదగిరి, బెళగావిల్లో చెరో ఒకరు చనిపోయారు. మరో పది కేసుల్లో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం. మరణాల్లో 50 శాతం కేసుల్లో తల్లులు 19 నుంచి 25 ఏళ్ల లోపువారు. 68 శాతం మరణాలు అధిక బీపీ, హృద్రోగం, మధుమేహం వల్ల జరిగాయి. భవిష్యత్తులో తల్లుల మరణాలు తప్పించేందుకు 27 సిఫారసులు చేశారు. ముఖ్యంగా ఆయా ఆస్పత్రుల్లో మౌలికవసతుల పెంపు, ఉపకరణాలు, మందులు, రక్తనిధి వంటి సౌకర్యాలు ఉండాలని కమిటీ సూచించింది. సాధారణ ప్రసవం అయిన వారికి మూడు రోజులు, సిజేరియస్ ప్రసవం అయిన వారు ఏడు రోజులు ఆస్పత్రిలోనే ఉండేలా తప్పనిసరి చేయాలి. మరణానికి స్పష్టమైన కారణాలు లేని సందర్భాల్లో పోస్టుమార్టమ్ తప్పనిసరి చేయాలి. -
జూనియర్ భోగేశ్వర్ కన్నుమూత
మైసూరు: రెండు ఏనుగుల మధ్య జరిగిన పోట్లాటలో పొడవాటి దంతాలు కలిగిన జూనియర్ భోగేశ్వర్గా పేరొందిన ఏనుగు అసువులు బాసింది. ఈ దుర్ఘటన జిల్లాలోని కబిని డ్యాం పరిధిలోని డీబీ కుప్పె, అంతరసంతె అటవీ వలయంలో జరిగింది. ఈ ప్రాంతంలో పొడవాటి దంతాలు కలిగిన కొన్ని ఏనుగులు ఉన్నాయి. వాటిలో ఆసియాలోనే ఎక్కువగా.. 8 అడుగుల అతి పొడవైన దంతాలు కలిగిన మిస్టర్ కబిని లేదా భోగేశ్వర్ అనే 68 ఏళ్ల ఏనుగు ఖ్యాతి పొందింది. ఈ ఏనుగు 2022 జూన్ 10న మరణించింది. ఆ తరువాత భోగేశ్వర్ ఏనుగును పోలినట్లుగా ఉన్న పొడవైన దంతాల మరో ఏనుగు ఒకటి సంచరిస్తోంది. దీనికి కొందరు వన్యజీవి ఛాయాగ్రాహకులు జూనియర్ భోగేశ్వర్గా పేరు పెట్టారు. ఫలించని చికిత్సలు డీబీ కుప్పె వన్యజీవి వలయపు కబిని పోటు జలాల ప్రాంతంలోని కొల్లి అనే చోట ఈ మగ ఏనుగు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అటవీ సిబ్బంది గమనించారు. మరో అడవి ఏనుగుతో జరిగిన పోట్లాటలో గాయపడినట్లుగా తెలిసింది. చికిత్స చేపట్టినప్పటికీ అది గాయాల తీవ్రతతో కన్నుమూసింది. జూనియర్ నేలకొరగడం స్థానికులకు, అటవీ సిబ్బందికి బాధ కలిగించింది. సోషల్ మీడియాలో జూనియర్ భోగేశ్వర్ ఏనుగు మరణ వార్త చిత్రాలతో వైరల్గా మారింది. ప్రజలు నివాళులర్పించారు. పులుల సంరక్షిత ప్రదేశం డైరెక్టర్ పీఏ సీమా, మేటికుప్పె ఉప విభాగపు ఏసీఎఫ్ ఎస్డీ మధు, ఆర్ఎఫ్ఓ ఎస్ఎస్ సిద్దరాజు పరిశీలించారు. నియమాల ప్రకారం ఏనుగు కళేబరాన్ని వన్యజీవులకు ఆహారంగా అడవిలోనే వదిలేశారు. అతి పెద్ద దంతాల ఆసియా ఏనుగుగా ఖ్యాతి మరో గజరాజుతో పోరాటంలో మృతి -
జైలులో జామర్.. ఎమ్మెల్యే ధర్నా
యశవంతపుర: జైలు అధికారులు కారాగారం చుట్టు వేసిన జామర్లతో ప్రజలకు ఇబ్బందిగా ఉందంటూ మంగళూరు నగర బీజేపీ నాయకులు శనివారం స్థానిక జైలు ముందు ధర్నా చేశారు. ఒక జామర్ వల్ల ప్రజలకు సమస్యగా ఉందని ఎమ్మెల్యే వేదవ్యాస కామత్ అరోపించారు. సమస్యను పరిష్కరించండి, లేదా జామర్ను తొలగించండి అని ఆయన డిమాండ్ చేశారు. జైలు అధికారులు, పోలీసు ఉన్నత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జైలుకు జామర్ అవసరం లేకున్నా ఎందుకు కొనసాగిస్తున్నరో అర్థం కావటంలేదన్నారు. జామర్ల వల్ల పరిసర ప్రాంతాల ప్రజల మొబైల్ఫోన్లకు అంతరాయం కలుగుతోందని తెలిపారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు. సీఐ సస్పెన్షన్ శివమొగ్గ: శివమొగ్గ నగరంలో ఉన్న వినోభనగర పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రకళ సస్పెండ్ అయ్యారు. విధులలో నిర్లక్ష్యం చూపినట్లు ఆరోపణలు రావడంతో తూర్పు విభాగం ఐజిపి రవికాంత్గౌడ ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఈద్గా మైదానం వివాదం గురించి ఎస్పీ అన్ని స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఇందుకు చంద్రకళ హాజరు కాలేదు. ఎస్పీ ఫిర్యాదు చేయడంతో వేటు పడింది. సిద్ధలింగేశ్వర జాతర తుమకూరు: ప్రసిద్ధ యడియూరు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో శనివారం మధ్యాహ్నం రథోత్సవం కనులపండువగా జరిగింది. ఏటా మాదిరిగానే ఉగాది పండుగ ముగిసిన తరువాత స్వామి జాతర, తేరు జరుగుతుంది. మంగళవాయిద్యాలతో, వీరగాసె కళాకారుల నృత్యాల మధ్య రథోత్సవం జరిగింది. పలువురు స్వామీజీ పాల్గొని టెంకాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.వాకింగ్ చేస్తుండగా చైన్స్నాచింగ్ మైసూరు: మైసూరులో చైన్స్నాచర్లు తెగబడ్డారు. ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన నగరంలోని మండి పోలీసు స్టేషన్ పరిధిలోని వెస్లి రోడ్డు వద్ద జరిగింది. లలిత (53) అనే మహిళ ఇంటి వెనుక రోడ్డులో వాకింగ్ చేస్తుండగా స్కూటర్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రూ.1.45 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. ఘటన అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బజార్లకు నవమి కళ చింతామణి: శ్రీరామనవమి పండుగ రావడంతో బజార్లు కిటకిటలాడుతున్నాయి. చింతామణి పట్టణంలో పూలు పండ్లు తదితర వస్తువులను కొనుగోలుకు ప్రజలు తరలివచ్చారు. పూలు పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పండుగ కావడంతో కొనుగోళ్లు చేశారు. కావేరి జలాల్లో అన్యాయమే ● కేంద్రమంత్రి కుమారస్వామి శివాజీనగర: మన నీరు మన హక్కు, ప్రజల పన్నుల సొమ్ముతో ఆనకట్టలను నిర్మించి తమిళనాడుకు నీరు విడుస్తున్నాము అని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి అన్నారు. బెంగళూరు కువెంపు కళాక్షేత్రలో కావేరి నది రక్షణ సమితి చేపట్టిన కావేరి నది నీటి పంపకాల గురించి చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. కావేరి నీటి విషయంలో మనకు అన్యాయం అయింది. పొరుగు రాష్ట్రానికి అనుకూలం అవుతోంది. కన్నడిగుల్లో ఐక్యత లేదు, నీటి విషయంలో కూడా అదే జరుగుతోందన్నారు. మేకెదాటు ప్రాజెక్ట్పై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నదని ఆరోపించారు. మనలో ఐక్యత రాకపోతే కావేరి నీటిలో న్యాయం జరగదన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మలానందనాథ స్వామి, సౌమ్యనాథ స్వామి, సిద్దరామేశ్వర స్వామి, నిశ్చలానందనాథ స్వామి, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వీ గోపాలగౌడ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
కర్వార్ నేవీ బేస్లో ‘సాగర్’ జలప్రవేశం
కర్వార్ (కర్నాటక): వ్యూహాత్మకంగా కీలకమైన కర్నాటకలోని కర్వార్ నేవీ బేస్లో శనివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఓషన్ షిప్ ఐవోఎస్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్)ను జెండా ఊపి జల ప్రవేశం చేయించారు. దీంతోపాటు ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిలటరీ హెలికాప్టర్లో కర్వార్కు చేరుకున్న రాజ్నాథ్ ‘సీబర్డ్’లో భాగమైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని రక్షణ శాఖ తెలిపింది. జల ప్రవేశం చేయించిన ఐవోఎస్ సాగర్లో 9 దేశాల నావికా దళాలకు చెందిన 44 మంది సిబ్బంది ఉంటారని పేర్కొంది. హిందూ మహా సముద్ర ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ఐవోఎస్ సాగర్ కీలకంగా మారనుందని రక్షణ శాఖ ‘ఎక్స్’లో తెలిపింది. ఈ ప్రాంత దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్కు ఇది ఎంతో సాయపడుతుందని తెలిపింది. సీబర్డ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విస్తరణ పనులతో కర్వార్ నేవీ బేస్లో 32 యుద్ద నౌకలు, సబ్మెరీన్లను నిలిపేందుకు అవకాశమేర్పడింది. -
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF— ANI (@ANI) April 5, 2025 -
గిగ్ వర్క్ర్ల సంక్షేమానికి సెస్
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఊతమిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై 5 శాతం సెస్ వసూలు చేసి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమగ్ర గిగ్ వర్కర్స్ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రవేశపెడతామని తెలిపారు.ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, డన్జో సహా 12 ప్రధాన కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. గిగ్ వర్కర్లు సరుకులను డెలివరీ చేయడానికి లేదా సేవలను అందించడానికి ప్రయాణించిన దూరం ఆధారంగా కొంత మొత్తాన్ని ఈ చట్టం కింద ఏర్పాటు చేయబోయే సంక్షేమ నిధికి మళ్లిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఐటీ అండ్ బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్తో ఈమేరకు చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.ప్రతిపాదనలు ఇవే..ఈ సమావేశంలో గిగ్ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం; అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా అందుబాటులో లేని ఆరోగ్య బీమా, విద్యా మద్దతు, ఇతర రక్షణలు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం; ఈ-కామర్స్, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ల ద్వారా గిగ్ వర్కర్లకు చేసే చెల్లింపులపై 5 శాతం సెస్ను బోర్డుకు కేటాయించడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సామాజిక భద్రత కోడ్ 2020 నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సంక్షేమ పథకాలను నిర్ధారించడానికి ఈ విధానాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు గిగ్ వర్కర్లకు రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఈ చట్టం కింద ప్రతి లావాదేవీకి 1-2 శాతం సెస్ను ప్రతిపాదించినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా దీని అమలు రెండుసార్లు నిలిచిపోయింది.ఇదీ చదవండి: క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్లుపారిశ్రామిక వర్గాల ఆందోళనఈ ప్రకటన నాస్కామ్, ఐఏఎంఏఐ వంటి పారిశ్రామిక సంస్థల నుంచి విమర్శలకు దారితీసింది. ఇది ఈ-కామర్స్ సంస్థలపై, ముఖ్యంగా ఇప్పటికే తక్కువ మార్జిన్లతో కొట్టుమిట్టాడుతున్న స్టార్టప్లపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటకలో గణనీయమైన కార్యకలాపాలు కలిగిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని తెలిపాయి. తిరిగి వినియోగదారులపై ఈ భారం పడుతుందని అంచనా వేస్తున్నాయి. -
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
కర్ణాటక: భార్య అదృశ్యమైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. మా కూతురిని హత్య చేశాడంటూ అనుమానంతో అత్తంటివారు ఫిర్యాదు చేయటంతో భర్తను కేసు పెట్టి జైలుకు పంపారు. ఎలానో శిక్ష నుంచి బయట పడ్డారు. ఇదీ కథ కాదు. ఐదేళ్లు క్రితం జరిగిన యద్దార్థ ఘటన. ఇప్పుడు ఆ భార్య ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. ఈ విచిత్ర సంఘటన కొడగు జిల్లా కుశాలనగర తాలూకా బసవనహళ్లి గ్రామంలో జరిగింది. ఓ రోజు మిస్సింగ్ కుశాలనగర తాలూకా బసవనహళ్లికి చెందిన సురేశ్, మల్లిగె దంపతులు కూలిపని చేసుకుని జీవిస్తుండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక రోజు మల్లిగె అదృశ్యమైంది. ఆమె ఆక్రమ సంబంధం కారణంగా వెళ్లిపోయిందని భర్త చెప్పేవాడు. ఓ రోజు మల్లిగెకి ఫోన్ చేసి నాతో సంసారం చేయకున్నా పర్వాలేదు. ఇద్దరు పిల్లలున్నారు. చూసుకోవడానికైనా రావాలని మల్లిగెని ప్రాధేయ పడ్డాడు. ఆమె మనసు కరగలేదు. చివరికి సురేశ్ 2021లో కుశాలనగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. 2022లో శవం లభ్యం 2022లో సురేశ్కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లు సమాచారం ఇచ్చారు. పిరియాపట్టణ పోలీసులు సురేశ్తో పాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించగా ఇది మల్లిగెది అని గుర్తించారు. అక్కడే అంత్యసంస్కారంను పూర్తి చేయించారు. తన అల్లుడే ఆమెను చంపాడని అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండేళ్లు తరువాత డీఎన్ఎ పరీక్షల రిపోర్ట్ రాగా, ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్ జైలు నుంచి బయట పడ్డారు. ఇలా దొరికింది ఇలా ఉండగా మల్లిగె ఈ నెల 1ను తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఒక హోటల్కు వెళ్లింది. అక్కడ సురేశ్ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్కు, పోలీసులకు పంపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తను ప్రియునితో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజర్ పరిచి మైసూరు జైలుకు తరలించారు. అప్పట్లో లభించిన శవం ఎవరిది, అన్యాయంగా సురేశ్ను జైలుకు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. -
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైష్ణవి
కర్ణాటక: ప్రేమ పెళ్లి పేరుతో యువకుల జీవితాలతో ఓ మహిళ చెలగాటమాడింది. డబ్బున్న వారిని గుర్తించి వలపు వల విసిరి పెళ్లి చేసుకొని నగదు, నగలతో ఉడాయిస్తోంది. ఇప్పటికే ముగ్గురు భర్తలను వదిలేసిన ఆమె తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరుసటి రోజే నగలతో ఉడాయించింది. బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె నిత్య పెళ్లికూతురని తెలిసి అవాక్కయ్యాడు. మండ్య జిల్లా మద్దూరు తాలూకా కెస్తూరు గ్రామానికి చెందిన పుట్టస్వామి కుమార్తె కే.పి. వైష్ణవి, ఇదే తాలూకా మల్లనాయకనకట్టె గ్రామానికి చెందిన ఎం.బి.శశికాంత్ 8 నెలలుగా ప్రేమించుకున్నారు. తాము చాల పేదమని భర్త వద్ద వాపోయిన వైష్ణవి పెళ్లికి ముందే రూ.లక్ష తీసుకుంది. అనంతరం పెళ్లినగలంటూ అతనితోనే వంద గ్రాముల బంగారం కొనుగోలు చేయించింది. కాబోయే భార్యకు శశికాంత్ రూ. 6లక్షల నగదను ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. మామకు ఆటో ఇప్పించాడు. ఇంటి అడ్వాన్సు కోసం రూ. 50 వేలు, అత్తకు పాత చైన్ను తీసుకొని 46 గ్రాములతో కొత్త చైన్ ఇప్పించాడు ఫ్రిడ్జి, టీవీ, వాషింగ్మెషిన్, అందరికి మొబైల్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయిచి ఇచ్చాడు. శశికాంత్, వైష్ణవికి మార్చి 24న ఆదిచుంచనగిరి క్ష్రేత్రంలో వివామైంది. మరుసటి రోజు కొత్త దంపతులు గౌడగెరె చాముండేశ్వరి ఆలయానికి కారులో బయల్దేరారు. ఉమ్మడిహళ్లి గెట్ వద్ద వాటర్ బాటిల్ కోసం శశికాంత్ కారు దిగాడు. అప్పటికే పథకం ప్రకారం వెనకాల వచ్చిన కారులో వైష్ణవి ఎక్కి ఉడాయించింది. బాటిల్ తీసుకొని కారు వద్దకు రాగా వైష్ణవి కనిపించలేదు. దీంతో శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెకు ఇప్పటికే మూడు వివాహాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ధర్మస్థలలో హాసన్కు చెందిని రఘు అనే వ్యక్తితో, అనంతరం శివ అలియాస్ తుపాకీ శివుతో ఇలా ముగ్గురితో వివాహమైందని, వారి ఇళ్ల నుంచి నగలతో ఉడాయించినట్లు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం అమ్మకందారుల ధర్నా
బళ్లారిటౌన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా మద్యం అమ్మకందారులు శుక్రవారం జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లాధికారి ద్వారా సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. మద్యం అమ్మకం దారులు జిల్లాధ్యక్షుడు సావుకార్ సతీష్బాబు, ప్రధాన కార్యదర్శి బసవ లింగరెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లోను సాంకేతిక ధర్నా చేపట్టామన్నారు. చిల్లర మద్యం అమ్మకందారులకు కనీసం 20 శాతం లాభాలు కల్పించాలని, అడిషినల్ ఎకై ్సజ్ ట్యాక్స్ను తగ్గించాలని, ఇప్పటికే పలు మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోయినందున నష్టాల్లో మద్యం వ్యాపారులు ఉన్నారన్నారు. అయితే ఖాళీ ఉన్న 950 మద్యం దుకాణాలకు టెండర్ ప్రక్రియ ప్రారంభించి ఈ టెండర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షుడు కేపీ రామరెడ్డి, కార్యదర్శి బసవలింగ రెడ్డి, జోనల్ కార్యదర్శి గట్టురాము, సూర్యకుమార్ శెట్టి, పీ.లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. హుబ్లీ: వివిధ సమస్యల కోసం పరిష్కారం కోసం మద్యం అమ్మకందారులు ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట సంఘం తరపున శుక్రవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఆదాయం గడించుకోవడానికి నియమాలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. 4065 మద్యం దుకాణాల వేలంపాట పాడడం దారుణం అన్నారు. అమ్మకందారుల లాభాల శాతాన్ని 20 శాతం మేరకు పెంచాలన్నారు. ఎకై ్సజ్ చట్టం– 2005కు చేసిన సవరణను పునర్ పరిశీలించాలన్నారు. ఎంఎస్ఐఎల్ అనుమతుల గురించి న్యాయంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా మద్యం ధరలను పెంచరాదని వారు డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు హనుమంతసా నిరంజన, ఉపాధ్యక్షులు మహేష్ శెట్టి, గౌరవ కార్యదర్శి సంబాజీ కలాల్, కోశాధికారి వెంకటేష్ ఆర్ నిరంజన, సహకార్యదర్శి హెచ్బీ.గిరిరెడ్డి, రాష్ట్ర సమితి కోశాధ్యక్షుడు, పీఎం మెహరవాడే తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21 తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ముగిశాయి. పరీక్షలు ముగిశాయని విద్యార్థులు ఆనందంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. అయితే ఎస్ఎస్ఎల్సీ పరీక్ష చివరి రోజున హావేరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అశ్రునయనాల మధ్య పరీక్ష రాశారు. హావేరి జిల్లా పద్మావతిపుర తాండాకు చెందిన రక్షిత, ధనరాజ్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాయడం కలిచివేసింది. వారి తండ్రి హనుమంతప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించగా 10 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి మరణవార్త నడుమ పరీక్షకు వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం నూరిపోసి నచ్చచెప్పి పరీక్షకు పంపించారు. తమను పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి, పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారని, ఉన్నఫళంగా గుండెపోటుతో మృతి చెందారని ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్నా చెల్లెళ్లు -
రహదారి పనుల పూర్తికి మీనమేషాలు
బళ్లారిటౌన్: నగరంలోని కేఈబీ సర్కిల్ నుంచి కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వరకు ఎస్హెచ్– 132 బసవేశ్వరనగర్ రోడ్డు వెడల్పు పనులు చేపట్టి దాదాపు 10 నెలలు కావస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నందున స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 400 మీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డు పనులు గతేడాది మే నెలలో ప్రారంభించారు. అయితే ఇంత వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యం అవుతున్నాయని సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్రెడ్డి ఆరోపించారు. 21వ వార్డు పరిధిలోని ఈ రోడ్డులో కూరగాయల మార్కెట్, ఆస్పత్రులు, హోటళ్లు, కమర్షియల్ షాపులు ఉన్నందున రోడ్డులో ఉన్న దుమ్ము, ధూళి అంతా దుకాణాల్లోకి చొరబడుతోందని వర్తకులు మండిపడుతున్నారు. ఇక ఈ రోడ్డుకి ఆనుకొని ఉన్న బసవేశ్వరనగర్ వాసులు తమ ఇళ్లలోకి ధూళి, దుమ్ము చేరుతున్నందున ఎప్పుడూ తలుపులు, కిటికీలు మూసుకొని ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించనందుకే జాప్యం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా విడుదల చేయక పోవడంతోనే పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ముందస్తుగా లక్షల్లో పెట్టుబడి పెట్టినా అధికారులు బిల్లులు మంజూరు చేయక పోవడంతో కాలయాపన జరుగుతున్నట్లు పలువురు వాపోతున్నారు. జాతీయ రహదారిలో ఏడాదిలో వందల కొద్ది కి.మీ. మేర రోడ్డు అభివృద్ధి చేస్తుండగా రాష్ట్ర రహదారిలో 400 మీటర్ల రోడ్డు పనులు నిర్వహించేందుకు 10 నెలలు కావాలా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇదే రాష్ట్ర రహదారిలో చాగనూరు వద్ద రాష్ట్ర రహదారుల మండలి టోల్గేట్ను నిర్మించి డబ్బులు దండుకుంటోంది. టోల్గేట్లో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు టోల్గేట్ నుంచి కేవలం 10–12 కి.మీ. దూరంలో ఉన్న బసవేశ్వరనగర్ రోడ్డును ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది స్థానికుల వాదన. ఇప్పటికై నా రాష్ట్ర రహదారుల నిగమ అధికారులు, మహానగర పాలికె అధికారులు, పాలక మండలి ఈ రోడ్డు పనులను త్వరగా ముగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 10 నెలలుగా పూర్తి కాని రోడ్డు పనులు దుమ్ము, ధూళితో దుకాణదారుల పాట్లు -
అందని నీరు.. ఎండిన పైరు
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు నీరందక పోవడంతో రైతులు బిక్కముఖం వేసుకున్నారు. మూడు జిల్లాల్లో లక్షలాది హెక్టార్లలో పంట నష్టం సంభవించే అవకాశాలున్నాయి. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదు. అధికారులు ఆయకట్టు చివరి భూములకు నీరందించక పోవడంతో పంటలు వాడుముఖం పట్టాయి. పంట నష్టం వివరాలు: యాదగిరి జిల్లాలో శహాపుర, సురపుర, హుణసిగి, వడగేర, నారాయణపుర, రాయచూరు జిల్లాలోని లింగసూగూరు, దేవదుర్గ, రాయచూరు ప్రాంతాల్లో వరి, మిరప, సజ్జ పంటలు పండిస్తున్నారు. యాదగరి జిల్లాలో దాదాపు రెండు లక్షలు, రాయచూరు జిల్లాలో లక్ష, విజయపుర జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి, సజ్జ, మిరప పంటలను పండిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు రోజుకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే అవకాశం ఉండేది. కాలువకు నీటి సామర్థ్యం, గేజ్ నిర్వహణ చేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యత కరువైంది. ఆల్మట్టి జలాఽశయం నుంచి నారాయణ పుర డ్యాంకు ఆరు టీఎంసీల నీటిని విడుదల చేస్తే రైతులు కష్టాల నుంచి గట్టెక్కుతారు. సుమారు ఆరు లక్షల హెక్టార్లలో పంట నష్టం రాయచూరు, యాదగిరి జిల్లాల్లో రైతులు విలవిల ఏప్రిల్ 20 వరకు నీరు వదలాలి ఎండుతున్న పంటలను చూసైనా అధికారులు ఎన్ఆర్బీసీ చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీటిని విడుదల చేయాలి –కరెమ్మ నాయక్, ఎమ్మెల్యే, దేవదుర్గ ఏప్రిల్ నెలాఖరు వరకు నీరివ్వాలి నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలి – రాజుగౌడ, మాజీ మంత్రి -
చంద్రమౌళేశ్వరుని సన్నిధిలో నటి సారా అలీఖాన్
హుబ్లీ: వాణిజ్య నగరి హుబ్లీ కేవలం వ్యాపార వ్యవహారాలతో చోటా ముంబైగా పేరు గడించింది. అయితే కళ్యాణ చాళుక్యులు నిర్మించిన అమర శిల్ప కళలకు ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో హుబ్లీలోని ఉణకల్ సుప్రసిద్ధ ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ప్రముఖ ఆలయానికి బాలీవుడ్ నటి సారా అలీఖాన్ దర్శించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆలయానికి వచ్చిన సదరు ఫోటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. ఈ స్టోరీ స్క్రీన్ షాట్ను హుబ్లీ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి తన ఫేస్బుక్లో షేర్ చేశారు. నటి సారా అలీఖాన్ చంద్రమౌళేశ్వర ఆలయాన్ని దర్శించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ప్రముఖులు ఆలయాన్ని దర్శించుకుంటున్న నేపథ్యంలో మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ఘన చరిత్రను చాటడమే కాకుండా పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కాగా ఎమ్మెల్యే షేర్ చేసిన ఫోటోకు స్థానికులు ప్రసంశలు వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు వచ్చి వెళ్లారో మాత్రం వివరాలు మాత్రం తెలియరాలేదు. సారా అలీఖాన్ దేశ వ్యాప్తంగా ఆలయాలకు వెళతారు. మేకప్ లేకుండా నిరాడంబరంగా ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. కేదార్నాథ్కు వెళ్లినప్పుడు శివుడి ఆశశీర్వాదం పొందుతూ ఆలయం మెట్లపై కూర్చొని ఉన్న ఫోటోను గతంలో పోస్టు చేశారు. ఆమె తొలి సినిమా కేదార్నాథ్ దర్శనం అనంతరం పుణ్యక్షేత్రాల్లో పర్యటించడం ఆమె అలవాటుగా పెట్టుకొని సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం హర్షణీయమని స్థానికులు అభిప్రాయ పడ్డారు. -
ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతం
సాక్షి,బళ్లారి: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 21 తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీతో బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో ముగిశాయి. పరీక్షలు ముగిశాయని విద్యార్థులు ఆనందంగా పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. అయితే ఎస్ఎస్ఎల్సీ పరీక్ష చివరి రోజున హావేరి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అశ్రునయనాల మధ్య పరీక్ష రాశారు. హావేరి జిల్లా పద్మావతిపుర తాండాకు చెందిన రక్షిత, ధనరాజ్ అనే ఇద్దరు అన్నా చెల్లెళ్లు పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాయడం కలిచివేసింది. వారి తండ్రి హనుమంతప్ప శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించగా 10 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి మరణవార్త నడుమ పరీక్షకు వెళ్లేందుకు నిరాకరించడంతో బంధువులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం నూరిపోసి నచ్చచెప్పి పరీక్షకు పంపించారు. తమను పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి పరీక్ష కేంద్రానికి తీసుకుని వచ్చి, పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లేవారని, ఉన్నఫళంగా గుండెపోటుతో మృతి చెందారని ఆ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్నా చెల్లెళ్లు -
వేతనాలు చెల్లించాలని వినతి
రాయచూరు రూరల్: జెస్కాంలోని 33 కె.వి.విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని జెస్కాం కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం రాయచూరు జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శరణ బసవ మాట్లాడారు. జిల్లాలో గత 20 ఏళ్ల నుంచి జెస్కాంలోని 33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 500 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు లేక వెట్టి చాకిరీ చేస్తున్నారని, వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జెస్కాం అధికారికి వినతిపత్రం సమర్పించారు. పాస్టర్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించండి బళ్లారిటౌన్: ఆంధ్రప్రదేశ్లో గతనెల 24న కోవూరు టోల్ గేట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని బళ్లారి కర్ణాటక క్రిస్టియన్ వెల్ఫేర్ సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రముఖులు కే.ఫృద్వీరాజ్ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ పాస్టర్ హత్య అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. ఇది ముందస్తు పథకంతోనే హత్య చేసినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై ఆంధ్రప్రభుత్వం సమగ్ర తనిఖీ నిర్వహించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు విజయ్కుమార్, పాస్టర్లు విశ్వనాథ్, సర్జన్ సారథి, నీలప్ప స్వామి, సురేష్, కమలమ్మ, రాజు, ఐవన్ పింటో, రాజన్న, గొండయ్య, కృష్ణ, నాసిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. హాస్టళ్లు మంజూరు చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెప్పడం మాని సిరవారకు అన్ని వర్గాలకు చెందిన హాస్టళ్లను మంజూరు చేయాలని దళిత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శుక్రవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బాలస్వామి మాట్లాడారు. సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు రాకపోవడం విచారకరమన్నారు. అధిక శాతం గ్రామీణ విద్యార్థులు ఉన్నందున విద్యా రంగం అభివృద్ధికి సిరవారలో వెనుక బడిన వర్గాల, సాంఘీక సంక్షేమ, మైనార్టీ, అంబేడ్కర్, మొరార్జి, రాణి కిత్తూరు చెన్నమ్మ, కస్తూరిబా గురుకుల హాస్టళ్లను ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. మొబైల్ లొకేషన్పై ఫిర్యాదు ● చాలా రోజుల నుంచి నాపై నిఘా వేశారు ● పోలీస్ అధికారులపై చర్యకు నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ డిమాండ్ రాయచూరు రూరల్ : ఓ ప్రజాప్రతినిధి వాడే మొబైల్ ఫోన్ లొకేషన్ను కబళిస్తున్నట్లు నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ పుట్టమాదయ్యకు ఆయన ఫిర్యాదు చేశారు. తన మొబైల్ ఫోన్ లొకేషన్కు సంబంధించి ప్రతి నెల 70 సార్లు జాబితాను తీస్తున్నారని, ఈ విషయంలో పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ అధికారులే ఈ కుట్రలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కేసులో వీరేష్ ప్రాణాలు కోల్పోయిన అంశంపై చర్చిస్తుండగా తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. శాసన సభ్యుడు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడారు అనే అంశాలను గమనిస్తున్నట్లు తెలిపారు. కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు కోలారు : తాలూకాలోని అరాభికొత్తనూరు గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ముగ్గురు గాయపడ్డారు. కోలారు నుంచి బెంగుళూరు వెళుతున్న కారు అతి వేగంగా మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతల రోడ్డుపై వస్తున్న బైక్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ఉన్న చుంచదేనహళ్లి గ్రామానికి చెందిన నాగేంద్రబాబు, నాగమణి, లలిత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేసినా సకాలంలో రాలేదు. దీంతో క్షతగాత్రులు ప్రమాద స్థలంలోనే నరకయాతనకు గురయ్యారు. కోలారు రూరల్ సీఐ కాంతరాజు, ఎస్ఐ వీ భారతి వచ్చి క్షతగ్రాత్రులను కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. -
మణిమకుటం కన్నడ వర్సిటీ
హొసపేటె: చారిత్రక వారసత్వ పరంపరకు ప్రసిద్ధి చెందిన హంపీలో మణిమకుటం లాంటి కన్నడ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లోట్ అభివర్ణించారు. శుక్రవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయం నవరంగ బయలు ప్రదేశంలో ఏర్పాటు చేసిన కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుమారు ఐదు వేల అరుదైన మాన్యుస్క్రిప్ట్లు, విజువల్ ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు సృష్టించి, ప్రదర్శించిన కళా ఖండాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. గిరిజన అధ్యయన విభాగం సేకరించిన గిరిజనుల చరిత్ర, స్వదేశీ కవితా వారసత్వాన్ని భావి తరాలకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్నడ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, హిందీ, ఆంగ్ల భాషల్లో మరింత విలువైన కన్నడ పుస్తకాలను ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం సమీపంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని, వాటిలో విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆదర్శనీయమన్నారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ హంపీ కన్నడ విశ్వవిద్యాలయం యావత్ కన్నడిగులకు ఆదర్శనీయమన్నారు. ప్రాధ్యాపకులు ఉత్తమ పరిశోధనలపై నిరంతరం దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం విశ్వవిద్యాలయ ప్రతిష్టిత నాడోజ బిరుదులను రాష్ట్ర ప్రసిద్ధ కవి కుంబార వీరభద్రప్పకు, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, ప్రసిద్ధ హిందూస్థానీ గాయకుడు వెంకటేష్ కుమార్కు అందజేసి సత్కరించారు. రాష్ట్ర గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లోట్ అభివర్ణన ఘనంగా హంపీ కన్నడ వర్సిటీ 33వ స్నాతకోత్సవం -
భక్తిభావంతో జీవితం ధన్యం
రాయచూరు రూరల్: మనిషి భక్తిభావం పెంపొందించుకున్నప్పుడే జీవితం ధన్యం అవుతుందని ఎలె బిచ్చాలి మఠాధిపతి వీరభద్ర శివాచార్య పేర్కొన్నారు. సిరవార తాలూకాలోని అత్తనూరు సోమవారపేట హిరేమఠ్ రాచోటి వీర శివాచార్యుల 21వ పుణ్యారాధన ఉత్సవాల్లో భాగంగా సామూహిక వివాహాల్లో పాల్గొన్న 11 జంటలను ఆశీర్వదించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు కర్బూజ పండ్లను దానం చేశారు. కార్యక్రమంలో గబ్బూరు బృహన్మఠ బూది బసవేశ్వర శివాచార్య, మహాలింగ, శాంతమల్ల శివాచార్య, చెన్న బసవ శివాచార్య, మహాంత శివాచార్య, వీర సంగమేష్ శివాచార్య స్వామీజీ, మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మహంతేష్ పాటిల్, సూగప్ప తదితరులున్నారు. -
బస్సు పల్టీ.. 50 మందికి గాయాలు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన తుమకురు జిల్లా పావగడ సమీపంలోని శివరామ గ్రామంలో జరిగింది. శుక్రవారం వేకువజామున 4.30 గంటల సమయంలో 63 మంది ప్రయాణికులతో పావగడ నుంచి బెంగళూరు బయల్దేరిన బస్సు శివరామ గ్రామం వద్దకు రాగానే అతి వేగం వల్ల అదపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో ప్రయాణికులు బస్సు బయటకు చెల్లా చెదురుగా విసిరివేయబడ్డారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. అయితే 50 మందికి స్వల్పగాయాలు కాగా పావగడ, మడకశిర ఆస్పత్రులకు తరలించారు. సీఎం ఇంటి ముందు బైక్ వీలింగ్ కృష్ణరాజపురం: ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం ముందు ఓ వ్యక్తి బైక్ వీలింగ్ చేస్తుండగా హైగ్రౌండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీ రాత్రి సదరు బైకిస్టు ముఖ్యమంత్రి నివాసం ముందు నుంచి బీడీఏ రోడ్డు వరకు వీలింగ్ చేసుకుంటూ వెళ్లాడు. బైకు నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉసురు తీసిన అనారోగ్యం ● ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య తుమకూరు: అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని నిట్టూరు సమీపంలోని ఆదళగెరె గ్రామంలో జరిగింది. చేళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఆదళగెరె గ్రామంలో మహాదేవయ్య, విజయలక్ష్మి(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చూడామణి(23), నరసింహమూర్తి(14) అనే సంతానం ఉంది. విజయలక్ష్మి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. తాను అనారోగ్యంతో మృతి చెందితే తన ఇద్దరు పిల్లలలను ఎవరు పెంచుతారని ఇటీవల బాధపడింది. ఈక్రమంలో భర్త ఇంటిలో లేని సమయంలో గురువారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో తల్లీపిల్లలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖరీదైన ఫోన్.. ప్రాణం తీసింది దొడ్డబళ్లాపురం: ఖరీదైన ఫోన్ ఎందుకు కొన్నావని తండ్రి మందలించడంతో మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెళగావి పట్టణంలో జరిగింది. న్యూ వైభవ్ నగర్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్(24) ఈఎంఐ పెట్టి రూ.70వేలు విలువ చేసే స్మార్ట్ఫోన్ కొనుగోలు చేశాడు. అంత ధర పెట్టి సెల్ఫోన్ ఎందుకు కొనాల్సి వచ్చిందని తండ్రి ప్రశ్నించాడు. మనో వేదనకు గురైన రషీద్ తన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఎంతసేపైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా ఉరివేసుకున్న విషయం తెలిసింది. ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాహ్..హంపీ అద్భుతం ● చరిత్రాత్మక సుగ్రీవ గుహల్లో గవర్నర్, మంత్రుల సందర్శన హొసపేటె: గవర్నర్ ఽథావర్చంద్ గెహ్లాట్ శుక్రవారం హంపీలోని చరిత్రాత్మక సుగ్రీవ గుహలను సందర్శించారు. గవర్నర్ వెంట ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్, విజయనగర జిల్లాధికారి దివాకర్, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు పాల్గొన్నారు. సందర్శన సమయంలో రామాయణంలో ప్రముఖ స్థానాన్ని కలిగిన, కర్ణాటక విలువైన వారసత్వానికి ఒక మైలురాయిగా ఉన్న ఈ ప్రాంత సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. -
మేలుకోటెలో ఘనంగా గరుడ ధ్వజారోహణ
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ చెలువ నారాయణ స్వామివారి వైరముడి బ్రహోత్సవం సందర్భంగా దేవానుదేవతలను వేడుకలకు ఆహ్వానిస్తూ ఇష్టరథం కరుణించాలని ప్రార్థిస్తూ శుక్రవారం గురుడ ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుమారు 9.30 గంటలకు గరుడ దేవుడి పటంలో ప్రతిష్టాపన చేసి ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. 3వ స్థానం నుంచి గరుడ నామ మంత్ర పఠనం నిర్వహించారు. మండ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎన్ చెలువరాయ స్వామి కుమారుడు సచిన్ దంపతులు పాల్గొని ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. అనంతరం గురూజీ మార్గదర్శనంలో చెలువనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. -
సువర్ణరథంలో బాహుబలి ఊరేగింపు
బొమ్మనహళ్లి: శ్రవణబెళగొళలో భగవాన్ బాహుబలి స్వామివారి 1,044వ ప్రతిష్టాపన వేడుకల సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని సువర్ణ రథంపైన ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి స్వస్తిశ్రీ అభినవ చారుకీర్తి భట్టారక స్వామీజీ గురువారం రాత్రి శ్రీఫలం అర్పించి ఊరేగింపు ప్రారంభించారు. రథం మధ్య భాగంలో ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన చేసి చుట్టు అష్టమంగళం ఏర్పాటు చేశారు. సువర్ణ రథం మొత్తం విద్యుత్ కాంతుల వెలుగులు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ముందు భాగంలో నూతనంగా అర్పించిన రజత దండలు గౌరవ రజతం, చామర మాలలతో ఆకట్టుకున్నాయి. కన్యాశ్రమానికి చెందిన బాలికలు, విద్యాపీఠం బాల బ్రహ్మచారులు ధర్మధ్వజాలు పట్టుకొని సాగారు. వివిధ మంగళ వాయిద్యాల మధ్య మంగళూరు చెండె వాయిద్యం, అరసికెరె చిట్టిమేళ సంగీతం, యువతీ యువకుల నృత్యాలు చేయగా శ్రావణ బాలురు భగవాన్ బాహుబలి స్వామికీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు జైన మఠం వద్ద నుంచి భండరి బసది చుట్టు మైసూరు కోనేరు, బెంగళూరు రోడ్డు గుండా ముందుకు సాగింది. అక్కడి నుంచి నేరుగా జైన మఠానికి చేరుకుంది. ఘనంగా 1,044వ ప్రతిష్టాపన దినోత్సవం -
పార్టీ ఆఫీసులో బీజేపీ కార్యకర్త అత్మహత్య
యశవంతపుర: తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ కొడగు జిల్లా సోమవారపేటె తాలూకా గోణిమరూరుకు చెందిన బీజేపీ కార్యకర్త వినయ్ సోమయ్య(35) డెత్నోటు రాసి బెంగళూరు నాగావరలోని పార్టీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. ఇతను ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఒక పోస్టింగ్ అప్లోడ్ చేశాడు. అది అపహస్యంగా ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మడికేరి పోలీసులు వినయ్ సోమయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్ట్ కాకుండా వినయ్ సోమయ్య ముందుస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం రాత్రి వినయ్ సోమయ్య డెత్నోటును సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి శుక్రవారం వేకువజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను మ్యాన్ పవర్ సప్లే సంస్థలో అతను పని చేస్తున్నట్లు తెలిసింది. భార్య, పిల్లలున్నారు. తన మృతికి విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతడి అప్తుడు తన్నీరా మహినా కారణమని వినయ్ డెత్నోటులో వివరించారు. రాజకీయ ద్వేషంతో తన జీవితంతో చెలగాటమాడారని, బెంగళూరులో ఉద్వోగం చేస్తున్న తనపై మడికేరిలో రౌడీషీట్ తెరవాలని ప్రయత్నాలు చేశారంటూ పేర్కొన్నాడు. వినయ్ సోమయ్య మృతిపై డీసీపీతో విచారణ చేయిస్తామని హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. తప్పు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాకు సంబంధం లేదు వినయ్ సోమయ్య ఎవరో తనకు తెలియదని సీఎం న్యాయ సలహాదారుడు, ఎమ్మెల్యే ఏఎస్ పొన్నణ్ణ స్పష్టం చేశారు. తాను ఏవరినీ వేధించలేదన్నారు. బీజేపీ నాయకులకు చేయటానికి పనిలేక నాపై అరోపిణలు చేస్తున్నట్లు అరోపించారు. కాగా వినయ్ ఏవరో తెలియదని, సామాజీక మాధ్యమాలలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసిన పోస్ట్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే అప్తుడు తన్నీరా మహినా తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు బీజేపీ కార్యకర్త వినయ్ డెత్నోటులో పేర్కొన్న కొడగు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నణ్ణ, మంథర్గౌడతో పాటు రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు తన్నీరా మహినాపై బెంగళూరు హెణ్ణూరు పోలీసులకు మృతుడు వినయ్ సోదరుడు జీవన్ సోమయ్య ఫిర్యాదు చేశారు. నాగావరలో ఘటన మృతుడు సోమవారపేటె తాలూకా గోణిమరూరు వాసి విరాజపేట ఎమ్మెల్యే పొన్నణ్ణ, అతని అప్తుడు తన్నీరా కారణమని డెత్నోట్కొడుగుకు మృతదేహం తరలింపు మృతుడు వినయ్ సోమయ్య మృతదేహానికి శుక్రవారం బెంగళూరులో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారపేటె తాలూకా గోణిమరూరులో శనివారం వినయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వినయ్ అత్మహత్యను ఖండిస్తూ కొడగు జిల్లా వ్యాప్తంగా బీజేపీ అందోళననలు చేపట్టింది. -
ఎయిమ్స్కు కేంద్రంపై ఒత్తిడి తెండి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యుల పూర్తి మద్దతు లభించినా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్ కలిసి రాయచూరులో మహాత్మగాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1057వ రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి కొరతతో మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. అశోక్ కుమార్ జైన్, సంతోష్ కుమార్, వినయ్ కుమార్, శాంతనగౌడలున్నారు. -
ప్రజ్వల్ కేసు కొట్టివేతకు నో
యశవంతపుర: జేడీఎస్ నేత, హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశే ఎదురైంది. మహిళపై అత్యాచారం, నగ్న వీడియోల కేసులో అతడు కొన్ని నెలలుగా పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఖైదులో ఉండడం తెలిసిందే. అత్యాచారం కేసును కొట్టివేయాలని ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. గురువారం పిటిషన్పై వాదనలు జరిగాయి. కేసు నుంచి విముక్తి కలిగించడం సాధ్యం కాదంటూ ఈ నెల 9కి వాయిదా వేశారు. ఈ కేసుల్లో గతేడాది మే నెలాఖరులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి విచారణ సాగుతోంది. అర్ధరాత్రి ఘోరం.. యువతిపై అత్యాచారం కృష్ణరాజపురం: యువతిపై ఇద్దరు ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాలు.. బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ సమీపంలో బిహార్కు చెందిన యువతి తన సోదరునితో కలిసి కేఆర్పురం రైల్వేస్టేషన్లో దిగి నడిచి వెళుతుండగా ఇద్దరు ఆటోడ్రైవర్లు నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి సోదరునిపై దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి 1.13 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. యువతి కేకలను విని అక్కడికి చేరుకున్న జనం ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపి నిందితుడు ఆసిఫ్ను, మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వ్యాన్ పల్టీ,13 మంది కూలీలకు గాయాలు మైసూరు: వేగంగా వెళుతున్న గూడ్స్ వ్యాన్ పల్టీలు కొట్టిన ప్రమాదంలో 13 మంది కూలీలు గాయపడ్డారు. జిల్లాలోని హుణసూరు తాలూకాలోని సంజీవనగర వద్ద చోటుచేసుకుంది. హుణసూరుకు చెందిన కూలీలు పొలంలో పనిచేసుకుని గూడ్స్ వ్యాన్లో వస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో చిక్కన్న, పార్థ, కుముద, మంజుల, పార్వతి, చిన్న ముత్తమ్మ, తరికల్ వళ్ళియమ్మ, రాణి, మహదేవమ్మ, మంగళ తదితరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఐదుమందిని హుణసూరు కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో చేర్చారు. మిగతావారు మైసూరు కెఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోకి దూరిన చిరుత● గొళ్లెం వేసిన దంపతులు ● జిగణిలో కలకలం దొడ్డబళ్లాపురం: ఓ చిరుతపులి ఏకంగా ఇంట్లోకి దూరి హల్చల్ చేసింది. ఈ సంఘట బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 8 గంటలప్పుడు వెంకటేశ్ దంపతులు వ్యక్తి ఇంట్లో ఉండగా ఓ చిరుత ప్రవేశించింది. అయితే ఏ మాత్రం బెదరని దంపతులు మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపులు గడియ పెట్టేశారు. దీంతో చిరుత లోపల బందీ అయ్యింది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకున్నారు. చిరుత ఇంట్లోకి దూరిందని తెలిసి వందలాది మంది జనం గుమిగూడి ఏం జరుగుతుందా? అని చూడసాగారు. అటవీ సిబ్బంది సుమారు 6గంటల పాటు శ్రమించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. -
రోడ్లు లేని ఊళ్లు, రోగమొస్తే దిగులు
మైసూరు: దేశం ఇప్పటికే అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తోంది. డిజిటల్ రంగంలో రాణిస్తోంది, కానీ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇంకా ఎలాంటి సౌకర్యాలు లేకుండా బతుకీడుస్తున్నారు. దీనికి ఉదాహరణే చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని తుళసికెరె గ్రామం. ఈ గ్రామానికి సరైన రోడ్డు నిర్మాణ వ్యవస్థ లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కట్టెకు మూటలో కట్టుకుని సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఏమైందంటే... గ్రామ నివాసి పుట్ట అనే వ్యక్తికి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. గ్రామానికి రోడ్డు లేనందున ఆటో, అంబులెన్సు రాలేవు. దీంతో బంధువుల సహాయంతో డోలిలో మలే మహదేశ్వర బెట్టకు తీసుకొచ్చి అక్కడి నుంచి దగ్గరలో ఉండే తమిళనాడు కొళత్తూరు ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. బెట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని చాలా గ్రామాలకు సరైన రోడ్డు వ్యవస్థ, మౌలిక వసతులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా కూడా మలే మహదేశ్వరబెట్ట , తుళసికెరె గ్రామం మధ్యలో ధర్నా చేశారు. డోలిలో 4 కిలోమీటర్లు మోసుకెళ్లారు చామరాజనగర జిల్లాలో దైన్యం -
6న శ్రీరామ నవమి ఉత్సవాలు
హుబ్లీ: ధార్వాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ పురుషోత్తమ సభాభవనంలో ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు సంస్కార భారతి సారథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఈ ప్రచార సభ కార్యనిర్వాహక అధ్యక్షుడు వీరేష్ అంచటగేరి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. సంస్కార భారతీ ఉత్తర ప్రాంత ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశిధర్ నరేంద్ర, రామాయణం ఆదర్శాల గురించి ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. అధ్యక్షురాలు సౌభాగ్య కులకర్ణి, మారుతీ ఉటగి, ప్రసాద్ మడివాళర్, భార్గవి గుడి కులకర్ణి, శిల్ప నవలిమఠ తదితరులు పాల్గొననున్నారు. సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారని, పలువురు ప్రముఖులు వీరణ్ణ పత్తార, డాక్టర్ శ్రీధర్ కులకర్ణి, హారతి దేవశిఖామణి తదితరులు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి రాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా ఆచరించారు. గురువారం మావినకెరె చెరువు వద్ద ఛత్రపతి శివాజీ చిత్రపటానికి లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు బంగి మునిరెడ్డి పూలమాల వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు శివాజీ జయంతిని ఆచరించక పోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. -
రేణుకా యల్లమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపురలో గ్రామ దేవత శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ బ్రహ్మ రథోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించారు. రాజేశ్వర శివాచార్య స్వామి, తమిళనాడు శివానందశివాచార్య స్వామి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. ప్రముఖ వీధుల్లో కోలాహలం మధ్య తేరు ఊరేగింది. వివిధ జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు అలరించాయి. సర్జాపురలో కోలాహలం -
సవదత్తి పచ్చ గాజులు భళా.!
సాక్షి, బళ్లారి: మహిళలకు అందులోనూ ముత్తైదు మహిళలకు గాజులు అంటే ఎంతో భక్తి, ఇష్టంతో వేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. తమ అలంకరణలో భాగంగా ప్రతి మహిళ రంగు రంగుల గాజులు వేసుకుని వారు ధరించిన చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్ గాజులు వేసుకుని మురిసిపోతుంటారు. కూలీ పనులు చేసుకుని జీవించే మహిళ నుంచి అపర కుబేరుల కుటుంబాలకు చెందిన మహిళలకు అందరి చేతుల్లో గాజుల సవ్వడి ఉంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి గాజులు ముఖ్యంగా సవదత్తి యల్లమ్మ ఆలయం వద్ద ధరిస్తే మహిళలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని, ముత్తైదువుగా ఉంటామని నమ్మకంతో మహిళలు సవదత్తికి వచ్చి గాజులు వేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. రంగు రంగుల గాజుల విక్రయాలు బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ గుడ్డలో వెలసిన రేణుక యల్లమ్మ దేవస్థానం ఆలయ పరిసరాల్లో వైవిధ్యమయమైన రంగు రంగుల గాజుల విక్రయాలు విశేషంగా కనిపిస్తాయి. గతంలో గాజుల కట్ట అని పిలుచుకునే స్థలం ప్రస్తుతం గాజులపేటగా వర్ధిల్లుతోంది. వందలాది కుటుంబాలు దశాబ్దాలుగా గాజులు విక్రయమే జీవనాధార పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్థలం తగినంత లేకపోవడంతో గుడ్డ పరిసరాల్లో ఎటు చూసినా గాజుల గలగలలు మహిళల సందడితో అలరారుతోంది. పౌర్ణమి, మంగళ, శుక్రవారాల్లో అన్ని అంగళ్లలో విద్యుత్ వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా అలంకరణలతో కనిపిస్తాయి. గాజులను ఒక కుప్పగా అందంగా పేర్చడమే ఇక్కడ పెద్ద ముచ్చటగా చెప్పుకుంటారు. ఆలయ పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో వ్యాపారులు ఏడాదంతా గాజులు విక్రయిస్తారు. మిగిలిన వారు జాతర వేళలో మాత్రమే వచ్చి వ్యాపారాలు చేసుకుని తిరిగి వెళ్లిపోతారు. గాజులు ఎక్కడ నుంచి వస్తాయంటే.. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ నగరంలో ఓ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ గాజులు సవదత్తి యల్లమ్మ ఆలయ పరిసరాల్లో సందడి చేస్తాయి. అక్కడ నుంచి సవదత్తి, బైలహొంగల, బాగలకోటె జిల్లా జమఖండికి వచ్చే గాజులను వ్యాపారుల నుంచి యల్లమ్మ గుడ్డ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. 80 శాతానికి పైగా పచ్చ గాజులనే ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడ పచ్చ గాజులకే భారీ డిమాండ్. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి, నవరాత్రులు శుభ ఘడియల్లో అత్యధికంగా గాజుల విక్రయం జరుగుతాయని యల్లమ్మ ఆలయ ముఖ్యులు తెలిపారు. కొంగు బంగారంగా రేణుకా యల్లమ్మ గాజుల సవ్వడిలో మురుస్తున్న భక్తులు -
కారు, బస్సు ఢీ.. నలుగురు బలి
మండ్య: బంధువు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళుతున్న కుటుంబం కూడా విషాదంలో చిక్కుకుంది. కారును బస్సు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మృతులు రెండు జంటలు. ఈ సంఘటన గురువారం బెంగళూరు– మైసూరు ఎక్స్ప్రెస్ హై వేలో మండ్య తాలూకాలోని తూబినకెరె వద్ద చోటు చేసుకుంది. మృతులు బెంగళూరులోని జేపీ నగరకు చెందిన బెస్కాం జూనియర్ ఇంజినీర్ సత్యానందరాజే అరస్ (51), భార్య నిశ్చిత (45), రిటైర్డు ఇంజినీర్ చంద్రరాజె అరసు (62) ఇతని భార్య సువేదిని రాణి (50). సర్వీసు రోడ్డు మలుపులో... సత్యానంద రాజె అరసు మేనమామ పిరియా పట్టణంలో చనిపోయాడు, కడసారి చూసి రావాలని కారులో బయలుదేరారు. చంద్రరాజే అరసు కూడా వారికి సమీప బంధువు అవుతారు. చంద్రరాజె అరసు కారు నడుపుతున్నారు. ఘటనాస్థలి వద్ద ఎక్స్ప్రెస్ హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో బెంగళూరు నుంచి మైసూరుకు వెళుతున్న ఆర్టీసీ ఐరావత బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. నలుగురూ కారులో తీవ్రగాయాలతో చిక్కుకున్నారు. క్షణాల్లోనే ముగ్గురు చనిపోగా, స్థానికులు నిశ్చితను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఐజీ బోరలింగయ్య, ఎస్పీ మల్లికార్జున వచ్చి పరిశీలించారు. కారు బస్సులోకి ఇరుక్కుపోవడంతో క్రేన్తో లాగి బయటకు తీశారు. మృతదేహాలను మండ్య మిమ్స్ మార్చురీకి తరలించారు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. మండ్య వద్ద ఎక్స్ప్రెస్ వేలో దుర్ఘటన మృతులు బెస్కాం ఇంజినీరు, మాజీ ఇంజినీరు దంపతులు అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోరం -
రాజధానిని ముంచెత్తిన భారీ వాన
బనశంకరి: రాజధాని బెంగళూరును వేసవి వర్షాలు ముంచెత్తాయి. గురువారం మధ్యాహ్నం గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం రాకతో వేసవి వేడి కాస్త తగ్గి వాతావరణం చల్లబడింది. గత రెండురోజులుగా నగరంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం పడలేదు. గురువారం ఉదయం నుంచి మేఘావృతమైంది, మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం ఆరంభమైంది. ఈ ప్రాంతాలలో అధికం హెబ్బాళ, ఆర్టీ.నగర, యలహంక, సదాశివనగర, శివానంద సర్కిల్ తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగర కేంద్రభాగాలైన మెజస్టిక్, ఎంజీ.రోడ్డు, కబ్బన్పార్కు, బసవనగుడి, శ్రీనగర, మైసూరురోడ్డు, బనశంకరి, జేపీ.నగర, పుట్టేనహళ్లి, హలసూరు. హెచ్ఏఎల్ విమానాశ్రయం, యశవంతపుర, పీణ్యా, తుమకూరు రోడ్డు, విజయనగర, రాజాజీనగర తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపై చిక్కుకుపోయారు. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాలపై కూలిన చెట్టు రాజాజీనగరలో గాలీ వానకు పెద్ద చెట్టు కూలి స్కార్పియో, స్విఫ్ట్ కారుతో పాటు పక్కన నిలిపిన బైక్లపై పడడంతో దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాలికె, కేఈబీ సిబ్బంది చేరుకుని చెట్టును తొలగించారు. ఈజీపుర మెయిన్రోడ్డులో కట్టడంలోని గ్రౌండ్ ఫ్లోర్లోకి నీరు చేరింది. లోపల ఉన్న కార్లు, బైకులు పాక్షికంగా మునిగిపోయాయి. బీటీఎం లేఔట్లో రోడ్లు జలమయం అయ్యాయి. లులు మాల్ ఎదురుగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బెంగళూరు నుంచి తుమకూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ బస్కు యాక్సిల్ కట్ కావడంతో వర్షంలో రోడ్డుపై నిలిచిపోయింది. ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి పోలీసులు, స్థానికులు బస్ను ముందుకు తోసి రోడ్డు పక్కకు చేర్చారు. వర్షంలో వాహనదారులు, ప్రయాణికులు సతమతమయ్యారు. ఎండల నుంచి ఉపశమనం రాష్ట్రంలో మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిన తరుణంలో నైరుతి రుతుపవన వర్షాలకు ముందే బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలలో వానలు పడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కరావళి, దక్షిణ ఒళనాడులోని కొన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు, మైసూరు, బెంగళూరు, హాసన, కొడగు, చామరాజనగర తో పాటు అనేకచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. హంపీలో విజయ విఠల ఆలయం సౌందర్యంరాతి రథం, ఇతర స్మారకాల ప్రతిబింబాలువర్షంలో హంపీ అందం రాయల రాజధాని హంపీలో జోరువాన కురిసింది. చారిత్రక శిల్ప కళా కట్టడాలు వాననీటిలో సుందర ప్రతిబింబాలయ్యాయి. పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. కోలారు, బెళగావి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసి ఎండ నుంచి ఉపశమనం ఇచ్చింది. ఆకస్మిక వర్షంతో రోడ్లు జలమయం పలుచోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తం ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం -
పాస్టర్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్వెస్లీ వెల్లడించారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ వెళుతుండగా కోవ్వూరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందన్నారు. పాస్టర్ వాహనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకపోయినా పాస్టర్ తలకు బలంగా దెబ్బలు తగిలాయన్నారు. తలకు ఉన్న హెల్మెట్కు ఏమీ కాలేదన్నారు. పాస్టర్ను రాజకీయ కక్షతో హత్య చేశారని, అతని మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానంద ద్వారా వినతిపత్రం సమర్పించారు. -
జిల్లాను తట్టు రహితంగా మారుద్దాం
హొసపేటె: ఈ ఏడాది చివరి కల్లా జిల్లాను మీజిల్స్ రుబెల్లా(తట్టు) రహితంగా మార్చడానికి ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, వైద్యులు సమన్వయంతో పని చేయాలని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ఆడిటోరియంలో జరిగిన తట్టు నిర్మూలన కార్యక్రమం అంతర్ విభాగ సమన్వయ కమిటీ సమావేశం, మాతా శిశు మరణాలపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులు మీజిల్స్ రుబెల్లా రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాను తట్టు రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తల సహకారంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆయుష్ శాఖ గర్భిణులు, పాలిచ్చే మహిళలకు పరీక్ష నిర్వహించాలన్నారు. సురక్షితమైన ప్రసవం, పోషకాహారంపై కౌన్సెలింగ్ అందించాలన్నారు. ఆయుష్ కేంద్రాల్లో గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేసి టీకాలు వేయాలన్నారు. గర్భిణులకు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వంఇటీవల కిల్కారి యాప్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. యాప్ ద్వారా గర్భిణుల పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రతి గర్భిణి సంరక్షణ కోసం సకాలంలో సలహాలతో పాటు వైద్య చికిత్సలు, ఫాలోఅప్లపై ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి ఇది కృషి చేస్తుందన్నారు. జిల్లా వైద్యాధికారి శంకర్నాయక్, ఆర్సీహెచ్ అధికారి జంబయ్యనాయక్, వైద్యులు హరిప్రసాద్, భాస్కర్, రాధిక, సతీష్చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులతో సమాజంలో శాంతిభద్రతలు
హొసపేటె: సమాజంలో శాంతి భద్రతలు నెలకొన్నాయంటే అది పోలీసుల వల్లే సాధ్యమని, ఇది పోలీసుల సేవ, ధైర్యం, అంకితభావానికి ప్రతీక అని విజయనగర జిల్లా ఎస్పీ బీఎల్ శ్రీహరిబాబు పేర్కొన్నారు. ఆయన నగరంలోని జిల్లా సాయుధ పోలీసు మైదానంలో పోలీసు జెండా దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం పోలీసు జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. పోలీసు జెండా పంపిణీ అనేక సంవత్సరాలుగా శాఖలో సేవలందించి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవ, త్యాగాలను గుర్తు చేస్తుందన్నారు. 1984కి ముందు నవంబర్ 2వ తేదీని పోలీసు సంక్షేమ దినోత్సవంగా, ఏప్రిల్ 2వ తేదీని పోలీసు జెండా దినోత్సవంగా జరుపుకునేవారన్నారు. 1984 నుంచి ఈ జెండా దినోత్సవం, సంక్షేమ దినోత్సవాన్ని కలిపి ఏప్రిల్ 2న కర్ణాటక రాష్ట్ర పోలీసు జెండా, పోలీసు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2024–25వ సంవత్సరానికి పోలీసు సంక్షేమ నిధి నుంచి పోలీసు అధికారులు, సిబ్బందికి ఆర్థిక సహాయంగా మొత్తం రూ.5,56,200 అందించామన్నారు. ఇందులో పోలీసు పిల్లల విద్య కోసం రూ.3,48,000, వారి కుటుంబాలకు కళ్లజోళ్ల కొనుగోలు కోసం రూ.33,200, మరణానంతర సహాయంగా రూ.45 వేలు, వివిధ హోదాల్లో పదవీ విరమణ చేసిన 26 మంది పోలీసు అధికారులకు సన్మానం కోసం రూ.1.30 లక్షలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన 35 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్య భాగ్య కింద చికిత్స పొందారని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు వెల్లడి -
రంగస్థల కళాకారులకు సన్మానం
బళ్లారిటౌన్: నాడోజ బెళగల్ ఈరణ్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించారు. సంగనకల్లు గ్రామంలోని ఆదర్శ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బెళగల్ ఈరణ్ణ కుమారుడు మల్లికార్జున నేతృత్వంలో కళాకారుల బృందం నగరంలోని సీనియర్ కళాకారిణులు సుజాతమ్మ, కణేకల్ రంగమ్మ, కళాకారుడు చెన్నబసప్పల ఇళ్లకు వెళ్లి సన్మానించారు. సీనియర్ కళాకారులు హెచ్ఎన్ చంద్రశేఖర్, మోకా రామేశ్వర్, కే.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకారంహొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకా నూతన ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటె గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు బీఈఓగా ఉన్న చిన్నబసప్ప రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి బీఈఓగా శేఖర్ హొరపేటెను నియమిస్తూ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. నూతన అధికారిని ఉపాధ్యాయ సంఘం నేతలు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు సుధాదేవి, కార్యదర్శి మల్లయ్య, వరప్రసాద్, విజయకుమారి, కుబేరాచారి, మార్గదప్ప, ప్రకాష్, హేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగ తెగి పడి ఉపాధ్యాయిని మృతిహొసపేటె: స్కూల్కి వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి మీద పడటంతో పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని జంగమర కల్గుడిలో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి ఆమైపె పడటంతో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన ఉపాధ్యాయురాలిని జంగమర కల్గుడి గ్రామం హొసకేర రోడ్డుకు చెందిన హరిత శ్రీనివాస్(26)గా గుర్తించారు. ఆమె విద్యానగర్లోని శ్రీగొట్టిపాటి వెంకటరత్నం మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గలో బాబూ జగ్జీవన్ రాం భవనంలో మౌలిక సౌకర్యాలకు రూ.52 లక్షలతో రక్షణ గోడ, మరుగుదొడ్డి, స్నానపు గదుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. జగీజవన్రాం భవన్ను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ఈ సందర్భంగా జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, అజీజ్, అస్లాంపాషా, సత్యనాథ్లున్నారు. పేదల స్థలం కబ్జాపై చర్యలేవీ? బళ్లారి అర్బన్: బళ్లారి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 32వ వార్డు బండిహట్టిలో పురాతన దళితుల బావిని, చుట్టు పక్కల స్థలాన్ని అక్రమంగా కబ్జాకు పాల్పడిన వారి నుంచి ఆ స్థలాన్ని రక్షించాలని కోరుతూ బండిహట్టి నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పీ.శేఖర్ నేతృత్వంలో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. ఆ సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ వాల్మీకి, మహిళా జిల్లాధ్యక్షురాలు లక్ష్మిదేవి, పద్మావతి, ఆ వార్డు శాఖ పదాధికారులు పేదలకు అండగా పాదయాత్రతో అదనపు జిల్లాధికారికి వినతిపత్రం అందజేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సంఘం ప్రముఖురాలు రోహిణి, ఈరమ్మ, మల్లికార్జున, రమేష్, బసవరాజ్, నీలప్ప, విరుపాక్షిరెడ్డి, గోవింద, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇంటి ముట్టడి భగ్నం
శివాజీనగర: నిత్యావసరాల ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బెంగళూరు ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేసిన బీజేపీ నాయకులు గురువారం సీఎం సిద్దరామయ్య అధికార నివాసం కావేరికి ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోగా గందరగోళం చెలరేగింది. మధ్యాహ్నం ధర్నాలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కావేరి ఇంటికి బయల్దేరారు. అక్కడే పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను తోసి ముఖ్యమంత్రి ఇంటి వైపు వెళ్లబోయారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు వ్యాన్లోకి ఎక్కించారు. గుణపాఠం తప్పదు అంతకుముందు విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ అహోరాత్రి ధర్నా కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు. ఈ ప్రభుత్వానికి పేదలపై శ్రద్ధ లేదని, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్, బస్సు, డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు. 40 శాతం కమీషన్ల గురించి కాంగ్రెస్ చేసిన ప్రచారానికి సాక్ష్యాలు లేవని రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని పలువురు నాయకులు ఆస్తులను కబ్జా చేశారని, అందుకే వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాగా పోలీసులు సీనియర్ నాయకులను వాహనాల్లో తరలించి తరువాత విడుదల చేశారు. బీజేపీ నేతల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు -
రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభఽుత్వం బీఎస్ఎన్ఎల్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సవరించిన పెన్షన్ను పరిశీలించాలని కోరుతూ పదవీ విరమణ చేసిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గురువారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు బసవరాజ్ మాట్లాడారు. ప్రభుత్వం 1972 నుంచి అమలులో ఉన్న పెన్షన్ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో కర్లి, ఆదెప్ప, సోమనరెడ్డి, సిద్దప్ప, గురురాజరావ్, ఉక్కలి, లాలప్పలున్నారు. రిమ్స్లో అన్ని సౌకర్యాలు సిద్ధం రాయచూరు రూరల్ : రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేసినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం వైద్యులతో మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తారన్నారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య పద్ధతులను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా 20 పడకలను పెంచాలన్నారు. రోగులకు ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. రిమ్స్ వైద్యాధికారి డాక్టర్ రమేష్, విజయ శంకర్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఆర్సీహెచ్ అధికారిణి నందిత, భాస్కర్, టీహెచ్ఓ ప్రజ్వల్ కుమార్లున్నారు. సమస్యలు తీర్చాలని ధర్నారాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా గోర్కకల్ పంచాయతీ పరిధిలోని గవిగట్టలో నెలకొన్న సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని రైతు సంఘం జిల్లా సంచాలకురాలు అనిత ఆరోపించారు. బుధవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గ్రామంలో గత 15 రోజుల నుంచి తాగునీరు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
వణికించిన భారీ వర్షం
హొసపేటె: నగరంలో బుధవారం అర్ధ రాత్రి నుంచి గురువారం తెల్లవారు జాము వరకు కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా నగరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి అర్ధ రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ముందు ఉన్న ఇంటి ముంగిట వర్షం నీరు నిలబడి జలమయంగా మారింది. రాజీవ్ నగర్తో పాటు ఆర్టీఓ కార్యాలయం రోడ్లలో మోకాలి లోతు వరకు వర్షం నీరు నిలబడడంతో పాదచారులకు, వాహనదారులు, విద్యార్థులకు కష్టకరంగా మారింది. టీబీ డ్యాం ప్రధాన రహదారిలో చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం విరిగి నేలవాలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది వారాల నుంచి వేసవి ఎండలతో సతమతమవుతున్న నగరవాసులు వర్షంతో చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదించారు. తడిచి ముద్దయిన హొసపేటె నగరం విద్యుత్ సరఫరా నిలిచి జనం పాట్లు -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసింది.. అందుకేనంటూ..చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు. -
దేవర దాసిమయ్య ఆదర్శాలు అనుసరణీయం
బళ్లారిటౌన్: ఆధ్యాత్మిక వచనకారులు, చేనేత సంతతి దేవర దాసిమయ్య ఆధ్యాత్మిక, మానవీయ గుణ గణాలు, ఆదర్శాలను అందరూ అలవరుచుకోవాలని జిల్లా శరణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కేబీ.సిద్దలింగప్ప పేర్కొన్నారు. బుధవారం కన్నడ సంస్కృతి శాఖ సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ కాలంలో సమాజ అభివృద్ధి కోసం సీ్త్ర సమానతపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించిన వారిలో దేవర దాసిమయ్య కూడా ఒకరన్నారు. సమాజంలో మూఢనమ్మకాలను కఠినంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆయన యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జన్మించారన్నారు. చేనేత వృత్తితో శివుడికి నేసిన దుస్తులను అలంకరించి అపూర్వ భక్తుడయ్యారన్నారు. జిల్లా చేనేత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు సీ.దేవానంద మాట్లాడుతూ చేనేత వర్గాలకు మౌలిక సదుపాయాలు మరింతగా కల్పించాలని, విద్యా రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దేవర దాసిమయ్య చిత్రపటానికి పుష్పార్చన సమర్పించారు. కన్నడ సంస్కృతి ఏడీ నాగరాజు, సమాజ నేతలు శీలా బ్రహ్మయ్య, అవార్ మంజునాథ, రాజు, మంజుల, చంద్రశేఖర తదితరులు పాల్గొన్నారు. సరళంగా దేవర దాసిమయ్య జయంతి రాయచూరు రూరల్ : దేవర దాసిమయ్య తత్వాలు, ఆదర్శాలను అనుసరించాలని అదనపు జిల్లాధికారి శివానంద పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన దేవర దాసిమయ్య జయంతిలో చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. తన వచనాల ద్వారా జీవన మౌల్యాలను గురించి దాసిమయ్య వివరించారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, తహసీల్దార్ సురేష్వర్మ, సురేంద్రబాబులున్నారు. -
ఇకపై హావేరిలో వందే భారత్కు స్టాపింగ్
సాక్షి,బళ్లారి: ఏడాది క్రితం బెంగళూరు–ధార్వాడ మధ్య ప్రారంభించిన వందే భారత్ రైలుకు ఇక నుంచి హావేరిలో స్టాపింగ్ కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యుడు బసవరాజ్ బొమ్మై కృషితో ఈ రైలు సేవలు వినియోగంలోకి రానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఽబెంగళూరు నుంచి ధార్వాడ వరకు గతంలో చేరుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వందే భారత్ రైలు ఏర్పాటు చేయడంతో ఐదు గంటల్లో ప్రయాణం సాగనుండటంతో ఎంతో అనుకూలంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వందే భారత్ రైలు సేవలను కర్ణాటకలో పలు జిల్లాలకు విస్తరించేందుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. హావేరి ఎంపీ కూడా హావేరికి వందే భారత్ రైలు సేవలను కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరడంతో ఆయన సూచనతో కేంద్ర రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ వాణిజ్య కేంద్రం హావేరికి వ్యాపారులు, రైతులు వచ్చి వెళ్లేందుకు ఎంతో ఇబ్బందులు పడేవారు. ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా వందే భారత్ రైలు సేవలు అందించడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వ్యాపార కేంద్రం బ్యాడిగి జిల్లా వాసుల్లో పెల్లుబికిన హర్షాతిరేకాలు -
రేపు వృద్ధి మహిళా దినోత్సవం
హుబ్లీ: కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా పారిశ్రామికవేత్తల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధి 2025 మహిళా దినోత్సవం, మహిళ సాధకులకు సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడి జేసీ నగర్లోని కేసీసీఐ సభాభవనంలో ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ మహిళా శాఖ చైర్పర్సన్ నిషా మెహత తెలిపారు. ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు. సృజనశీలత నినాదంతో తర్వాత తరాల మహిళా పారిశ్రామికవేత్తలను, నాయకురాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెస్కాం ఎండీ ఎంఎల్ వైశాలి, వాయువ్య కర్ణాటక ఆర్టీసీ ఎండీ ఎం.ప్రియాంకతో పాటు మహిళా సాధకురాలు బోయింగ్ 777 పైలట్ కెప్టెన్ జోయ్ అగర్వాల్, మిస్ ఇండియా 2013, కళాకారిణి సిమ్రాన్ అహుజ పాల్గొంటారన్నారు. వివిధ రంగాలలో సేవలు అందించిన సాధకురాలైన గిరిజక్క ధర్మారెడ్డి, జ్యోతి హిరేమఠ, డాక్టర్ కేఆర్ రాజేశ్వరిలను సన్మానిస్తామన్నారు. ప్రముఖులు ఎస్పీ సంశిమఠ, సందీప్, మహేంద్ర సింగి, పల్లకి మాలవి తదితరులు పాల్గొన్నారు. బస్సులో మహిళ ఆభరణాల చోరీహుబ్లీ: ఓ మహిళ బస్సులో ప్రయాణం చేస్తుండగా రూ.లక్షలాది విలువ చేసే బంగారు ఆభరణాలను ఎవరో చోరీ చేసినట్లు విద్యా నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హుబ్లీ నుంచి శంసికి వెళ్లడానికి హోసూరు బస్టాండ్ నుంచి ఆ మహిళ బస్సు ఎక్కింది. దీంతో ఆమె వద్ద ఉన్న మంగళసూత్రం, ఇతర ఆభరణాలు చోరికి గురయ్యాయి. అక్రమ రీఫిల్లింగ్.. సిలిండర్లు స్వాధీనం మరో ఘటనలో ధార్వాడ తాలూకా జోగెళ్లపురలో అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేస్తున్న గోడౌన్పై తహసీల్దార్, అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 180 నిండు సిలిండర్లు, 461 ఖాళీ సిలిండర్లు, రెండు నాజిల్స్, రెండు రీఫిల్లింగ్ యంత్రాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై ధార్వాడ తహసీల్దార్ దొడ్డప్ప పూజార కేసు నమోదు చేస్తానని తెలిపారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి 9 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, సాంఘీక న్యాయం కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సంచాలకుడు రవీంద్ర నాథ్ పట్టి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ మాదిగ సముదాయాల సమీక్షకు సహకరించాలన్నారు. 45 రోజుల పాటు ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు కులం జాబితాలో తప్పని సరిగా కులం పేరును రాయించాలన్నారు. -
రేపు హంపీ కన్నడ వర్సిటీ స్నాతకోత్సవం
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 4న విశ్వవిద్యాలయ ఆవరణలోని నవరంగ బయలు ప్రదేశంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ పరశివమూర్తి తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ మంటప సభాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవం సందర్భంగా నాడోజ బిరుదులను ముగ్గురు ప్రముఖులకు అందజేస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన ప్రముఖ రచయిత, ఆలోచనాపరుడు కుంబార వీరభద్రప్ప, ధార్వాడకు చెందిన ప్రముఖ హిందూస్థానీ గాయకుడు పద్మశ్రీ ఎం.వెంకటేష్ కుమార్కు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ చేతులు మీదుగా నాడోజ బిరుదులను ప్రదానం చేస్తారని తెలిపారు. అదే విధంగా పీహెచ్డీ, డీ.లిట్లతో పాటు వివిధ పట్టాలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సుధాకర్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విజయ్ పూణచ్చ తంబండ తదితరులు పాల్గొన్నారు. -
లాకప్డెత్పై న్యాయమూర్తి విచారణ
రాయచూరు రూరల్: నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో లాకప్డెత్ కేసులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్రామప్ప విచారణ చేపట్టారు. బుధవారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. రిమ్స్ మార్చురీని సందర్శించి అధికారులతో, మృతుడు వీరేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, శవ పరీక్షకు సంబంధించి వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీరేష్ను చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలనకు వచ్చారు. జడ్జి వెంట తాలూకా ఆరోగ్య అధికారి ప్రజ్వల్ కుమార్, తహసీల్దార్ సురేష్ వర్మలున్నారు. ఇద్దరు అధికారుల సస్పెండ్ నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్డెత్ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని బళ్లారి రేంజ్ ఐజీపీ లోకేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకా నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్లను సస్పెండ్ చేస్తూ వారిద్దరిపై ఎస్టీ క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. అధికారులు వీరేష్ అనే యువకుడిని చితక బాదడంతో మరణించినట్లు ఫిర్యాదు అందడంతో కేసును సీఐడీకి అప్పగించారన్నారు. ప్రజలు సైబర్ నేరాల విషయంలో డిజిటల్ అరెస్ట్లకు భయపడరాదన్నారు. సైబర్ నేరాల విషయంలో బళ్లారి రేంజ్ పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో సైబర్ నేరాల కట్టడి కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాయచూరులో డీఎస్పీ సత్యనారాయణ సైబర్ నేరాలను చూసుకుంటున్నారన్నారు. జింకలను వేటాడి ఊరేగించిన వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య ఉన్నారు. ఇద్దరు అధికారులపై వేటు నగరంలోని పశ్చిమ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్డెత్ కేసులో బాధ్యులైన ఇద్దరు అధికారులను బళ్లారి రేంజ్ ఐజీపీ లోకేష్ కుమార్ సూచనల మేరకు సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. పశ్చిమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మేకా నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో గబ్బూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ లోకాయుక్త వలలో చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్ టీడీ మంజునాథ్ సస్పెండ్ కావడం గమనార్హం. -
నేటి నుంచి కార్యాలయాల పని వేళల్లో మార్పులు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లో గురువారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వ అదనపు కార్యదర్శి విమలాక్షి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.బళ్లారి సీఐకు సీఎం గోల్డ్ మెడల్బళ్లారి అర్బన్: తమ విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు పోలీస్ శాఖలో ఈ సారి సీఎం బంగారు పతకానికి బళ్లారి ట్రాఫిక్ సీఐ అయ్యనగౌడ పాటిల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఏఆర్ మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన పోలీస్ ధ్వజారోహణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శోభారాణి చేతుల మీదుగా అయ్యనగౌడ సీఎం బంగారు పతకాన్ని అందుకొన్నారు.ఎన్ఆర్బీసీకి ఏప్రిల్ వరకు నీరందివ్వాలిరాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని యాదగిరిలో మాజీ మంత్రి రాజుగౌడ నేతృత్వంలో యాదగిరి బంద్ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాయచూరు జిల్లా గబ్బూరులోని నందీశ్వరాలయంలో దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మనాయక్ బుధవారం పూజలు చేసి పాదయాత్రను రాయచూరు వరకు చేపట్టారు. యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రాజుగౌడ మాట్లాడుతూ పంటలకు నీటి కొరత రాకుండా చూడాలని ఒత్తిడి చేశారు.స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతిశివమొగ్గ: స్నేహితుల మధ్య ఏర్పడిన గొడవ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్పలో బుధవారం జరిగింది. వివరాలు.. దేవరాజ్(31)కు, అతని స్నేహితుడు వెంకటేష్ మధ్య చిన్న కారణానికి గొడవ మొదలైంది. ఓ దశలో ఇద్దరూ కొట్టుకున్నారు. వెంకటేష్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన దేవరాజ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
శాంతిభద్రతల రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
సాక్షి,బళ్లారి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె బుధవారం నగరంలోని డీఏఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పోలీసులేనన్నారు. అలాంటి ఉద్యోగం చేస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. అయితే పోలీసు స్టేషన్లకు వచ్చే వారితో స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. పోలీసులు అంటే భయం చూపకూడదన్నారు. జనంలో మనం ఒకరిగా జీవిస్తూ ముందుకెళ్లాలన్నారు. ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని పని చేసే పోలీసులు ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమయం కేటాయించాలన్నారు. పోలీసు ధ్వజం అమ్మకం ద్వారా సంగ్రహించిన నిధులను పోలీసు కుటుంబాల సంక్షేమానికి సమర్పిస్తున్నారని కొనియాడారు. జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి 2025 వరకు మొత్తం 37 మంది పోలీసు అధికారులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారన్నారు. వీరిలో పీఎస్ఐలు7 మంది, ఆర్ఎస్ఐలు 2, ఏఎస్ఐలు 13 మంది, ఏఆర్ఎస్ఐలు 9 మంది, సీడ్సీపీలు 3 తదితరులు పదవీ విరమణ పొందారన్నారు. జిల్లాలో ఉత్తమంగా పని చేసిన 178 పోలీసు అధికారులు, సిబ్బందికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇచ్చామని గుర్తు చేశారు. పోలీసులు లేకుంటే సమాజంలో అశాంతి వాతావరణం, గొడవలు తలెత్తుతాయన్నారు. మిగిలిన శాఖల కన్నా పోలీసు వృత్తిలో పని చేయడం ఎంతో ఛాలెంజ్గా ఉంటుందన్నారు. సమాజం దృష్టి మనందరిపై ఉంటుందని, అలాంటి వృత్తిలో పని చేసే మనందరి అడుగులు ఆచితూచి మంచి నడతతో ముందుకెళ్లాలన్నారు. పలువురు పోలీసు అధికారులు కూడా తమ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, జైలు సూపరింటెండెంట్ లత, పోలీసు అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో సేవాభావం అవసరంరాయచూరు రూరల్: పోలీసులు విధి నిర్వహణలో సేవా మనోభావాన్ని పెంపొందించుకోవాలని రిటైర్డ్ సీఐ హసన్ సాబ్ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ క్రీడా మైదానంలో పోలీస్ ధ్వజ దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలో పేరు సంపాదించుకోవాలంటే ప్రజలకు సేవ చేయాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో శాఖపై నమ్మకం తగ్గిపోతోందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ సంక్షేమ నిధి నుంచి 2024–25లో 266 మందికి ఆరోగ్య భాగ్య పథకం కింద రూ.4 లక్షలు వ్యయం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో బళ్లారి రేంజ్ ఐజీ లోకేష్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏఎస్పీ హరీష్, డీఎస్పీలు దత్తాత్రేయ కర్నాడ్, తళవార్, సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ వైశాలి, చంద్రప్ప, నారాయణ, లక్ష్మి, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి వెల్లడి -
అనాథలకు అండ.. స్పూర్తిధామ
రాయచూరు రూరల్: సంతానం లేకపోయినా ఆ ఉపాధ్యాయ దంపతులు పేద పిల్లలకు అండగా నిలిచారు. జిల్లాలోని మస్కి తాలూకాలో పేద విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజనం, దుస్తులు, విద్య వంటి సౌకర్యాలు కల్పించి సొంత బిడ్డలుగా 30 మందిని చూసుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. మస్కి పట్టణానికి చెందిన రామణ్ణ, శ్రుతి దంపతులకు వివాహం జరిగి 15 ఏళ్లు నిండినా పిల్లలు కాలేదు. ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా రామణ్ణ, కంప్యూటర్ ఉపాధ్యాయినిగా శ్రుతి విధులు నిర్వహిస్తున్నారు. తమ చుట్టు పక్కల ఉన్న అనాథ, పేద విద్యార్థులను అక్కున చేర్చుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. అభినందన్ స్పూర్తిధామ పేరుతో ఆరంభమైన పాఠశాలలో రోజు విద్యార్థులకు క్రీడలు, విజ్ఞానం, ఉప నిషత్తులు, గురువందనం, స్తోత్రాలు నేర్పుతారు. రామణ్ణ, శ్రుతి దంపతులు చేస్తున్న ఉదార సేవకు ఉడుతా భక్తిగా అందరి సహకారం లభిస్తోంది. దివ్యాంగుడు దేవరాజ్కు రాష్ట్ర స్ధాయి కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో స్వంత డబ్బులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. ప్రత్యేకంగా అభినందన్ విద్యా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పంచమసాలి సముదాయ భవనం, దాసోహ మంటప భవనాలను నిర్మించారు. ఆదరిస్తున్న ఉపాధ్యాయ దంపతులు స్వయంగా పాఠశాల నిర్వహిస్తున్న వైనం -
సైకో భర్త.. రక్తపాతం
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కోసం వెళ్లి.. అత్త, మరదలు, కూతురి కాల్చివేత ఆపై హంతకుడు ఆత్మహత్య చిక్కమగళూరు జిల్లాలో మారణహోమం కుటుంబ కలహాలే కారణం మోసం చేసింది.. అందుకేనంటూ.. చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు. -
ప్రైవేటు బస్సు, బైక్లు బూడిద
చింతామణి: పట్టణంలోని బెంగళూరు కూడలి ప్రైవేటు బస్టాండులో ఓ ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. అలాగే పక్కన వున్న పది ద్విచక్రవాహనాలు మంటల్లో మాడిపోయాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు చింతామణి నుండి హోసకోట పారిశ్రామికవాడలోకి కంపెనీ ఉద్యోగులను తీసుకొని వెళ్లి తిరిగి చింతామణికి వచ్చి నిలబడింది. తెల్లవారుజామున బస్సులో మంటలు చెలరేగి కాలిపోతుండంతో ప్రాంతవాసులు పోలీసులకి తెలిపారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసేటప్పటికి పూర్తిగా కాలిపోయింది. పక్కన పాత పోలీసు స్టేషన్లో సీజ్ చేసి ఉంచిన పది ద్విచక్రవాహనాలు నిప్పుపడి కాలి బూడిదయ్యాయి. సెలవు ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యశవంతపుర: అక్క కూతురి పెళ్లికి వెళ్లడానికి ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదనే ఆవేదనతో కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో జరిగింది. పాత గాంధీనగరకు చెందిన డ్రైవర్ బాలచంద్ర శివప్ప హుక్కోజి (47) మృతుడు. శహపుర నాకా నుంచి వడగావికి వెళ్లే బస్సుకు డ్రైవర్గా పని చేస్తున్నాడు. బాలచంద్ర ఇంటిలో అక్క కుమార్తె పెళ్లి జరుగుతోంది, ఇందుకు సెలవు కావాలని ఉన్నతాధికారులను అడిగాడు. సెలవు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో మథనపడి ఆత్మహత్య చేసుకున్నాడని, అధికారులే కారణమని కుటుంబసభ్యులు అరోపించారు. బెళగావి నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం
బనశంకరి: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు పిలుపునిచ్చారు. బుధవారం కోరమంగలోని కేఎస్ఆర్పీ పరేడ్ మైదానంలో పోలీస్ పతకాలను సిబ్బందికి ప్రదానం చేసి ప్రసంగించారు. సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. రాష్ట్రాన్ని డ్రగ్స్రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. పోలీసులు డ్రగ్స్ ముఠాను కూకటివేళ్లతో పెకలించాలని సూచించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, మరింత తగ్గించాలని చెప్పారు. శాంతిభద్రతలు , పెట్టుబడులు పెట్టడం, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఒకదానికి ఒకటి నేరుగా సంబంధం ఉందన్నారు. నిరుద్యోగం చాలా పెద్ద సమస్యగా ఉందని దీనిని పరిష్కరించాలంటే శాంతిభద్రతలు ఉత్తమంగా ఉండాలని తెలిపారు. పతకాలు తీసుకున్న సిబ్బంది ఆదర్శవంతులుగా ఉండాలని సూచించారు. పోలీసుల సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మీరు మాత్రం విధుల్లో అలసత్వం చూపితే సహించేది లేదని, పోలీస్ గస్తీని మరింత పటిష్టంగా నిర్వహించాలని తెలిపారు. డ్రగ్స్ నివారణ, మహిళా భద్రత రాష్ట్రంలో నేరాలు, మాదక ద్రవ్యాలు కార్యకలాపాలను పూర్తిగా మట్టికరిపించడంతో పాటు మహిళలు సురక్షత కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని, దీంతో రాష్ట్రానికి అధిక పెట్టుబడులు వస్తాయన్నారు. మతవిద్వేషాలకు పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో సైబర్ క్రైం పెద్ద సవాల్గా మారింది. రాష్ట్రంలో ఏడాదికి 20 వేల కేసులు నమోదు అవుతున్నాయని, బెంగళూరు ఐటీ సిటీగా ఉండటం, ఇంటెర్నెట్ సౌకర్యం అధికంగా ఉండటంతో సైబర్ నేరాలు హెచ్చుమీరుతున్నాయని వీటికి అడ్డుకట్టవేసే దృష్టితో పనిచేయాలని మరింత కఠినంగా పనిచేయాలని తెలిపారు. నక్సల్స్ లొంగిపోవడంతో నక్సల్స్ రహిత కర్ణాటక గా మారిందన్నారు. బ్యాంకు దోపిడీ దొంగలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నారని అభినందించారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు కేంద్రం అస్త్రం అప్లికేషన్ ప్రారంభమైందని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. డీజీపీ అలోక్మోహన్, ఐపీఎస్లు పాల్గొన్నారు. పోలీసులకు సీఎం ఆదేశం ఘనంగా పోలీసు పతకాల ప్రదానోత్సవం శాంతిభద్రతలతోనే ఆర్థిక వికాసమని సూచన -
సర్కారు ధరాఘాతం.. సామాన్యుల బతుకు భారం
శివాజీనగర: రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలను పెంచి పేద, సామాన్య ప్రజలు జీవించకుండా చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు బుధవారం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో అహోరాత్రి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పాలు, విద్యుత్, బస్సు, మెట్రో చార్జీలను పెంచారు, ఇంధన సెస్సును పెంచారు. స్టాంప్ ఫీజును పెంచారు. ఇది ధరలను పెంచే ప్రభుత్వమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్, మాజీ సీఎం యడియూరప్ప సహా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. తమ పోరాటం ఆగదని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు బీజేపీ విశ్రమించదని చెప్పారు. దరల పెరుగుదలతో ప్రజల బతుకు భారంగా మారిందని చెప్పారు. పెంచిన ధరలను తగ్గించేవరకు రాష్ట్రమంతటా ధర్నాలు చేస్తామని యడియూరప్ప తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను నిలిపివేసింది, అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య వేషధారితో వ్యంగ్య నాటకాన్ని ప్రదర్శించారు. మరోవైపు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై విధానసభ స్పీకర్ ఖాదర్ విధించిన 6 నెలల ససెన్షన్ను రద్దు చేయాలని విధానసౌధ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ధర్నాకు పిలవలేదని జేడీఎస్ అసంతృప్తి బీజేపీ ఆందోళనలకు మిత్ర పక్షమైన జేడీఎస్ను ఆహ్వానించలేదని ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు సీ.బీ.సురేశ్బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, జేడీఎస్ను బీజేపీ ధర్నాకు పిలవకపోవడం సరికాదు. మునుముందు సమస్యలకు కారణమవుతుందన్నారు. గతంలో ముడా పాదయాత్ర సందర్భంలో కూడా తమకు పిలుపు లేదని వాపోయారు. శాసనసభాలో తాము ఐకమత్యంగా పోరాటం చేశామని ఆయన తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన బీజేపీ నిరసనలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు మహిళా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు ఫ్రీడంపార్క్లో బీజేపీ ధర్నా పాల్గొన్న ముఖ్య నేతలు -
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్కు విసుగొచ్చి ఆమె సిమ్ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని ధర్నా
రాయచూరు రూరల్ : నగరంలోని వెస్ట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినట్లు సమాచారం అందింది. మూడు రోజుల క్రితం ఆశాపూర్ రోడ్డులో నివాసం ఉంటున్న వీరేష్(28) అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. ఈ విషయంలో వెస్ట్ పోలీస్ స్టేషన్లో భార్య తరపున కుటుంబ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసును సదర్ బజార్ మహిళా పోలీస్ స్టేషన్కు బదలాయించారు. రాజీ ప్రక్రియతో ఇరువురిని కలిపారు. కాగా మంగళవారం వెస్ట్ పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిచి ఇష్టానుసారంగా చితకబాదారని వీరేష్ తండ్రి గోపి వారి బంధువు నారాయణ ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి ప్రాణాలు వదిలాడు. ఘటనపై కేసు నమోదుకు పోలీసులు నిరాకరించడంతో వీరేష్ కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకున్నారు. కాగా వెస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులపై చర్యలు చేపట్టాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు పూనుకొని మాట్లాడారు. అతని మరణానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. కౌన్సిలర్లు నాగరాజ్, శఽశిరాజ్, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, బీజేపీ నేతలు ఆంజనేయ, రవీంద్ర జాలదార్, విజయ్ కుమార్ నాగరాజ్, యల్లప్ప, శ్రీనివాసరెడ్డిలున్నారు. -
ధరల పెంపు పంచ గ్యారెంటీలకు వడ్డీనా?
రాయచూరు రూరల్: కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయంతో గ్యారెంటీలను ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారి నుంచి వడ్డీని వసూలు చేస్తోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నఫళంగా విద్యుత్ బిల్లును యూనిట్కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు పెంచడం తగదని పేర్కొంటూ ఈ నెల 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పాల రైతులకు రూ.662 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలిపారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక సర్కార్ ఏటీఎంగా మారిందని ధ్వజమెత్తారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు, శాసన సభ్యులు కొల్లగొడుతున్నారని విమర్శించారు. మాజీ శాసన సభ్యులు బసన గౌడ, పాపారెడ్డి, శంకరప్ప, నగర అధ్యక్షుడు రాఘవేంద్ర, సభ్యులు శంకరరెడ్డి, రవీంద్ర జాలదార్, చంద్రశేఖర్, మల్లికార్జునలున్నారు. కాంగ్రెస్కు ఏటీఎంగా కర్ణాటక సర్కార్ 7 నుంచి జనాక్రోశ యాత్రకు శ్రీకారం జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరనగౌడ -
గర్భిణులు ఎండల్లో తిరగరాదు
బళ్లారిటౌన్: ప్రస్తుతం జిల్లాలో ఎండలు తీవ్రం అవుతున్నందున గర్భిణులు మధ్యాహ్నం పూట బయట తిరగరాదని డీహెచ్ఓ యల్లా రమేష్బాబు పేర్కొన్నారు. మంగళవారం కురుగోడు తాలూకా కోళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ప్రజలతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ సమయంలో గర్భిణులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అదే విధంగా నీళ్లు ఎక్కువ తాగాలన్నారు. ఇక బాలింతలు కూడా శిశువులకు తల్లి పాలు ఎక్కువగా ఇవ్వాలన్నారు. ఇతర ఏ ఆహారాన్ని ఇవ్వరాదన్నారు. తల్లి పాలల్లో చాలా నీటి అంశం ఉంటుందన్నారు. రోజుకు 10 నుంచి 12 సార్లు తల్లి పాలు ఇవ్వాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్ ఉంటుందన్నారు. ఆస్పత్రి తనిఖీ సందర్భంలో ఓఆర్ఎస్ ద్రావణం తాగడం ద్వారా దేహంలో నిర్జలీకరణ పొంది అపాయాన్ని తప్పించవచ్చన్నారు. తారానాథ ఆయుర్వేదిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్, వైద్యులు రాజశేఖర్ గాణిగేర్, మనీంద్ర, కళ్యాణి, ఈశ్వర్ హెచ్.దానప్ప, బసవరాజు, వీరేష్, శరణమ్మ, సిద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్యారెంటీలతో ధరలు పెంచి లూటీ
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో లీటరు పాల ధరను ఏకంగా రూ.9 పెంచారని, పాడి రైతులను మాత్రం నడ్డి విరుస్తూ దాదాపు రూ.663 కోట్ల మేర రైతులకు బాకీ ఉన్నారని, వినియోగదారులకు ధరలు పెంచి, రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక్క పాల ధరే కాకుండా అన్ని విధాలైన నిత్యావసరాల ధరలు పెంచేశారన్నారు. దీంతో సామాన్యుడి జీవితం అష్టకష్టంగా మారిందన్నారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో పాలకులు లూటీ చేసుకుని పబ్బం గడుపుతున్నారన్నారు. పేదలకు గ్యారెంటీలు సక్రమంగా అందడం లేదన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాహన రిజిస్ట్రేషన్లు, ల్యాబ్ పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, దత్తస్వీకార పత్రం, అఫిడవిట్, బస్సు టికెట్ ధరలు, బీర్లు, విద్యుత్ వాహనాలు, నిత్యావసర ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిపై చాప కింద నీరులా ధరలు పెంచుకుంటూ గ్యారెంటీలు ఇస్తున్నామని పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.ఽ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరల పెంపు పైనే దృష్టి సారిస్తూ సంపద సృష్టించుకుని, కొందరికి మోదం, మరికొందరికి ఖేదంగా పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకే మేలు జరుగుతుందన్నారు. మిగిలిన వారు భారీగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. బీజేపీ నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్, డాక్టర్ అరుణ కామినేని, గురులింగనగౌడ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. లీటరు పాలపై ఏకంగా రూ.9 పెంపు ధరల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి -
ఏబీసీడీ వర్గీకరణ చేయాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదని సాంఘీక న్యాయంతో మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ జారీ చేయాలని మాదిగ దండోరా రాష్ట్ర సంచాలకుడు నరసప్ప డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు వర్గీకరణ చేయడంలో మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగ మెహన్ దాస్ నివేదిక ఆధారంగా వర్గీకరణ చేయాలన్నారు. ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించాలన్నారు. -
అధిక లాభాలంటూ లక్షల్లో వంచన
హుబ్లీ: క్వాలిటీ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే 30 శాతం లాభాలు ఇస్తామని నమ్మించి నగర విద్యార్థి నుంచి రూ.10.30 లక్షలు వంచించారు. కే.హనుమంతను సంప్రదించిన కార్తీక్ అనే వ్యక్తి పెట్టుబడి పేరుతో దశల వారీగా రూ.10.30 లక్షలను బదలాయించుకొని మోసగించాడని బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుట్టుమిషన్లు, కార్లు పంపిణీ హుబ్లీ: హుబ్లీ ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దేవరాజ అరసు వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ, వడ్డర్ల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వావలంభి సారథి పథకం ద్వారా లబ్ధిదారులకు కార్లు, కుట్టు మిషన్లను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి పంపిణీ చేశారు. తమ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 36 మంది మహిళలకు కుట్టుమిషన్లు, ముగ్గురికి కార్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాల నుంచి వంచితులైన వారికి కూడా స్వయం ఉపాధి కల్పించేందుకు ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా పేద, మధ్య తరగతి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అనుకూలంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వీణా భరద్వాజ్, కార్పొరేటర్ రూపా శెట్టి, ప్రముఖులు రాజు కాళె, ఆ సంస్థ జిల్లా మేనేజర్ కుశాల్ చౌగలె, హనుమంత వక్కుంద పాల్గొన్నారు. కారు బోల్తా.. ఇద్దరు మృతి● మృతులు తండ్రీకుమారులు ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● చిత్రదుర్గ జిల్లాలో ఘోరం సాక్షి,బళ్లారి: డివైడర్ను కారు ఢీకొని బోల్తా పడటంతో తండ్రీ కుమారుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా బొమ్మక్కనహళ్లి సమీపంలో జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెంగళూరు నుంచి యాదగిరికి కారులో వెళుతున్న మౌలా(35), రెహమాన్(15) అనే ఇద్దరు తండ్రీ కుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో ఫాతిమాబేగం, సలీమా, సమీర్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, బళ్లారి బిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై రాంపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 12 మంది గంజాయి విక్రయదారుల అరెస్ట్హుబ్లీ: గంజాయి విక్రయిస్తున్న 3 కేసుల్లో 12 మంది పెడ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 1.677 గ్రాముల గంజాయిని జప్తు చేశారు. కసబాపేట పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ అవరంగి, అభిషేక్, ఈరణ్ణ, విశాల్, విజయ్, ధార్వాడ విద్యాగిరి స్టేషన్ పరిధిలో మహమ్మద్, హనుమంత, ఆసిఫ్, మంజునాథ్, అనిల్లపై కేసు దాఖలైంది. నిందితుల నుంచి రూ.35,750 విలువ చేసే 11.75 గ్రాముల గంజాయి, 9 మొబైల్ ఫోన్లు, రెండు బైక్లు, రూ.1700 నగదుతో పాటు మొత్తం రూ.68,450 విలువ చేసే వస్తువులను జప్తు చేశారు. అలాగే బెండిగేరి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఎన్ క్రైం స్టేషన్ పోలీసులు దాడి చేసి అభిషేక్, అనిల్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి 5.2 గ్రాముల గంజాయిని జప్తు చేశారు. కొళగల్లు ఎర్రితాత రథోత్సవంపై నిషేధంబళ్లారిటౌన్: బళ్లారి తాలూకా కొళగల్లు గ్రామంలో ఈనెల 4న జరగాల్సిన ఎర్రితాత రథోత్సవాన్ని జరపకుండా నిషేధిస్తూ మంగళవారం జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా ఆదేశాలను జారీ చేశారు. కొళగల్లు గ్రామంలో దేవస్థానం ఆస్తి విషయంలో గత ఏడాది ఫిబ్రవరి 24న మఠం ఆవరణలో కొత్తగా నిర్మించిన ఎర్రితాత గుడిలో ప్రతిష్టించిన విగ్రహం తొలగించాలని ధార్వాడ హైకోర్టు ఆదేశించింది. ఈ విగ్రహం తొలగింపులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న గ్రామంలోని వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి వివాదం చోటు చేసుకోగా పోలీసులపై రాళ్లు రువ్విన సంగతి విదితమే. దేవస్థానం ఆస్తుల విషయంలో గొడవలు జరిగినందున గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసులు దాఖలు అయ్యాయి. దీంతో ఈ వివాదం కోర్టులో ఉన్నందున మళ్లీ రథోత్సవం జరిగితే గ్రామంలో అశాంతి తలెత్తవచ్చని అధికారులు భావించినందున శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ రథోత్సవాన్ని నిషేధిస్తూ ఆదేశించినట్లు తెలిపారు. జింకల వేటపై కేసు నమోదురాయచూరు రూరల్ : జింకలను వేటాడి కొడవలి తదితర మారణాయుధాలతో ఊరేగింపు జరిగిన ఉదంతం జిల్లాలోని మస్కి తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం తుర్విహాళలో శంకర లింగేశ్వర జాతర సందర్భంగా మస్కి శాసన సభ్యుడు బసనగౌడ సోదరుడు సిద్దనగౌడ, కుమారుడు సతీష్ గౌడ జింకలను పట్టుకొని ఊరేగిస్తూ వాటిని చంపారని ఆరోపిస్తూ అటవీ శాఖాధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. -
పొంచి ఉన్న జలక్షామం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ప్రధాన జలాశయాలన్నీ నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి భారీ, మధ్య తరహా జల వనరులు ఎండిపోయాయి. ఈ ఏడాది వేసవి తాపం అధికంగా ఉంది. ఏప్రిల్, మే నెలలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి దిగజారాయి. ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటకలో జలక్షామంతో నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేదనే విషయం తేటతెల్లమైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. పల్లెల్లో దాహాకారాలు డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 490.70 మీటర్లు, నీటి నిల్వ 32.400 టీఎంసీలు ఉంది. డెడ్ స్టోరేజీ 10.600 టీఎంసీలు పోను మిగిలిన 21.800 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు, ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ, బెళగావి, బాగల్కోటె, గదగ్ జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. గతంలో వానలు కురువక పోవడంతో కళ్యాణ కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. కలబుర్గి జిల్లాలో ఘటప్రభ, మలప్రభ, బెణ్ణెతోర, అమర్జా, భీమా నదులున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. రాయచూరు జిల్లాలోని లింగసూగూరు తాలూకా యరగుంటె, సింధనూరు తాలూకా మల్లనగుడ్డల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా చేపడుతున్నారు. 15 జిల్లాలకు తప్పని నీటి గండం పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం మౌనం వహించిన ప్రజాప్రతినిధులు -
పాస్టర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
రాయచూరు రూరల్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐతో విచారణ జరపాలని కల్వరి పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేయించి దానిని రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తోందన్నారు.హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త స్వస్థత కూటమి సమావేశాలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల వెళుతున్న సమయంలో కొవ్వూరు టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల వాహనానికి ఎలాంటి ముప్పు జరగక పోయినా పాస్టర్ తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. తలకు పెట్టుకున్న హెల్మెట్ కూడా పగలకుండా ఉందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను రాజకీయ కక్షతో హత్య చేశారన్నారు. పాస్టర్ మరణంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.వివాదాస్పద ఫోటో స్టేటస్పై ఘర్షణహుబ్లీ: ఓ యువకుడు వివాదాస్పద ఫోటో స్టేటస్ పెట్టుకున్నాడన్న విషయమై రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. ధార్వాడ ఆంజనేయ నగర్కు చెందిన సలీం ఈ కేసులో నిందితుడు. ఈయన ధార్వాడ జకని బావి వద్ద ఈద్గాలో ఉన్నట్లు వదంతులు వెలువడ్డాయి. దీంతో భజరంగదళ్ కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. అయితే పోలీసులు ముందుగానే నిందితుడిని విద్యాగిరి స్టేషన్కు తరలించారు. దీంతో స్టేషన్ ఎదుట గుమిగూడిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సలీం కుటుంబ సభ్యులు కూడా విద్యాగిరి స్టేషన్కు రావడంతో స్టేషన్ ఎదుటే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.12న హంపీలో జోడు బ్రహ్మరథోత్సవంహొసపేటె: చారిత్రక హంపీలోని విరుపాక్ష్వేర స్వామి, చంద్రమౌళేశ్వర స్వామి జంట బ్రహ్మరథోత్సవం ఈనెల 12న జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి హనుమంతప్ప తెలిపారు. హంపీ జాతర మహోత్సవం ఈనెల 6 నుంచి 14 వరకు హంపీ తాలూకాలో జరుగుతుంది. హంపీ ప్రాంత ప్రధాన పూజారి విద్యారణ్య భారతీ స్వామి మార్గదర్శకత్వంలో ఈనెల 12న జోడు బ్రహ్మరథోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కృష్ణదేవరాయలు సమర్పించిన బంగారు కిరీటాన్ని ఏప్రిల్ 10 నుంచి 14 వరకు అలంకరించనున్నారు. భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. జాతర మహోత్సవం, రథోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఓ ప్రకటనలో కోరారు.ఇస్పేట్ జూదరుల అరెస్టుహొసపేటె: గంగావతి తాలూకా ఉడుమకల్లో ఇస్పేట్ జూదం అడ్డాపై రూరల్ పోలీసులు దాడి చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసి, 26 బైకులు, రూ.39,000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలైన సిద్దికేరి రైల్వే ట్రాక్, పాపయ్య కెనాల్, ఆంజనేయ గుడి, విద్యానగర్, దేవఘట్ట, ఆనెగుంది, బెట్టగుడ్డ, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం, గంగావతి గంజ్ ఏరియా, కొన్ని లాడ్జిల్లో పగలు, రాత్రి సాగుతున్న జూదాలను అరికట్టాలని ఆయా సంఘాలు ఎస్పీకి విన్నవించాయి. ఈ దాడిలో రూరల్ సీఐ రంగప్ప దొడ్డమని, సిబ్బంది బసవరాజు చిన్నూరు, రాఘవేంద్ర, మంజునాథ్, బసవరాజు, మురుడి ముత్తురాజు, డ్రైవర్ అమరేష్ పాల్గొన్నారు. -
కర్ణాటక సంఘానికి నూతన భవనం నిర్మిస్తాం
రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలకు సాంస్కృతిక పరంగా, కన్నడ భాషకు నూతన ఒరవడిని కల్పించిన కర్ణాటక సంఘం నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. మంగళవారం కర్ణాటక సంఘం పాత భవనాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. 98 ఏళ్లు పూర్తి చేసుకున్న భవనం శిథిలావస్థకు చేరుకుందని, మరో రెండేళ్లో వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సంఘం అధ్యక్షుడు శాంతప్ప, జయన్న, రుద్రప్ప, శివమూర్తి, నరసింహులు, శ్రీనివాసరెడ్డి, మురళీధర్ కులకర్ణిలున్నారు. -
బీబీఎంపీ చెత్త లారీ బోల్తా
కృష్ణరాజపురం: నగరంలో పాలికె చెత్త లారీలు తరచూ ప్రమాదాలకు కారణమవుతూ ప్రజలకు బెదురు పుట్టిస్తున్నాయి. బీబీఎంపీ చెత్త లారీ డ్రైవర్ అజాగ్రత్తతో బోల్తా పడిన ఘటన బెంగళూరు పులకేశినగరలోని సింధి సర్కిల్ వద్ద జరిగింది. చెత్తను డంప్ యార్డుకు తరలిస్తుండగా లారీ డ్రైవర్ అతి వేగంగా మలుపు తిప్పడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ ఇతర వాహనాలు, జనం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. లారీ డ్రైవర్ చింగారికి చిన్న గాయాలయ్యాయి. పులకేశినగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.బీదర్ జిల్లాలో భూప్రకంపనలుసాక్షి, బళ్లారి: బర్మా, థాయ్లాండ్ దేశాల్లో భయంకరమైన భూకంపం వచ్చి అంతటా భయాందోళన నెలకొన్న సమయంలో, విజయపుర జిల్లాలో భూమి కంపించింది. మంగళవారం జిల్లాలోని తిక్కోటా తాలూకా పరిధిలో పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఎవరికీ హాని కలగలేదు. ప్రకంపనల సమయంలో భూమి నుంచి పెద్దఎత్తున శబ్ధం రావడంతో ప్రజలు హడలిపోయారు. ఉత్తర కర్ణాటకలో తరచూ భూప్రకంపనలు వస్తున్నాయి. కలబురగి, బీదర్ జిల్లాల్లో స్వల్పస్థాయి భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలు చేసి పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.ఎమ్మెల్యేల సస్పెన్షన్ను ఎత్తివేయాలిబనశంకరి: విధానసభలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలని స్పీకర్ యుటీ ఖాదర్ కు మంగళవారం బీజేపీ నేత ఆర్.అశోక్ లేఖరాశారు. గత నెల 21 తేదీన శాసనసభలో హనీట్రాప్ గొడవ, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ చర్చ సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ధర్నాకు దిగామని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అంతేగాక పలు ఆంక్షలు కూడా విధించారని తెలిపారు. స్పీకర్ పీఠానికి అగౌరవం తీసుకువచ్చే ఉద్దేశం ఎమ్మెల్యేలకు లేదని చెప్పారు. పునఃపరిశీలించి సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరారు.ఖైదీల వద్ద మొబైల్ఫోన్మైసూరు: నగరంలోని సెంట్రల్ జైలులో ఖైదీలు యథేచ్ఛగా మొబైల్ఫోను వాడుతున్న వైనం బయటపడింది. నేరాల్లో నిందితులుగా జైలుకు వచ్చిన శివమొగ్గకు చెందిన కార్తీక్, నితిన్లు చాటుగా మొబైళ్లు ఉపయోగిస్తున్నారు. జైలు అధికారి ఎం.దీపా ఖైదీల గదులను తనిఖీ చేస్తుండగా, 25వ గదిలో నితిన్, కార్తీక్ల వద్ద ఒక స్మార్ట్ఫోన్, సిమ్ కార్డు లభించాయి. స్థానిక మండి పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టారు. కాగా, జైలులోపలికి నిషిద్ధ వస్తువులు దొంగచాటుగా చేరిపోతుంటాయి. నిందితులతో కొందరు సిబ్బంది కుమ్మక్కు కావడమే కారణమని ఆరోపణలున్నాయి.కాంగ్రెస్పై యడ్డి ధ్వజంబనశంకరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెంపును వ్యతిరేకిస్తూ బుధవారం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తుందని, అందులో తాను కూడా పాల్గొంటానని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తెలిపారు. మంగళవారం డాలర్స్ కాలనీ నివాసంలో విలేకరులతో యడియూరప్ప మాట్లాడారు. ధరల పెంపుతో సామాన్య, మధ్య తరగతిపై పెనుభారం పడిందన్నారు. ఫ్రీడం పార్కులో ధర్నా చేస్తామని, అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. సీఎం కుర్చీకోసం కాంగ్రెస్లో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది వారికి ముఖ్యమని, ప్రజలు కాదని హేళన చేశారు. ధర్నాలలో కేంద్రమంత్రులు కూడా పాల్గొంటారన్నారు.వృద్ధురాలు అనుమానాస్పద మృతికృష్ణరాజపురం: బెంగళూరులోని విజయనగర రైల్వే పైప్లైన్ రోడ్డు ఆర్పీసీ లేఔట్లో ఓ వృద్ధురాలు అనుమానాస్పద రీతిలో మరణించింది. సిద్దమ్మ (78) మృతురాలు. ఆమె సొంత ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది. మంగళవారం ఉదయం ఇంట్లోనే శవమై తేలింది. బంగారు చెవి కమ్మలు మాయమయ్యాయి. ఆమె మరణానంతరం ఎవరైనా వాటిని తీసుకెళ్లారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హత్య జరిగినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు పోలీసులకు లభించలేదు. చెవికమ్మలు పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
సిద్ధగంగ మఠం జన సాగరం
తుమకూరు: లక్షల మంది బాలలకు చదువు, అన్నం, విద్యా ఆశ్రయం కల్పించి నడిచే దేవునిగా కీర్తి పొందిన తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత దివంగత శివకుమార స్వామి 118వ జయంతి వేడుకలు, గురువందన మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగాయి. సిద్ధగంగా మఠంలో వేలాది మంది భక్తులు, సాధుసంతులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెల్లవారుజామునుంచే మఠంలో స్వామీజీ సమాధి వద్ద వివిధ పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి వి.సోమన్న, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మఠాధిపతి సిద్ధలింగస్వామి పాల్గొన్నారు. సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ ఊరేగింపు మైసూరు సుత్తూరు మఠం స్వామి శివరాత్రి దేశికేంద్ర స్వామి పూలు పండ్లు తీసుకువచ్చి సమాధికి సమర్పించి పూజలు గావించారు. తరువాత శివకుమారస్వామి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి మఠంలో ఊరేగించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 118 మంది చిన్నారులకు నామకరణోత్సవం, అక్షరాభ్యాసం చేయించారు. ఆ శిశువులకు ఉచితంగా ఉయ్యాలలు, ఇతర సామగ్రిని అందజేశారు. అశేష భక్తజనానికి మఠంలో భోజన వ్యవస్థ కల్పించారు. తుమకూరు నగరంలోనూ అనేకచోట్ల స్వామీజీ భక్తులు అన్నదానం చేశారు. వైభవంగా శివకుమారస్వామి 118వ జయంతి ఉత్సవాలు కేంద్ర రక్షణమంత్రి, మంత్రులు హాజరు -
ఓ నాన్నా.. అనాథవేనా?
దొడ్డబళ్లాపురం: కుటుంబ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వయసు మీద పడగానే వదిలించుకోవాలని చూసే కొడుకులు ఎక్కువయ్యారు. బెళగావిలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని కన్న కొడుకు ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయాడు. తండ్రి చనిపోయి అనాథ శవమయ్యాడు. బిమ్స్ ఆస్పత్రిలో వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సతీశ్వర్ అనే వృద్ధున్ని అతని కుమారుడు 15 రోజుల క్రితం బెళగావి జిల్లా ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయాడు. అప్పటినుంచి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు, మార్చి 31న ఆయన మరణించాడు. వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కుమారుని కోసం శోధించారు. అయితే జాడ దొరకలేదు. కుమార్తెచే అంత్యక్రియలు చివరకు గోవాలో జీవిస్తున్న కుమార్తెను తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపించారు. కుమార్తె చెప్పిన ప్రకారం ఆమె సహోదరుడు కొన్ని రోజుల క్రితం గోవా నుంచి తండ్రిని తీసుకుని వచ్చేశాడు. తానే చూసుకుంటానని చెప్పి ఇలా చేసాడని ఆమె వాపోయింది. ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలియదని చెప్పింది. పిల్లలు వృద్ధ తల్లిదండ్రులను బెళగావి బిమ్స్లో అనారోగ్యమని చేర్పించి పత్తా లేకుండా పోతున్నారని, ఇలాంటి పిల్లలకు ఇచ్చిన ఆస్తిపాస్తులను రద్దు చేయాలని వైద్యవిద్యా మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ఇటీవల డిమాండ్ చేయడం తెలిసిందే. తండ్రిని ఆస్పత్రిలో చేర్పించి పరారైన తనయుడు మృతిచెందిన వృద్ధుడు -
బెయిల్ కోసం హైకోర్టుకు రన్య
బనశంకరి: కేజీల కొద్దీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఫిబ్రవరి 3న బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో అరెస్టయి, రిమాండులో ఉన్న నటి రన్య రావు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. 64 వ సెషన్స్ కోర్టు బెయిల్ను తిరస్కరించడంతో ఆమె న్యాయవాది హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. రన్యకు బెయిలు ఇవ్వరాదని డీఆర్ఐ వకీళ్లు గట్టిగా వాదిస్తున్నారు. యత్నాళ్ కేసు మీద స్టే జారీ నటి రన్య రావు పై అవహేళన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ పై నమోదైన క్రిమినల్ కేసు విచారణపై మంగళవారం హైకోర్టు స్టే విధించింది. రన్య శరీరమంతా బంగారం అంటించుకుని స్మగ్లింగ్ చేస్తోంని ఇటీవల యత్నాళ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రన్య బంధువు బెంగళూరు హైగ్రౌండ్స్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని యత్నాళ్ హైకోర్టులో అర్జీ వేశారు. విచారించిన జడ్జి ప్రదీప్సింగ్ యెరూర్.. స్టే జారీ చేయడంతో ఆయనకు ఊరట లభించింది. -
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
బెంగళూరు: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో ఎఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీదేవి రుదాగి అనే టీచర్.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తన ఐదేళ్ల కూతుర్ని 2023లో బెంగళూరులోని ఓ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి సతీష్(పేరు మార్చాం). అయితే అక్కడే అసలు కథ మొదలైంది. పాపను స్కూల్ కు తీసుకొచ్చి, తీసుకెళ్లే క్రమంలో అతనితో టీచర్ శ్రీదేవి సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇలా ఇరువురి మధ్య ప్రారంభమైన వ్యవహారం కాస్తా ముదిరింది. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యంగా ఉండటాన్ని సీక్రెట్ గా వీడియో రికార్డు చేసింది. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తనకు డబ్బులు కావాలంటూ పదే పదే వేధించసాగింది. కాలే, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టింది ఇలా మొత్తం మీద రూ. 4 లక్షల వరకూ లాగేసింది.ఏకంగా ఇంటికి..ఇక తనతో సాన్నిహిత్యం తగ్గించడంతో వ్యాపారి ఇంటికి వచ్చేసింది టీచర్ శ్రీదేవి. తనకు అప్పు కావాలనే వంకతో ఇంటికి వచ్చింది. అక్కడ రూ. 50 వేల అప్పు రూపంలో ఆమెకు ఇస్తున్నట్లు ఇంట్లో నమ్మించాడు సదరు వ్యాపారి. ఆ తర్వాత కూడా ఆమె నుంచి వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.మకాం మార్చాడు..ఇక ఆమె వేధింపులు అధికం కావడంతో గుజరాత్ కు మకాం మార్చాడు సదరు వ్యాపారి. అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది. అలా ఆమె ఆఫీస్ లో చిక్కుపోయాడు వ్యాపారి. అక్కడ వీడియోలు, ఫోటోలు చూపిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది. అక్కడ కాలే, సాగర్ లు కూడా ఉండటంతో చివరకు చేసేది లేక బయటకొచ్చాడు.పోలీసులకు ఫిర్యాదుఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీదేవితో పాటు కాలే, సాగర్ లను కూడా అరెస్ట్ చేయగా,. ఆ ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్పోర్ట్లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్వుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్కి రీమేక్గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. -
ఐస్క్రీంతో జర జాగ్రత్త
బనశంకరి: ఐస్క్రీం అనగానే పిల్లలైనా, పెద్దలైనా ఎవరికైనా నోరూరుతుంది. వేసవిలో ఎండలు తీవ్రరూపం దాల్చడంతో చల్లదనం కోసం, కాలక్షేపానికి ఐస్క్రీములు తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఐస్క్రీమ్ కేంద్రాలలో ఆహార సురక్షతా శాఖ అధికారులు సోదాలు చేసి శాంపిళ్లను ల్యాబ్కు తరలించారు. ప్లాస్టిక్ పేపర్లో ఇడ్లీ, కర్బూజా, కలర్ వేసిన కబాబ్, గోబిమంచూరి, పన్నీర్లలో ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలున్నాయని ఇప్పటివరకు తనిఖీలలో తేలింది. ఇప్పుడు చల్లని ఐస్క్రీమ్ వంతు వచ్చింది. ఆహార శాఖ అధికారులు ప్రతినెలా ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారు. ఎండాకాలంలో ప్రజలు ఐస్క్రీములు ఎక్కువగా తింటున్నారు. ఐస్క్రీములకు రంగు రావడానికి కృత్రిమ రంగులను వాడతారు. ఈ రంగులు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అథణిలో బాగోతం ఇటీవల బెళగావి జిల్లాలోని అథణిలో అనుమతులు లేని ఓ ఫ్యాక్టరీలో రంగురంగుల ఐస్ క్యాండీలను తయారు చేయడం చూసి తనిఖీలు చేశారు. ఐస్క్రీంలను ల్యాబ్కు పరీక్షల కోసం పంపించగా వాటిలో హానికరమైన అంశాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రంగు రావడానికి కెమికల్స్ వినియోగిస్తారని, అవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. సన్సెట్ ఎల్లో, సన్సెట్ గ్రీన్ కలర్లు శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందన్నారు. ఇదే కాకుండా గుండె రోగాలు, కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. ఐస్క్రీంలు, కేక్ ఉత్పత్తిలో కల్తీ రంగులు, రసాయనాలను వాడరాదని తెలిపారు. అందులో హానికారక రంగుల వాడకం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు -
భలే.. సీతాకోకచిలుకలు
బనశంకరి: బెంగళూరు బిన్నిమిల్ మైదానంలో సీతాకోకచిలుకల ఉద్యానవనంలో రోబోటిక్ సీతాకోకచిలుకలు, కీటకాలు ఆకృతులతో జాగృతి ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నేటి ఆధునిక యుగంలో సీతాకోకచిలుకలు కనుమరుగు అవుతున్నాయి. అవి లేకపోతే ప్రకృతికి ముప్పు అనే నినాదంతో ప్రజల్లో జాగృతం చేయడానికి రోబోటిక్ సీతాకోకచిలుకల ప్రదర్శన ఏర్పాటైంది. ఇంకా తూనీగలు, మిడతల బొమ్మలు బాలలు ఆకట్టుకుంటున్నాయి. రోజూ సాయంత్రం 4 గంటలనుంచి 9 వరకు జరుగుతుంఇ. జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ఊపిరి తీసిన సిగరెట్ మండ్య: ధూమపానం ఏరూపంలో ఉన్నా ప్రాణాలు తీస్తుందని అంటారు. అలాంటిదే ఈ ఉదంతం. సిగరెటు తాగుతూ బాటిల్లో తీసుకొని వచ్చిన పెట్రోల్ బైకు ట్యాంకులో పోస్తుండగా మంటలు అంటుకుని మృత్యువాత పడ్డాడో యువకుడు. జిల్లాలో కేఆర్ పేటె తాలూకాలోని కిక్కెరి వద్ద అన్నెజానకనహళ్ళి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ (25), మార్చి 26వ తేదీన సాయంత్రం బంక్ నుంచి పెట్రోల్ను ఓ సీసాలో తీసుకువచ్చి తన బైక్లో పోస్తున్నాడు. ఆ సమయంలో అతడు సిగరెట్ తాగుతున్నాడు. పెట్రోల్ ఒలికిపోయి కొంత అతని మీద పడింది. వెంటనే సిగరెట్ వేడికి మంటలు అంటుకున్నాయి. కాలిన గాయాలైన రాకేష్ని కొందరు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కానీ అతని పరిస్థితి సీరియస్గా మారింది. ఆదివారం రాత్రి మరణించాడు. చిన్న అజాగ్రత్త నిండు ప్రాణాలను బలిగొందని గ్రామస్తులు వాపోయారు. -
కొరియర్ పార్శిల్ బట్వాడాపై గొడవ
కోలారు : కొరియర్ పార్శిల్ ఇచ్చే విషయంపై కొరియర్ డెలివరీ బాయ్, మరో యువకుడి మధ్య గొడవ ప్రారంభమై కత్తిపోట్లకు దారి తీసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అంతకు ముందు కొరియర్ బాయ్, యువకుడి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొరియర్ బాయ్ నగరంలోని కీలుకోట నివాసి పవన్, అతని సోదరుడు మోహన్లతో బైక్లో తాలూకాలోని ముదువాడి హొసహళ్లి గ్రామానికి చేరుకుని గ్రామానికి చెందిన చేతన్, యువరాజ్లతో గొడవకు దిగారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని పవన్, మోహన్లు తమ వద్ద ఉన్న కత్తితో చేతన్, యువరాజ్ల కడుపులో పొడిచారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన చేతన్, యువరాజ్లను గ్రామస్తులు వెంటనే కోలారు ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనతో ఉద్రిక్తులైన గ్రామస్తులు గుంపుగా చేరి పవన్, మోహన్ల దుస్తులు ఊడదీసి కరెంటు స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న కోలారు రూరల్ పోలీసులు హూటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల నుంచి మోహన్, పవన్లను విడిపించి స్టేషన్కు తీసుకు వచ్చారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
లోక్సభలో ఎంపీలకు మాట్లాడే హక్కు లేదా?
రాయచూరు రూరల్: లోక్సభలో ప్రతిపక్ష పార్టీ లోక్సభ సభ్యులకు మాట్లాడే హక్కు లేదా? అని రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్ ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు మాట్లాడానికి వీలు లేకుండా స్పీకర్లకు మైక్ కట్ చేయడాన్ని ఖండించారు. బడె్జ్ట్ పద్దులపై ప్రతిపక్ష నేతలు ప్రసంగించడానికి మైక్రో ఫోన్లు అవకాశం కల్పించక పోవడంతో త్వరలో న్యూఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్లు నాయక్ తెలిపారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయాలని బీజేపీ ఎంపీ మంజునాథ్ మద్దతు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు బసన గౌడ, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, సభ్యులు అమరే గౌడ, శాంతప్ప, శివమూర్తి, జయన్నలున్నారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
సాక్షి,బళ్లారి: నెల రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేపట్టి పవిత్రంగా రంజాన్ ఆచరించిన ముస్లిం సోదరులు తమ ఉపవాస దీక్షలు విరమించారు. సోమవారం రంజాన్ పర్వదినం సందర్భంగా నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించిన ఉపవాసాన్ని విరమించి రంజాన్ పండుగను జరుపుకున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ముస్లిం సోదరులు ఇంటింటా ప్రతి ఒక్కరు కొత్త బట్టలు ధరించి మహిళలు ఇంట్లోనే ప్రార్థనలు చేయగా, పురుషులందరూ చిన్నా, పెద్దా, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన మసీదుల్లో ప్రార్థనలు చేశారు. నగరంలో ప్రముఖంగా ఈద్గా మైదానంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరి సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత గురువు ముస్లిం సోదరులతో సామూహిక ప్రార్థనలు చేయించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. పవిత్ర రంజాన్ వేళ వేలాది మంది ముస్లిం సోదరులు ఒకే చోట చేరిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆయా మసీదుల వద్దకు చేరుకుని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో ప్రముఖ ఈద్గా మైదానం వద్దకు చేరుకుని లోక్సభ సభ్యుడు తుకారాం, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తదితరులు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘనంగా రంజాన్ పండుగ హొసపేటె: రంజాన్ పండుగ వేడుకలు సోమవారం ముస్లిం సోదరులు విజయనగర జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక ఉన్న ఈద్గా మైదానంలో ఉదయం 7.30 గంటలకు, కేఆర్టీసీ బస్ డిపో సమీపంలోని కొత్త ఈద్గా మైదానంలో ఉదయం 8.30 గంటలకు, చిత్తవాడిగి, కారిగనూరు ఈద్గా మైదానాల్లో ఉదయం 9 గంటలకు, నాగేనహళ్లి ఈద్గా మైదానంలో ఉదయం 9.30 గంటలకు, టీబీ డ్యాం ఈద్గా మైదానంలో ఉదయం 10 గంటలకు సామూహిక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ప్రతిచోటా శాంతియుత సామూహిక ప్రార్థనలు జరిగాయి. ముందుగా ఊరేగింపులో నడిచిన వ్యక్తులు ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఒక సాధారణ దృశ్యం. కొత్త బట్టలు ధరించి మండుతున్న ఎండలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులను కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు ఎట్టకేలకు పవిత్ర ఉపవాస దీక్షల విరమణఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు రాయచూరు రూరల్: ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో సోమవారం ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మాట్లాడుతూ జిల్లాలో హిందూ, ముస్లింలు అన్నదమ్ములుగా ఉన్నామన్నారు. మనమంతా ఒక్కటే అనే భావాలను చాటడానికి రంజాన్ పండుగ చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, రవి, లోక్సభ సభ్యుడు కుమార నాయక్లున్నారు. మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్, తలమారిలో గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
కుటుంబానికి తల్లి వెలుగు వంటిది
హొసపేటె: ప్రతిఫలం ఏమీ ఆశించకుండా మనందరికి నిరంతరం సలహాలిచ్చే తల్లి మన కళ్ల ముందు ఉండాలని కూడ్లిగి సబ్ డివిజన్ డీఎస్పీ మల్లేష్ దొడ్డమని తెలిపారు. సోమవారం పట్టణంలోని పర్యాటక కేంద్రంలో కూడ్లిగి సబ్ డివిజన్ తరపున జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. దేవుని రూపంలో ఉన్న మన తల్లి 24 గంటలూ మనకు వెలుగుగా ఉంటూ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ మహిళలు సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. మహామహి, ఒక నిస్వార్థ వ్యక్తి అని, ఆమె చేసిన పనికి ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఆమె కుటుంబ శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పని చేశారని తెలిపారు. ప్రతి విజయవంతమైన మహిళ వెనుక ఒక పురుషుడు ఉంటాడనేది నిజం. పురుషుడు మహిళలను ప్రోత్సహించకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. జ్యోతిబాపులే అక్షర సావిత్రి బాయి పూలేలు ఆ రోజుల్లో మహిళలు విద్యకు చేరువయ్యేలా చేశారన్నారు. పురుషులు, సీ్త్రలు ఓకే నాణేనికి రెండు వైపులా ముఖాలన్నారు. పితృస్వామ్య సమాజంలో కూడా నేడు మహిళలు అన్ని రంగాల్లో తమను తాము విజయవంతంగా నిరూపించుకున్నారన్నారు. అసమర్థులు కాదు, సమర్థులు, భారతదేశంలో మహిళలు తమ హక్కుల కోసం మాత్రమే కాకుండా మహిళా సమానత్వం కోసం కూడా పోరాడారు. రాజారామ్ మోహన్ రాయ్ సహా అనేక మంది మహానుభావులు స్వాతంత్య్రానికి ముందు సతీ ఆచారాన్ని వ్యతిరేకించి, సీ్త్రస్వేచ్ఛ కోసం పోరాడారనే వాస్తవం ఈ నేల సంస్కృతికి నిదర్శనమన్నారు. ఇతర దేశాల్లో మహిళలు తమ హక్కుల కోసం స్వయంగా పోరాడాల్సి వస్తోందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో గణనీయమైన సేవలందించిన ప్రముఖులను సన్మానించారు. -
బ్యాంకు దొంగల అరెస్టు, 17 కేజీల బంగారం సీజ్
యశవంతపుర: దావణగెరె జిల్లా న్యామతి ఎస్బీఐ బ్యాంక్లో దోపిడీకేసులో ఆరుమంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువగల 17 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఐజీ రవికాంతేగౌడ వివరాలను వెల్లడించారు. సినిమా లెవెల్లో లూటీ తమిళనాడులో మదురై ప్రాంతానికి చెందిన విజయకుమార్ (30), అజయకుమార్ (28), పరమానంద (30), అభిషేక్ (23), చంద్రు (23), మంజునాథ్ (32)లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2024 అక్టోబర్ 28న దావణగెరె న్యామతి ఎస్బీఐ బ్యాంక్లో గ్రిల్స్ను తొలగించి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల తీగలు, అలారం తీగలను కత్తిరించారు. ఆపై లాకర్లను పగలగొట్టి బంగారు నగలను దోచుకెళ్లారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన 17 కేజీల బంగారు ఆభరణాలు దొంగల పాలయ్యాయి. ఇది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. మొబైల్ టవర్లలో దొరికిపోతామనే భయంతో దొంగలు మొబైల్ ఫోన్లను వాడలేదు. పోలీసులకు ఎలాంటి ఆధారం లభించకుండా ప్లాన్ చేశారు. లోతైన గుంతలో నగల పెట్టెలు జిల్లా పోలీసులు అప్పటినుంచి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ముమ్మరంగా గాలించి దొంగలను పట్టుకున్నారు. దొంగలు తమిళనాడులోని మదురై వద్ద ఉసిలంపట్టి అనే ఊరిలో ఊరిబయట గుంత తవ్వి అందులో నగల పెట్టెలను దాచిఉంచారు. విజయకుమార్ ఈ కేసులో సూత్రధారిగా గుర్తించారు. అతడు బేకరీ నడుపుతూనే దొంగతనాలకు పాల్పడేవాడని గుర్తించారు. ఆభరణాలతో పాటు దోపిడీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీడిన న్యామతి బ్యాంకు రాబరీ కేసు గతేడాది అక్టోబరులో దావణగెరె జిల్లాలో ఘటన నిందితులు తమిళనాడువాసులు -
మది నిండా రంజాన్ శోభ
తుమకూరు: నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు ఉండిన ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఉదయమే మసీదులు, ఈద్గాలకు వెళ్లి విశేష ప్రార్థనలు చేశారు. రంజాన్ సందేశాన్ని మతగురువులు వినిపించారు. ఈ సందర్భంగా పిల్లలూ పెద్దలూ పరస్పరం ఈద్ ముబారక్ అని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బెంగళూరులోని ప్రఖ్యాత చామరాజపేట ఈద్గా మైదానంలో వేలాదిగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో రంజాన్ శోభ కనిపించింది. బంధుమిత్రులతో విందు భోజనాలను ఆరగించారు. తుమకూరులో కుణిగల్ రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రార్థనాలు చేశారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్, పెద్దసంఖ్యలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడా అవాంఛనీయాలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఈద్ ఆచరణ అంతటా సామూహిక ప్రార్థనలు -
ముగ్గురు పోలీసులకు ముఖ్యమంత్రి పతకం
హొసపేటె: విజయనగర డీఏఆర్ ఆర్పీఐ జి.శశికుమార్, హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ పీఎస్ఐ హెచ్.నాగరత్న, కూడ్లిగి తాలూకాలోని గుడెకోటె పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కొట్రేష్ చిమ్మల్లి ముఖ్యమంత్రి పతకాలకు ఎంపికయ్యారు. 2024వ సంవత్సరానికి ముఖ్యమంత్రి పతకాల జాబితా ప్రకటించగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. విజయనగర జిల్లా సాయుధ రిజర్వ్ ఫోర్స్కు చెందిన డీఏఆర్ ఆర్పీఐగా ఉన్న శశికుమార్ ఇటీవలే చిత్రదుర్గకు బదిలీ అయ్యారు.భద్రా నుంచి తుంగభద్రకు 2 టీఎంసీల నీరు● ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటనహొసపేటె: తాగునీటి అవసరాల కోసం భద్రా డ్యాం నుంచి తుంగభద్ర డ్యాంకు రెండు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఏప్రిల్ 1, 5వ తేదీల మధ్య కాలువలోకి నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం నిర్ణయించారు. దీని వల్ల కళ్యాణ కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి తదితర జిల్లాల్లో పండించే పంటలకు, ఇక్కడి ప్రజలకు తాగునీటి లభ్యత లభిస్తుంది. మార్చి 30 నాటికి భద్ర జలాశయంలో 28 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇందులో మే 8 వరకు 11 టీఎంసీలు సాగునీటికి, 14 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా, 3 టీఎంసీల నీటిని జలాశయంలో నిలుపుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6 నుంచి కాలువలను తాగునీటి సరఫరాకు మాత్రమే ఉపయోగిస్తారు. రైతుల పంటలకు తాగునీరు అందించడానికి ప్రభుత్వం అన్ని స్థాయిల్లో కట్టుబడి ఉందని ఆయన అన్నారు.యత్నాళ్తో కాంగ్రెస్ నేత భేటీపై సర్వత్రా చర్చహుబ్లీ: బీజేపీ నుంచి బహిష్కృతుడైన విజయపుర ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కాంగ్రెస్లో చేరుతారు. కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది అన్న చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ కాంగ్రెస్ నేత యత్నాళ్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ధార్వాడ గ్రామీణ శాఖ, జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ పాటిల్ సోమవారం ప్రైవేట్ హోటల్లో యత్నాళ్ను కలవడంతో తమ పార్టీలోకి ఆహ్వానించారా? అన్న విషయంపై స్పష్టత రాకున్న తీవ్రంగా చర్చకు దారి తీసింది. దీన్ని యత్నాళ్ కూడా తోసిపుచ్చినా దానికి దోహద పడేలా కాంగ్రెస్ నుంచి ప్రముఖుడు కలవడం కుతుహలం రేకెత్తిస్తోంది. బెంగళూరు నుంచి మార్గమధ్యంలో హుబ్లీకి వచ్చిన యత్నాళ్ను అనిల్కుమార్ కలిసి కొద్దిసేపు హోటల్లో చర్చించడం కాకతాళీయమా? లేక పనిగట్టుకొని కలిశారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.శ్రీశైలం భక్తులకు అన్నదానంరాయచూరు రూరల్ : శ్రీశైల మల్లికార్జునుని దర్శనార్థం బయలుదేరి వచ్చిన కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రజలు భక్తులకు ఉచిత భోజనం అందించారు. సోమవారం బైపాస్ రహదారిలోని ముగుళకోడ ముక్తి మందిర మైదానంలో వీరశైవ సమాజం, బసవ సమితి ఆధ్వర్యంలో శాంతమల్ల శివాచార్యులు, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు భక్తులకు భోజనం వడ్డించారు. లోక్సభ సభ్యుడు కుమార నాయక్, వీరశైవ సమాజం అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటిల్, అమరేగౌడ, జయన్న, కరియప్ప, శాంతప్ప, శివమూర్తి, జయంతిరావ్ పతంగిలున్నారు.స్వయంకృషితో ఎదగాలిరాయచూరు రూరల్ : విద్యార్థులు స్వయంకృషితో ముందుకు రావాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అన్నారు. సోమవారం హరిజనవాడ ఆవరణలో నవరత్న యువక సంఘం తరఫున విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా, సాంఘీకంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రవీంద్ర జాలదార్, విరుపాక్షి, నరసింహులు, మల్లేశప్ప, నాగరాజ్, శరణప్ప, ప్రతిభారెడ్డి, తిమ్మయ్య, తిమ్మప్ప, అంబణ్ణ, జనార్దన్, అనిల్కుమార్లున్నారు. -
ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగులకు బకాయి వేతనాలేవీ?
రాయచూరు రూరల్: ఒపెక్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ ఒపెక్ ఆస్పత్రి ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం ఒపెక్ ఆస్పత్రి వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మానసయ్య మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి ఆరు నెలల నుంచి వేతనాలు లేవన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలన్నారు. ఒపెక్ ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. అల్లమ ప్రభు జయంతి రాయచూరు రూరల్ : శతమాన శ్రేష్ట శరణ చింతకుడు అల్లమ ప్రభు జయంతి ఉత్సవాలను సోమవారం బసవ కేంద్రంలో ఆచరించారు. బసవ కేంద్రంలో అల్లమ ప్రభు చిత్రపటానికి కేంద్రం అధ్యక్షుడు రాచనగౌడ పుష్పాంజలి ఘటించి మాట్లాడారు. అల్లమ ప్రభు పేదల పాలిట దేవుడని, వారి ఆకలిని తీర్చిన అన్నదాతగా చిరస్మరణీయుడన్నారు. 1645 వచనాలను రాసిన మహా మేధావి అన్నారు. ఈ సందర్భంగా శివకుమార్, చెన్నబసవ, వెంకణ్ణ, మల్లికార్జున, రాఘవేంద్రలున్నారు. పోస్టర్ విడుదల హుబ్లీ: ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప కార్యం మరొకటిది లేదు. తమకు చేత కాకున్నా ఉన్న వారి నుంచి అన్నాన్ని సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేస్తున్న కరియప్ప, సునంద శిరహట్టి దంపతులు చేస్తున్నది పుణ్య సేవ అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరళి నాగరాజ్ గంగావతి తెలిపారు. సోమవారం ఆనంద నగర్లో కరియప్ప శిరహట్టి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హసిదవర అన్న జోళిగె పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆ దంపతులు పేదలైన నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు ఏమైనా సాయ పడాలన్న ఉద్దేశంతో అన్న జోళిగె కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టడం ఆదర్శప్రాయం అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి, అశోక్ అణ్ణిగేరి తదితరులు పాల్గొన్నారు. -
శాంతికి చిహ్నం రంజాన్
చెళ్లకెరె రూరల్: ముస్లిం బాంధవులు నెలంతా భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపి పండుగను ఆచరించడం సంతోషదాయకం అని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన బెంగళూరు రోడ్డులోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు. ముస్లిం సమాజ గురువు నూర్ ఉద్దీన్ మౌలాన్ రంజాన్ పండుగ విశేషతను తెలిపారు. అనంతరం ముస్లిం బాంధవులు శుభాంకాక్షలు తెలుపుకున్నారు. నగరసభ అధ్యక్షురాలు మంజుల ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షురాలు ఉమా భరమయ్య, నగరసభ సభ్యులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువతులతో ప్రేమాయణం
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం వేలాడుతున్నా చూడకుండా.. ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
ఆకట్టుకున్న బయలాట ప్రదర్శన
బళ్లారి అర్బన్: అభినయ కళా కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సిరిగుప్ప తాలూకా బూదిగుప్ప గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ కళా సౌరభ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమాన్ని వీఎస్ఎస్ఎన్ అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కన్నడ సాంస్కృతిక శాఖ గ్రామీణ ప్రాంతంలో బయలాట కళకు ప్రోత్సహం అందించడం హర్షనీయమన్నారు. శ్రీ బసవేశ్వర రంగసజ్జ యజమాని విశ్వనాథ్ సౌకర వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. సిడిగినమళే బలే సిద్దప్ప, రచించిన వీరఅభిమన్యు నాటకంలో కృష్ణార్జునల ఘట్టాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. కళా కేంద్ర అధ్యక్షుడు సీనియర్ కళాకారుడు కే.జగదీశ్, సీనియర్ కళాకారులు ఈరప్ప సౌకర, రంగరెడ్డి మేస్టారు, ఎర్రిస్వామి మేస్టారు, వందవాగలి సిద్దప్ప, కవి సోమశేఖర్ పాల్గొన్నారు. జీవన్, చక్రవర్తి, హులూరు రమేష్, దొడ్డ హనుమంతలు తమ పాత్రలలో ప్రతిభ చాటి ప్రేక్షకుల మన్నన పొందారు. సీనియర్ సంగీత కళాకారుడు వీరాపుర రంగారెడ్డి, సిద్దప్ప, బూదిగుప్ప ఎర్రిస్వామి, ఆర్మోనియంతో తమదైన శైలిలో బైలాటను రక్తికట్టించారు. బసవరాజ్ తబళ, చిక్కన్న తదితరులు ఇతర సహయ సహకారాలు అందించారు. -
బైక్ను ఢీకొన్న బస్సు.. ఇద్దరి మృతి
● 40 మంది ప్రయాణికులకు గాయాలు సాక్షి,బళ్లారి: బస్సు బైక్ను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందగా 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈఘటన ముధోళ తాలూకా ముగళకోడ గ్రామ సమీపం జరిగింది. గ్రామానికి చెందిన శంకరప్ప(55) శ్రీదేవి(45) దంపతులు ఉగాది పర్వదినం పురస్కరించుకొని ముందు రోజు అమావాస్య సందర్భంగా పొలంలో పూజలు చేసేందుకు బైక్లో వెళ్లారు. తిరిగి వస్తుండగా యాదగిరి జిల్లా చిక్కొడికి చెందిన బస్సు బైక్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో దంపతులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న దాదాపు 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముధోళ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పారువేటను హలాల్ రహితంగా నిర్వహించుకోవాలి
హుబ్లీ: ఉగాది అనంతరం పారువేటను హాలాల్ రహితంగా నిర్వహించుకోవాలని శ్రీరామ సేనా ముఖ్యస్తులు ప్రమోద్ ముతాలిక్ సూచించారు. ధార్వాడలో మీడియాతో మాట్లాడారు. హాలాల్ అన్నది ఇస్లాంకు సంబంధించింది. అది హిందూవులకు సంబంధించినది కాదన్నారు. బసవన్నగౌడ పాటిల్ యత్నాల్ బహిష్కరణ గురించి ఆయన మాట్లాడుతూ బీజేపీ హై కమాండ్ ఈ విషయంలో పునర్ పరిశీలించాలని సూచించారు. తండ్రి మృతి చెందిన దుఃఖంలోనూ పరీక్షకు హాజరు హొసపేటె: తండ్రి మరణించిన దుఃఖంలోనూ టెన్త్ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. హోస్పేట్లోని టీబీ డ్యామ్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థి హరిధరన్ తండ్రి సెల్వకుట్టి శుక్రవారం తమిళనాడులో అనారోగ్యంతో మరణించాడు. తండ్రి ఆరోగ్యం క్షీణించినప్పుడు హరిధరన్ తమిళనాడు వెళ్లి చూచి వచ్చాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో సెల్వకుట్టి మృతి చెందాడు. అయినా ఆ బాధను దిగమింగి హరిధరన్ పరీక్ష రాశాడు. నీటి వనరులను పరిరక్షించాలి హుబ్లీ: కేఎల్ఈ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశ్వజల దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. జలవనురుల శాఖ, నీటిపారుదల కార్పొరేషన్ ధార్వాడ విభాగం చీఫ్ ఇంజినీర్ అశోక్ ఎల్ వాసన్ మాట్లాడుతూ నీటి పొదుపు పాటించి బావి తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా నీటి పొదుపు వినియోగం పరకరాల ప్రదర్శణ ఏర్పాటు చేశారు -
ఉద్యోగిని సేవలు మరువలేనివి
బళ్లారి రూరల్ :బీఎంసీఆర్సీలో మేట్రిన్ (నర్సింగ్ సూపరింటెండెంట్) కె.నాగరత్నమ్మ సేవలు మరవరానివని బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ అన్నారు. కె.నాగరత్నమ్మ ఉద్యోగ విరమణ సదర్భంగా శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్టాఫ్ నర్సుగా బళ్లారి మెడికల్ కళాశాలలో చేరి అనంతరం విమ్స్ హెడ్నర్సుగా, మేట్రిన్గా, బీఎంసీఆర్సీ మేట్రిన్గా రోగులకు విశేష సేవలు అందించారన్నారు. నాగరత్నమ్మ అందరిపట్ల సౌమ్యంగా మాట్లాడేవారని, ఆమెను తల్లిలా భావించేవాడినని తెలిపారు. అనంతరం కె.నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు. ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్ సూపరిన్టెండెంట్లు డాక్టర్ ఇందుమతి, డాక్టర్ శివనాయక్, నర్సులు సిబ్బంది పాల్గొన్నారు. -
యత్నాళ్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
రాయచూరు రూరల్: విజయపుర శాసనసభ్యుడు బసన గౌడ పాటిల్ యత్నాళ్పై బీజేపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని హిందూపర సంఘటనలు ఉద్యమించాయి. ఈమేరకు నాయకులు శుక్రవారం రాత్రి విజయపుర నగరలోని సిద్దేశ్వర ఆలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్వామి వివేకానంద సేన అధ్యక్షుడు రాఘవ మాట్లాడుతు తండ్రీకొడుకుల కుమ్మక్కుతో గౌడను బహిష్కరించారని ఆరోపించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రుద్రగౌడ, పాటిల్, నాగరాజ్గురు గచ్చిన మనె, ప్రతాప్ పాల్గొన్నారు. లోకాయుక్త వలలో ఇద్దరు అధికారులు బళ్లారి రూరల్: లంచం తీసుకుంటూ ఇద్దరు బెస్కాం అధికారులు లోకాయుక్తకు చిక్కారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా మల్లాపురానికి చెందిన రైతు సోమశేఖరప్ప పొలంలో విద్యుత్తు మీటర్ ఎడాది క్రితం కాలిపోయింది. కొత్తమీటరు ఏర్పాటుచేయాలని సంతెబెన్నూర్ జెస్కాం అసిస్టెంట్ ఇంజినీరు మోహన్కుమార్, సెక్షన్ అధికారిని సంప్రదించాడు. మీటర్ బిగించడానికి రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం శనివారం నగదు చెల్లిస్తుండగా లోకాయుక్త కమిషనర్ ఎం.ఎస్. కౌలా పూర, ఉపకమిషనర్ కళావతి ఆధ్వర్యంలో అధికారులు హెచ్.గురు బసవరాజ,సరళ దాడి చేశారు. జెస్కాం అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్, సెక్షన్ అధికారిని అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. కుట్టుమిషన్ల పంపిణీ హొసపేటె: దివంగత దేవరాజ అరస్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 26 మంది లబ్ధిదారులకు శనివారం నగరంలో గాంధీచౌక్ సమీపంలోని రీడింగ్ రూమ్ ఆవరణలో కుట్టు యంత్రాలను ఎమ్మెల్యే గవియప్ప పంపిణీ చేశారు. అదేవిధంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ, గ్రామీణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 41 మందికి ఉచిత విద్యుత్ కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు. టీబీ డ్యామ్ 19వ క్రస్ట్ గేట్ ఊడిపోవడం వల్ల నష్టపోయిన 80 మంది మత్స్యకారులకు రూ.30వేలు చొప్పున పరిహారం చెల్లించారు. రూ.10వేల విలువైన ఫిషింగ్ కిట్లను పంపిణీ చేశారు. ఉచిత పథకాలు ప్రమాదకరం హుబ్లీ: ఉచిత పథకాలు ప్రమాదకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర పాలన, సంస్కరణ పాలన అధ్యక్షుడు ఆర్వీ దేశ్పాండే అన్నారు. ఉత్తర కన్నడ జిల్లా దాండేలి అంబే వాడిలో నూతనంగా నిర్మించిన సహయ ప్రాంతీయ రవాణా శాఖఅధికారుల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఏమి కూడా ఉచితంగా ఇవ్వరాదన్నారు.మహిళలకు శక్తి పథకం కింద ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని కల్పించారని, ఈ పథకాన్ని పురుషులకు కూడా విస్తరించాలన్న డిమాండ్ వినిపించిందన్నారు. అన్నిటిని ఉచితంగా ఇస్తే ప్రభుత్వం రవాణా సంస్థలను ఎలా నడపగలదని ఆయన ప్రశ్నించారు. -
ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం
సాక్షి,బళ్లారి: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు ప్రజలు, కన్నడిగులు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని పండగు సరుకుల కోసం శనివారం ప్రజలు మార్కెట్లకు పోటెత్తారు. బళ్లారిలోని బెంగళూరు రోడ్డులోని దుకాణాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు, దుస్తుల దుకాణాలు కొనుగోలు దారులతో నిండిపోయాయి.మరో వైపు ఇళ్లను శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకున్నారు. ఉగాది పచ్చడి చేసుకునేందుకు వేపపూతను సేకరించుకున్నారు. ఖరీఫ్ సీజన్లో తుంగభద్ర ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు చేతికందడంతో పండుగను ఉత్సాహంగా చేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. జంట నగరాల్లో ఉగాది వేడుకలు హుబ్లీ: జంట నగరాలలో ఉగాది ఉత్సవాలు శనివారం నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నవనగర్ సమీపంలోని పంచాక్షరిలోని కాళికాదేవి మహాభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. అలాగే ధనధాన్యాలను సమర్పించి సేవలు నెరవేర్చారు. ఆదివారం పాడ్యమి రోజు కాళిక దేవికి సందేశ పోతేదార కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతన పల్లకీ సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. పల్లకీని బన్ని మహంకాళి ఆలయం నుంచి పూర్ణకుంభాలు, వివిధ వాయిద్యాల ప్రదర్శనతో ఆలయానికి తీసుకువస్తారు. -
పనుల కేటాయింపులో పీడీఓ పక్షపాతం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మస్కి తాలూకా తోరణ దిన్ని పంచాయతీ పీడీఓపై చర్యలు చేపట్టాలని ఆ పంచాయతీ మాజీ అధ్యక్షురాలు చంద్రమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడారు. నవంబర్లో గ్రామ పంచాయతీ సభలో తీసుకున్న నిర్ణయం మేరకు వార్డుల్లో పనుల చేపట్టడానికి రూ.35 లక్షలు మంజూరు కాగా పీడీఓ తిమ్మప్ప నాయక్ పంచాయతీ అధ్యక్షుడితో కుమ్మకై ్క పనులు కేటాయించడంలో పక్షపాతం చూపుతున్నారని ఆమె ఆరోపించారు. కార్యాలయం నుంచి బయటకు వెళ్లాలని పీడీఓ హుకుం జారీ చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెన్త్ పరీక్షలకు 463 మంది గైర్హాజరుహొసపేటె: ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు శనివారం కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలు ఉండగా 20246 మంది విద్యార్థులు హాజరైనట్లు, 463 మంది గైర్హాజరైనట్లు డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప తెలిపారు. హగరిబొమ్మనహళ్లిలోని 12 కేంద్రాల్లో 3012 మంది హాజరు కాగా, 53 మంది గైర్హాజరయ్యారన్నారు. హోస్పేటలోని 20 కేంద్రాలకు 5658 మంది హాజరు కాగా, 140 మంది గైర్హాజరయ్యారన్నారు. 9 కేంద్రాల్లో జరిగిన ఫ్లవర్ బోట్ పరీక్షకు 2757 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారన్నారు. కూడ్లిగిలోని 17 కేంద్రాల్లో 4811 మంది హాజరు కాగా, 122 మంది గైర్హాజరయ్యారన్నారు. హరపనహళ్లిలో 13 కేంద్రాల్లో4008 మంది హాజరు కాగా, 115 మంది గైర్హాజరయ్యారన్నారు. -
పండుగకు వస్తుండగా మృత్యు పంజా
సాక్షి,బళ్లారి: పొట్టకూటి కోసం సుదూర ప్రాంతానికి వెళ్లి ఉగాది పండుగను స్వగ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా చేసుకోవాలని వస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. చెళ్లకెర తాలూకా తిమ్మననహళ్లి లంబాడిహట్టి గ్రామానికి చెందిన అన్నదమ్ములు కుమారనాయక్(46),శంకర్బాయ్(65)లు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. టెంపో వాహనం, కారు కొనుగోలు చేసుకుని బాడుగులకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నారు. ఉగాది పండుగను స్వగ్రామంలో చేసుకోవాలని భావించి రెండు కుటుంబాల వారు టెంపో వాహనంలో బయల్దేరారు. మరో గంటలో ఊరికి చేరుకోవాల్సి ఉండగా చెళ్లకెర తాలూకా హెగ్గేరి ఫ్యాక్టరీ సమీపంలో టిప్పర్ ఎదురైంది. రెండు వాహనాలు డీకొనడంతో కుమారనాయక్, శంకర్భాయ్తోపాటు శ్వేతా(38) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందారు. లక్ష్మీబాయి, ప్రశాంత్, శైలజ, పుష్పావతి, ప్రీతమ్కుమార్, తిప్పేస్వామితోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చెళ్లకెర పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతదేహాలను చెళ్లకెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేపట్టారు. మిన్నంటిన రోదనలు ప్రమాదం విషయం తెలిసి బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న తమ వారి చూసి విలపించారు. గంటలోనే ఇంటికి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లారా అంటూ రోదించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గొల్లరహట్టి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా బైక్ను కారు ఢీకొట్టింది. బైకర్తోపాటు మరొకరు తీవ్రంగా గాయపడగా హోస్పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. హగరిబొమ్మనహళ్లి పోలీస్లు కేసు దర్యాప్తు చేపట్టారు. టెంపో ట్రావల్ వాహనం, టిప్పర్ ఢీ చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకాలో ఘటన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం బడుగుల కుటంబాల్లో మిన్నంటిన విషాదం -
1 నుంచి ఉపాధి పథకం కూలీ పెంపు
బళ్లారిటౌన్: ఉపాధి హామీ పథకం కూలీలకు ఏప్రిల్ 1నుంచి కూలీ మొత్తం పెరగనుంది. రోజుకు రూ.370కు పెంచి ఎండకాలంలో నిరంతరం 100 రోజులు పని కల్పిస్తున్నట్లు జిల్లా పంచాయతీ సీఈఓ మహమ్మద్ హ్యరీష్ సుమైర తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.349 ఉన్న కూలీని సవరించి రూ.370కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కార్మికులు నమూన 6లో దరఖాస్తులను గ్రామ పంచాయతీలో సమర్పించి 100 రోజులు ఈ పనినిలో పాల్గొనవచ్చునన్నారు. మరిన్ని వివరాలకు ఆయా గ్రామ పంచాయతీలో తెలుసుకొవచ్చునని పేర్కొన్నారు. -
క్రిమినల్ చర్యలు చేపట్టాలి
రాయచూరురూరల్: నగరలోని మోథడిస్ట్ చర్చి, బాల్డ్విన్ విద్యాసంస్థ మాజీ చీఫ్ యనయల్, కర్కరేపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మోథడిస్ట్ చర్చి ఇండియా నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళనకు దిగారు. జిల్లాద్యక్షుడు అబ్రహాం జో హన్ మాట్లాడారు. కర్కరే 2016 నుంచి ఆయా సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారికి వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో డ్యానియల్, సురేంద్ర, అశీర్వాదం, నందకుమార్, ప్రమోద్, సిమోన్, రుబిన్, లక్ష్మయ్య, శాంతరాజ పాల్గొన్నారు. -
పశువుల స్నానం.. ముగ్గురికి మృత్యుపాశం
మైసూరు: ఉగాది పండుగ సందర్భంగా పశువులను కడగడానికి చెరువులోకి వెళ్ళిన ముగ్గురు అనుకోకుండా నీట మునిగి చనిపోయారు. జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కామనహళ్ళిలో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది. వినోద్ (17), బసవేగౌడ (45), ముద్దేగౌడ (48)లు పండుగ కావడంతో తమ పశువులకు స్నానం చేయించి అలంకరించాలని చెరువుకు తీసుకెళ్లారు. ఓ ఎద్దు బెదిరి చెరువులోకి పరుగులు తీసింది. తాడు పట్టుకుని ఉన్న వినోద్ను కూడా లాక్కెళ్లింది. మిగతా ఇద్దరు అతన్ని కాపాడాలని వెళ్లారు. కానీ నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి చెరువులో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదం తాండవించింది. -
ఎయిమ్స్ ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: రాయచూరులో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎయిమ్స్ పోరాట సమితి ప్రధాన సంచాలకుడు బసవరాజ్ కళస డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గతంలో అనేక మార్లు సీఎం సిద్దరామయ్య, ప్రధాని మోదీకి వినతిపత్రాలు అందించామన్నారు. మరోసారి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.బాలికపై కుక్కల గుంపు దాడిరాయచూరురూరల్: బాలికపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈఘటన రాయచూరు తాలూకా మర్చటాల్ గ్రామంలో జరిగింది. చైత్ర అనే తొమ్మిదేళ్ల బాలిక శనివారం ఉదయం తన ఇంటి వద్ద అడుకుంటుండగా కుక్కల గుంపు చుట్టుముట్టింది. బాలిక కేకలు వేస్తూ తప్పించుకునేందుకు యత్నించగా కుక్కలు వెంటాడి కరిచాయి. దీంతో బాలక ఒంటిపై పది చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాలికను రిమ్స్కు తరలించారు. కాగా కుక్కల బెడదను నివారించాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించినా స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలిరాయచూరు రూరల్: జిల్లాలోని తుంగభద్ర–కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణపై జిల్లా కలెక్టర్ నిఘా ఉంచాలని జన సంగ్రామ పరిషత్ అధ్యక్షుడు రాఘవేంద్ర కుిష్టిగి డిమాండ్ చేశారు. శనివారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాజకీయ నాయకుల అనుచరులు ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తవ్వకాలకు కొంత అనుమతి పొంది ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు.విద్యుత్ చార్జీల పెంపు అన్యాయంరాయచూరురూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎం లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అందోళన చేపట్టారు. జిల్లాధ్యక్షుడు అజీజ్ జాగిర్దార్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల సిబ్బంది వేతనాల కోసం చార్జీలు పెంచడం దారుణమన్నరు. యూనిట్కు 36 పైసలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుందన్నారు. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంజినేయ, రవిచంద్ర, హనీఫ్, జిలాని, మహేంద్ర, అనంద్ పాల్గొన్నారు.నీటి ఎద్దడి తలెత్తనివ్వంరాయచూరు రూరల్: కృష్ణానది తీర ప్రాంత గ్రామాల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే అన్నారు. శనివారం ఆయన గుర్జాపూర్ అనకట్టను పరిశీలించారు. కృష్ణా నది నుంచి పంప్ సెట్ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. మంచినీటి పథకాలకు మరమ్మతులు చేపట్టి నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. -
దుర్గామాతకు ఉగాది పూజలు
మాలూరు: ఉగాది అమావాస్య కావడంతో తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన శ్రీ దుర్గాదేవి దేవాలయంలో శనివారం విశేష పూజలను నిర్వహించారు. మూల విగ్రహానికి మల్లెలు, కనకాంబరాలు తదితర పుష్పాలతో గండభేరుండ రూపంలో అలంకరించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పసుపు, గాజులను సమర్పించారు. కంబీల మధ్య గజ యాతన మైసూరు: అడవిలో ఉన్న రైలు పట్టాలకు అటు ఇటు ఉన్న ఇనుప కంబీల మధ్యలో చిక్కి అడవి ఏనుగు తీవ్ర ఇబ్బందులు పడింది. మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకాలోని బాడగ గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. దగ్గరిలోని అడవిలో నుంచి ఆహారం వెతుక్కుంటూ ఓ ఏనుగు వస్తూ రైలు పట్టాలకు అటు ఇటు అడ్డుగా ఉన్న కంబీలను దాటడానికి ప్రయత్నించి వాటి కింద ఆ భారీకాయం చిక్కుకుపోయింది. ఘీంకారాలు చేస్తూ ఉండడంతో గ్రామస్తులు చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి ఏనుగును కంబీలను తొలగించి ఏనుగును బయటకు తీయడంతో గండం తప్పింది. 1న గురువందనకు రాజ్నాథ్ తుమకూరు: సిద్ధగంగ మఠం దివంగత త్రివిధ దాసోహి శివకుమారస్వామి 118వ గురువందన వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొంటారని కేంద్రమంత్రి వి.సోమన్న తెలిపారు. శనివారం తుమకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. మఠంలో ఏప్రిల్ 1వ తేదీన వేడుకలు జరుగుతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్నాథ్సింగ్ పాల్గొంటారని తెలిపారు. -
బైక్ను చెత్త లారీ ఢీ, బాలుడు మృతి
● లారీకి జనం నిప్పు ● బెంగళూరులో దుర్ఘటన యశవంతపుర: బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు, బెంగళూరు థణిసంద్ర రైల్వే ట్రాక్ వద్ద ఈ విషాదం జరిగింది. వివరాలు.. కొడుకు ఐమాన్ (10)ను తీసుకుని తండ్రి బైక్లో స్కూల్కి బయల్దేరాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన చెత్త లారీ ఢీకొనడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఐమాన్ తీవ్ర గాయాలతో అక్కడే మరణించగా, తండ్రి గాయపడి అంబేడ్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే దుర్ఘటనతో ఆక్రోశానికి గురైన స్థానికులు చెత్త లారీకి నిప్పు పెట్టడంతో కాలిపోయింది. ధణిసంద్రలో చెత్త లారీలు ఢీకొని ఇప్పటికి నలుగురు మరణించడంపై స్థానికులు మండిపడ్డారు. యలహంక పోలీసులు పరిశీలించారు. మూడు నెలల క్రితం ధణిసంద్ర మెయిన్రోడ్డులో బీబీఎంపీ చెత్త లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. ఉడుపిలో లవ్ గొడవ ● తండ్రి వర్సెస్ కుమార్తె ఫిర్యాదులు యశవంతపుర: తన కూతురిని అన్య మతానికి చెందిన వ్యక్తి అపహరించాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉడుపి నగరంలో జరిగింది. తమ కుమార్తె జీనా మెరీల్.. కాలేజీకి వెళ్లి వస్తుండగా మహ్మద్ అక్రం కిడ్నాప్ చేశాడని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడానికి దరఖాస్తు చేశాడని తండ్రి దేవదాస్ తెలిపారు. ఈ పెళ్లికి అనుమతి ఇవ్వవద్దని కోరారు. గతంలోను నిందితుడు తన కుమార్తె వెంట పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇదిలా ఉంటే, సదరు యువతి, అక్రంలు దేవదాసుపైనే ఆరోపణలు చేయడం గమనార్హం. తమ ప్రేమ, పెళ్లికి దేవదాస్ అడ్డుపడుతున్నట్లు ఎస్పీకి, మల్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు అక్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాలికె బడ్జెట్లో చెత్త పన్ను బాదుడు
బనశంకరి: బృహత్ బెంగళూరు మహానగర పాలికె చరిత్రలో తొలిసారి రూ.19,927 కోట్లతో భారీ బడ్జెట్ను ప్రకటించారు. శనివారం టౌన్హాల్ సభాంగణంలో పాలికె 2025–26వ బడ్జెట్ను బీబీఎంపీ పాలనాధికారి ఆర్.ఉమాశంకర్, కమిషనర్ తుషార్ గిరినాథ్, ఆర్థిక విభాగం ప్రత్యేక కమిషనర్ హరీశ్కుమార్ సమర్పించారు. ఎప్పుడూ లేనివిధంగా చెత్త పన్నును బాదడంతో నగరవాసులపై భారం పడనుంది. ఈ బడ్జెట్లో కొత్త పన్ను రాయితీలు ఏవీ ఇవ్వలేదు. రోడ్ల వసతులు, వైట్ ట్యాపింగ్ ● ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేలా ఆస్తి పన్నుతో కలిసి చెత్త సేకరణకు పన్ను విధించనున్నారు. ఒక్కో ఇల్లు, షాపులపై చెత్త పన్ను ఎంత మొత్తం అనేది ప్రకటించలేదు. ● బ్రాండ్ బెంగళూరుకు పెద్దపీట, చెత్త తరలింపులో సంస్కరణలు, ట్రాఫిక్ రద్దీ పరిష్కారానికి మౌలిక వసతులను పెంచుతామని పేర్కొన్నారు. ● సొరంగ మార్గాలు, ఎలివేటెడ్ కారిడార్, రాజకాలువల పక్కల్లో రోడ్ల నిర్మాణం, రహదారులకు వైట్టాపింగ్, స్కై–డెక్ నిర్మాణ పథకాలను చేపట్టాలని బడ్జెట్లో ప్రస్తావించారు. ● వీధులు, సందుల్లోని అర్టీరియల్, సబ్ అర్టీరియల్ రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్పాత్లను ఏర్పాటు చేస్తారు. సిల్క్బోర్డులో ఆధునిక రహదారి సెంట్రల్ సిల్క్బోర్డు, కృష్ణరాజపురం జంక్షన్, బైయప్పనహళ్లి మెట్రోస్టేషన్ వరకు ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నందున అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోతో కలిసి పాలికె రూ.400 కోట్లతో 22.7 కిలోమీటర్ల రోడ్డును ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దుతారు. బ్రాండ్ బెంగళూరు ప్రత్యేక ఎస్క్రో అకౌంట్ తెరిచి మూడేళ్లలో రూ.2828 కోట్లతో సొరంగ మార్గం, ట్రాఫిక్, ఆరోగ్యం, ఆధునిక రీతిలో మౌలిక సౌకర్యాలను ప్రజలకు కల్పిస్తామని ప్రకటించారు. నగరం నలుదిక్కుల్లో చెత్త సంస్కరణ కేంద్రాలను నెలకొల్పుతారు. పలు దశల్లో తడి, పొడి చెత్తను తరలించడం, సంస్కరణ కేంద్రాల్లో ఎరువులుగా మార్చడానికి పలు ప్రణాళికలను రూపొందించారు. ఇకపై పౌర కార్మికులకు తలా రూ.10 లక్షలుగా, మొత్తం రూ.107.70 కోట్లను బ్యాంకులో డిపాజిట్చేసి దీని ద్వారా వచ్చే వడ్డీని పింఛన్గా అందిస్తారు. రూ.19,927 కోట్ల బెంగళూరు పాలికె పద్దు ఆస్తిపన్నుతో కలిపి చెత్తపన్ను వసూలు మౌలిక వసతులకు నిధులు -
మల్లెలు కేజీ రూ.2 వేలు
దొడ్డబళ్లాపురం: ఉగాది పండుగ అంటే తెలుగు, కన్నడ నూతన సంవత్సరాది, ఏడాది మొదటిరోజును ఆనందోత్సాహాలతో ఆచరించాలని అందరూ అనుకుంటారు. పండుగ వచ్చింది కదా అని పూలు పండ్ల వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెంచేశారు. అయినప్పటికీ శనివారం జనం మండే ఎండలను కూడా లెక్కచేయకుండా మార్కెట్లకు తరలివచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు నగరాలకు క్యూ కట్టారు. కొత్త బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పండ్లు, కూరగాయలు, పూల ధరలు కాస్త అందుబాటులో ఉన్నా ఉగాది పేరుతో వ్యాపారులు ధరలను పెంచారు. బెంగళూరు బజార్లలో మల్లెపూలు కేజీ రూ.1800 నుంచి 2000 మధ్య పలికాయి. చామంతులు రూ.250, గులాబీలు రూ.200, చెండుపూలు రూ.80, కాగడాలు రూ.600, కనకాంబరాలు రూ.1000, తులసి మాల మూర రూ.100, వేప కొమ్మలు కట్ట రూ.25, మామిడి ఆకులు కట్ట రూ.25 కి విక్రయించారు. కేఆర్ మార్కెట్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఉగాది వేళ భగ్గుమన్న ధరలు నగరంలో మార్కెట్లు కిటకిట -
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్(83), పావీయా నజరత్(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్ నోట్ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగదు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్నోట్ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్కాల్స్ ఉన్నాయని.. సిమ్ కార్డ్ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్ నోట్లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్కేస్లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
నగరాభివృద్ధికి సహకరించండి
హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు. -
తప్పుడు సర్టిఫికెట్లపై చర్యకు డిమాండ్
హొసపేటె: 3ఏ కేటగిరి కులాల వారు 2ఏ సర్టిఫికెట్లు పొందకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన కులాల కూటమి ఆధ్వర్యంలో కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లిలో నిరసన తెలిపారు. ఇప్పటికే వాటిని పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. వెనుకబడిన కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలు అందించి లింగాయత్, వీరశైవ వర్గాల కేటగిరి 2ఏ సర్టిఫికెట్లు పొందడం అన్యాయమని ఆయన అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.చంద్రమోహన్కు అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు
రాయచూరు రూరల్ : రాయచూరులో సత్యనారాయణ అనే వ్యక్తి తన కూతురు, కుమారుడికి కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న అంశంలో రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ గజానన రద్దు చేశారని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం డివిజన్ కార్యదర్శి రఘువీర్ నాయక్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లలకు పాఠశాలలో తండ్రి వారసత్వంతో కుల ప్రమాణపత్రం పొందకుండా తల్లి వారసత్వం ద్వారా కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ కురుబలు వెనుక బడిన వర్గాల పరిధిలోకి వస్తారని రుజువు కావడంతో తహసీల్దార్లు ఇచ్చిన కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని రద్దు చేశారన్నారు. పాఠశాలల్లో హెడ్మాస్టార్లు, టీసీ, ఇతర సర్టిఫికెట్లలో కాడు కురుబ ఎస్టీలను తొలగించి కురుబ వెనుక బడిన వర్గాల జాబితాలో చేర్చాలని నివేదికలను అందిస్తామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్.. ఒకరు అరెస్ట్
హుబ్లీ: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఒకరిని ధార్వాడ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. గామనగట్టి నివాసి పర్వత ప్రకాష్ శర్మ అరెస్ట్ అయిన నిందితుడు. ఇక్కడి రసూల్పుర వీధిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వేళ సదరు స్టేషన్ ఎస్ఐ ఆర్హెచ్ నదాఫ్ తమ సిబ్బందితో దాడి చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2080ల నగదుతో పాటు ఓ మొబైల్ను జప్తు చేశారు. ఘటనపై ధార్వాడ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. మహిళ అదృశ్యం హొసపేటె: సుమారు 55 ఏళ్ల వయస్సుగల ఉంకి హులిగమ్మ అనే మహిళ అదృశ్యం కావడంపై హగరిబొమ్మనహళ్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ శరీరాకృతి, 5.2 అడుగుల ఎత్తు కలిగిన మహిళ, నల్లటి కుర్తా, తెల్లటి పూల బొమ్మలతో కూడిన ఆకుపచ్చని చీర, ఎడమ కనుబొమ్మపై పాత మచ్చ కలిగి ఉంది. గత నెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈమె ఆచూకీ గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్కు లేదా 08397–238333, 9480805770 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. రైల్వే ఉద్యోగులకు సురక్షత ప్రశస్తుల ప్రదానం హుబ్లీ: నైరుతి రైల్వే జోన్ జీఎం ముకుల్ శరణ్ మాథుర్ తన విధుల్లో చూపించిన చొరవతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకున్న భద్రతా చర్యలతో రైల్వే కార్యకలాపాల్లో సమర్థవంతంగా భద్రత నిర్వహణ చేసినందుకు గాను 5 మంది ఉద్యోగులకు సురక్షత ప్రశస్తిని ప్రదానం చేశారు. గదగ్ రోడ్డులోని రైలు సౌధలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ ఐదుగురిని ఎంపిక చేసిన సన్మానించారు. శివాజీ ఎల్. పవార్, కై లాస్ ప్రసాద్ మీనా, హెచ్ఎస్ మహేష్, జేబీ లోహిత్, అబూ సాలియాలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ విధి నిర్వహణలో సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాలతో భద్రత, ప్రయాణికుల సురక్షతణకు ప్రాధాన్యం ఇచ్చామని, అదే నైరుతి రైల్వే లక్ష్యం అని అన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరు తాలూకాలోని హారాళు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రైలు ఢీకొని మరణించిన ఘటన గ్రామ శివార్లలో జరిగింది. హారాళు గ్రామానికి చెందిన భంగి నాగరాజ్ (29) అనే వ్యక్తిని ఉదయం 8.30 గంటలకు రైలు ఢీకొన్నట్లు సమాచారం అందడంతో ఆయన మరణ వార్త విని కుటుంబ దిగ్భ్రాంతికి గురైంది. మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన జాద్రి కొట్రప్ప అనే వ్యక్తి రైలు ఢీకొని మరణించాడు. ఒకే వారంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకొని మరణించిన ఘటనలపై రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా రైల్వే శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు. లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీని వీడాలి ●● కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామీజీ పిలుపు హుబ్లీ: ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం బహిష్కరించడంపై పంచమశాలి సామాజిక వర్గంలో ఆక్రోశం వ్యక్తమవుతోంది. బహిష్కరణ అన్నది నీచమైన కృత్యం అని కూడల సంగమ జయ మృత్యుంజయ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే తమ సమాజానికి రిజర్వేషన్లను కేటాయించడానికి వెనుకంజ వేశారో వారే నేడు బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను పార్టీ నుంచి బహిష్కరించడంలో కృతకృత్యులయ్యారని మండిపడ్డారు. యత్నాళ్కు అండగా నిలబడేందుకు లింగాయత్ ఎమ్మెల్యేలు వెంటనే బీజేపీని వీడాలని స్వామీజీ పిలుపునిచ్చారు. అంతేగాక త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పంచమశాలి వర్గం ఒక రోజు పాటు ఆందోళన చేపడుతుందన్నారు. ట్రామా కేంద్రం ప్రారంభం రాయచూరు రూరల్ : రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ(ఒపెక్) ఆస్పత్రిలో రోగులకు ట్రామా కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. గురువారం ఒపెక్ ఆస్పత్రిని సందర్శించి ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అధికంగా వచ్చే రోగులందరికీ సమానంగా వైద్యం అందిస్తున్నారన్నారు. ఒపెక్ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలతో కూడిన వైద్య చికిత్సలకు శ్రీకారం చుట్టామన్నారు. క్యాన్సర్ చికిత్సకు కిద్వాయి ఆస్పత్రిలో మాదిరిగా రూ.52 కోట్లతో 2.5 ఎకరాల స్థలంలో క్యాన్సర్ ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్డియాలజీ, యూరాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో సర్జికల్, మెడికల్ గ్యాస్ట్రో, పైకో మ్యాక్సిలరీ సర్జరీ సౌకర్యాలు కల్పించారన్నారు. ఒపెక్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ సాగర్, డాక్టర్ రమేష్, విజయ శంకర్లున్నారు. అభివృద్ధి పనులకు భూమిపూజ రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. గురువారం 2వ వార్డులో ఉద్యానవనాలను రూ.5 లక్షలతో నిర్మాణం, తాగునీటి ట్యాంకర్లకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడుతామన్నారు. ఈ సందర్భంగా భీమనగౌడ, నాగరాజ్, కులకర్ణి, ఆంజనేయ, తిమ్మారెడ్డి, రత్న, శారదమ్మ, విజయలక్ష్మి, నరసింహమూర్తిలున్నారు. -
అన్ని రంగాల్లో దేశ ప్రగతి
మైసూరు: యువత నిరంతర ప్రయత్నాలతో దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. గురువారం మైసూరులోని ముక్తగంగోత్రిలో కర్ణాటక రాష్ట్ర ఓపెన్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని అన్ని రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రస్తుత దేశ ఆర్థికత ప్రబలంగా ఉండి ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. స్నాతకోత్సవంలో సీఎం ఇర్ఫానుల్లా షరీఫ్, డాక్టర్ దాక్షాయణి ఎస్.అప్పాలకు గౌరవ డాక్టరేట్ పట్టాలు అందించి సత్కరించారు.వ్యాన్– గూడ్స్ టెంపో ఢీ, ముగ్గురు మృతి దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మైసూరు రహదారిలో చెన్నపట్టణ తాలూకా తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. గూడ్స్ టెంపో, మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. గురువారం ఉదయం చెన్నపట్టణ తాలూకా మంగాడహళ్లికి చెందిన శివప్రకాశ్ కుటుంబం మండ్యలో బంధువుల ఇంట్లో శుభ కార్యానికి మారుతి–800 వ్యాన్లో వెళ్తోంది. తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్ రోడ్డులో ఎదురుగా వచ్చిన టెంపో వేగంగా ఢీకొంది. మారుతి వ్యాన్ నుజ్జునుజ్జు కాగా, అందులోని శివప్రకాశ్ (37), పుట్టగౌరమ్మ (72), శివరత్న (50) మరణించారు. నటరాజ్, సుమ, టెంపో డ్రైవర్ నాగేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను చెన్నపట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లోకాయుక్త అదుపులో ఆర్టీఐ కమిషనర్ దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ కమిషనర్ రవీంద్ర గురునాథ్ డాకప్ప లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్.సీ.బెనకనళ్లి అనే ఆర్టీఐ కార్యకర్త ఏకధాటిగా 117 దరఖాస్తులు చేయడంతో అతనిని బ్లాక్ లిస్టులో చేర్చారు. తన పేరు బ్లాక్ లిస్టు నుండి తొలగించాలని కోరగా గురునాథ్ రూ.3లక్షలు డిమాండు చేశాడు. దీంతో ఆర్టీఐ కార్యకర్త లోకాయుక్తను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. గురునాథ్ ఏప్రిల్ నెలలో రిటైరు కానున్నారు. ఇంతలో పట్టుబడ్డాడు. ముగ్గురు పోలీసులపై కేసు● మూడేళ్ల కిందట ఖైదీ మృతి ఘటన.. యశవంతపుర: మూడేళ్ల కిందట వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన నిందితుడు జిమ్స్ ఆస్పత్రి కట్టడంపై నుంచి దూకి చనిపోయిన ఘటనలో ఒక ఏఎస్ఐతో పాటు ముగ్గురు పోలీసులపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. కలబురగి బ్రహ్మపుర పోలీసుస్టేషన్ ఎఎస్ఐ అబ్దుల్ ఖాదర్ (54), కానిస్టేబుల్స్ హుణచప్ప మల్లప్ప (56), కుమార రాథోడ్ (22)లపై కేసు నమోదైయింది. నిందితుడు సోహేబ్ (20)ను ఓ కేసులో బ్రహ్మపుర పోలీసులు 2022 అగస్ట్ 8న అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు నిందితునికి కరోనా టెస్టుల కోసం జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బేడిలను విప్పేశారు. ఇదే అదనుగా అతడు తప్పించుకోవాలని పరుగులు తీసి ఆస్పత్రి మూడో అంతస్తు మీద నుంచి దూకాడు. తలకు బలమైన గాయలై అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కేసును సీఐడీ అప్పగించింది. సీఐడీ పోలీసులు పై ముగ్గురి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నగల బ్యాగును వదిలి దొంగ పరారీ మైసూరు: పోలీసును చూసి దొంగ బ్యాగును అక్కడే వదిలి పరారైన ఘటన నగరంలో జరిగింది. అతని బ్యాగులో నుంచి రూ.7.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనపరచుకున్నారు. వివరాలు.. నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ ఎస్ఎం అనంత, హోంగార్డు రఘుకుమార్ గస్తీలో ఉండగా, గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హూటగళ్లి సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి నంబరుప్లేట్ లేని వాహనంతో నిలబడి ఉండటాన్ని గమనించారు. అతని వద్దకు వెళుతుండగా భయపడిన అతను బైక్ని, బ్యాగును వదిలి అక్కడి నుంచి సందులోకి పారిపోయాడు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా బంగారు ఆభరణాలు, నగదు, ఇనుప రాడ్డు లభించాయి. పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. దొంగ ఎక్కడైనా చోరీ చేసి వస్తుంటాడని అనుమానాలున్నాయి. అతని కోసం గాలింపు చేపట్టారు. -
ముంచేస్తున్న సైబర్ వల
బనశంకరి: నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు హెచ్చుమీరాయి. నిరక్షరాస్యులు కాకుండా విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ఐటీ బీటీ ఉద్యోగులు, యువతీ యువకులు, రిటైర్డు ఉద్యోగులు, మహిళలు సైబర్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 2024 లో 21,984 సైబర్నేరాలు నమోదు కాగా రూ.2,120 కోట్లను సైబర్ వంచకులు దోచేశారు. బెంగళూరులోనే 2023లో రూ.673 కోట్లు కాజేసిన సైబర్ దొంగలు, 2024లో రూ.1,998 కోట్లు నొక్కేశారు. నిత్యం సరాసరి 48 కేసులు నమోదు అవుతున్నాయి. పోలీస్స్టేషన్ల వరకు రాని కేసులు లెక్కకు అందవు. బెంగళూరులో మరీ అధికం సైబర్ మోసాలు, బాధితుల సంఖ్య ఏటేటా విస్తరిస్తోంది. నగరంలోనే మూడు రెట్లు పెరిగాయి. బెంగళూరులో నిత్యం కొత్త తరహాలో సైబర్ కేటుగాళ్లు వల వేస్తూ పోలీసులకు సవాల్గా మారారు. ప్రజలను జాగృతం చేసినప్పటికీ వలలో పడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఓటీపీ చెప్పాలని, మోసపూరిత లింక్లను పంపి క్లిక్ చేయించడం, ఫోన్ని హ్యాక్ చేయడం ద్వారా డబ్బు కొట్టేస్తున్నారు. షేర్మార్కెట్లో పెట్టుబడితే వారంలో లక్షాధికారులు కావచ్చని నమ్మించి ఎక్కువగా దోచుకుంటున్నారని సైబర్ ఠాణా పోలీసులు తెలిపారు. మొబైల్లో రహస్యంగా కొన్ని యాప్లు ఇన్స్టాల్ చేసి సిమ్కార్డుని, మొబైల్ను తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం పెరిగింది. డబ్బు కట్ అయినప్పటికీ మొబైల్కు ఎస్ఎంఎస్, ఈమెయిల్ వెళ్లదు, దీనివల్ల బాధితులకు మోసం గురించి తెలియదు. సహాయవాణి 1930 సైబర్ నేరానికి గురైతే తక్షణం 1930 సహాయవాణి కి కాల్ చేసి వివరాలను అందిస్తే నగదు చేజారకుండా కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఆలస్యమయ్యేకొద్దీ వంచకుల ఆచూకీని కనిపెట్టడం సాధ్యం కాదన్నారు. చాలామంది డబ్బు కోల్పోయిన 2–3 రోజుల తరువాత ఫిర్యాదు చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. ఏటేటా ఆన్లైన్ మోసాల వృద్ధి సంపన్నులు, ఉద్యోగులే లక్ష్యం విదేశాల నుంచి సైబర్ ముఠాల దాడులు పట్టుకోలేకపోతున్న పోలీసులు క్లిక్ చేయగానే లక్షలు లాస్ మోసగాళ్లు పెట్టుబడి పేరుతో పంపించిన లింక్పై క్లిక్ చేయగానే ప్రైవేటు టీచరమ్మ రూ.15 లక్షలు పోగొట్టుకుంది. సాప్ట్వేర్ ఉద్యోగి ఇంటి విక్రయంతో వచ్చిన రూ.1.48 కోట్ల డబ్బును షేర్ల పేరుతో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. పగలూ రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బును పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులు కొన్ని గంటల్లో పోగొట్టుకుంటున్నారు. బ్యాంకు ఉద్యోగుల ముసుగులో సైబర్ వంచకులు ఐటీ ఇంజినీర్కు ఫోన్ చేసి గిప్టు ఓచర్ పంపించి ఫోన్ని హ్యాక్ చేశారు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.80 కోట్లు నగదు దోచేశారు. -
దేశాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం
సాక్షి,బళ్లారి: దేశాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయ శాఖతో (శాసకాంగ, కార్యాంగ, న్యాయాంగ)తో పాటు పత్రికల(మీడియా) పాత్ర కూడా ఎంతో కీలకమని జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో పత్రికా భవన్లో కర్ణాటక కార్యనిరత పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫోటో జర్నలిస్ట్ పురుషోత్తం హంద్యాళకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మూడు పిల్లర్లతో ఏ భవనం నిర్మాణం సాధ్యం కాదన్నారు. అదే విధంగా దేశాభివృద్ధితో కాని, రాష్ట్రాభివృద్ధి, జిల్లాభివృద్ధిలో కాని ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో, సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలియజేసేందుకు నాలుగో స్తంభంగా మీడియా పాత్రను మరువలేనిదన్నారు. పాత్రికేయులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు కళాకారులుగా అప్పుడప్పుడు మారడంతో ఉపశమనం పొందేందుకు వీలవుతుందన్నారు. మన సంస్కృతి వారసత్వాలను కాపాడుకునేందుకు కళాకారులు ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు. సన్మానం అందుకున్న పురుషోత్తం మాట్లాడుతూ కళాకారుడుగా చేసిన సేవలను గుర్తించి తనను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. డీపీఆర్ఓ గురురాజ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభం మీడియా జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా -
కంటి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం
బళ్లారిటౌన్: మనిషికి నయనం ప్రధానం అని, కళ్లు దెబ్బతినకుండా వాటి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీనగర్లోని రేణుకా కిచెన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి జీవన శైలిలో మనిషిపై ఒత్తిడి పెరుగుతున్నందున నేత్ర సమస్యలు ఎక్కువవుతున్నాయన్నారు. ఈ దిశలో రాష్ట్రంలో పేరుగాంచిన అగర్వాల్స్ ఐ హాస్పిటల్ను బళ్లారిలో కూడా ప్రారంభించడం శ్లాఘనీయం అన్నారు. ప్రభుత్వ పథకాల కింద మంజూరయ్యే కంటి ఆపరేషన్లను కూడా పేదలకు ఆస్పత్రిలో చేసేలా మున్ముందు ఆసక్తి చూపాలన్నారు. హాస్పిటల్ సీనియర్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ హాస్పిటల్ రాష్ట్రంలో బళ్లారితో కలిపి 28 కేంద్రాలను ప్రారంభించిందన్నారు. 220కి పైగా ప్రపంచ స్థాయి అన్ని సదుపాయాలు ఈ ఆస్పత్రిలో లభిస్తాయన్నారు. ల్యాబ్, ఆపరేషన్లు, కంటి అద్దాలు, ఇతర సదుపాయాలు కూడా ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా, అడిషనల్ ఎస్పీ రవికుమార్, డీహెచ్ఓ వై.రమేష్బాబు, డాక్టర్ మహేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యత్నాళ్ బహిష్కరణపై పునరాలోచించాలి
సాక్షి,బళ్లారి: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బసవనగౌడ పాటిల్ యత్నాళ్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంపై బీజేపీ హైకమాండ్ పునరాలోచించాలని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడారు. బసవనగౌడ పార్టీ పరంగా బ్యాటింగ్ చేశారన్నారు. అలా నేరుగా మాట్లాడటం మంచిది కాదని,పార్టీ నిబంధనలకు లోబడి పనిచేస్తే మంచిదని తాను ముందు నుంచి యత్నాళ్కు సూచించానన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యత్నాళ్ బహిష్కరణపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యత్నాళ్ బలమైన పంచమశాలి లింగాయత్ సమాజానికి చెందిన నాయకుడన్నారు. ఆ కులానికి చెందిన వారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు. బీజేపీకి నష్టం జరగకుండా ఉండాలనేదే తన తపన అన్నారు. బలమైన హిందూ వాదిగా, పంచమశాలి లింగాయత్ సమాజానికి గొప్పనాయకుడుగా కొనసాగుతున్న యత్నాళ్ను పార్టీ నుంచి తప్పించడంపై పునరాలోచించాలని తాను ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్షాలను కోరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ దుష్పరిపాలన హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రి బీ.శ్రీరాములు తెలిపారు. బుధవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన హనీట్రాప్పై కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు సృష్టించిందన్నారు. ఈ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో దీని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు నిప్పంటించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిఖార్సయిన హిందుత్వవాది మాజీ మంత్రి శ్రీరాములు వెల్లడి -
భార్యను ముక్కలు చేసి.. సూట్కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
ఏప్రిల్ ఆఖరు వరకు నీరివ్వాలని ర్యాలీ
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్ఆర్బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని మాజీ మంత్రి రాజుగౌడ డిమాండ్ చేశారు. గురువారం సురపుర తాలూకా హుణసగిలోని కృష్ణా భాగ్య జల మండలి కార్యాలయం వద్ద వంద ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టి మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి గేజ్ నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువకు ఏప్రిల్ చివరి వరకు వారబందీ పద్ధతి ద్వారా నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఎస్కాం డీఎస్పీగా శ్రీపాద జల్దే హుబ్లీ: 7 జిల్లాల పరిధిలోని ఎస్కాం జాగృత దళం డీఎస్పీగా శ్రీపాద జల్దే గురువారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. 2001వ బ్యాచ్కు చెందిన ఈయన డీఎస్పీగా పదోన్నతి పొందక ముందు హుబ్లీ– ధార్వాడ జంట నగరాల్లోని కసబాపేట, పాత హుబ్లీ, కేశ్వాపుర, ట్రాఫిక్ స్టేషన్లలో సీఐగా, అథణిలో డీఎస్పీగా రెండేళ్లు ఉత్తమ సేవలు అందించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోండి రాయచూరు రూరల్: జిల్లాలో ఉగాది, రంజాన్ పండుగలను హిందూ ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని అదనపు ఎస్పీ హరీష్ సూచించారు. బుధవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో మాట్లాడారు. ఈనెల 30న జరిగే ఉగాది, 31న రంజాన్ పండుగలను శాంతియుతంగా ఆచరించాలన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో రోజాను పాటిస్తున్నారన్నారు. హిందూ సోదరులు శాంతితో ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా పండుగను జరుపుకోవాలన్నారు. సమావేశంలో సీఐ మేకా నాగరాజ్, ఎస్ఐలు మంజునాఽథ్, చంద్రప్ప, అమిత్, నరసమ్మ, శ్రీనివాస్, అంబాజీ, మహావీర్, ఇస్మాయిల్లున్నారు. ఎల్ఎల్సీ నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలి సాక్షి,బళ్లారి: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ఎల్సీ) నుంచి గుడదూరు వాగుకు నీరు వదలాలని తుంగభద్ర రైతు సంఽఘం జిల్లా అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ మనవి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జిల్లాధికారి ప్రశాంత్కుమార్ మిశ్రాను కలిసి రైతు సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కంప్లి, సిరుగుప్ప నియోజకవర్గాల్లో గుడదూరు, హంద్యాళు, డి.కగ్గల్, చానాళ్, మైలాపుర, బూదుగుప్ప, హెచ్.హొసళ్లి, హాగలూరు, దరూరు, కరూరు, కారిగనూరు తదితర గ్రామాల పరిధిలో రబీలో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే గుడదూరు వాగుకు ప్రతి రోజు 100 క్యూసెక్కుల నీరు వదిలితే రైతుల పంటలు చేతికందుతాయన్నారు. అంతేకాకుండా పశువులకు నీరు కూడా దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అక్రమ భూములపై విచారణ శూన్యం రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో గత 45 ఏళ్లుగా అక్రమంగా సాగు చేసుకుంటున్న భూములపై విచారణ ఽశూన్యమైందని సీపీఐ(ఎంఎల్) రెడ్ ఫ్లాగ్, కర్ణాటక రైతు సంఘం సంచాలకుడు మానసయ్య ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరాజ్ అరసు తెచ్చిన భూ సంస్కరణల చట్టాన్ని జారీ చేస్తామని చెబుతున్న సర్కార్లు నేటికీ మిగులు భూముల పంపిణీలో మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. సింధనూరు తాలూకా జవళగేరలో 1981 నుంచి 1064 ఎకరాల భూములకు వారసుదారురాలు సిద్దలింగమ్మ మరణించడంతో మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ తనదే అంటూ కోర్టుల నుంచి కాలావకాశం కోరుతూ పెండింగ్లో ఉంచారన్నారు. ఈ విషయంలో 44 ఏళ్ల నుంచి భూ సంస్కరణల చట్టం జారీ చేయడంలో జిల్లాధికారులు భూస్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలం కావడాన్ని తప్పుబట్టారు. -
నందిని పాలు, పెరుగు ధరలు భగ్గు
బనశంకరి: సిద్దరామయ్య సర్కారు ఉగాది కానుకను వినూత్నంగా ప్రకటించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నందిని పాలు, పెరుగు ధరను ప్రతి లీటరుపై రూ.4 పెంపు జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలవుతుంది. గురువారం విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పెంపును ఖరారు చేశారు. నిజానికి కేఎంఎఫ్ రూ.5 పెంచాలని కోరిందని, తామే ఒక్క రూపాయ తగ్గించామని సర్కారు వర్గాలు చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో పాలు, పెరుగు ధర పెంపు ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఉగాది బహుమతి అని విమర్శలు వచ్చాయి. దీని వల్ల హోటళ్లలో కాఫీ, టీల ధరలు భగ్గుమంటాయని ఆక్రోశం వ్యక్తమౌతోంది. లీటర్కు రూ.4 పెంపు -
తప్పుడు సర్టిఫికెట్లపై చర్యకు డిమాండ్
హొసపేటె: 3ఏ కేటగిరి కులాల వారు 2ఏ సర్టిఫికెట్లు పొందకుండా నిరోధించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన కులాల కూటమి ఆధ్వర్యంలో కూడ్లిగి తాలూకా కానాహొసహళ్లిలో నిరసన తెలిపారు. ఇప్పటికే వాటిని పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఒత్తిడి చేశారు. వెనుకబడిన కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్ మాట్లాడుతూ తప్పుడు పత్రాలు అందించి లింగాయత్, వీరశైవ వర్గాల కేటగిరి 2ఏ సర్టిఫికెట్లు పొందడం అన్యాయమని ఆయన అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.చంద్రమోహన్కు అందజేశారు. సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు
రాయచూరు రూరల్ : రాయచూరులో సత్యనారాయణ అనే వ్యక్తి తన కూతురు, కుమారుడికి కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న అంశంలో రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ గజానన రద్దు చేశారని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం డివిజన్ కార్యదర్శి రఘువీర్ నాయక్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లలకు పాఠశాలలో తండ్రి వారసత్వంతో కుల ప్రమాణపత్రం పొందకుండా తల్లి వారసత్వం ద్వారా కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ కురుబలు వెనుక బడిన వర్గాల పరిధిలోకి వస్తారని రుజువు కావడంతో తహసీల్దార్లు ఇచ్చిన కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని రద్దు చేశారన్నారు. పాఠశాలల్లో హెడ్మాస్టార్లు, టీసీ, ఇతర సర్టిఫికెట్లలో కాడు కురుబ ఎస్టీలను తొలగించి కురుబ వెనుక బడిన వర్గాల జాబితాలో చేర్చాలని నివేదికలను అందిస్తామన్నారు. -
కరువు విలయం.. కబేళాలకు విక్రయం
రాయచూరు రూరల్ : ఈఏడాది కల్యాణ కర్ణాటక(క–క)లోని ఆరు జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర సర్కార్లు నిర్లక్ష్యం వహించాయి. సరైన వర్షాలు లేక పంటలు పండక పోవడంతో పశువులకు పశుగ్రాసం కూడా లభించని దుిస్థితి నెలకొంది. అనావృష్టితో ఆయా జిల్లాలో రైతులు పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక మూగజీవాలు తల్లడిల్లుతున్నా కనీసం పంట నష్టపరిహారం అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయి. బాధితులు ఎలా జీవితం గడపాలనే ఆలోచనలో ఉన్న సందర్భంలో ఏదైనా పరిహారం వస్తుందన్న ఆశతో కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించాల్సిన తహసీల్దార్లు లేకపోవడంపై రైతుల్లో విచారం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. చెరువులు, కుంటలు, బావులు, వాగుల్లో నీరు లేకపోవడంతో పశువులను మేపడానికి పశుగ్రాసం లభించక రైతులు కబేళాలు, జాతరలు, సంతల్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.55 లక్షలకు పైగా పశువులను విక్రయించినట్లు సమాచారం. జిల్లాలో 25 వేల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరం ఉందని పశు సంవర్ధక శాఖ అధికారులు జిల్లాధికారికి మూడు నెలల క్రితమే ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద వరి పంటను తక్కువ ప్రమాణంలో పండించడంతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని అధికారులు అంటున్నారు. సంతలు, జాతరల్లో తక్కువ ధరకు పశువుల అమ్మకం క–కలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు -
మ్యాట్రిమొని మోసగాడు
యశవంతపుర: టీవీ సీరియల్ నటునిగా కనిపిస్తున్న ఇతడు ఓ మోసగాడు. ఐఏఎస్ ఆధికారినని చెప్పుకొంటూ యువతులు, మహిళలను మోసగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమొని వెబ్సైట్లో జీవన్కుమార్ అనే వ్యక్తి వివరాలు నమోదు చేసుకున్నాడు. యువతులతో చాటింగ్ చేస్తూ తాను ఐఏఎస్నని, పెళ్లి చేసుకొంటానని చెబుతూ, తల్లికి క్యాన్సర్ వైద్యానికి అర్జంటుగా డబ్బులు కావాలని లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. తరువాత వారితో సినిమాలు, షికార్లకు వెళ్లి సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీసుకొనేవాడు. మొదట రూ.3 లక్షలు తీసుకొని, మరోదఫా రూ. 5 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వని మహిళల ప్రైవేట్ ఫోటో, వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించేవాడని పోలీసుల విచారణలో బయట పడింది. ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే హత్య చేస్తానంటూ బెదిరించేవాడు. దేశవ్యాప్తంగా సుమారు 20 మంది మహిళలకు మోసం చేసిన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన మహిళ మోసపోవటంతో జీవన్కుమార్పై హెబ్బాళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఐఏఎస్నంటూ వసూళ్లు -
నగరాభివృద్ధికి సహకరించండి
హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు. -
ఛేదిస్తున్న కేసులు స్వల్పమే
● వేలాదిగా సైబర్ మోసాలు జరుగుతుంటే పోలీసులు ఛేదిస్తున్నవి మాత్రం చాలా తక్కువ. ● వంచకులు వేల సంఖ్యలో నకిలీ బ్యాంక్ అకౌంట్ల కలిగి ఉండటం, క్రిప్టో కరెన్సీలోకి నగదు మార్చడం, అత్యాధునిక టెక్నాలజీ, వాయిస్ కాలింగ్ వ్యవస్థలను వాడడం వల్ల పోలీసులకు వారిని కనిపెట్టి నగదు స్వాధీనం చేసుకోవడం తలకు మించిన పనవుతోంది. ● బాధితుల ఖాతా నుంచి నేరగాళ్లు క్షణాల్లో వివిధ బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేస్తారు. బ్యాంకుల నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం పోలీసులకు ఆటంకంగా ఉంటోంది. ● దుబాయ్, కాంబోడియా, థాయ్లాండ్, హాంకాంగ్, చైనా దేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో వారి మూలాలను కనిపెట్టడం కష్టసాధ్యమని పోలీసు అధికారులు తెలిపారు. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు నో బెయిల్
బెంగళూరు : నటి రన్యారావుకు బెంగళూరు కోర్టులో చుక్కెదురైంది. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రన్యారావుకు బెంగళూరు 64వ సీసీహెచ్ సెషన్స్ కోర్టు బెయిల్ను తిరస్కరించింది. రన్యా రావు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవ్వడం ఇది మూడోసారి. అంతకుముందు మార్చి 14న రన్యారావు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అనంతరం, మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ కోర్టు సైతం బెయిల్ ఇవ్వలేదు. తాజాగా,64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. విశ్వసనీయ సమాచారం మేరకు రన్యారావు బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ఆమె తరుఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
భర్త దూరపు బంధువుతో భార్య వివాహేతర సంబంధం..!
కర్ణాటక: వివాహేతర సంబంధం వద్దని దండించిన భర్తను, ప్రియునితో కలిసి హతమార్చిందో భార్య. ఈ కేసులో భార్యతో పాటు ప్రియునికి జీవితఖైదును విధిస్తూ హోసూరు కోర్టు జడ్జి సంతోష్ తీర్పు చెప్పారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37), పికప్ వాహన డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రైతుల పొలాల నుంచి కాయగూలను వాహనంలో మార్కెట్కు తీసుకెళ్లేవాడు. తనకు తోడుగా దూరపు బంధువైన మంచుగిరి గ్రామవాసి తంగమణి (24)ను తోడుగా తీసుకెళ్లేవాడు. తంగమణి తరచూ అయ్యప్ప ఇంటికెళ్లి వస్తుండేవాడు. హత్య చేసి నాటకం ఈ నేపథ్యంలో అయ్యప్ప భార్య రూప (29)తో తంగమణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకొన్న అయ్యప్ప భార్యను నిలదీశాడు. దీంతో అయ్యప్పను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర చేశారు. 2021 అక్టోబరు 21వ తేదీన ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్న అయ్యప్పను గొంతుకోసి చంపారు. మత్తులో తానే గొంతు కోసుకొని చనిపోయాడని భార్య నాటకమాడింది. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు తీవ్ర విచారణ జరుపగా అయ్యప్ప భార్య, ప్రియుని బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నేరం రుజువు కావడంతో మంగళవారం సాయంత్రం జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు. -
హౌ టు కిల్ పుస్తకం చదివి.. అల్లుడిని చంపిన అత్త
యశవంతపుర: మాగడి రియల్టర్ లోకనాథసింగ్ (37) హత్య కేసులో భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. విచారణలో కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అల్లుడంటే సరిపడని అత్త హేమా, ఆమె కూతురు యశస్వి పుస్తకాలు చదివి, ఇంటర్నెట్లో శోధించి హత్యకు పథకం వేశారు. హౌ టు కిల్ పుస్తకం చదివిన హేమా భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించింది. గత ఆదివారం రాత్రి నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మత్తు పదార్థం కలిపిన ఆహారం తినిపించిన తరువాత అతన్ని ఇద్దరూ గొంతు కోసి హతమార్చారు. భార్య యశస్వికి చెందిన ప్రైవేట్ వీడియోను పెట్టుకొని లోకనాథ్సింగ్ బెదిరించేవాడని, తాను మరో మహిళను పెళ్లి చేసుకొంటానని భార్య, అత్తకు చెప్పేవాడు. ఇది తట్టుకోలేక అంతమొందించినట్లు విచారణలో తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ధనుశ్రీ మృతి
బెంగళూరు: బైక్పై వెళ్తున్న విద్యార్థిని కిందపడగా వెనుక నుంచి వచ్చిన క్యాంటర్ ఆమె పైనుండి దూసుకెళ్లగా మరణించిన సంఘటన బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో చోటుచేసుకుంది. మాగడి తాలూకా బ్యాడరహళ్లి గ్రామానికి చెందిన సిద్ధరాజు, జగదాంబ దంపతుల కుమార్తె ధనుశ్రీ (20) మృతురాలు. వివరాలు.. ఈమె మంగళూరు ఆళ్వాస్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. గ్రామంలో జాతర ఉండడంతో వచ్చింది. తిరిగి మంగళూరు వెళ్లేందుకు తమ్ముడు రేణుకేశ్తో కలిసి బైక్పై కుణిగల్ రైల్వేస్టేషన్కు బయలుదేరింది. తాళెకెరె హ్యాండ్ పోస్టు వద్ద జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ప్రమాదవశాత్తు బైక్ పైనుండి కిందపడింది. వెనుకనే వేగంగా వచ్చిన క్యాంటర్ ఆమెపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోను, రాష్ట్రంలో ఆహార తనిఖీలలో రోజుకొక ఆహారం బండారం బయటపడుతోంది. ఇప్పటివరకు బొంబై మిఠాయి, టమాటా సాస్, బేకరీలలో కేక్లు, పానీ పూరి, గోబీ, ఇడ్లీ, కళింగర పండ్లు తదితరాలలో కల్తీలు, కాలుష్య కారకాలు ఉన్నాయని ఆహార భద్రతా శాఖ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ వంతు వచ్చింది. స్టార్ హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు పన్నీర్ వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆ పన్నీర్ ఎంత శుభ్రమైనది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు వేసి వండి వడ్డిస్తే ఆబగా తినేయడం కనిపిస్తుంది. ఆహారశాఖ అధికారులు బెంగళూరులో పలు చోట్ల పన్నీర్ శాంపిల్స్ను సేకరించి నాణ్యత పరీక్షకు పంపించారు. రిపోర్టుల్లో పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు పేర్కొన్నారు. 231 పన్నీర్ శాంపిల్స్లో 17 శాంపిల్స్ రిపోర్టు మాత్రం వచ్చింది. వాటిలో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కల్తీ పదార్థాలతో పన్నీర్ తయారీ, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ, దానిని వట్టి చేతులతో తాకడం వల్ల కలుషితం అవుతుంది. -
రూ. 2 లక్షల లంచం, సైబర్క్రైం ఠాణా ఏసీపీ అరెస్టు
యశవంతపుర: ప్రైవేట్ సంస్థకు చెందిన వెబ్సైట్ను హ్యాక్ చేసిన కేసులో నేరగాళ్లను పట్టుకోవడానికి రూ.4 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో రూ. రెండు లక్షలు తీసుకుంటూ బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం పోలీసుస్టేషన్ ఏసీపీ తన్వీర్ ఎస్ఆర్, ఎఎస్ఐ కృష్ణమూర్తి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు... ఇటీవల సైబర్ నేరగాళ్లు ఓ సంస్థకు చెందిన వెబ్సైట్ను హ్యాక్ చేశారు. సంస్థ యజమానులు సెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ తన్వీర్ రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకోవడానికీ రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. మొదట సగం చెల్లిస్తే నిందితులు ఎక్కడున్నా పట్టుకొంటామని భరోసా ఇచ్చారు. ఇలా మొదటి విడత లంచం సొమ్ము తీసుకొంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి లోకాయుక్త దాడి నగర పోలీసులను కలవరపెట్టింది. నిందితులను విచారణ చేపట్టారు. లోకాయుక్త వలలో పీడీఓ దొడ్డబళ్లాపురం: కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఒక పీడీఓ లోకాయుక్తకు చిక్కిన సంఘటన కనకపుర తాలూకా సోమదప్పనహళ్లి గ్రామపంచాయతీ ఆఫీసులో జరిగింది. పీడీఓ మునిరాజు, కాంట్రాక్టర్ వెంకటాచలయ్య పనులకు బిల్లులు పాస్ చేయడానికి రూ.20వేలు లంచం డిమాండు చేశాడు. దీంతో కాంట్రాక్టర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. బుధవారంనాడు లంచం తీసుకుంటూ ఉండగా మునిరాజును లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హక్కుల కోసం నిరంతర పోరాటం
హొసపేటె: సమాజంలో మహిళలకు సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటాలు జరగాలని సివిల్ కోర్టు న్యాయమూర్తి టి.అక్షత తెలిపారు. విజయనగర జిల్లా హూవినహడగలి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, లీగల్ సర్వీసెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మహిళా దినోత్సవం 8వ తేదీకే పరిమితం కాకూడదని, ప్రతి రోజు దినోత్సవం జరుపుకోవాలన్నారు. ప్రతి రంగంలోనూ దోపిడీ జరుగుతున్నా సామాజిక, రాజకీయ, వృత్తి, విద్యా, ఇతర రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. కానీ ఆమెకు సమాన హక్కులు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మహిళలు సంఘటితంగా ఉండాలన్నారు. వారి హక్కులను పొందేందుకు, వారిపై జరుగుతున్న దారుణాలను నిరోధించడానికి, అటువంటి సమాజంలో మహిళలు తమ సరైన హోదాను సాధించాలంటే చట్టపరమైన పరిజ్ఞానం చాలా అవసరమన్నారు. తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వసంత్కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తాలూకా ఆరోగ్య అధికారిణి స్వప్న కత్తి, మహిళా శిశు సంక్షేమ అధికారిణి రామనగర గౌడ, సంఘం ప్రధాన కార్యదర్శి డి.సిద్దనగౌడ, కోశాధికారి ఎంపీఎం ప్రసన్నకుమార్, ఆటవలిగి కొట్రేష్, టీఎంపీ అసిస్టెంట్ డైరెక్టర్ హేమాద్రినాయక, గంగాధర, హెచ్.సుజాత, మహిళా శిశు అభివృద్ధి శాఖ సిబ్బంది, న్యాయవాదుల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. -
పన్నీర్లో బ్యాక్టీరియా
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోను, రాష్ట్రంలో ఆహార తనిఖీలలో రోజుకొక ఆహారం బండారం బయటపడుతోంది. ఇప్పటివరకు బొంబై మిఠాయి, టమాటా సాస్, బేకరీలలో కేక్లు, పానీ పూరి, గోబీ, ఇడ్లీ, కళింగర పండ్లు తదితరాలలో కల్తీలు, కాలుష్య కారకాలు ఉన్నాయని ఆహార భద్రతా శాఖ ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు పన్నీర్ వంతు వచ్చింది. స్టార్ హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు పన్నీర్ వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఆ పన్నీర్ ఎంత శుభ్రమైనది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు వేసి వండి వడ్డిస్తే ఆబగా తినేయడం కనిపిస్తుంది. ఆహారశాఖ అధికారులు బెంగళూరులో పలు చోట్ల పన్నీర్ శాంపిల్స్ను సేకరించి నాణ్యత పరీక్షకు పంపించారు. రిపోర్టుల్లో పన్నీర్లో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు పేర్కొన్నారు. 231 పన్నీర్ శాంపిల్స్లో 17 శాంపిల్స్ రిపోర్టు మాత్రం వచ్చింది. వాటిలో ప్రమాదకర బాక్టీరియా ఉన్నట్టు, దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కల్తీ పదార్థాలతో పన్నీర్ తయారీ, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ, దానిని వట్టి చేతులతో తాకడం వల్ల క లుషితం అవుతుంది. నివేదికల్లో వెల్లడి